గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3
238-కాశ్మీర్ శైవ దర్శన బృహత్ కోశ కర్త -నీలకంఠ గర్తు (1925-2008 )
శ్రీనగర్ పండిత కుటుంబం లో 2-1-1925 న జన్మించిన నీలకంఠ గర్తు ,పండిట్ లైకాక్ లాంగు పండిట్ ,పండిట్ హరభట్ట శాస్త్రి పండిట్ మహేశ్వరనాధ్ నెహ్రవంటి ఉద్దండులవద్ద అడ్వాంస్ డ్ సంస్కృత వ్యాకరణం లింగ్విస్టిక్స్ నేర్చి ప్రజ్ఞా విశారద శాస్త్రి డిగ్రీలను పొందాడు .ప్రభాకర్ డిగ్రీ కూడా అందుకొని సంస్కృత బి ఏ సాధించాడు .ప్రొఫెసర్ బాలాజీ నాధ్ పండిట్ ,స్వామి లక్ష్మణ్ జూ వద్ద శైవ మాత గ్రంధాలు అధ్యయనం చేశాడు .కాశ్మీర్ లోని ‘’త్రాల్ ‘’లో ఉన్న ప్రభుత్వ సంస్కృత పాఠశాలలో సంస్కృత పండిట్ గా ఉద్యోగం లో చేరి ,సంస్కృతం హిందీలలో లో ఏం ఏ అందుకొన్నాడు .జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వ రీసెర్చ్ అండ్ పబ్లికేషన్ డిపార్ట్ మెంట్ లో అసోసియేట్ గా చేరాడు . 8-12-2008 న చనిపోయాడు .కాశ్మీర శైవ దర్శన బృహత్ కోశం తోపాటు చాలా గ్రంధాలు హిందీలో రాశాడు హర్షేశ్వర మహాత్మ్యం ను ఆంగ్లం లోకి అనువదించాడు
239-కాశ్మీర్ సంస్కర్త -పండిట్ నిత్యానంద శాస్త్రి (1871-
కాశ్మీర పండిత కుటుంబం లో 1874 లో జన్మించి జమ్మూ కాశ్మీర్ లోవిద్యా వ్యవస్థ లేకపోయినా ప్రయివేట్ గా చదివి అప్పటివరకు ,మెట్రిక్ పాసయిన ఇద్దరిలో ఒకరుగా రికార్డ్ సృష్టించి,సంస్కృతంలో గాఢ పాండిత్యాన్ని సాధించి ఆంగ్లం చదవాలన్న కోరికతో ,సంప్రదాయ జీవి అయినా తండ్రికి ఇష్టం లేనందున రహస్యంగా శ్రీకాంత్ ఖాజాన్సీ వద్ద చదివి మాస్టరీ సాధించి ,లాహోర్ లో అరుల్ స్టెయిన్ అనే ఓరియెంటలిస్ట్ పరిచయమై ఆయన ఆధ్వర్యం లో నిర్వహింప బడే పంజాబ్ యూనివర్సిటీలోసంస్కృత ప్రజ్ఞ పరీక్ష రాసి పాసయ్యాడు .స్టెయిన్ తో ఈపరిచయం జీవితాంతం కొనసాగింది .స్టెయిన్ కు కాశ్మీర్ సంస్కృత గ్రంధాలను ఆంగ్లం లోకి అనువదించటానికి శాస్త్రి ఎంతో తోడ్పడ్డాడు .శాస్త్రీవలన గీయర్సన్ ,వోగెల్ వింటర్నిటీజ్ ,వేరీజ్ మొదలైన పాస్చాత్య పండితులు సంస్కృతం విషయం లో ఎంతగానో సాయం పొందారు
16 వ ఏట నే నిత్యానంద శాస్త్రి ప్రభుత్వ పాఠశాలలో సంస్కృత ఉపాధ్యాయుడై సంస్కృత బోధ చేశాడు .తర్వాత సంస్కృతం లో శాస్త్రి డిగ్రీ పొంది ,1916 లో శ్రీనగర్ ప్రతాప్ కాలేజీ సంస్కృత ప్రొఫెసర్ అయ్యాడు .ఆంగ్లం చదివి మేధావి అయినా కాలేజీకి సంప్రదాయ కాశ్మీర్ పండిత వస్త్ర ధారణతోనే వెళ్ళేవాడు . 1897 లో స్వామి వివేకానంద కాశ్మీర్ సందర్శించినప్పుడు ఆయనను దర్శించిన నలుగురైదుగురు కాశ్మీర్ పండితులలో నిత్యానంద ఒకరు .ఆయనతో గ్రూప్ ఫోటో దిగాడు .1906 లో వైస్ రాయ్ లార్డ్ కర్జన్ శ్రీనగర్వచ్చినప్పుడు సంస్కృతం లో ఆయనకు సన్మాన పత్రం రాసి చదివాడు శాస్త్రి .ఆనాటి కాశ్మీర్ పండితులు విద్యా వ్యాసంగం లోనే కాక అనేక సాంఘిక ఆర్ధిక రాజకీయ కార్యక్రమాలలో ముందు ఉండేవారు అలాంటివారిలో శాస్త్రి కూడా ఒకరు .ఆయన శిష్యులలో రాయబారి టి యెన్ కౌల్ ,చరిత్రకారిని పుపుల్ జయకర్ .1930 లో నిత్యానంద ప్రొఫెసర్ గా రిటైర్ అయినపుడు కౌల్ వీడ్కోలు ప్రసంగం చేశాడు .
పండిత మదన మోహన మాలవ్యాకు కాశ్మీర్ పండితులంటే విపరీత మైన ఆరాధన ఉండేది ఆయన 1929 అఖిలభారత హిందూ మహా ధర్మ సమ్మేళన సభకు రావల్ పిండి వచ్చినప్పుడు నిత్యానంద ఆయనను కలిశాడు మాలవ్యా శాస్త్రిని బెనారస్ విశ్వ విద్యాలయ ఫాకల్టీ లో చేరవలసిందిగా ఆహ్వానించగా కుటుంబ పరిస్థితులవలన రాలేనని చెప్పగా ‘’మా యుని వర్సిటీ తెలుపులు మీకోసం ఎప్పుడూ తెరిచే ఉంటాయి ఎప్పుడొచ్చినా సంతోషమే ‘’అన్నాడు మాలవ్యా .స్టెయిన్ కూడా ఎక్స్ ఫర్డ్ కు ఆహ్వానించినా తిరస్కరించాడు .నిత్యానంద శాస్త్రి విజ్ఞాన సర్వస్వము వంటివాడు .కాశ్మీర్ వాడాలి వెళ్లాలని ఉండేదికాదుకాని శీతాకాలం లో విద్యాలయాలు మూసి వేసినప్పుడు మాత్రం దేశం లోని సంస్కృత విద్యాలయాలను సందర్శించేవాడు .సంస్కృత విడవాసులను కలుసుకొనేవాడు .తన కార్య క్షేత్రానికి విద్య కు మాత్రమే పరిమితం చేయకుండా శాస్త్రి సాంఘిక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వ హించాడు .1930 లో ఏర్పడిన సంస్కృత సాహిత్య పరిషత్ కు మొదటి అధ్యక్షుడయ్యాడు .విధవలకు అనాధలకు ఆశ్శ్రయం కోసం ‘’వనితా ఆశ్రమం ‘’స్థాపించాడు .ప్రతినెలా తనజీతం లో పదిశాతాన్ని అనేక దాన ధర్మాలకు ఖర్చు చేసిన వితరణం శీలి శాస్త్రి .హార్వర్డ్ యూనివర్సిటీలోసంస్కృతం ప్రారంభించినపుడు స్పూనర్ కోరికపై 1913 లో ‘’తై తరీయ ఉపనిషత్ ‘’కు నాలుగు భాగాల సంస్కృత వ్యాఖ్యానం రాసి పంపాడు అది ఆ యుని వర్సిటీ లైబ్రరీలో భద్రం గా ఉంది
240 అభినవ కల్హణుడు -పండిత గోవింద కౌల్ (1846 -1899 )
1846 లోఆనాటి ప్రపంచ ప్రసిద్ధ సంస్కృత విద్వా0సు డైనపండిత బల భద్ర కౌల్ పెద్దకుమారునిగా జన్మించిన గోవిందకౌల్ తండ్రితాత అందరూ మహా విద్వాంసులలే .ఈయన పూర్వీకుడు కాశ్మీర్ రాజు రంజిత్ సింగ్ ను కాశ్మీర్ ను ఆఫ్ఘన్ కబంధ హస్తాలనుంచి విముక్తి చేయమని ప్రేరేపించినవాడు .సంస్కృత పారసీలతో పాటు ఆంగ్లాన్నీకూడా కౌల్ నేర్చాడు .కాశ్మీర్ లో ఇంగ్లిష్ నేర్చిన మొదటితరం వారిలో ఈయన ఉన్నాడు .ప్రపంచ విషయాలన్నీ కూడా బాగా అవగాహన చేసుకోగలిగారు అలంకార వ్యాకరణ న్యాయ శాస్త్రాలలో శైవ సూత్రాలలో అఖండుడు అనిపించాడు 28 ఏళ్లకే గొప్ప విద్యా వేత్తగా ప్రసిద్ధి చెందాడు . 1874 ప్రభుత్వ అనువాద శాఖలో ఉద్యోగం లో చేరి కాశ్మీర్ సంస్కృత సాహిత్యాన్ని హిందీలోకి అనువదించాడు.పదేళ్ల తర్వాత ప్రాజెక్ట్ మూతపడి ఉద్యోగం లేక శ్రీనగర్ ప్రభుత్వ పాఠశాల సంస్కృత టీచర్ గా చేరాడు .అదీ ఊడగా ,యూరోపియన్ ఇండా లజిస్ట్ జార్జ్ బూలర్ కౌల్ ప్రజ్ఞను గుర్తించి స్టెయిన్ కు పరిచయం చేయగా ఆయన చేస్తున్న కల్హణు ని రాజతరంగిణి అనువాదానికి 1888 నుంచి 1896వరకు సహకరించాడు .దీనితర్వాత మహారాజా రన్బీర్ సింగ్ కోరికపై స్టెయిన్ తోకలిసి జమ్మూలోని రఘునాధ ఆలయం లోని రణబీర్ సింగ్ లైబ్రరీలో 6 వేళా సంస్కృత వ్రాత ప్రతులకు కేటలాగ్ తయారు చేశాడు .ఇదికాక స్టెయిన్ తోకలిసి కాశ్మీర్ జానపద కథలను సేకరించి 1917 లో కౌల్ వివరణలతో ‘’హాతిమ్ కధలు ‘’గా ప్రచురించాడు .గ్రియర్సన్ కు కాశ్మీర్ నిఘంటు నిర్మాణం లో తోడ్పడ్డాడు .
1899 జూన్ లో పండిత గోవింద కౌల్ మరణించినప్పుడు దుఃఖాన్ని తట్టుకోలేని స్టెయిన్ ”like another Kalhana departed as my best Indian friend beyond all hope of reunion in this Janma”. Paying fulsome tributes to him, Stein wrote: “Whenever Govind Kaul was by my side, whether in the dusty exile of Lahore or alpine coolness of Mohand Marg in Kashmir, I was in continuity with the past as the historical student of India. His personality embodied all that change of ages indicated and showed as the mind and psyche of India.”
అని ఆధునిక కల్హణుడు గా కౌల్ ను ప్రస్తుతించి నివాళులర్పించాడు
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -17-6-17 కాంప్-షార్లెట్ -అమెరికా
—