ప్రఖ్యాత గణాంక శాస్త్ర వేత్త పద్మ విభూషణ్ డా. సి ఆర్ రావు

ప్రఖ్యాత గణాంక శాస్త్ర వేత్త పద్మ విభూషణ్ డా. సి ఆర్ రావు

చల్యం  పూడి రాదా కృష్ణారావు గారు  అందరికీ  సి .ఆర్ .రావు గారు  గా పరిచయం .1920 సెప్టెంబర్ 10 న కర్నాటక బళ్లారి జిల్లా ‘’ హడగల్లి’’ లో జన్మించిన అచ్చమైన తెలుగు వారు . . పది మంది సంతానం లో ఎనిమిదవ వారు .తండ్రి పోలీస్ ఇన్స్పెక్టర్ కనుక ఆయన బదిలీ అయినప్పుడల్లా వేర్వేరు చోట్ల చదవాల్సి వచ్చింది ..గూడూరు ,కృష్ణా జిల్లా నూజివీడు  నందిగామ లలో చదివి ,విశాఖ పట్నం లో స్కూల్ ఫైనల్ నుంచి డిగ్రీ వరకు స్కాలర్షిప్ లతో చదివారు .అన్ని తరగతులలో ఫస్ట్ రాంక్ విద్యార్ధి . బి .ఏ. ఆనర్స్ చేసి గణితం లో ,ఎం ఏ డిగ్రీ పొందారు .ఇరవై ఏళ్ళ నాటికే ఇవన్నీ సాధించిన మేధావి రావు గారు .

కలకత్తా వెళ్లి ఇండియన్ స్టాటి స్టికల్  ఇన్ స్టి ట్యూట్ లో ఎం ఏ .స్టాటిస్టిక్స్ మొదటి బాచ్  లో చేరి ,  ఇప్పుడూ యూని వర్సిటి మొదటి రాంక్ తో స్వర్ణపతకం సాధించారు .రావు గారు సాధించినన్ని మార్కులు ఇప్పటి వరకు ఇంకెవ్వరికీ రాలేదట .అదొక అరుదైన రికార్డ్ .అక్కడే నెలకు 75 రూపాయల జీతం తో లెక్చరర్ గా చేరి  ఉద్యోగం చేస్తూనే పరిశోధనలు చేశారు .దీనివలన కేంబ్రిడ్జి యూని వర్సిటి లో పరిశోధనలు కొనసాగించే అరుదైన అవకాశం పొందిన అదృష్ట వంతులు .అత్యున్నత స్థాయిలో ఉన్న వీరి పరిశోధనాంశాలను లండన్ లోని కేంబ్రిడ్జి యూని వర్సిటి ప్రెస్ తమ అదృష్టంగా భావించి ఆయన గ్రంథ రచనలను ముద్రించారు .అప్పటికి రావు గారి వయసు 26 అంటే ముక్కుమీద వేలు వేసుకోవాల్సిందే .

ఇంగ్లాండ్ నుంచి ఇండియాతిరిగి వచ్చి కలకత్తా లో మాతృ సంస్థ లోనే మళ్ళీ ఉద్యోగించారు ..కేంద్ర ప్రభుత్వం ఈ సంస్థకు రెండు పంచ వర్ష ప్రణాళి కల రూపకల్పన   బాధ్యత అప్పగించింది .వీటిలో డా సి .ఆర్. రావు గారి తోడ్పాటు అనితర సాధ్యంగా ఉంది .దేశ స్థాయిలో అపారిశ్రామిక  అభి వృద్ధికి పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలని   ఆయన ప్రభుత్వానికి సూచించారు .నాటి ప్రధాని నెహ్రు అంగీకరించారు .ఆంధ్రా యూని వర్సిటి, రావు గారికి అప్పడు ఇస్తున్న జీతానికి 5 రెట్లు ఎక్కువ జీతం ఇస్తామని ఆఫర్ చేసినా ,అంగీకరించక  ప్రొఫెసర్ గా గణాంక శాఖ హెడ్ గా కూరుకు పోవటం కంటే తన పరిశోధనలకే  ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు.

కలకత్తా యూని వర్సిటి లో నలభై ఏళ్ళు ఉండి,తన పరిశోధనలు నిరంతరం కొన సాగించి మనసులో ఉన్న అభిప్రాయాన్ని  ఆచరణ లో పెట్టారు .  వేలమంది విద్యార్ధుల జీవితాలను తీర్చిదిద్ది మార్గ దర్శనం చేసిన విద్యావేత్త రావు గారు . అత్యుత్తమ శాస్త్ర వేత్తలకు అందజేసే ‘’శాంతి స్వరూప్ భట్నగర్ పురస్కారం ‘’ను ప్రధాని జవహర్ లాల్ నెహ్రు చేతుల మీదుగా అందుకున్న  అత్యున్నత  ఉత్తమ శ్రేణి గణాంక సైంటిస్ట్ ఆయన .దీనికి అంద జేసిన  ప్రైజ్ మనీ ని అదే వేదికపై ప్రధానికి దేశ రక్షణ నిధి కి సమర్పించిన వదాన్యులు .అమెరికా లో ప్రతి ఏడాదీ అత్యత్తమ స్థాయి శాస్త్ర వేత్తలకు అందించే ‘’నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్ ‘’అవార్డ్ ను అమెరికాలో , అమెరికా ప్రెసిడెంట్ జార్జి బుష్ చేతులమీదుగా అందుకున్న మేధావి .

‘’ రష్యా సైన్స్ అకాడెమీ ‘’ తన 200 సంవత్సరాల వేడుకలో ఆహ్వాని౦పబడిన  ప్రపంచ వ్యాప్తం గా ఉన్న 200 మంది శాస్త్ర వేత్తలలో రావు గారు  ఉండటం ఆయనకే కాక మనదేశానికీ గర్వ కారణం .ఈ కార్య క్రమ ప్రారంభం లో వీర మరణం పొందిన సైనికులకు నివాళి  అర్పించే ,స్మృతి చిహ్నం పై పుష్ప గుచ్చాన్ని సమర్పించే అరుదైన అవకాసం మొదటగా రావు గారికే దక్కింది .గత దశాబ్ద కాలం లో ప్రపంచ వ్యాప్తంగా విశేష కృషి చేసిన 70 మంది శాస్త్ర వేత్తల జీవిత చరిత్రలను ,ఫోటో లను ప్రచురించిన ‘’అమెరికన్ పబ్లికేషన్ ‘’లో రావు గారు స్థానం పొందటం అపురూపమైన ప్రపంచ వ్యాప్త సత్కారం ,గుర్తింపు .గణాంక శాస్త్ర అభి వృద్ధికోసం హైదరాబాద్ లో ఒక సంస్థ ఏర్పాటు చేయాలని రావు గారి సంకల్పం .మన రాష్ట్ర ప్రభుత్వం ఉస్మానియా యూని వర్సిటి లో స్థలం కూడా కేటా యించింది .ఆరు దశాబ్దాల అవిశ్రాంత కృషిలో ఉన్నా నవ యవ్వనం తో తొణికిసలాడే ఉత్సాహం తో ఆయన కనిపిస్తారు .

లండన్ లోన 1662 లో స్థాపింపబడి ,  అత్యంత ప్రాచీనమైంది, ప్రపంచ వ్యాప్త ప్రతిస్టాత్మకమైన’’రాయల్ సొసైటీ ఆఫ్ సైన్సెస్ ‘’ కు ‘’ ఫెలో ‘’గా ఎన్నికైన ప్రధమ ఆంధ్రుడు రావు గారే .చాలామందికి ఆయన అసలు సిసలైన తెలుగు వారని ఇప్పటికీ తెలియదు .భారత ప్రభుత్వం ‘’పద్మ విభూషణ్ ‘’పురస్కారం అందజేసి గౌరవించింది ..350పరిశోధనా పత్రాలు రాశారు .14 గ్రంథాలు రచించారు .ఇవన్నీ ప్రపంచ  వ్యాప్తం గా  వివిధ భాషలలోకి అనువాదం పొందాయి  19 దేశాల నుండి 38  డాక్టరేట్లు అందుకున్న అరుదైన ప్రతిభాశాలి . గణాంక శాస్త్రం లో లో 50 మంది పరి శోధకులకు మార్గ దర్శకం చేశారు .టైమ్స్ ఆఫ్ ఇండియా’’ టాప్ టెన్ సైంటిస్ట్ ‘’లలో ఒకరుగా రావు గారు గుర్తింపు పొందారు .సహస్ర చంద్ర దర్శనం చేసుకున్న రావు గారు మన తెలుగు వారుకావటం మన అదృష్టం

అమెరికా లో పెన్సి ల్వేనియన్ స్టేట్ యూనివర్సిటి ఎమిరిటస్ ప్రొఫెసర్ గా ,బఫ్ఫెల్లో యూని వర్సిటి రిసెర్చ్ ప్రొఫెసర్ గా ,ఉన్నారు .అమెరికా దేశపు ‘’నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్ అందుకున్న ఘనులు .అమెరికన్ స్టాటిస్టికల్ అసోసియేషన్ రావు గురించి ‘’ a living legend whose work has influenced not just statistics, but has had far reaching implications for fields as varied as economics, genetics, anthropology, geology, national planning, demography, biometry, and medicine.”[.

అని అభి వర్ణించింది .లాభా పేక్ష లేని ‘’ఇండియన్ హార్ట్ అసోసియేషన్ ‘’కు సీనియర్ స్టాటిస్టిక్స్ అడ్వైజర్ ,సీనియర్ పాలసీ మేకర్ గా ఉన్నారు.  పిట్స్ బర్గ్ యూని వర్సిటి ప్రొఫెసర్ గా ,పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటి లో మల్టి వేరియేట్ అనాలిసిస్ సెంటర్ డైరెక్టర్ గా అక్కడి  స్టాటి స్టీషి యన్  డా పరుచూరి రామకృష్ణయ్య గారి ఆహ్వానం పై పని చేశారు .2010 లో దేశం లో అత్యున్నతమైన ‘’ఇండియా సైన్స్ అవార్డ్’’ పొందారు .’’ఇంటర్ నేషనల్ ఎన్ సైక్లో పీడియా ఆఫ్ స్టాటిస్టి కల్ సైన్స్’’కు సహకరించినందుకు ,మియోడ్రాగ్ లోవ్రిక్ ,షియోమో సావిలోస్కి లతో  పాటు రావు గారు 2013 లో నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు 19 14 జులై 26 న ఖర్గపూర్ ఇండియన్ ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ  38 వ గౌరవ డాక్టరేట్ ఇచ్చి సత్కరించింది ..ఇంటర్నేషనల్ స్టాటి స్టికల్ ఇన్ స్టి ట్యూట్ ప్రెసిడెంట్ గా ,అమెరికాలోని ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ మాదమాటికల్ స్టాటిస్టిక్స్,ఇంటర్ నేషనల్ బయో మెట్రిక్ సొసైటీలకు రావు అధ్యక్షులు .’’ఇండియాస్ నేషనల్  ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ క్వాలిటి అండ్ రిలయబిలిటి హాల్ ఆఫ్ ఫేం’’లో స్థానం పొందారు .1991 లో ‘’ది జర్నల్ ఆఫ్ క్వాంటిటేటివ్ ఎకనమిక్స్ ‘’రావు గారిపై గౌరవ ప్రత్యేక సంచిక ప్రచురించింది. ఆ సంచికలో రావు గారి గురించి ‘’ Dr Rao is a very distinguished scientist and a highly eminent statistician of our time. His contributions to statistical theory and applications are well known, and many of his results, which bear his name, are included in the curriculum of courses in statistics at bachelor’s and master’s level all over the world. He is an inspiring teacher and has guided the research work of numerous students in all areas of statistics. His early work had greatly influenced the course of statistical research during the last four decades. One of the purposes of this special issue is to recognise Dr Rao’s own contributions to econometrics and acknowledge his major role in the development of econometric research in India.”

అని రాసింది  .

రావు గారు ‘’ఎస్టి మేషన్ దీరీ ‘’,స్టాటిస్టికల్ ఇన్ఫరెన్స్ అండ్ లీనియర్ మోడల్స్ .మల్టి వేరియేట్ అనాలిసిస్ ,కాంబి నెటోరియల్ డిజైన్ ,ఆర్థో గనల్ ఎర్రెస్ లలో  ప్రత్యేక పరిశోధనలు చేశారు .6 ప్రసిద్ధ అవార్డ్ లు మెడల్స్ పొందారు .పద్మ భూషణ్ ,పద్మ విభూషణ్ లతో సహా 10 జాతీయ ,అంతర్జాతీయ గౌరవాలు అందుకున్నారు .97 ఏళ్ళ వయసులో ఉన్న రావు గారు అరుదైన స్టాటి స్టిక్స్ శాస్త్రవేత్త .శతాధిక ఆయుష్మాన్ భవతి .

ఆధారం –శ్రీ వాసవ్య రచన –ఆంధ్ర శాస్త్ర వేత్తలు  మరియు వీకీ పీడియా

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -5-8-18 –ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.