శ్రీ యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -3
యాజ్ఞవల్క్యుడు దివాకరుని అనుగ్రహం తో పొందిన వేదాన్ని శుద్ధ యాజుషం అని , ,ఏకాయనం అని ,అయాత యామ అనిపిలువబడింది .పూర్వ మీమాంస శాస్త్రం పుట్టటానికి కర్మకాండ ,ఉత్తర మీమాంసకు కారణం అయిన బ్రహ్మకాండ ,తర్వాత మంత్ర బ్రాహ్మణం వేర్వేరుగా ఉండటం చేత శుద్ధ లేక శుక్ల యజుర్వేదం అనే పేరు తోపాటు ,దీనికంటే శ్రేష్టమైనది వేరేలేనందున ఏకాయతనం అనే పేర్లు వచ్చాయి .శుక్లాయజుర్వేదానికి చరణ వ్యూహం ,భారతం లలో చెప్పబడినట్లు 15 శాఖలున్నప్పటికీ ఇప్పుడున్నవి కేవలం కాణ్వ ,మాధ్యందిన అనే రెండు శాఖలు మాత్రమే అని ముందే చెప్పుకున్నాం .ఇతర వేదాలలో కొన్ని పాఠక భేదాలు అంటే సూత్ర భేదాలనుబట్టి శాఖలేర్పడ్డాయి .కాని శుక్ల యజుర్వేదానికి మాత్రం ఏశాఖ బ్రాహ్మణం ఆ శాఖకే ఉన్నాయి .అంటే కాణ్వశాఖ కు సంహిత బ్రాహ్మణాలు వేరుగా ,మాధ్యందిన శాఖకు బ్రాహ్మణాలు వేరుగా ఉన్నాయి .శుక్ల యజుర్వేద బ్రాహ్మణాన్ని’’శత పథం’’అంటారు .కాణ్వ శాఖాను సారంగా ఈ బ్రాహ్మణం లో 17 కాండలు ,104 అధ్యాయాలు ఉన్నాయి.మాధ్య్యందిన శాఖాను సారంగా 14 కాండలు ,100 అధ్యాయాలున్నాయి .’’పథిక్’’అంటే అధ్యాయం అనే అర్ధం ఎక్కడా లేదు .నాలుగు అనే అర్ధం చెప్పవచ్చు .కనుక శతపథం అనేది కాణ్వ బ్రాహ్మణానికి మాత్రమె చెందుతుంది అని గ్రహించాలి .వ్యాకరణ భాష్యం లో శతపథం,షష్టి అనే రెండుపదాలున్నాయి .మాధ్య౦దినం లో మొదటి 9 కా౦డలలోని అధ్యాయాలు 40 కనుక ఆ తొమ్మిది కా౦డలకు మాత్రమె ‘’షష్టి పథం’’అన్నారు .వార్తికం పుట్టేనాటికి మాధ్యందిన శాఖలో 100 అధ్యాయాలున్నట్లు భావించారు. ఏతావాతా తేలిందేమిటంటే’’ షష్టి పథం’’అంటే మాధ్య౦దినం అనీ ,’’శతపథం’’ అంటే కాణ్వ మనీ గ్రహించాలి. మాధ్య౦దినం లోని 40 అధ్యాయాలు కాణ్వం నుంచి చేర్చబడ్డాయి .
యాజ్న వల్క్యుడు యాజ్ఞిక ప్రవీణుడు ,ఆధి దైవత త్త్వంతెలిసిన పండిత శ్రేష్టుడు . కనుక ఆయనకు బ్రహ్మవాదం అంటే మహా ప్రీతి .తురీయాశ్రమాన్ని మొట్టమొదట స్వీకరించినవాడు యాజ్ఞవల్క్యుడు అని చరిత్ర ప్రసిద్ధం .శతపధం లో అనేక పూర్వ ఋషుల, రాజుల చరిత్ర ఉంది . ఋగ్వేదం చదివినవారికి మిగిలినవేదాలు నేర్వటం యెంత సులువో ,శతపధ బ్రాహ్మణం నేర్చినవారికి యాజ్ఞిక కర్మలు చేయించటం అంత తేలిక మాత్రమేకాక తైత్తిరీయాదులు గ్రహించటం కూడా చాలా తేలికౌతుంది. శతపథం లో వేదార్ధాన్ని గ్రహించటం సులువు .ఇది తెలిస్తే వైదిక విషయాలు కరతలామలకం అవుతాయి .కనుక అన్ని బ్రాహ్మనాలకంటే శ్రేస్టం గా పేర్కొన్నారు .ఆధ్యాత్మ రామాయణం ఆరణ్యకాండ 8 వ సర్గ లో ‘’అపూర్వ మైన శతపద౦ నాచే చేయబడింది ‘’అని యాజ్ఞవల్క్యుడు అన్నట్లు ఉంది –‘’రతి పతి శత కోటి సుందరాంగం’’ –శతపధ గోచర భావనావిదూరం –యతి పతి హృదయే సదా విభాంతం –రఘుపతి మార్తిహరం ప్రపద్యే ‘’ వెబర్ అనే పాశ్చాత్య పండితుడు’’ ది హిస్టరీ ఆఫ్ ఇండియన్ లిటరేచర్ ‘’లో ‘’White Yajus occupies the most significant and important position of all the Brahmanas ‘’అన్నాడు .శతపథం కు మాత్రమే కాక తాండ్యభాల్లవి బ్రాహ్మణానికి కూడా ఉదాత్త అనుదాత్త స్వరాలు రెండేఉంటాయి అని కాత్యాయనుడు’ భాషిక సూత్రం’’ లో చెప్పాడు .ఈ సూత్రం ప్రాతిశాఖ్యము వేదం యొక్క స్వర సంస్కార నియమాన్ని తెలిపినట్లే, వేద వ్యాఖ్యానమైన బ్రాహ్మణ స్వర సంస్కార నియమాన్ని కూడా తెలుపుందని విజ్ఞుల ఉవాచ .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -15-9-18- ఉయ్యూరు
శ్రీ యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర అన్ని భాగాలు కావాలి. ఈ వెబ్సైట్లో కొన్ని మాత్రమే ఉన్నాయి. దయచేసి స్పందించాలని కోరుతున్నాను.
Click to access 2015.371205.Yajnj-avalkya-Charitramu.pdf
Thank you very much Sir for your immediate response and sharing the link of most valuable book. Really it’s a great service rendered by you in starting సరస భారతి website and sharing so many things which we don’t know. Recently I came across to see this website. As I am interested to know about Yagnavalkya Maharshi, can you share any other information or photos available with you. Yagnavalkya Smruti pdf copy is available?
Best Regards
KSN MURTHY
Visakhapatnam