సాహితీ బంధువులకు శుభ కామనలు -ఈ రోజు మధ్యాహ్నం 2- 30 కి సింగపూర్ నుంచి శ్రీ శశిధర్ (శశికుమార్ )ఫోన్ చేసి ఎంతో ఆత్మీయంగా మాట్లాడారు .ఆయన తెలంగాణా కరీం నగర్ కు చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి .మన సరసభారతి బ్లాగులను గత మూడేళ్లు గా రెగ్యులర్ చదువుతున్నాననీ ,చాలా ఆసక్తికరంగా ,ఉత్తేజంగా విషయాలు రాస్తున్నానని తాను చదవటమే కాక అందులోని విషయాలను తన స్వరంతో రికార్డ్ చేసి తన బంధువులకు స్నేహితులకు పంపుతూంటానని చెప్పారు . కోనసీమ” ఆహితాగ్నులు” గురించి రాసిన 12 ఎపిసోడ్ లు అత్యంత గొప్పగా ఉన్నాయన్నారు .ఎవరూ ఎక్కడా రాయని విషయాలు ఉన్నాయని సంతోషించారు . మళ్ళీ ఎప్పుడు మొదలు పెట్టి రాస్తారా అని తాను ,బంధువులు ఆసక్తిగా ఉన్నామని చెప్పారు . త్వరలోనే రాస్తానని అంతటి ఆసక్తి చూపిన వారిని నిరాశ పరచననీ చెప్పాను నర్మదానది గురించి అక్కడి ఓంకార క్షేత్రం గురించి రాసింది ముచ్చటగాఉంది మొదటిసారిగా ఎన్నో విషయాలు తెలుసుకున్నామన్నారు . గీర్వాణకవుల మూడు భాగాలు శిరోధార్యాలన్నట్లు గా ఉన్నాయని సంతోషించారు . ఇప్పుడు రాస్తున్న యాజ్ఞ వల్క్య చరిత్ర ఆసక్తికరంగా ఉంటోందని తాను సద్గురు శివానందమూర్తిగారు మనమహర్షులపై రాసిన రెండు భాగాలపుస్తకం అత్య౦తాసక్తిగా చదివి దాచు కొన్నానని అయన తన సంస్కారాన్ని తెలియ జేసినందుకు ఆన౦దపడ్డాను .
.సుమారు రెండుమూడేళ్ళక్రితం రాసిన ”బ్రాహ్మణాలు ”కూడా తామందరు ఉత్కంఠ గా చదివామని ఆరణ్యకాలు గురించిరాస్తామని అప్పుడే చెప్పి ,ఇంతవరకు రాయకపోవటం తమకు నిరాశ కలిగించిందని వెంటనే రాయమని కోరారు .సరే అన్నాను తాను అక్టోబర్ లో కరీం నగర్ వచ్చి రెండువారాలు ఉంటానని అన్నారు .కరీం నగర్ రాగానే ఫోన్ చేస్తేసరసభారతి పుస్తకాలు పంపిస్తాను వాటికి డబ్బులేమీ ఇవ్వక్కరలేదు అని చెప్పాను సంతోషించారు . సింగపూర్ కు ఇండియాకు టైం లో తేడా రెండున్నర గంటలని ,ఇప్పుడు తమ టైం 5 గంటలని చెప్పారు .”అంతా బాగానే ఉంటున్నా సార్ మీరు ఏమీ అనుకోకపోతే ఒకమాట . ఒక్కో సారి ” థ”కు” ధ ”కు తేడా లేకుండా టైప్ చేస్తున్నారు ”అని సుతిమెత్తగా చురక అంటించారుఎంత జాగ్రత్త తీసుకున్నా కొన్ని సార్లు అవి వస్తూనే ఉన్నాయి మరింత జాగ్రత్త పడతాను ”అని ఓ కుంటి సాకు చెప్పాను. దానికి ఆయన సార్! నేను మాత్రం మా వాళ్లకు పంపేటప్పుడు వాటిని సవరించి పంపుతున్నాను ”అని చెప్పటం తో అవాక్కయ్యాను . సుమారు అరగంట శ్రీ శ్రీధర్ మాట్లాడి నాకు కొత్త ఉత్సాహాన్నిచ్చారు .
సరసభారతికి ఇంతమంది అభిమానులు ఇన్ని చోట్ల ఉండటం వారంతా క్రమం తప్పకుండా మనబ్లాగులను చదవటం కు మించిన ఆనందం ఏముంది ? ఇంతమందిని సరసభారతి ద్వారా అలరిస్తున్నందుకు నేను ధన్యత చెందానని పించింది .సరసభారతిపై వారందరికీ ఉన్న ఆప్యాయ అనురాగాలు ఆత్మీయత నన్ను ముగ్ధుడిని చేశాయి . . సరస్వతీ ప్రసాదం అందరికి అందజేయగలగటం నా అదృష్టం . సరసభారతిపై అంతటి మక్కువ గౌరవం వాఱందరు చూపటం నా కృషి కంటే వారి సౌజన్యమే ఎక్కువ . –మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -15-9-18 -ఉయ్యూరు .
వీక్షకులు
- 1,010,496 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- గ్రంథాలయోద్యమ పితామహ శ్రీ అయ్యం కి వెంకట రమణయ్య గారు?8 వ భాగం.9.6.23.
- మురారి అన ర్ఘ రాఘవమ్. 12 వ భాగం.9.6.23.
- సరస భారతి వీక్షకుల సంఖ్య 10 లక్షలపైనే
- గీర్వాణ కవుల కవితా గీర్వాణ 0 .7. వ భాగం. 8.6.23:
- 25 ఏళ్లకే సంస్కృత ప్రొఫెసర్ అయి ,’’కాదంబరి’’ ప్రచురించిన స్కాట్లాండ్ సంస్కృత విద్వాంసుడు –పీటర్ పీటర్సన్
- గ్రంథాలయోద్యమ పితామహ శ్రీ అయ్యం కి వెంకట రమణయ్య గారు.8 వ భాగం.8.6.23.
- మురారి అన ర్ఘ రాఘవం.11 వ భాగం.8.6.23.
- గీర్వాణ కవుల కవితా గీర్వాణ 0.7 వ భాగం.7.6.23.
- గ్రంథాల యోద్యమపితామహ శ్రీ అయ్యం కి వెంకట రమణయ్య గారు.7 వ భాగం.7.6.23.
- చారిత్రక నవలా ‘’కల్కి ‘’తురాయి కి చలన చిత్ర ‘’మణి రత్నం ‘’-పొన్నియ౦ సెల్వం
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (77)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (8)
- నా దారి తీరు (135)
- నేను చూసినవ ప్రదేశాలు (107)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (2,978)
- సమీక్ష (1,333)
- ప్రవచనం (11)
- ఫేస్బుక్ (522)
- మహానుభావులు (346)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (1,079)
- రాజకీయం (65)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (334)
- సమయం – సందర్భం (844)
- సమీక్ష (26)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (517)
- సినిమా (376)
- సేకరణలు (315)
- సైన్స్ (46)
- English (6)
ఊసుల గూడు
ధన్యవాలండి!! మీతో మాట్లాడి నాకు చాలా సంతోషంగా ఉండండి. మీతో మాట్లాడిన విషయాలను మీరు మీ సరస భారతి బ్లాగు ద్వారా కూడా పంచుకోవడం నిజంగా నా అదృష్టం.