అణు శాస్త్ర వేత్త డా. ఆకునూరి వెంకటరామయ్య ”పుస్తకం అమెరికాలో రెండు చోట్ల ఆవిష్కరణ
సరస భారతి సాహితీ బంధువులకు దసరా శుభా కాంక్షలు –
నేను రాసి, శ్రీ మైనేని గోపాల కృష్ణ శ్రీమతి సత్యవతి దంపతుల ప్రాయోజకత్వం లో ,,సరస భారతి చేత శ్రీ కర్రీ శివ ప్రసాద్, డా ద్రోణవల్లి రామమోహన రావు గార్ల నేతృత్వం లో ప్రచురింపబడిన
”అణుశాస్త్ర వేత్త డా ఆకునూరి వెంకటరామయ్య ”పుస్తకం అమెరికాలో టెన్నెస్సీ రాష్ట్రం ” నాష్ విల్ ”లో డా రామయ్యగారి స్వగృహం లో 15-10-18 సోమవారం సాయంత్రం
ఆంద్ర ప్రదేశ్ శాసనమండలి సభ్యులు శ్రీ వై వి బి రాలేంద్ర ప్రసాద్ గారిచే శ్రీ మైనేని గోపాలకృష్ణ ,శ్రీ కాకాని బాబూరావు శ్రీమతి యలమంచిలి భ్రమరాంబ మొదలైన ఆత్మీయ అతిధులు ,బంధుమిత్రుల సమక్షం లో ఆవిష్కరింపబడుతుంది .
16-10-18 మంగళవారం ఉదయం అలబామా రాష్ట్రం లోని శ్రీ మైనేని గారుండే ” హంట్స్ విల్” దగ్గరున్న” మాడిసన్ కౌంటి” ”లో కూడా ”మీట్ అండ్ గ్రీట్ ”సమావేశం లో డా రామయ్య గారి పుస్తకాన్ని శ్రీ రాజేంద్ర ప్రసాద్ ఆవిష్కరిస్తారు . .
ఇలా సరసభారతి పుస్తకం అమెరికాలో ఒక రోజు తేడాతో రెండు చోట్ల ఒకే గౌరవ వ్యక్తిచేత ఆవిష్కరింపబడటం విశేషం . సరసభారతి దక్కిన అరుదైన గౌరవం .
ఈ రెండు కార్యక్రమాలు శ్రీ మైనేని గోపాలకృష్ణ గారి సంపూర్ణ సౌజన్య ,సహాయ, సహకారాలతో జరగటం విశేషం . శ్రీమైనేని గారి సహృదయత కు నిదర్శనం సరసభారతికి శ్రీమైనేని గారు అందిస్తున్న సంపూర్ణ సహకారానికి కృతజ్ఞతలతో నమోవాకములు .
డా రామయ్య గారి కీ ,సతీమణి శ్రీమతి కృష్ణమయి కుటుంబ సభ్యుల సహకారానికీ నమస్సులు .
డా రామయ్య గారి పుస్తకం ఈ డిసెంబర్ చివరి వారం లో ఉయ్యూరులో డా రామయ్య గారి కుటుంబ సభ్యుల సమక్షం లో కూడా ఆవిష్కరింపబడుతుంది అని తెలియ జేయటానికి సంతోషంగా ఉంది
శ్రీ విళంబి ఉగాదికి ఒక వారం ముందు ఉయ్యూరు లోను ,ఉగాది నాడు అమెరికాలోని షార్లెట్ లోను నేను రాసిన ,సరసభారతి ప్రచురించిన ‘షార్లెట్ సాహితీ మైత్రీ బంధం”పుస్తకం రెండు చోట్లా ఆవిష్కరింపబడిందన్న సంగతి గుర్తు ఉండే ఉంటుంది -దుర్గా ప్రసాద్ -13-10-18 -ఉయ్యూరు
మీ గబ్బిట దుర్గా ప్రసాద్ -13-10-18 -ఉయ్యూరు