సాహితీ బంధువులకు శుభకామనలు -నేను రాసిన దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -1 మొదటిభాగం 201 ఆంజనేయ దేవాలయాలతో 2015 శ్రీ హనుమజ్జయంతి నాడు ఉయ్యూరు లో మా సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో ఆవిష్కరింపబడిన సంగతి మీకు గుర్తు ఉండే ఉంటుంది .
దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2 రెండవభాగం -241 ఆంజనేయ దేవాలయాలతో వస్తోంది .దీనిలో చేర్చటానికి శ్రీ ఆంజనేయ వైభవం ”పై పద్యాలు రాసి పంపని
1-డా.రామడుగు వేంకటే శ్వర శర్మ ,2- శ్రీ మంకు శ్రీను 3- శ్రీ తుమ్మోజు రామ లక్ష్మణాచార్యులు 4- శ్రీ పంతుల వెంకటేశ్వర రావు 5-శ్రీ టేకుమళ్ళ వెంకటప్పయ్య 6–మధురకవి శ్రీమతి ముదిగొండ సీతారామమ్మ 7-శ్రీమతి లక్కరాజు వాణీ సరోజినీ గార్లను కోరగా సహృదయం తో స్పందించి ,రచించి ,వెంటనే నాకు పంపారు .వారందరికీ ధన్యవాదాలు .ఆ పద్య సుమాలన్నీ ఈ గ్రంథ0 లో చోటు చేసుకొని ,స్వామికి అలంకారమౌతాయని భావిస్తున్నాను .
గ్రంధా విష్కరణ సరసభారతి 31-3-2019 న నిర్వహించే శ్రీ వికారి,ఉగాదిపురస్కారాలు, కవి సమ్మేళనం వేడుకలలో జరుగు తుందని తెలియ జేస్తున్నాను –
దీనితోపాటునేను రాసిన బుక్ లెట్స్ (కరదీపికలు ) 1-అణుశాస్త్ర వేత్త డా ఆకునూరి వెంకటరామయ్య (117వ మూలకం టెన్నిస్సిన్ -కనిపెట్టిన ఆంద్ర శాస్త్ర వేత్త-ఈ కరదీపిక ఈ సంవత్సరం అక్టోబర్ 16 న టేనస్సీ రాష్ట్రం నాష్ విల్ లో శ్రీ రామయ్యగారి స్వగృహం లోనూ , ,17వ తేదీ దీని స్పాన్సర్ అయిన సరసభారతి కి ఆత్మీయులు శ్రీ మైనేని గోపాలకృష్ణగారి హంట్స్ విల్(అలబామా రాష్ట్రం ) దగ్గరున్న మాడిసన్ లోనూ మన ఎం .ఎల్ . సి. శ్రీ వై వి బి రాజేంద్ర ప్రసాద్ ఆవిష్కరించారు ) 2–కాంతి ప్రయోగ పిత డా పుచ్చా వెంకటేశ్వర్లు(ఆలీఘర్ ముస్లిం యూని వర్సిటీ,కాన్పూర్ ఐ ఐటి ,అలబామా అగ్రికల్చరల్ ఆండ్ మెకానికల్ యూని వర్సిటీ ల స్థాపకులు ,లేజర్ కిరణాలపై ప్రముఖ పరిశోధకులు) పుస్తకాలు కూడా ఆవిష్కరింపబడుతాయి ..అంటే మూడు పుస్తకాలు ఒకే సారి సరసభారతి ఆవిష్కరింప బోతోందని తెలియజేయటానికి సంతోషంగా ఉన్నది
సరసభారతి పై మీకున్న అభిమాన ఆధరాలకు ధన్యవాదాలు -దుర్గాప్రసాద్ -13-12-18-ఉయ్యూరు