సరసభారతి 137 వ కార్యక్రమంగా సామూహిక సత్యనారాయణ వ్రతం
మాఘ శుద్ధ పంచమి శ్రీపంచమి 10-2-19 ఆదివారం ఉదయం 9 గం లకు సరసభారతి 137 వ కార్యక్రమంగా శ్రీ సువర్చలాంజ నేయ స్వామి దేవాలయం లో సామూహికంగా పాలుపొంగించి పొంగలి తయారు చేయటం ,అనంతరం సామూహిక సత్య నారాయణ వ్రతం నిర్వ హింపబడుతోంది . దీనికి రుసుము చెల్లించ వలసినఅవసరం లేదు . పూజా ద్రవ్యాలు ,దేవతా విగ్రహాలు వగైరా ఎవరి పూజాసామగ్రి వారే తెచ్చుకొని సాధ్యమైనంతవరకు దంపద్యుక్తంగా కూర్చుని చేసుకోవచ్చు .
వ్రతం పూర్తయ్యాక 11-30గం లకు శ్రీ అయ్యప్ప దీక్షతో ఉయ్యూరు నుండి శబరిమలై కు సైకిల్ పై 18 సార్లు వెళ్లి వచ్చిన వారు ,శ్రీ శివ దీక్షతో ఉయ్యూరు నుంచి శ్రీశైలం కు నడకతో 5 సార్లు వెళ్ళివచ్చినవారు ,స్థానిక సుధీర్ టింబర్ డిపోలో గుమాస్తాగా ఉన్న శ్రీ బిరుదుగడ్డ వేంకటేశ్వరరావు (స్వామి )గారికి సన్మానం ,అనంతరం ”స్వామి”గారి అనుభవ విశేషాల ప్రసంగం ఉంటుంది .
అందరూ పాల్గొని జయప్రదం చేయ ప్రార్ధన . వ్రతం లో పాల్గొని వారు అర్చక స్వామిని సంప్రదించి పేరు నమోదు చేసుకోవలసినది ,
గబ్బిట దుర్గా ప్రసాద్ -సరసభారతి అధ్యక్షులు -ఆలయ ధర్మకర్త -2-2-19 -ఉయ్యూరు
—