ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు శ్రీ ఉప్పులూరి మల్లికార్జునశర్మగారి మరణం
-ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు ,అసలైన గాంధేయవాది ,గ్రంధకర్త ,సాంఘిక సేవాతత్పరులు సాహిత్యాభిమాని శ్రీ ఉప్పులూరి మల్లికార్జునశర్మగారు22-3-19 శుక్రవారం విజయవాడలో మరణించినట్లు ఇవాళ జ్యోతి లో చూశాను .నిబద్ధతగల రాజకీయ నాయకులాయన ఖద్దరు పంచ లాలీచీ ఉత్తరీయంతో హుందాగా అతి సాధారణంగా ఉండేవారు .చలపాక ప్రకాశ్ గారు ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం ఆధ్వర్యం లో విజయవాడలో శతాధిక కవులతో సుమారు మూడునెలల క్రితంలో ఠాగూర్ లైబ్రరీ లో నిర్వహించిన
కవి సమ్మేళనం లో చివరి సారిగా చూశాను .సరసభారతి పుస్తకాలు అందజేశాను .అంతకు మించి నేను పెద్దగా పరిచయం చేసుకోలేదు . ఆంధ్రప్రదేశ్ సత్వర అభి వృద్ధికి మనసారా ఆకాంక్షించిన వృద్ధ తరం నాయకులాయన .కృష్ణా జిల్లా రచయితల సంఘం నిర్వహించే అన్నికార్యక్రమాలకు తప్పక హాజరయ్యే సాహితీ ప్రియులు శర్మగారు
గుంటూరు జిల్లా దుగ్గిరాలమండలం పెదకొండూరులో 16-7-1939జన్మించారు తండ్రిగారు ఉప్పులూరి రామ శాస్త్రిగారు ఖద్దరు సంస్థాన్ కు అత్యంత విధేయులు . 1935 లో దీన్ని రామశాస్త్రిగారు ,ఉప్పులూరి వెంకట కృష్ణయ్యగారు కలిసి స్థాపించారు
శర్మగారు 12 వ ఏటనే అఖిలభారత కాంగ్రెస్ సంస్థ పై ఆకర్షణ పెంచుకొని క్రియా శీలంగా వ్యవహరించారు అఖిలభారత కాంగ్రెస్ కమిటీ సభ్యులు .ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కార్యదర్శిగా ఉన్నారు హిందీ తెలుగు భాషలు ఆయనకు వాచోవిధేయాలు .రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయినప్పుడు 1985ఆగస్ట్ లో ఆయనతోపాటు రాష్ట్రం అంతా పర్యటించి ఆయన ఉపన్యాసాలను చక్కని తెలుగులో అనర్గళముగా అనువదించి ఆయన అభిమానం పొందారు 2004 అసెంబ్లీ ఎన్నికలకు విజయవాడనుంచి స్వతంత్ర అభ్యర్ధీ గా పోటీ చేసి ఓడిపోయారు .
జీవితాంతం సాంఘిక సేవలో ధన్యుడైన గాంధీజీ వారసులాయన బెజవాడలో గాంధీ హిల్స్ ఏర్పడటానికి ముఖ్యకారకులలో శర్మగారు ఒకరు .డా కె.ఎల్ రావు ,పాతూరు నాగభూషణం గార్లతో ఎన్నో సాంఘిక సేవాకార్యక్రమాలు శర్మగారు నిర్వహించారు . 2007 లో మద్యపాన విమోచన సమితి కి చైర్మగా ఉండి ,విస్తృతంగా పర్యటించి ప్రజలను చైతన్యపరిచారు .
హైదరాబాద్ లో రవీంద్రభారతి కి సెక్రెటరీ గా ఉండి ఎన్నెన్నో అతి ముఖ్య మైన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు .శర్మగారి సేవా తత్పరతకు నాగార్జున విశ్వవిద్యాలయం గౌరవ డిగ్రీ ప్రదానం చేసి గౌరవించింది .నిజం చెప్పాలంటే శర్మగారు చేసిన సేవకు తగిన గుర్తింపు ప్రభుత్వం ఇవ్వలేదనే చెప్పాలి .మంచి రచయితకూడా అయిన శర్మగారు” వీరభారతప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి”పుస్తకం రచించారు . . 80ఏళ్ళ రాజకీయ వృద్ధులు శ్రీ ఉప్పలూరి మల్లికార్జునశర్మగారి మరణం ఆంద్ర ప్రదేశ్ కు తీరని లోటు వారికి ఆత్మకు శాంతికలగాలని భగవంతుని ప్రార్ధిస్తూ వారి కుటుంబానికి సానుభూతి తెలియ జేస్తున్నాను
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -26-3-19-ఉయ్యూరు
శ్రీ ఉప్పులూరి మల్లికార్జున శర్మగారి కవితాప్రతిభ ,గాంధీ క్షేత్రం పై అంకితభావం
‘స్వాప్నిక మధు మాధవం’ గ్రంథావిష్కరణఆర్ఆర్పేట, ఏలూరు సాంస్కృతిక, న్యూస్టుడే: తేనెలొలుకు తెలుగు భాష మధురాతి మధురమని విజయవాడకు చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు ఉప్పులూరి మల్లికార్జునశర్మ అన్నారు. అగ్రహారంలోని రత్నకమలాంబిక పీఠంలో కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ సమకాలికుడు, సాహితీవేత్త దివంగత పల్ల సుబ్బారావు అప్పట్లో రచించిన ‘స్వాప్నిక మధు మాధవం’ గ్రంథావిష్కరణ సభను ఆదివారం నిర్వహించారు. రత్నకమలాంబిక పీఠం ఛైర్మన్ సుంకేసుల రత్నబాల సభకు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఉప్పులూరి మల్లికార్జున శర్మ గ్రంథాన్ని ఆవిష్కరించి మాట్లాడుతూ వందేమాతరం వరుస తప్పుతోందని, జనగణమన గణం తప్పుతోందని, తెలుగుభాష రక్షణకు సమన్వయ కార్యాచరణ ఆవశ్యమని అన్నారు. ఎమ్మెల్సీ రాము సూర్యారావు మాట్లాడుతూ తెలుగుభాష అభ్యున్నతికి కవి పండిత సాహితీవేత్తలు సమష్టిగా కృషిచేయాలన్నారు. పీఠం ఛైర్మన్ సుంకేశుల రత్నబాల మాట్లాడుతూ సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకు విస్తృత కార్యాచరణ చేపట్టామన్నారు. నేత్రావధాని డాక్టరు నిడమర్తి లలితాకామేశ్వరి, సినీగేయ రచయిత రసరాజు, జ్యోతిష పండితుడు శ్రీహరి శ్రీనివాస శాస్త్రి, సాహితీవేత్త బుద్దరాజు సూర్యకుమారి, నాట్యాచార్య కేవీ సత్యనారాయణ, సాహితీవేత్త గుండు సుబ్రహ్మణ్య దీక్షితులు, మైలవరపు గురుశర్మ తదితరులు మాట్లాడారు. ఈసందర్భంగా ఉప్పులూరి మల్లికార్జునశర్మ, అతిథులను కార్యనిర్వాహకులు పల్ల గంగాధర చయనులు దుశ్శాలువలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు
‘స్వాప్నిక మధు మాధవం’ గ్రంథావిష్కరణఆర్ఆర్పేట, ఏలూరు సాంస్కృతిక, న్యూస్టుడే: తేనెలొలుకు తెలుగు భాష మధురాతి మధురమని విజయవాడకు చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు ఉప్పులూరి మల్లికార్జునశర్మ అన్నారు. అగ్రహారంలోని రత్నకమలాంబిక పీఠంలో కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ సమకాలికుడు, సాహితీవేత్త దివంగత పల్ల సుబ్బారావు అప్పట్లో రచించిన ‘స్వాప్నిక మధు మాధవం’ గ్రంథావిష్కరణ సభను ఆదివారం నిర్వహించారు. రత్నకమలాంబిక పీఠం ఛైర్మన్ సుంకేసుల రత్నబాల సభకు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఉప్పులూరి మల్లికార్జున శర్మ గ్రంథాన్ని ఆవిష్కరించి మాట్లాడుతూ వందేమాతరం వరుస తప్పుతోందని, జనగణమన గణం తప్పుతోందని, తెలుగుభాష రక్షణకు సమన్వయ కార్యాచరణ ఆవశ్యమని అన్నారు. ఎమ్మెల్సీ రాము సూర్యారావు మాట్లాడుతూ తెలుగుభాష అభ్యున్నతికి కవి పండిత సాహితీవేత్తలు సమష్టిగా కృషిచేయాలన్నారు. పీఠం ఛైర్మన్ సుంకేశుల రత్నబాల మాట్లాడుతూ సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకు విస్తృత కార్యాచరణ చేపట్టామన్నారు. నేత్రావధాని డాక్టరు నిడమర్తి లలితాకామేశ్వరి, సినీగేయ రచయిత రసరాజు, జ్యోతిష పండితుడు శ్రీహరి శ్రీనివాస శాస్త్రి, సాహితీవేత్త బుద్దరాజు సూర్యకుమారి, నాట్యాచార్య కేవీ సత్యనారాయణ, సాహితీవేత్త గుండు సుబ్రహ్మణ్య దీక్షితులు, మైలవరపు గురుశర్మ తదితరులు మాట్లాడారు. ఈసందర్భంగా ఉప్పులూరి మల్లికార్జునశర్మ, అతిథులను కార్యనిర్వాహకులు పల్ల గంగాధర చయనులు దుశ్శాలువలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు
— అమరావతిలో గాంధీ క్షేత్రం
కరెన్సీనగర్(విజయవాడ), న్యూస్టుడే: నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రాంతాన్ని గాంధీ క్షేత్రంగా మార్చాలని గాంధీ దేవాలయ నిర్మాణ మండలి తీర్మానించిందని ఛైర్మన్ నరహరశెట్టి శ్రీహరి తెలిపారు. బుధవారం నగరంలోని భారతీనగర్లో నిర్మాణ మండలి వివరాలను ఆయన వెల్లడించారు. గాంధీ ఆలయాన్ని కంచికచర్ల ప్రాంతంలో చేపడతామని, నిర్మాణ మండలికి గౌరవ సలహాదారులుగా ప్రభుత్వ ఆస్పత్రి విశ్రాంత న్యూరో ఫిజీషియన్ ఆచార్య డాక్టర్ సీహెచ్ రామకృష్ణారావు, వి.బలరామయ్య, ఎం.రంగరాజులు వ్యవహరిస్తారని, స్వాతంత్య్ర సమరయోధులు ఉప్పులూరి మల్లికార్జునశర్మ, డీఎస్ఎన్ మూర్తిలతో పాటు సభ్యులుగా న్యాయవాదులు కోనపల్లి సూరిబాబు, కోట్ల జయరాజ్, మట్టా జయకర్, అబ్ధుల్ మథీన్, ఉత్తమ్ నాగరాజు, ఏవీ రమణ, సంఘసంస్కర్తలు మండలి రాజా, చెన్నుపాటి వజీర్లతో మండలి ఏర్పడిందన్నారు. గాంధీ ఆలయం నిర్మాణ ప్రధాన ఉద్దేశంలో భాగంగా ‘గాంధీ మాల’ ఏర్పాటు చేసి అష్టాదశ సూత్రాలను అవలంబించేలా చర్యలు తీసుకుంటూ మెరుగైన సమాజానికి నాంది పలుకుతామన్నారు. మూడు మతాల పెద్దల పర్యవేక్షణలో ఆలయ నిర్మాణం జరుగుతుందని, ఇప్పటికే దాతలు ముందుకొస్తున్నారన్నారు. గాంధీ ఆలయ నిర్మాణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళతామన్నారు.