ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘునాధ శర్మగారికి రాష్ట్రపతి పురస్కారం
గీర్వాణా౦ధ్ర సాహిత్య సరస్వతి ,ఆధ్యాత్మిక వేత్త ,శ్రీశృంగేరి పీఠ ఆస్థాన విద్వాంసులు ,మహా ప్రాసంగికులు, ”సాహితీ శలాక ”,ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘునాధ శర్మగారు రాజమండ్రి నుండి ఇప్పుడే ఫోన్ చేసి ,తమకు ఏప్రిల్ 4వ తేదీన ఢిల్లీలో రాష్ట్ర పతి పురస్కారం అందజేస్తున్న శుభ వార్త తెలియ జేశారు. మనస్పూర్తిగా అభినందించాను . ఆ సాహితీ తేజో మూర్తికి సరసభారతి తరఫున శుభాభినందనలు తెలియజేస్తున్నాను . ఇది ఆంద్ర, సంస్కృత సారస్వత లోకానికి అత్యంత ముదావహం . ఉగాది ముందే వచ్చినంత సంబరం .-దుర్గాప్రసాద్ -26-3-19-ఉయ్యూరు
—