గురు పౌర్ణమి సందర్భంగా నోరి వారి ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందజేసిన కళా సుబ్బారావు పురస్కారం

గురు పౌర్ణమి సందర్భంగా నోరి వారి ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందజేసిన కళా సుబ్బారావు పురస్కారం

                        నేపధ్యం  

సరసభారతి శ్రీ వికారి నామ సంవత్సర ఉగాది వేడుకలకు మా తలిదండ్రులు కీ శే.గబ్బిట మృత్యుంజయ శాస్త్రి  శ్రీమతి భవానమ్మ  గారల స్మారక ఉగాది పురస్కారం అందజేయటానికి హైదరాబాద్ లో ఉన్న నోరి నరసింహ శాస్త్రి ఛారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు శ్రీ విద్యోపాసకులు బ్రహ్మశ్రీ నోరి సుబ్రహ్మణ్య శాస్త్రి ఎం.ఇ. గారిని ఆహ్వానించి పురస్కారం అందించి సత్కరించాము .అప్పుడు వారు  జులై 14 ఆదివారం హైదరాబాద్ త్యాగరాజ గాన సభ లో వ్యాస పౌర్ణమి సందర్భంగా నాకు గురు పురస్కారం అందిస్తామని రహస్యం గా చెప్పారు .సరే అన్నాను .కానీ యెవరికీ నేను చెప్పలేదు .జూన్ 20కు అందెట్లుగా నాకు ఆహ్వాన పత్రాలు పంపారు .అందులో త్యాగరాజ గాన సభ నిర్మాత , లలితకళా ప్రపూర్ణ  శ్రీ కళా సుబ్బారావు పురస్కారం అందిస్తున్నట్లు ఉన్నది .ఈ ఆహ్వానాన్ని అందరికీ పంపాను .అందరూ అభినందించారు .డా .రామడుగు వేంకటేశ్వర శర్మగారు గుంటూరు నుండి తనకు నేనుపంపిన ఆహ్వానం అందగానే ఫోన్ చేసి యెంతో సంతోషించి  కళా సుబ్బారావు గారి సాహిత్య ,కళా సేవలను వివరించి ‘’మీకు వారి అవార్డ్ రావటం ‘’చాలా అభినందనీయ విషయం అని నన్ను అభినందించారు .ఒక గొప్పవారి పేరిట  ఒకప్పుడు మన  రాస్ట్రమే అయినా నేడు వేరొక రాస్త్రం అయిన తెలంగాణాలో అందునా రాజధాని నగరం అయిన హైదరాబాద్ లో అందులోనూ ఘనత వహించిన త్యాగ రాజ గాన సభ లో పురస్కారం అందుకోవటం నేను ఊహించని విషయం .అది జరుగబోతున్నందుకు మా కుటుంబం అంతా యెంత గానో సంతోషింఛారు .

      ప్రయాణ సన్నాహం

https://photos.app.goo.gl/BPE4LARCx1K3Ks4q8

 జులై 12 శుక్రవారం తొలి ఏకాదశి పర్వదినం కనుక ఆ రోజు ఇంట్లో పూజ చేసుకొని మధ్యాహ్నం నుంచి  బయల్దేరాలను కొన్నాం  . 14 వ తేదీ సభకు నాతోపాటు ఉన్న పురస్కారగ్రహీతలు అతిధులు కలిపి 12 మండి ఉన్నారు  వీరికి నేను రాసి ,సరసభారతి  ప్రచురించిన ‘’ గీర్వాణకవుల  కవితా గీర్వాణం 3 భాగాలు  దైవచిత్తం మొత్తం 4పుస్తకాలు అందజేయాలని 16 సెట్లు దేనికది ఒక ఒక కవర్ లో పెట్టి రెడీ చేసి రెండు అట్ట పెట్టెలలో పాక్ చేసి సిద్ధం చేశాను . వీటి బరువు చూసి మా శ్రీమతి గుండె బాదుకొని బస్ లో వద్దు కారులో వెళ్దాం అన్నది .నేను ‘’కొండవలస ‘’లాగా ‘’ఐతే వాకే’’అన్నాను  .మా సంగతి ముందే తెలిసిన మా అబ్బాయి   రమణ కారు బుక్ చేస్తానని చెప్పాడు .సరే అన్నాను .  మా ఆన్నయ్య గారబ్బాయి రామనాధ్ శిష్యుడు మా అందరికీ బాగా పరిచయమున్న ఉయ్యూరులోని యమహాకంపెనీ మేనేజర్ దావూద్ గురువారం ఉదయం తాను కొత్త కారు కొన్నానని , రమణకు చ్చెప్పాడట  .వాడు మా హైదారాబాద్ ప్రయాణం సంగతి చెబితే ‘’మొదటి రైడింగ్  తాతయ్య్గ  గారు అమ్మమ్మగారి తో చేయిద్దా0’’అని చెప్పి డ్రైవర్ ను మాట్లాడి కారు తెచ్చి మా వాటర్ ప్లాంట్ లో శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు పెట్టాడు.   మేమిద్దరం మా మనవడు చరణ్ మధ్యాహ్నం 12 కే భోజనం చేసి  పావుతక్కువ 2 కు కాఫీ లు తాగి రెడీ అయ్యా0.దావూద్ ,మా రమణ వచ్చారు .మొదటి సారి కారు ప్రయాణం కనుక దావూద్ చేతిలో యెంతైనా కొంత డబ్బు పెట్టమన్నాడు ,దావూద్ పది రూపాయలు పెట్టండి తాతయ్యగారు అన్నాడు .అది పద్ధతి కదనుకొని అయిదువందల ఒక్క రూపాయి చేతిలోపెట్టి‘’ఇలాంటికార్లు రెండుమూడు కొనాలి ‘’అని భుజం తట్టాను అతడు మా ఇద్దరికాళ్ళకు నమస్కారం చేసి ‘’తాతయ్యగారూ ఇదంతా మీ  ఆశీర్వాదమేనండీ’’అని ఆనందంగా చెప్పాడు . మధ్యాహ్నం 2-15కు అందరికీ బై చెప్పి బయల్దేరా0 .సూర్యాపేటలో టిఫిన్ చేసి మళ్ళీ బయల్దేరి రాత్రి 7-45కు హైదారాబాద్ కు మా పెద్దబ్బాయి శాస్త్రి వాళ్ళ ఇంటికి మల్లాపూర్ చేరా0.

                           సభ -పురస్కార సత్కారం

 14 వ తేదీ ఆదివారం సాయంత్రం 4 30 కి కాబ్ లో  మేమిద్దరం ,చరణ్ ,పెద్ద కోడలు శ్రీమతి సమత  బయల్దేరి 5 గంటలకు త్యాగరాజ గాన సభకు చేరా0 .మణికొండనుంచి స్టేట్ బాంక్ లో పని చేస్తున్న మా బావమరది ఆనంద్ ,బాచుపల్లి నుంచి మా రెండో అబ్బాయి శర్మా కోడలు శ్రీమతి ఇందిర మనవడు హర్ష మనవరాలు హర్షిత  చేరుకున్నారు. సత్కారం సంగతి మా  రమణద్వారా తెలుసుకున్న హైదారాబాద్ లో ఉంటున్న మా ఉయ్యూరు శిష్యుడు వేగరాజు రాజా ,ఉయ్యూరులో యెలిమెంటరీ స్కూల్ హెడ్ మాస్టర్  స్వర్గీయ వెంపటి శర్మగారబ్బాయి ప్రభాకర  కూడా వచ్చారు .54యేళ్లక్రితం ఉయ్యూరు హైస్కూల్ లో నా శిష్యుడు అత్యంత వినయ సంపన్నుడు  ఉద్యోగం చేసి రిటైరై హైదరాబాద్ లో ఉంటున్న నజీరుద్దీన్ మధ్యాహ్నం ఫోన్ చేసి సన్మానం సంగతి తెలిసి తను  జలుబు ,తుమ్ముల వలన ఇబ్బంది పడుతున్నానని యే మాత్రం వీలున్నా వస్తానని చెప్పాడు సరే అన్నాను .రాలేక పోయానని తర్వాత మెసేజ్ పెట్టాడు .ఉయ్యూరు పాలిటెక్నిక్ లో చదివిన లంకావారబ్బాయి  ప్రభాకర్  స్నేహితుడు పరిచయం  చేసుకొని  చెప్పాడు . నా అభిమానిడా శ్రీమతి కే బి లక్ష్మి గారు వచ్చి వేదికమీద నాతో మాట్లాడి అభినందనలు తెలిపి అక్కడి వారితో ‘’మా గురువుగారు దుర్గా ప్రసాద్ గారు ‘’అని చెప్పటం నాకు పరమానందం కలిగించి అవాక్కయ్యాను  .దాదాపు పాతిక యేళ్ళ క్రితం పామర్రు హైస్కూల్ లో ఫిజికల్ సైన్స్ టీచర్ ,అనేక అవార్డులు పొందిన నేను యెప్పుడు కనిపించినా ‘’సార్ !ఇంతమంది సైన్స్ మేస్టర్లు పామర్రు హైస్కూల్ లో పని చేసినా ,ఇప్పటికీ మిమ్మల్నే బాగా గుర్తుపెట్టుకొని అందరూ అభిమానిస్తారు కారణం  యేమిటి?’’అని అమాయకంగానో గడుసుగానో ప్రశ్నించే  ,రిటైర్ అయి హైదారాబాద్ లో ఉంటున్న ,తమ తండ్రి గారు శ్రీ పూసపాటి నాగేశ్వర రావు గారి జీవితం రచనలపై పిహెచ్ డి చేసిన శ్రీ పూసపాటి శంకరరావు గారూ వచ్చారు .ప్రముఖ కథారచయిత అత్యుత్తమ శ్రేణి విమర్శక విశ్లేషకులు ,పద చిత్ర రామాయణ కర్త శ్రీ విహారిగారు వాట్సాప్ లో అభినందించారు .వారం ముందే ‘’నేనువస్తాను కలుస్తాను ‘’అని మెయిల్ పెట్టి ఊరించిన హైదారాబాద్ వాసి  శ్రీ ఎ. సి.పి . శాస్త్రిగారు ‘’యథాప్రకారం’’ చెయ్యిచ్చారు .

  సాయంత్రం 5 -30 కి సభ ప్రారంభమైంది .ముందుగా  శ్రీ వారణాసి వెంకట నారాయణ శాస్త్రి గారు రచించిన ‘’భగవద్గీత ‘’బుర్రకధను  శ్రీ పిసుపాటి వేంకటేశ్వర శర్మగారు శ్రావ్యం గా గానం చేసి సమ్మోహపరచారు .తరువాత అతిధులకు పురస్కార గ్రహీతలకు నాదస్వర వాద్యం తో పూర్ణ కుంభం తో వేదాశీస్సులతో స్వాగతం పలికి లోపలికి ఆహ్వానించి కూర్చోబెట్టారు .నేను తెచ్చిన పుస్తకాల సెట్లు సభ ప్రారంభం ముందే అందరికీ పంచేశాను .’’దర్శనం ‘’పత్రిక లో పని చేస్తున్న శర్మగారు ‘’ఒక సెట్ ఉంటే ఇవ్వండి ‘’అని అడిగితే ప్రభాకర్ కిచ్చిన సెట్ తీసుకొని అతనికి  పోస్ట్ లో పంపిస్తానని చెప్పి తీసుకొని దర్శనం గారికిచ్చాను

 సభా సంచాలకులు శ్రీ పి.ఎం. గాంధీ సుశబ్ద సుమధుర వచనాలతో  ఒక్కొక్కరిపై రాసిన ప్రత్యేక పద్యం తో అపూర్వంగా రాగ భావాలతో ఆలపిస్తూ అందరినీ వేదికపైకి ఆహ్వానించారు .బ్రహ్మశ్రీ నోరి సుబ్రహ్మణ్య శాస్త్రీ గారు అధ్యక్షత వహించి సభ నిర్వహించారు .నోరి ఛారిటబుల్ ట్రస్ట్ గురించి తాము చేబడుతున్న కార్యక్రమాలగురించి పురస్కార గ్రహీతలగూర్చి క్లుప్తంగా అర్థవంతంగా వివరించారు .తరువాత శ్రీ కళ్యాణానంద భారతీ స్వామి సంస్కృతం లో రచించి ,డా వారణాసి వెంకటేశ్వర్లు గారు తెలుగు అనువాదం చేసి నోరి ట్రస్ట్ వారు ప్రచురించిన ‘’బ్రహ్మ కలా’’గ్రంధాన్ని శ్రే శ్రీ విజ్ణానంద భారతీ స్వామి ఆవిష్కరించారు .ముఖ్య అతిధిగా శ్రీ పిల్లుట్ల విశ్వనాధ్ గారు ,విశిస్ట అతిధిగా డా వారణాసి వెంకటేశ్వర్లు ,ఆత్మీయ అతిథి శ్రీ ముదిగొండ శివ ప్రసాద్ గారు పురస్కార గ్రహీతలు వేదికను సుసంపన్నం చేశారు .

మొదటగా అనుగ్రహణ భాషణం చేసిన స్వామీజీ చెప్పిన ‘’గుర్రబ్బండీ వాడి ‘’ అన్యాపదేశ కధ అందరినీ ఆకట్టుకొన్నది .

  ఆ పిమ్మట పురస్కార ప్రదానోత్సవం సన్మానం ఘనంగా నోరివారు అందరి సహకారం తో నిర్వహించారు .శ్రే వేద వ్యాసపురస్కారం ను బ్రహ్మశ్రీ పురాణం మహేశ్వర శర్మగారికి ,శ్రీ కళ్యాణానంద భారతీ స్వామి పురస్కారం బ్రహ్మశ్రీ మున్నంగి వేంకటరాయ శర్మగారికి ,కవి సామ్రాట్ నోరి నరసింహ శాస్త్రి సాహిత్య పురస్కారం శ్రీ రాధశ్రీ అనబడే పద్యకవి దిడుగు అనంత రాధ కృష్ణ ప్రసాద్ గారికి ,శ్రీ మునిమాణిక్యం నరసింహారావు పురస్కారం ప్రముఖ రచయిత్రి డా.శ్రీమతి వాసా ప్రభావతిగారికి ,డా సర్వేపల్లి రాధ కృష్ణ లౌకిక గురు పురస్కారం డా శ్రీమతి శరత్ జ్యోత్స్నారాణి గారెకి ,డా.బెర్జాగీ పురస్కారం ప్రొఫెసర్ యెస్. వెంకటరావు గారికి ,తెలుగు తల్లి పురస్కారం శ్రీ సాధన నరసింహ శర్మగారికి ,శ్రీ కళాసుబ్బారాఓ పురస్కారం శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్  అనే నాకు  అందజేశారు .  దంపతులను ఆశీనులను చేసి సత్కరించిన తీరు  ఆకర్షణీయం, అభిలషణీయంగా ఉన్నది .మా దంపతులకు నోరివారి సన్మానమే కాకుండా మా బావమర్ది ఆనంద్  గులాబీ దండ శాలువాలతో మిమ్మల్ని సత్కరిస్తే ,శ్రీమతి కంలాకర్ భారతి గారు శాలువా కప్పి అభిమానం చాటితే  మా ఇద్దరబ్బాయిలు  కోడళ్ళు మనవళ్లు మనవరాలు శాలువాలుకప్పి  హైదారాబాద్ లోనూ ‘’గబ్బిటవారి హవా’’ చూపెట్టారు .శాస్త్రిగారు  అందరికీ శాలువా పుష్పమాల ,జ్ణాపిక ,మెడల్ ,దీన్ని భద్రపరచుకోవటానికి చిన్న భరిణ ,నోరి నరసింహ శాస్త్రిగారి పుస్తకాలు ,రెండు బత్తాయిపళ్లు  అన్నీ నోరి ఛారిటబుల్ ట్రస్ట్ వారి ప్రత్యేకమైన పెద్ద నాణ్యమైన ‘’Duffelబాగ్ ‘’లో పెట్టి అందించారు  . డా శివప్రసాద్ గారు శాస్త్రిగారితో  వారి తండ్రిగారితో ఉన్న అనుబంధాన్ని వివరించారు .డా వెంకటేశ్వర్లు ఆవిష్కరింపబడిన గ్రంధం లోని ముఖ్యాంశాలను స్పృశించారు .వృద్ధురాలైన ప్రభావతిగారు అనారోగ్య రీత్యా సన్మానం అందుకొనగానే వెళ్ళిపోయారు .పురస్కార గ్రహీతలు   ఇవ్వబడిన రెండుమూడు నిమిషాలలో తమ మనో భావాలను స్పందనగా తెలియబరచారు .చివరి వాడిని నేనే కావటం 9గంటలకు వేదిక ఖాళీ చేసి  వెళ్లాల్సిన  అవసరం ఉండటం తో నాకు ఒక్క నిమిషమే కేటాయిస్తే అందులోనే చెప్పాల్సింది చెప్పేశాను .తర్వాత సన్మానితులందరి తరఫున నేను తెచ్చిన శాలువాను మేమందరం కలిసి శ్రీ నోరి సుబ్రహ్మణ్య శాస్త్రిగారికప్పి కృతజ్నాత తెలియ జేయటం హైలైట్ అయింది .నేను మాట్లాడుదామనుకొని తయారు చేసిన దాన్ని ఇప్పుడు మీకు తెలియ జేస్తాను .  సభ అవగానే  మేమందరం దగ్గరలోనే ఉన్న హోటల్ కు వెళ్ళి టిఫిన్లు చేశా0  మా మనవడు హర్ష ఇంటర్ పాసై ,ఇంజనీరింగ్ లో చేరిన సందర్భంగా మా అబ్బాయి శర్మ హోటల్ ఖర్చు  3,500రూపాయల బిల్లుకట్టిమిమ్మల్ని ఆశ్చర్యం లో పడేశాడు .శర్మావాళ్లు బాచుపల్లి ,మా బామ్మర్ది మనికొండ,వెళ్లారు మేము మల్లాపూర్ చేరేసరికి రాత్రి 11-30 అయింది .

  నా ప్రసంగ పాఠం

‘’గురుః ఆది రనంత శ్చ-గురుః పరమ దైవతం -గురోఃపరతరం నాస్తి -తస్మై శ్రీ గురవేనమః’’

ఈ శ్లోకం ‘’విశ్వ సార తంత్ర ‘’లోనిది .యెందుకో దీనికి లోకం లో యెక్కడా ప్రచారం లేక పోవటం  ఆశ్చర్యంగా ఉంది .ఆషాఢ పౌర్ణమి వ్యాసమహర్షి జన్మించిన రోజు .ఆయన వసిస్టమహర్షి మునిమనవడు ,శక్తిమహర్షి మనవడు ,పరాశర సత్యవతీ దంపతులపుత్రుడు శుకమహర్షికి తండ్రి .వ్యాసపౌర్ణమినాడు బ్రహ్మసూత్ర పఠనంచేస్తారు .స్త్రీలు ‘’గో పద్మ వ్రతం ‘’విష్ణుమూర్తి అనుగ్రహం కోసం  చేస్తారు .నాలుగు ముఖాలులేని బ్రహ్మ అంటే జ్నాన చైతన్య ప్రదాత ,నాలుగు భుజాలు లేని విష్ణువు అంటే రక్షకుడు ,అపమార్గం నుంచి తప్పించేవాద్దు ,మూడు నేత్రాలులేని శివుడు అంటే అజ్నానాన్ని నశింప చేసే వాడు గురువు అంటారు అంటే త్రిమూర్తి అవతారం. జ్నానజ్యోతి ప్రసాద్దించే ప్రత్యక్ష దైవం కనుక గురువు ‘’గురు దేవుడు ‘’అయ్యాడు .అంతేకాక ‘’ఆచార్య దేవో భవ ‘’కూడా .

  నేపాల్ లో తానాహు జిల్లాలో ‘’దమాలీ ‘’లో వ్యాసుడు తపస్సు చేసి బ్రహ్మ సూత్రాలు పురాణాలు వేద విభజన చేసిన గుహ ఉంది .గొప్ప యాత్రాస్థలమైంది .వ్యాసుడు ‘’కాలావతారం ‘’అన్నారు .వ్యాస అనేది ఒక అధికారం అంటే ఒక పదవి .ప్రతియుగం లో ఒక వ్యాసుడు ఉద్భవిస్తాడు .ఇప్పటికీ 27 గురు వ్యాసులయ్యారు మొదటి ద్వాపరమ్ లో స్వాయంభువ్డుమొదటి  వ్యాసుడు ,రెండవ ద్వాపరమ్ లో ప్రజాపతి వ్యాసుడు మూడవ ద్వాపరమ్ లో శుక్రుడు వ్యాసుడు ,ఆతర్వాత వరుసగా వసిస్ట ,త్రివర్ష ,మొదలైనవారు వ్యాసులై 27 వ వ్యాసుడుగా సనద్వాజుడు అయ్యాడు .ఇప్పుడున్న బాదరాయణుడు లేక కృష్ణ ద్వైపాయనుడు అనే వ్యాసుడు 28 వ వ్యాసుడు .దీని తర్వాత ఈయన సూర్య సావర్ణికాలం లో సప్తరుషులలో ఒకడు ఔతాడు .

  కాశ్మీర్ లో ప్రవహించే బియాస్ నది అంటే వ్యాస నది అనే అర్ధం .వ్యాసర్షి భారత హరివంశ0 తోకలిపి 1 లక్ష ఇరవై అయిదు వేల శ్లోకాలు ,పురాణాలలో 5 లక్షలశ్లోకాలు రాసీనా  మహానుభావుడు .మానవ మనస్తత్వం మారడం లేదని భారతం లో ‘’ఊర్ధ్వ బాహుః విరోమ్యెషు ,నహి కశ్చిత్ శ్రుణో తిమే-పరోపకార పుణ్యాయ,పాపాయ పరపీడనం ‘’అని  నెత్తీనోరూ బాదుకున్నాడు . జనాలకు చేతులెక్కి మొక్కాడు పాపం .దీని అర్ధం యేమిటంటే ‘’ఇతరులకు ఉపకారం చేస్తే పుణ్యం అపకారం చేస్తే పాపం ‘అని నేను మొత్తుకున్నా యెవ్వరూ నా మాట వినటం లేదే ‘’అని పరితపించిన మానవీయ మూర్తి విశాల హృదయుడు భగవాన్ వేద వ్యాసుడు .ఇప్పటికీ యెవరూ ఆమాట వినటం లేదుకదా .

  అటుకులు తీసుకొని తన చెలికాడు  శ్రీ కృష్ణుని దర్శించిన కుచేలుడు తనమిత్రుడు చేసిన సపర్యలకు ఉబ్బి తబ్బిబ్బు అయ్యాడు అంతేకాక గురువు సాందీపమహర్షి ని తలచుకోవటం అక్కడ గడిపిన రోజులు గుర్తుకు చేసుకున్నాడు .దీనికి ఆశ్చర్యపోయాడు కుచేలుడు –‘’

‘’గురు మతి దలపగ-త్రిజగద్గురుడ వనం దగిన నీకు -గురువనగా నొరు డెవ్వ దింతయును నీ -కరాయంగా – విడంబన0 బగు గాదె హరీ ‘’అన్నాడు –

 భావం -త్రిజత్తులకు గురువైన నువ్వు గురువు సాందీపమునిని   తలచుకోవటం ఆశ్చర్యంగా ఉంది ‘’అని అంటే లోకం లో గురువు కున్న ఉత్కృస్ట స్థితిని ఆచరణలో చూపి లోకానికి గొప్ప మార్గ దర్శి అయ్యాడు భగవాన్ శ్రీ కృష్ణుడు  వ్యాసర్షి కృష్ణుని అవతార మే కనుక కృష్ణ ద్వైపాయనుడు అయ్యాడు .కృష్ణావతార ఘట్టం లో దేవతలంతా చేసిన ప్రార్థన ఇద్దరికీ వర్తిస్తుంది

‘’గురు పాఠీనమవై ,జలగ్రహమవై ,కోలంబవై ,శ్రీ నృ కే-సరివై ,భిక్షు0డవై ,హయాననుడవై  ,క్ష్మా దేవతా భర్తవై

ధరణీ నాధుడవై ,దయా గుణోదారు0 డవై ,లోకముల్ -పరి రక్షించిన నీకు  మ్రోక్కెద ,మిలాభారంబు వారింపవే ‘’

 గురుపౌర్ణమి శుభాకాంక్షలతో

మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -16-7-19-కాంప్ -మల్లాపూర్ -హైదారాబాద్

— 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సభలు సమావేశాలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.