ఎంతని పొగడుదు గిడుగు
‘’ మహా భారత భాగవతాది గ్రంథాలు ఎన్ని సార్లు ప్రచురణ పొంది ,ఎన్ని పరిణామాలు పొందాయో ,ఎన్ని వ్రాతప్రతులు ఎన్ని రూపాలలో ఉన్నాయో ,తెలిసిన వారు గిడుగు వారు తప్ప వేరెవరు లేరు’’అనీ ,’’ఇతర దేశీయులు ,ఇతర రాష్ట్రాలవారు ‘’మీ తెలుగు తల్లి కన్నసుపుత్రుడు ఎవరు ?’’అని నన్ను అడిగితే’’గిడుగు వారు తప్ప వేరెరెవరూ లేరుఅని ఖచ్చితంగా చెబుతాను ‘’అని తెలుగు తొలి చారిత్రక నవలా రచయిత, ప్రముఖ పరిశోధక, ,విమర్శకాగ్రేసరులు బ్రహ్మశ్రీ నోరి నరసింహ శాస్త్రి గారు చెప్పారు .
గొప్ప గురువు గిడుగు వారికి కు గొప్ప శిష్యుడు చారిత్రిక పరిశోధకుడు ,భాషావేత్త వ్యావహారిక భాషా సమర్ధకుడు శ్రీ చిలుకూరి నారాయణ రావు గారు ‘’మా గురువుగారికి అభిమానం అంటే ఇంటరెస్ట్ లేని విజ్ఞాన శాఖ లేదు .కొత్తది ఏదికనిపించినా దాని అంతు చూసేదాకా వదిలిపెట్టేవారు కాదు .శాసన ప రిశోధనలోనూ అందే వేసి’’న చెయ్యి .’’అని కీర్తించారు .
‘’తెలుగు వారికీ నిజమైన సంప్రదాయాన్ని చూపి , సరైనదారిలో పెట్టిన విద్వాంసులు గిడుగు .ఆయన కృషికి గొప్ప నిదర్శనం వారి ‘’ఆంద్ర గద్య చింతామణి’’.కవిత్రయ భారతాన్ని 36సార్లు చదివారు .రామమూర్తి గారు మహా కోపిస్టి .తనదగ్గరున్న అరుదైన ఫ్రెంచ్ నిఘంటువు నిండా మనవడు పెన్సిల్ తో పిచ్చి గీతలు గీస్తే ,వాడిని కోపపడకుండా వాడిలో మార్పు తెప్పించాలని ‘’ఒరేయ్ !నువ్వు పెద్ద వాడవయ్యాక ఈ పుస్తకాన్ని చదువుతాననినాకు ఇప్పుడు మాట ఇస్తే నిన్నేమీ అనను ‘’అని వాడు ‘’అలాగే చేస్తా తాతయ్యా ‘’అని హామీ ఇస్తే ,క్షమించి వదిలేసిన ప్రేమమూర్తి .ఆయన నోటిలో భగవద్గీత శ్లోకాలు ఎప్పుడూ నానుతూ ఉండేవి . .మరణ సమయం లో కూడా గీత శ్లోకాలు చదువుతూనే తనువు చాలించైనా ధన్యజీవి ‘’అని శ్రీ చింతా దీక్షితులు గారన్నారు .
‘’గురజాడ ,గిడుగు ,యేట్స్ దొర ,శ్రీనివాస అయ్యంగార్ ల వలనననే ‘’వ్యవహారిక భాషోద్యమ౦ ‘’మొదలైంది .కళా ప్రపూర్ణ ,రావు సాహెబ్ ,కైజర్ ఏ హిందూ వంటి బిరుదులుపొంది మహా భాషా వేత్త గిడుగు .తనధనం ,తన గృహం ,తన జీవితం ,తనజీవం ,తన సర్వస్వం వ్యవహారిక భాషోద్యమానికి ధారపోసిన త్యాగమయుడు గిడుగు రామమూర్తి పంతులుగారు ‘’అన్నారు హాస్యబ్రహ్మ ,వాడుకభాషలో మాండలీకం లో అద్భుత నాటికలు రాసిన సాహితీ విమర్శకులు శ్రీ భమిడిపాటి కామేశ్వరరావు గారు .
‘’Telugu has acquired as the substance of this Andhra Literary stream mainly on account of the bold ,persistent ,undaaunted ,un parallelled fight for it,toput up in press ,on the platform ,in social discourse and controversial pamphlets ,from psychological ,educational ,literary ,philological and traditional points of views by our renaissance types of revered scholor ,teacher ,the Upadhyaya of Upaadhyas,Rao SahebGidugu Venkata Rama Murthy pantulugaaru ,our ever beckoning light ,our never failing inspiration ‘’అని గొప్ప కితాబిచ్చారు శ్రీ బి .శేషగిరి రావు .
వీటికి ఆధారం –ఆచార్య చేకూరి రామారావు గారి ఆధ్వర్యం లో 1986డిసెంబర్ లో హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారు ప్రచురించిన ‘’మరో సారి గిడుగు ‘’పుస్తకం .
చనిపోవటానికి కొన్ని రోజులముందు మద్రాస్ ‘’ప్రజామిత్ర ‘’పత్రిక కార్యాలయం లో పత్రికా రచయితల సమావేశం లో గిడుగు పంతులుగారు చేసిన ‘’తుది విన్నపం ‘’లోని మాటలు ఒకసారి గుర్తుకు తెచ్చుకొందాం –‘’నిరాక్షరాస్యత ఉంటె అభి వృద్ధి ఉండదు .విద్యా వ్యాప్తి చెందితేనే సంఘం అభి వృద్ధి చెందుతుంది .ఇంగ్లాండ్ లో కూలిజనం ,కమ్మర్లు, వెల్డర్లు కార్పెంటర్లు మహాకవులు షేక్స్పియర్, మిల్టన్ లను చదవరు .వృత్తి విద్యనేర్పమని అడుగుతారు .అందుకే విద్యాధికులు వాళ్ళ దగ్గరకే వెళ్లి, వాళ్ళ భాషలో జ్ఞానం ,వివేకం అందిస్తారు . ఆ దేశాలలో ప్రజలకోసం సారస్వతం పుట్టి పెరుగుతుంది .మన దేశం లో కూడా ప్రజలు తమభాషలో రాయటం, చదవటానికి సమర్ధులు కావాలి .వీటికి పత్రికలూ ,ఇతర మాధ్యమాలు బాగా తోడ్పడాలి .ఏ భాషద్వారా జ్ఞాన౦ అభివృద్ది అయితే ,ఆభాషలోనే రాయాలి చదవాలి ‘’ఇదీ గిడుగు పిడుగు మనకిచ్చిన సందేశం .
నేడు గిడుగు వారి జయంతి –తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలతో
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -29-8-19-ఉయ్యూరు