1-సంగీత సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి
దాక్షిణాత్య సంగీతకళా తపస్సంపన్నులలో ప్రథములు శ్రీ త్యాగరాజస్వామి , ఆంద్ర వాగ్గేయకార చక్రవర్తి .’’సత్క్రియా చరణం ,భక్తితత్వ విచారణ ,యోగాభ్యాసాలలో ఒక దానిఎంచుకొని సాధన చేయమని చెప్పిన భగవద్గీ తాను సారం గా త్యాగరాజు గారు భగవత్ సామ్రాజ్యం సాధించారు .తన్మయత్వంతో శ్రీరామ చంద్ర గుణగానం చేసి ,గానానికి ఆత్మ సామ్రాజ్యం సాధించే శక్తి ఉందని నిరూపించారు .సాంఖ్యులు ,యోగులు పొందే నిర్వాణ స్థాయిని నాదోపాసన తో పొందవచ్చునని తెలియ జేసిన గాయక బ్రహ్మ త్యాగయ్య.’’సంగీతజ్ఞానము, భక్తి వినా సన్మార్గము కలదే మనసా ‘’?అని లోకోత్తర సందేశమిచ్ఛి తరి౦ప జేశారు .తెలుగు భాషామదుర్యం ,కావ్య రసామృతం,గానానందం త్రివేణీ సంగమం గా ఏకస్థాయిలో తనకృ తులలో మేళవించి బ్రహ్మానంద రసాను భూతి సిద్ధింప జేశారు త్యాగయ్య .
రాగాలకు జీవకళ ఉట్టిపడేట్లు గంభీర భావపూరితంగా కృతులను కూర్చ టానికి తెలుగు భాష మాత్రమే సరైనదని నిరూపించారు వాగ్గేయకారుడు త్యాగరాజస్వామి.వేద, వేదాంగాల సారాన్ని మంచి నుడికారంతో తెలుగు వారికి అందించిన మహానీయుడాయన .నిగమాల నిస్ట లో వ్యాసుడు కవితా గోష్టి లో వాల్మీకి .వైరాగ్యం లోశుకమహర్షి .భక్తిలో ప్రహ్లాదుడు.సాహిత్యం లోచతుర్ముఖ బ్రహ్మ. గానం లో నారదమహర్షి అనిపించిన సర్వజ్ఞ మూర్తి త్యాగబ్రహ్మసకల వేదోపనిషత్ సారాన్ని 24 వేల దివ్య సంకీర్తనలలో వ్యక్తం చేసిన పు౦భావ సరస్వతి ,సంగీత సద్గురువు త్యాగరాజస్వామి ..’’దేశభాషలందు తెలుగు లెస్స’’అని రుజువుచేసిన క్రాంత దర్శి ..96కోట్ల రామనామం జపించి తరించి తరి౦పమజేసినశ్రీరామభక్తుడు,త్యాగమూర్తి త్యాగబ్రహ్మ . త్యాగబ్రహ్మగారి కృతులన్నీ నాద బ్రహ్మ సాక్షాత్కారం లో నుండి ఆవిర్భవి౦చినవే ..ప్రతికీర్తనా రాగ సుధారస పాన మత్తత కలిగించే అమృత గుళిక. ‘’Tyagaraja ;s songs breathe the wisdom of S0crates,the tenderness and nathos Buddha ,the love of Christ for suffering humanity ,the quintessence of Upanishads and with all an in effable sweetness of music for which there is no parallel in the ancient and modern world ‘’ ఇలాంటి దివ్యామృతాన్ని తనివి దీరా గ్రోలేట్లు వేలాది కీర్తనలు రచించి దాక్షిణాత్యగాయకులకు భక్తిమార్గం చూపిన నాదబ్రహ్మ సద్గురుమూర్తి త్యాగరాజస్వామి .
శ్రీ శొంఠి రమణయ్య సద్గురువుల వద్ద గానవిద్య నభ్యసించి అసమాన పాండిత్య ధనుడై ,రామభక్తితో ఆయన కల్యాగుణా లను 24 వేల కృతులతో గానం చేసి ‘’శ్రీ గిరిరాజ సుతా ‘’అనే విఘ్నేశ్వర ప్రార్ధనతో ఆరంభించారు త్యాగయ్య .నిరంతర రామనామ పద రాజీవ ధ్యానం తో తన్మయత్వం లో వెలువడిన దివ్యనామ సంకీర్తనలు కర్ణ రసాయనంగా గానం చేస్తూ శ్రీరామ సేవలో గడిపిన ధన్యమూర్తి .తల్లి సీతమ్మ .తండ్రి రామ బ్రహ్మ .వీరిద్దరి పేర్లు వచ్చేట్లు ద్వంద్వార్ధంగా ‘’సీతమ్మమాయమ్మ ,శ్రీరాముడు మాకు తండ్రి ‘’కృతి రాశారు .పెన్నూ ,పేపరు లేని ఆకాలం లో కృతులను బొగ్గుతో గోడలపై రాసేవారు త్యాగయ్య .ఇవన్నీ తంజావూరు ,తిరువయ్యారు లలో విశేష వ్యాప్తి చెందాయి .
ఆకాలం లో తంజావూరు రాజదర్బారు లో 360మంది మహా గాయకులుడేవారు .వీరికి సంవత్సరం లో ఒక్క రోజు మాత్రమె పాడే అవకాశం కలిగేది .అందుకని ప్రతివారు ఒక్కొక్కరాగం లో విశేష కృషి చేసేవారు .వారు సాధన చేసిన రాగాన్ని బట్టి వారికి పేర్లు వచ్చాయి .శంకరాభరణం నర్సయ్య ,అఠాణా అప్పయ్య ,తోడి సీతారామయ్య వగైరా .ఇంతమంది సంగీత విద్వాంసులలో క్రొత్త విద్వాంసుడిగా త్యాగరాజుగారికి పేరు రావటానికి కారణం ఆయన అలౌకిక ప్రతిభ .అప్పటికే దేశ దేశాంతర కీర్తి పొందిన త్యాగయ్య గారిని గురువు గారు పిలిపించి తిరువాయార్ గాయక సమావేశం లో త్యాగయ్యగారితో పాడించారు.అద్బుతంగా గానం చేసి సుభాష్ అనిపించుకొన్నారు ‘’దొరకునా ఇటు వంటి సేవ ‘’కీర్తన మహా రంజుగా పాడిఅందర్నీ ఆశ్చర్య చకితులను చేశారు .వెంకట రమణయ్యగారు శిష్యుని గాన పాండిత్యాన్ని మనసారా అభినందించి ,ఆస్థాన గాయకుడైన తన తండ్రి వెంకట సుబ్బయ్య మొదలైన ఆస్థాన విద్వాంసుల సమక్షం లో పాడమనగా కాంభోజి రాగం లో ‘’మరిమరి మొరలిడి నానే ‘’ కీర్తన రసరమ్యంగా పాడి పరవశులను చేశారు .ఈ వార్త శరభోజీ మహారాజుకు చేరి సగౌరవంగా ఆహ్వానించగా ‘’నిధి చాల సుఖమా ,రాముని సన్నిధి చాల సుఖమా నిజముగదెలుపు మనసా ‘’ అనే కృతి రాసి ,దర్బారుకు వెళ్ళటానికి విముఖత చూపారు .ఆజ్ఞా ధిక్కారంగా భావంచి బంధించి భటులను తీసుకొని రమ్మని ఆజ్ఞాపించగా ,’’కడుపు శూల ‘’వ్యాధి తో గిలగిలలాడాడు .సిరిరా మోకాలు అడ్డినందుకు అన్న జపేశం కోపగించి ‘’నీ భజన బట్టకాయెనా,పొట్ట కాయెనా’’అని ని౦దించాడు .
గురు ముఖంగా నేర్వని విద్య వ్యర్ధం అని భావించి ‘’గురువు లేక ఎటు వంటి గుణి కి తెలియగబోదు’’కీర్తన రాశారు .మాతామహుడు వీణ కాళహస్తయ్య చనిపోయాక’’నారదీయ ‘’గ్రంథం లభించగా అర్ధంకాక పొతే రామాన౦ద యతి ‘’నారదోపాస్తి ‘’మంత్రోపదేశం చేయగా ,నారదమహర్షి దర్శనమిచ్చి పంచనదీశ్వరాలయానికి తీసుకు వెళ్లి ,’’స్వరార్ణవం’’గ్రంథం ఇచ్చి ,సకలశాస్త్రార్ధం అవగతం అవుతుందని ఆశీర్వదించి అదృశ్యమయ్యాడు
‘’ ఆత్మమధ్యగతః ప్రాణః ప్రాణ మధ్యగతో ధ్వనిః-ధ్వని మధ్యగతో నాదః నాదమధ్యే సదాశివః ‘’ అనే శ్లోకభావంగా ‘’రాగ సుధారస పానము ‘’అనే కీర్తనరాశారు త్యాగయ్య .స్వరార్ణవం లోని మూర్చనలపేర్లకు ఇప్పుడు ,ప్రచారం లో ఉన్న వాటి పేర్లకు చాలా తేడాలున్నాయి .తననారద భక్తి ప్రకటనకు ‘’శ్రీనారద సరసీ రుహ భ్రు౦గ’’,’’నారద గురుగుహ ‘’,నారద గురు స్వామి ‘’మొదలైన కీర్తనలు రాసి నారదాంకితం చేశారు త్యాగబ్రహ్మ .తనమాయరూపాన్ని త్యాగయ్య పసికట్టాడని గ్రహించి త్యాగయ్యకు ‘’రామ తారక మంత్రం ‘’నారదుడు ఉపదేశి౦చగా ‘’ఎంత భాగ్యమో ‘’,’’సందేహమును దీర్పుమయ్య ‘’కృతులురాసి కృతజ్ఞత తెలుపుకొన్నారు నారద గురువుకు శిష్య త్యాగబ్రహ్మ .
ఆధారం –చతుర్భాషా కోవిద ,నానారాజ్య విద్వత్సభా పదవీ విభూషిత ప్రభుత్వ గాన పరిశోధక ,నాద సుధానిధి శ్రీ మంగిపూడి రామలింగ శాస్త్రి రచన ‘’ఆంద్ర గాయకుల చరిత్రలు ‘’,
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -24-12-19-ఉయ్యూరు
‘’