ప్రపంచ దేశాల సారస్వతం
49-పలావు దేశ సాహిత్యం
ఆర్చిపెలగు ఐన 500దీవుల సమూహమే పలావు దేశం పశ్చిమ ఫసిఫిక్ తీరం లో ఉంది.కరోనా సోకని ఎనిమిదవ దేశం .బెబిల్ డాబ్ రాజధాని .3వేలఏళ్ళ క్రితమే ఇక్కడ వలసలు ఏర్పడ్డాయి .16వ శతాబ్దిలో స్పెయిన్ మొదటిసారిగా ఇక్కడ కాలుపెట్టిన యూరోపియన్ దేశం .1898లో జరిగిన స్పానిష్ –అమెరికన్ యుద్ధం లో ఇంపీరియల్ జర్మనీకి దీన్ని అమ్మేశారు .మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్ చేతికి వచ్చింది .1979లో పూర్తి సార్వభౌమాధికారం పొంది స్వతంత్ర దేశమైంది .ప్రెసిడెంషియల్ రిపబ్లిక్ ప్రభుత్వం .పలావు ,ఇంగ్లిష్ లు అధికార భాషలు .ఇక్కడ ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ క్లైమేట్ ఉంటుంది .పర్యావరణ వినాశనం కాని దేశం .ఉప్పునీటి మొసళ్ళు ఇక్కడ ప్రత్యేకం .ఇవి లెక్కలేని ఉన్నా ప్రమాదకరమైనవి అంటున్నా ,పెద్దగా మనుషుల్ని ఇబ్బంది పెట్టిన జాడ బహు స్వల్పం .15అడుగులపోడవు క్రోకడైల్స్ కూడా ఉండిఆశ్చర్యం కలిగిస్తాయి .భూకంపాలు అగ్నిపర్వత భయాలు ఎక్కువ .తాగునీటి సరఫరా సరిగ్గా ఉండదు వ్యవసాయభూమి చాలాతక్కువ .2009లో ప్రెసిడెంట్ ఇక్కడ ప్రపంచం లోనే మొట్టమొదటి ‘’షార్క్ శాం క్త్యురి ‘’ఏర్పాటు చేస్తానని ప్రకటించాడు .కమ్మర్షియల్ షార్క్ వేట నిషేదించి ‘’ఎక్స్ల్యూజివ్ ఎకనామిక్ జోన్ ‘’ఏర్పాటు చేసి ,సముద్రం లో 6లక్షల చదరపు కిలోమీటర్ల మేరకు రక్షించే ‘’షార్క్ అభయ ప్రదేశం –శాన్క్త్యురి ‘’ఏర్పాటు చేసి ప్రపంచ మన్ననలు పొందింది పలావు .ప్రెసిడెంట్ టోరిబియాంగ్ యునైటెడ్ నేషన్స్ లో మాట్లాడుతూ ప్రపంచ దేశాలన్నీ షార్క్ వేట నిషేధించాలని కోరాడు ఫ్రాన్స్ అంగీకరించింది .ఈ సాహస నిర్ణయానికి ‘’వరల్డ్ ఫ్యూచర్ కౌన్సిల్ ‘’ పలావు దేశానికి’’ఫ్యూచర్ పాలిసి అవార్డ్ ‘’అందించింది .మెరైన్ ఈకో సిస్టం పరిరక్షణలో పలావు దేశం మార్గదర్శి అయింది .
ఈ దేశ ఆర్ధికం ఫిషింగ్ ,టూరిజం కొద్దిపాటి వ్యవసాయం వల్లనే వస్తుంది .స్కూబా డైవింగ్ కు టూరిస్ట్ లు ఎగబడతారు .అమెరికాపైనే ఆర్ధికానికి ఎక్కువ ఆధారపడుతుంది .2006పలావు సేవింగ్స్ బాంక్ దివాలాతీసింది .జనాభా సుమారు 18వేలు .రోమన్ కేధలిక్కులు ,ప్రొటే స్టంట్ లు ఉన్నారు .జనాలు అన్ని చోట్లా సంప్రదాయం తప్పక పాటిస్తారు .బేస్ బాల్ ఆట ఇష్టం .నేషనల్ ఫుట్ బాల్ టీం ఉంది.16వ ఏడులోపల ప్రైమరీ విద్య పూర్తి చేయాలి .పలావో కమ్యూనిటి కాలేజి ఉంది.పై చదువులకు బయటి దేశాలకు వెళ్ళాల్సిందే .లోతైన నీలి సముద్రంలో హాయిగా విహరించటానికి ‘’పిస్టైన్ పారడైజ్ ‘’ఉంది.దీని సంస్కృతిని అత్యంత భద్రంగా సంరక్షిస్తున్నారు .
పలావు దేశ సాహిత్యం –కొందరు రచయితలు ,రాసిన పుస్తకాలు -1-బీయింగ్ ఎ పలావియన్ –హోమర్ జి బార్నెట్ 2-వర్డ్స్ ఆఫ్ ది లేగూన్ –ఆర్ ఇ.జోనాన్స్ 3లాస్ట్ మాన్ స్టాండింగ్ –డిక్ కాంప్ 4-వరల్డ్స్ ఎవే –పాట్రిక్ ఫినేల్లి 5-పలావు స్ట్రగ్లింగ్ ఫర్ ఇండిపెండెన్స్-ఆర్నోల్డ్ లీబో విజ్ 6-లెఫ్ట్ టు డై-డాన్ కుర్జిమన్7-సిక్స్టి యియర్స్ ఆఫ్ సెర్చింగ్ ఫర్ దిమిస్సింగ్ మెన్ ఆఫ్ వరళ్డ్ వార్ -2-విల్ ఎస్ విల్టన్ మొదలైనవారు
బాలల పుస్తకం రాసిన జొలేన్ గోరియాకిల్ అనే ఆమె పలావు భాషలో బాలసాహిత్యం రాసినకోద్దిమందిలో ఒకరు .వెయ్యికాపీలు ముద్రించింది. దీనికి ఆమెకు ప్రోత్సాహంగా ఫసిఫిక్ యూత్ నుంచి గ్రాంట్ లభించింది .ఆ పుస్తకాలన్నీ స్కూళ్ళకు ఉచితంగా ఆమెసరఫరాచేసి గ్రాంట్ కు సార్ధకత చేకూర్చింది .ఇంతకంటే వివరాలు దొరకలేదు
ప్రపంచాన్ని కరోనా వైరస్ చుట్టుముట్టి బాధిస్తుంటే ,దాన్ని పలావు దేశం లో అడుగుపెట్టకుండా ఆ దేశ అధ్యక్షుడు టామీ రేమింగ్ సావు దేశ టూరిజం కోసం ఇక్కదికిరాకుండా చాలా స్ట్రిక్ట్ నిబంధనలు అమలు చేశాడు ప్రపంచం అంతా కరోనా నుంచి విముక్తి పొందాకే బార్డర్లు తెరుస్తాను అని నిర్మొహమాటంగా చెప్పి నిలబెట్టుకొంటున్నాడు ప్రజారక్షణ అంటే అదీ .మనరాస్ట్రం లాగా మంత్రులు శాసనసభ్యులు ఇతర ప్రజాప్రతినిధులు మందీ మార్బలంతో వెళ్లి కుళాయి నో టాయ్ లెట్ నో ,వస్తు సరఫరానో చేయటం లేదు .టూరిజం మీదనే ఎక్కువ ఆధారపడిన దేశమైనా ప్రెసిడెంట్ అత్యంత సాహసోపేత నిర్ణయం తీసుకోవటం అభినందనీయం. Profits come and go. But you only have one life to live and that’s the basic model we’ve been following … That’s why, as of today, no single virus (case) has been detected.” అని ప్రజలప్రాణమే అన్నిటికన్నా మిన్న అని ఘంటా పదంగా చెప్పాడు ఆ ప్రెసిడెంట్ . Key to that readiness was being able to convince people to follow strict hygiene and social distancing measures, while accepting that school closures and business and economic losses were sacrifices for the greater good, Remengesau said. If you don’t respect yourself, you don’t respect your neighbours, and that’s when chaos can ensue.” అని ప్రజలకు నచ్చ చెప్పి వారందరి మద్దతు సాధించి భేష్ అనిపించాడు .ఎన్నికలకోసమో ,పాప్యులారిటీకోసమో కక్కుర్తి పడే జనం,వాళ్ళ నాయకులు తప్పక గ్రహించాల్సిన విషయం ఇది .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -27-4-20-ఉయ్యూరు