ప్రపంచ దేశాల సారస్వతం
51-సావో టోమ్ అండ్ ప్రిన్సిపి దేశ సాహిత్యం
కరోనా సోకని పదవ దేశం సావో టోమ్ అండ్ ప్రిన్సిపి దేశం రెండవ అతి చిన్న ఆఫ్రికా దేశం సావోటోమ్ మరియుప్రిసిపి అనే రెండు ఐలాండులు ఒకదానికొకటి 140కిలోమీటర్ల దూరం ఉన్న దేశం .ఒకప్పుడు ఇవి పోర్చుగీస్ కాలనీలు .1975లోలో స్వాతంత్ర్యం పొందాయి .1471లోనే పోర్చుగీసులు సావో టోమ్ లో,1492లో ప్రిన్సిపి లలో అడుగుపెట్టి ,ఆ నాటి సెయింట్ ల ప్రభావం ఎక్కువకనుక పూర్వపు ప్రిన్స్ అయిన ప్రిన్సిప్ పేరుగా సెయింట్ అంటావోదేశం గా అని ,1500లో ప్రిన్స్ ఆఫ్ పోర్చుగల్ గా మార్చారు .పోర్చుగల్ యాత్రికులు రాకముందు ఇక్కడ జనావాసమే లేదు .భూమధ్యరేఖకు కుడివైపున ఉన్నది .అట్లాంటిక్ సముద్రం,గల్ఫ్ ఆఫ్ గినియా కు దగ్గర .టూరిస్ట్ లకు భయం ఉండదు. నేరాలు అత్యల్ప౦ . .ఇక్కడ ఓహో నేచురల్పార్క్ ,మ్యూజియం ,పికోగ్రాండే,లాగోవా అజుల్ ,పికో మొగామ్బో ,ప్రాయామకొండో మొదలైన 10ప్రాంతాలు గొప్ప టూరిస్ట్ స్పాట్స్
1953లో ‘’బెటాపా మాసకర్’’జరిగి వందలాదినేటివ్ లను పోర్చుగీసులు హత౦ చేశారు .పంటలకోసం వాళ్ళను బలవంతంగా బానిసలుగా పని చేయించారు. పని చేయనివారిపై తీవ్ర చర్య తీసుకోమని గవర్నర్ జనరల్ హుకుం జారీ చేశాడు .క్రమంగా మువ్ మెంట్ ఫర్ లిబరేషన్ ఉద్యమం సాగి ,1990లో MLSTP అనే ఏకైక పార్టీ ఏర్పడి ,రాజ్యాగ సవరణ చేసి మిగిలిన రాజకీయ పార్టీలకూ అవకాశం ఇచ్చింది.నేషనల్ అసెంబ్లీ కి ఎన్నికలుజరిగి ‘’’’ పార్టీ ఆఫ్ డెమోక్రాటిక్ కన్వర్జెన్స్ ‘’అత్యదికస్థానాలు సాధించి మైగెల్ త్రొవోడా ప్రెసిడెంట్ అయ్యాడు
ఇక్కడ ట్రాపికల్ హుమిడిటి క్లైమేట్ ఉంటుంది .కొమరాన్ వల్కానిక్ లైన్ లో ఉన్నదేశం కనుక అగ్నిపర్వత భయం జాస్తి .కొన్ని చోట్ల అత్యధిక కొన్ని చోట్ల అత్యల్ప వర్ష పాతం ఉంటుంది .వ్యవసాయం, ఫిషింగ్ ఇక్కడి ఆదాయవనర్లు కోకా పంట విస్తృతం 95శాతం పంట ఎగుమతి అవుతుంది .రాగి దొరుకుతుంది .కాఫీ ,పామోలివ్ ప౦డుతాయి .స్వతంత్రం వచ్చాక ఎకనామి జాతీయం చేయబడింది .ఇతర దేశాల పై ,యుఎన్ ఓ సహాయం పై ఆధారం ఎక్కువ .కరెన్సీపేరు-డోబ్రా దీని విభాగాలు 100..ఆర్చిపెలాగాన్ ,నైజీరియాలో పెట్రోల్ పడింది ఈమధ్యనే .జనాభా ఒకలాక్ష అరవై వేలు .రాజధాని కూడా సావో టోమ్ .ఆఫ్రికన్ ,పోర్చుగీస్ సంస్కృతీ ఉంటుంది .డాగో౦ కాంగో డాన్సులు ఎక్కువ .పిల్లలు నాలుగేళ్ళు స్కూలు విద్య నేర్వాలి. రెండు కాలేజీలున్నాయి .
సావొటోమ్ ప్రిన్సీపి సాహిత్యం –రచన అంతా పోర్చుగీస్ భాషలోనే ఉంది .ఇంగ్లిష్ లోనూ కొన్ని ఉన్నాయి. స్థానికభాషలలో తక్కువే .ఈ దేశాల ప్రాధమిక సాహిత్యాన్ని కేటనో డ కోస్టాఅలగ్రా మొదట రికార్డ్ చేశాడు .అందులో ‘’విసావో ‘’అనే కవితా సంకలనంఉంది తర్వాత సారా పింటోకోఎల్హో అనే రచయితరచనలున్నాయి .20వ శతాబ్దిలో ఆర్చి పేలగా నుంచివచ్చిన ఫ్రాన్సిస్కో జోస్ టేనేరో చరిత్ర రచనలో సుప్రసిద్ధుడు .అమిత ప్రభావం కలిగించినవాడు .లిస్బన్ లో హైస్కూల్ ఆఫ్ కలోనియల్ అడ్మినిస్ట్రేషన్ లో చదివి క్లారిడేట్ పత్రికలోరివ్యూలు రాశాడు .కవిత్వంతోపాటు ఆఫ్రో అమెరికన్ పాటలను సేకరించి భద్రపరచాడు .రచయిత్రులలో మాన్యూలా మార్గరిడో,ఆల్డా ఎస్పిరిటో శాంటో ప్రసిద్ధులు .వీరి రచనలు జాతీయతపైనా స్వాతంత్ర్యుద్యమం పైనా ఉంటాయి .స్వతంత్రం వచ్చాక ఆలిండా బేజా ,కన్సెరికో లిమా 21వ శతాబ్ది గొప్ప రచయితలు
రచయితలుగా ప్రసిద్ధులు
· Olinda Beja
· Albertino Bragança
· Guadalupe de Ceita
· Sara Pinto Coelho
· Alda Neves da Graça do Espírito Santo
· Carlos Graça
· Conceição Lima
క వులుగా ప్రసిద్ధులు
·
· Olinda Beja
· Caetano da Costa Alegre
· Francisco da Costa Alegre
· Alda Neves da Graça do Espírito Santo
· Conceição Lima
· Manuela Margarido
· António Lobo de Almada Negreiros
· Rafael Branco
· Francisco José Tenreiro – historically the most renowned writer in history
· జర్నలిస్ట్ లు António Lobo de Almada Negreiros
· Aurélio Martins
డోనాల్డ్ బరన్స్ ‘’ఒస్సోబో ‘’అనే రచనలో ఆదేశ సాహిత్యం పై వ్యాస సంపుటి రాశాడు .
మార్చి 20కి ముందే ఈదేశం లో ఎమర్జెన్సి విధించి విద్యా సంస్థలు మూసేసి ,బార్డర్స్ మూసేసి టూరిజం ఆపేశారు కనుక కరోనా వైరస్ కాలుపెట్టలేదు .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -30-4-20-ఉయ్యూరు