ప్రపంచ దేశాల సారస్వతం
104-పాకిస్తాన్ దేశ సాహిత్యం
పాకిస్తాన్ దక్షిణ ఆసియాలో ఇస్లామిక్ రిపబ్లిక్ .213మిలియన్ లతో ప్రపంచంలో అయిదవ అధిక జనాభా ఉన్న దేశం .33వ పెద్ద దేశం .రాజధాని –ఇస్లామాబాద్ –కరెన్సీ –పాకిస్తాన్ రూపాయి .బీద దేశం .న్యూక్లియర్ పవర్ సాధించింది అత్యధిక ముస్లిం జనాభాలో రెండవ స్థానం జాతీయ భాష ఉర్దు.పస్తూ, సింధు, బలోచి వగైరా భాషల జనాలున్నారు .అందమైన ఆకర్షణీయ దేశం టూరిస్ట్ లకు భద్రత ఉంది .ప్రత్తి పంట ఫిషరీస్ ,అడవులు ఆదాయ వనరులు . పాకిస్తాన్ సాహిత్యం 1947లో స్వతంత్రం పొందాకనే వచ్చింది .ఉర్దూ ఇంగ్లిష్ సాహిత్యం బాగా పెరిగింది .సర్దార్ హసన్ మాంటో-1912-55 దక్షిణ ఆసియా కధలురాశాడు ఇండో –పాక్ విభజన నేపధ్యంగా .తర్వాత 20వ శతాబ్దం లో పాకిస్తానీయుల కష్టాలూ కథలుగా రాశాడు .అక్కడి ఉర్దూ ఇంగ్లిష్ రచయితలు విషయాలను ఇంగ్లిష్ ఉర్దూ లనుండి గ్రహించారు .పాకిస్తాన్ అకాడెమి ఆఫ్ లెటర్స్ ఏర్పడి సాహిత్య పర్యవేక్షణ చేస్తోంది.
పాకిస్తాన్ పీరియాడికల్స్ ను డైజెస్ట్ లు అంటారు .వీటికి కేంద్రం కరాచి .ఫిక్షన్ కూడా ఇక్కడి నుంచే .షకీల్ ఆదిల్ జాదా పల్ప్ ఫిక్షన్ చాలా రాశాడు .జనరల్ జియాకాలం లో స్వేచ్చ ఉండేదికాదు .అయినా లంచాలిచ్చి మేనేజ్ చేసేవారు .కొన్ని పత్రికలు మానవ స్వభావానికి ఆత్మ శక్తికి వ్యతిరేకంగా ఉండేవి .ఇవి మధ్యతరగతి వారికి సెక్స్ మసాల బాగా దంచి అందించేవి .క్లాసికల్ ఉర్దూ లో దిట్టలు కూడా హ్యూమన్ సెక్సువాలిటి ని తరచి రాసినట్లు హసీబ్ అసీబ్ తెలియజేశాడు .
ఫైజ్ అహ్మద్ ఫైజ్ పాకిస్తాన్ కమ్యూనిస్ట్ పార్టీ లీడర్ సాహిత్య వ్యాప్తికి ఫెస్టివల్ కరాచి లిటరేచర్ ,ఫెస్టివల్ లాహోర్ లిటరేచర్ నిర్వహించాడు .ఉర్దూలో చాలా రాశాడు .సింది సాహిత్యం లో కవిత్వం వ్యాసం బాగా వచ్చాయి .కార్గిల్ యుద్ధం లో దేశభక్తికవిత్వం ఏరులై పారింది .ప్రోగ్రెసివ్ రైటర్స్ ఉద్యమమూ వచ్చింది .గుజరాతీ సాహిత్యమూ వెలువడింది
ఉర్దూ కవులలో –అహ్మద్ ఫరాజ్ ,అహ్మద్ నజీం కాస్మి ,పర్వీన్ షకిర్ , జువాన్ ఎలియా ,షకీబ్ జలాలి,రాయస్ వార్సి మోయీన్ నిజామి మొదలైన వారు అగ్రస్థానం లో ఉన్నారు .
స్త్రీలలో ఫెహ్మిడా రియాజ్ ఒక్కరే .కామికల్ పోయెట్స్ లో అన్వర్ మసూద్ , దిలావర్ ఫిగర్ ,జమీర్ జఫ్రి ఉన్నారు .ఆంగ్లకవులలో దావూద్ కమాల్ ,ఆలంగిర్ హాష్మి ,జుల్ఫీకర్ ఘోష్ ,సాహిర్ సుహ్రవర్ది ,మకికురేషి ,కలీం ఒమర్ .పంజాబీ కవులలో –పీర్ నజీరుద్దీన్ నజీర్ ,బుల్లెష్ షా ,ఫరీదుద్దీన్ గంజాస్కర్ ,వారిస్ షా ,సుల్తాన్ బహు ,ఉస్తాద్ దమన్ . సరైకి కవులు –ఖవాజా ఫరీద్ ,సచాయ్ సర్మస్ట్ ,బుల్లెష్ షా ,సుల్తాన్ బహు,షకిర్ షుజా ఆబాది .సింధి కవులు –అదల్ సూమ్రో ,బేడిల్,ఇమ్దాద్ హుసేని ,మీర్జా క్వలీజ్ బేగ్ ,సవాన్ ఫకీర్ ,తజాల్ బేవస్,ఉస్తాద్ బుఖారి వంటి వారు చాలామంది
ఫస్తూకవులు –ఖుశాన్ ఖాన్ ఖటక్,రహ్మా బాబా ,హమీర్ హంజా షిన్వరి ,ఖాన్ అబ్దుల్ ఘనీఖాన్ ,అజ్మల్ ఖట్టక్.బలూచి కవులలో గుల్ ఖాన్ నసీర్ ఒక్కడే కనిపిస్తున్నాడు
సాదత్ హసన్ మంటో-ప్రముఖ రచయిత.’’తమాషా ‘’కథా చక్రవర్తి .సెక్యులర్ భావాలు .’’డి.హేచ్ .లారెన్స్ ఆఫ్ పాకిస్తాన్’’ అంటారు .అతని తొండాగోష్ట్ కథ పాక్ లో అసభ్య నేర విచారణకు సంబంధించింది .అతని శైలి ‘’టెల్ ఇట్ ఆజ్ ఇట్ ఈజ్ ‘’అంటే ఉన్నది ఉన్నట్లు చెప్పు అనేది 250 కధల్లోనూ కనిపిస్తుంది .42ఏళ్ళు సాహిత్య సేవ చేశాడు .2012లో ఆయన జయంతిని ఘనంగా జరిపారు.
మొహసిన్ హమీద్ –యువ పాక్ రచయిత.2000లో ‘’మోత్ స్మోక్ ‘’నవల,2007లో ‘’ది రిలక్టేంట్ ఫ౦డమెంటలిస్ట్స్’’రాసి చాలా పేరు పొందాడు .మాత్ స్మోక్ నవలలో ఈ నాటి పాక్ లో సంస్కృతుల మధ్య వైరుధ్యం ,దీనివలన నేర ప్రవృత్తి పెరగటం రాశాడు .పాక్ న్యూక్లియర్ బలం సాధించటానికి వ్యతిరేక నేపధ్యంగా రాశాడు .ఈనవల హెమింగ్వే అవార్డ్ కు నామినేట్ అయి ,న్యూయార్క్ టైమ్స్ నోటబుల్ బుక్ ఆఫ్ ది యియర్ గుర్తింపు పొందింది .రెండవ నవలలో నాయకుడు చెంఘిజ్ ఇస్లాం ఫండమెంటలిజం- అమెరికన్ కేపిటలిజం మధ్య నలిగి పోవటం.మాన్ బుకర్ ప్రైజ్ కు ఎంపికయింది .ఇతనిపై హెమింగ్వే ,నోబకోవ్ లప్రభావం ఉన్నది
మహమ్మద్ హనీఫ్ –‘’ఎ కేస్ ఆఫ్ ఎక్స్ప్లో డింగ్ మాంగోస్ ‘’ సటైరికల్ నవల .ఇందులో జనరల్ జియావుల్ హక్ మరణానికి జరిగిన కుట్ర కుతంత్రం ఉంటాయి .మామిడి పళ్ళను ‘’నెర్వ్ గాస్ ‘’తో నింపి విమానంలో ఎక్కించి పైలట్ ను నాక్ డౌన్ చేసి ,విమానంకూలిపోయేట్లు చేసిన కుట్ర .ఈనవల సాహిత్య ప్రపంచంలో అత్య౦త అరుదైన హాస్య౦ తో తీవ్ర తుఫాన్ సృష్టించి,కామన్ వెల్త్ బుక్ ప్రైజ్ తో సహా అనేక అవార్డ్ లు పొందింది.
రెండవనవల ‘’అవర్ లేడీఆఫ్ ఆలిస్ భట్టి ‘’2011 రోరింగ్ సక్సెస్ సాధించింది An allegory for the plight of religious minorities in Pakistan, the book is interspersed with genuinely funny lines. A case in point is one of the characters’ take on love: ‘It’s futile to predict what love will make of you, but sometimes it brings you things you never knew you wanted. One moment all you want is a warm shower, and the next you are offering your lover your chest to urinate on.’ అని ప్రశంసలు పొందిన నవల .రచయిత విట్ అండ్ హ్యూమర్ కు అంతర్జాతీయ గుర్తింపు లభించింది .హనీఫ్ నాటకాలు కూడా రాశాడు. కరాచి బిబిసి ఉర్దూ విభాగం లో డైరెక్టర్ .
కామిలా శంషీ-ఇతర దేశాలలోచదివి ఎదిగి ,ఇక్కడికి వచ్చి 5పుస్తకాలురాసింది .మొదటిది ‘’ది సిటి బై ది సీ’’ జాన్ లీవిల్లీ ప్రైజ్ కు ఎంపికయింది .అనిశ్చితరాజకీయంలో ఒక యువకుడు పడే పాట్లు ఇందులో అంశం .ఈమెకు చాలా అవార్డ్ లొచ్చాయి .
డేనియల్ ముసీనుద్దీన్ –కథలు న్యుయార్కర్ మొదలైన పత్రికలలో ప్రచురితాలు .’’ఇన్ అదర్ రూమ్స్ ,అదర్ వండర్స్ -2009సంపుటులలో పాకిస్తాన్లోని జీవితాన్ని వివిధ మనుషుల కళ్ళ లోంచి చూసి చెప్పాడు .ఇందులో వర్గ పోరాటాలు ,ఫ్యూడల్ వ్యవస్థ గురించి వర్ణించాడు .తనపై టాల్స్టాయ్ ,చెకోవ్ ల ప్రభావం ఎక్కువ అని ఈ న్యుయార్కర్ అన్నాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -28-5-20-ఉయ్యూరు