0వ శతాబ్ది సాహిత్యం -3
01914నుంచి 1945వరకు
కొత్త కవిత్వం -2
ఎజ్రా పౌండ్ రెండవ ప్రపంచయుద్ధం తర్వాత వాషింగ్టన్ డి.సి.లో సెయింట్ ఎలిజబెత్ హాస్పిటల్ లో బందీ గా ఉన్న కాలం తప్ప ,1908తర్వాత స్వదేశం అమెరికాలోకాక ఇతర దేశాల్లోనే ఉన్నాడు .20వ శతాబ్దం ఇంగ్లీష్ రచనపై పౌండ్ ప్రభావం అత్యధికం కవిత్వం లోనేకాక ,సంగీత నాటక ప్రసారాలపై పట్టు ఉన్నవాడుగా ,ఇతర రచయితలను ప్రేరణ చెందించే వాడుగా ఉన్నాడు .అతడి వివాదాస్పద ‘’కాంటోస్’’మొదటిసారిగా 1926లో వెలువడింది .చివరిదైన త్రోన్స్ 1959లో ప్రకటించాడు .అనుబంధాన్ని డ్రాఫ్ట్స్ అండ్ ఫ్రాగ్ మెంట్స్ ఆఫ్ కాంటోస్-CXCXV111గా 1969లో విడుదల చేశాడు .
పౌండ్ శిష్యుడైన టి ఎస్ ఇలియట్ కూడా ఆయనలాగానే అమెరికాలో పుట్టినా ,విదేశాలలోనే గడిపి 1927లో బ్రిటిష్ పౌరుడయ్యాడు .1917మొదటి రచన ఫ్రఫ్రాక్ అండ్ అదర్ అబ్జర్వేషన్స్ గా రాసి ప్రచురించాడు అయిదేళ్ళ తర్వాత 1922’’వేస్ట్ లాండ్ ‘’అద్భుత కవితా సంపుటి రాశాడు .ఇందులోని మొదటికవిత తోనే ప్రపంచ ప్రసిద్ధిపొందాడు .విభాగాలుగా ,పోటీ స్వరాలుగా (కంపీటింగ్ వాయిసెస్ )పండిన పరోక్ష కవిత్వం అల్యూజన్స్ గా రాసి కొత్త ప్రయోగం తో ఆధునిక ఆంగ్ల సాహిత్యానికి మార్గదర్శియ్యాడు .దీనిలో పూర్తిగా నిరాశపడిన యుగాన్నీ ,ఆధునికప్రపంచాన్నీ వర్ణించాడు .రెండు ప్రపంచ యుద్దాలమధ్య కాలం లో కవిగా విమర్శకుడుగా శక్తివంతమైన ప్రభావం చూపించాడు .అయన రచనలలో దిబెస్ట్ అని విమర్శకులు మెచ్చిన ‘’ది ఫోర్ క్వార్టర్స్ ‘’ను 1943లో రాశాడు .అందమైన ఇమేజరీ సృష్టించటం ఇలియట్ ప్రతిభకు నిదర్శనం .గతకాల మానవ వైభవం ఆయన్ను వెంటాడింది .మానవ చరిత్ర అంటే ఏమిటో లోకానికి చాటి చెప్పాడు .
17వ శతాబ్దికి చెందిన వైవిధ్య మెటాఫిజికల్ కవుల అందులో ముఖ్యంగా జాన్ డోన్నెప్రభావం ఇలియట్ పై బాగా ఉంది. ఆర్కిబాల్ద్ మాక్ లీష్ తొలినాటి కవిత్వ ప్రభావం వేస్ట్ లాండ్ లో బాగాకనిపిస్తుంది. ఇలియట్ కవిత్వ, విమర్శ ల ప్రభావం అనేకమంది దక్షిణ దేశకవులైన జాన్ క్రౌ రామ్సన్ ,డోనాల్డ్ దేవిడ్సన్,అల్లెన్ టాటే లు ఎక్కువగా కనిపిస్తుంది .సాహిత్య నోబెల్ ప్రైజ్ పొందాడు ఇలియట్ .అమెరికా యువ మెటాఫిజికల్ కవులు లూయిస్ బోగాన్ ,లియోనీ ఆడమ్స్ ,మూరియాల్ రుకేసర్,డేల్మోర్ స్క్వార్జ్ ఇలియట్ ప్రభావితులే .కొందరు మేజర్ కవులు ఇలియట్ ప్రభావాన్ని వ్యతిరేకించారు .వీరికి రొమాంటిక్ విజనరీ కవిత్వం పై మోజు ఎక్కువ .వీరిలో హార్ట్ క్రేన్ దీర్ఘకవిత –ది బ్రిడ్జ్’’-1930లో విట్మానిక్ అమెరికన్ ఎపిక్ గా రాశాడు .వాలేస్ స్టీవెన్స్ కళకళ లాడే ఐంద్రియ (లష్ అండ్ సెన్సువస్ )కవిత్వం గుప్పింఛి ‘’హార్మోనియం ‘’-1923కవితలో ఆశ్చర్యకరకవిత్వం రాసి ఆకర్షించి అమెరికా రుణపడి ఉండేట్లు చేశాడు .మరొక ఇలియట్ భావ ప్రత్యర్ధి విలియం కార్లోస్ విలియమ్స్ ప్రయోగాత్మక వచనంతో ఆకర్షించి ‘’స్ప్రింగ్ అండ్ ఆల్ ‘’కవితా సంపుటి 1923లోనే రాశాడు . అమెరికా లౌకిక వివరాలు (మండేన్ డిటైల్స్’’)ఆ దేశ పౌరాణిక (మిత్ ),సాంస్కృతిక చరిత్ర వర్ణన లన్నీస్వీప్ గా 1925లో రాసిన ‘’ఇన్ ది అమెరికన్ గ్రైన్స్ ‘’లో చూపాడు .
ఫిక్షన్
లిటిల్ మాగజైన్ లు కవిత్వనికే కాక ఫిక్షన్ కు గొప్ప ప్రోత్సాహం కలిగించాయి .సంప్రదాయ బద్ధం కాని ధైర్యంగా రాసిన కధలను ముద్రించాయి .బాగా పాతుకుపోయిన రచయితలపై దాడినీ బాగానే ఆదరించి ప్రచురించారు .ది డయల్ – 1880-1929,లిటిల్ రివ్యు -1914-29,సెవెన్ ఆర్ట్స్ -1916-17 మొదలైన పత్రికలు ఆధునిక సృజన ను బాగా ప్రోత్సహించాయి .భయంకర ఫన్నీ జర్నలిస్ట్ క్రిటిక్ హెచ్ ఎల్ మెంకేన్ తన స్మార్ట్ సెట్ -1914-33లో ,అమెరికన్ మెర్క్యురి 1924-33 లలో ఇలాంటి రచనలు పెద్ద పీట వేసి ప్రచురించి రచయితలను ప్రోత్సహించాడు .మూసలో నుండి నూతన ఫిక్షన్ ఆవిర్భవానికి ,ప్యూరిటజం పై కటువైన విమర్శకుడైనఈ ఎడిటర్ మెకెన్సన్ ప్రభావం బాగా తోడ్పడింది .
ఈ ఉత్సాహం తో జోసెఫ్ కాన్రాడ్,ధియోడర్ డ్రీజర్ లు దూకుడుగా రాశారు .ఆభిజాత్యం (జెంటిలిటి)పై దాడి చేస్తున్న,గ్రామీణ జనాల అసహాయ నిరాశా జీవితాలపై ప్రశ్నిస్తున్న , చిన్న చిన్న యువ రచయితలనూ ఆయన ప్రోత్సహించాడు .వీరిలో జేమ్స్ బ్రాంచ్ కాబెల్,జానా గేల్రూత్ సక్కో వంటివారున్నారు .వీరిలో గణనీయుడు షేర్ వుడ్ ఆండర్సన్ .అతడి ‘’వైన్స్ బర్గ్ ఒహాయో 1919,ది ,ది ట్రయంఫ్ ఆఫ్ ది ఎగ్’’ 1921కధా సంపుటులలో గ్రామీణులు అనుభవిస్తున్న అన్నిరకాల భయాలు ,బాధలు ,అణచి వేతలు ఇతి వృత్తంగా రాశాడు .చాలా నవలలూ రాశాడు .వాటిలో ది బెస్ట్ ‘’పూర్ వైట్ ‘’-1920.
విమర్శకులు 1920లోకొత్తతరహా ఫిక్షన్ ఆవిర్భావి౦చినట్లు గమనించారు .దీనిలో ఎఫ్ స్కాట్ ఫిట్జ రాల్డ్ రాసిన- ది సైడ్ ఆఫ్ పారడైజ్ ,సిన్క్లేర్ లేవిస్ రచన –మెయిన్ స్ట్రీట్ లు సమకాలీన జీవితాన్ని చిత్రించిన రచనలు .1920నవలలు లిరికల్ గా పర్సనల్ గా ,మొదటిప్రపంచయుద్ధం తో నిరాశాజనకం గా ఉన్నా అవి యుద్ధానంతర జనరేషన్ యొక్క అసంతృప్తి ,భ్రమప్రమాదాలను అద్దం పట్టాయి .1930తర్వాత వచ్చిన నవలలుఅప్పుడు వచ్చిన ‘’ది గ్రేట్ డిప్రెషన్’’వలన వచ్చిన బాధలు కన్నీరు కష్టాలతో రాడికల్ సోషల్ క్రిటిసిజం వైపుకు మొగ్గాయి . ఫిట్జరాల్డ్,విలియం ఫాక్నర్ ,హెన్రి రోత్,నధానియల్ వెస్ట్ లు పూర్వ యుగ ఆధునిక పంధాలో రాశారు .
సశేషం
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలతో
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -15-8-20-ఉయ్యూరు .