ప్రపంచ దేశాల సారస్వతం
203-అమెరికాదేశ సాహిత్యం -14
20వ శతాబ్ది సాహిత్యం -6
01914నుంచి 1945వరకు
లిరిక్ ఫిక్షనలిస్ట్ లు
ఆధునికత తో వర్ధిల్లిన ఫిక్షన్ లో మరో తమాషా జరిగి కవిత్వం నేచురలిస్టిక్ నుంచి అసలైన కవిత్వం లోకి దారి మళ్ళింది .వివరాలు ఎంచుకొని ,సింబాలిక్ ఎలిమెంట్ జోడించి ,ఆలోచన ,పాత్రల భావోద్రేకాలతో లయాత్మక వచనం లో రాశారుకవులు.వీరిలోస్టీఫెన్ క్రేన్ ,ఫ్రాంక్ నార్రిస్ ,కేబెల్, పాస్సోస్ ,హెమింగ్వే స్టెయిన్ బెక్ ,ఫాక్నర్ లున్నారు .చిన్న పేరాలలో చిన్న కథలలో ,మొత్తం నవలలో కూడా ఈ విధానం తో రాశారు .ఫాక్నర్ 1954లోఐరానికల్ గా రాసిన ‘’ఎ ఫేబుల్ ‘’,పులిట్జర్ ప్రైజ్ కొట్టింది .విల్లా కేధర్స్ ,ఓపయనీర్స్ -1913,దిసాంగ్ ఆఫ్ దిలార్క్ -1915,మై ఆంటోనియ-1918లలో కవితాత్మక పాసేజస్ ఉన్నాయి .అందులో సరిహద్దుల అదృశ్యం అక్కడి జానపదుల సృజన వర్ణన ఉంటుంది .ఎ lost లేడీ-1923,ది ప్రొఫెసర్స్ హౌస్ -1925లలో చారిత్రాత్మక సాంఘిక పరివర్తన ,’’డెత్ కమ్స్ ఫర్ ది ఆర్చి బిషప్ -1927లో గతవైభవం ,ఆధ్యాత్మిక మార్గ దర్శనం కనిపిస్తుంది .కేధరీన్ అన్నే పోర్టర్ చిన్ననవలల కధలు తో మొదలుపెట్టి ,క్రమంగా మెటాఫిజికల్ కవులలాగా రాసి ,పెద్ద ఉత్తేజకర నవల ‘’ఎ షిప్ ఆఫ్ ఫూల్స్ ‘’-1962లో రాసి౦ది ఆమె చైతన్య స్రవంతి టెక్నిక్ బాగా వశం చేసుకొని –ఫ్లవరింగ్ జూడాస్ -1930,పేల్ హార్స్ ,పేల్ రైడర్-1939లలో ఐరనీ, సింబాలిక్ ఆడంబరం తో రాసింది ఈకవులంతా అదే ధోరణి వారే .మోడర్నిస్ట్ లుగా ఫాషన్ తెచ్చారు వీటిలో .
1930కాలపు కవితాత్మక రచనలలో న్యూయార్క్ నగరం లో లోవర్ ఈస్ట్ సైడ్ జ్యూయిష్ కాలనీ లో మొదటి ప్రపంచ యుద్ధం ముందున్న పరిస్థితుల వర్ణన ఉన్నది .మైకేల్ గోల్డ్ రాసిన ‘’హార్ష్ జ్యూస్ వితౌట్ మనీ -1930,హెన్రి రోత్ ప్రౌస్టియన్ స్టైల్ లో రాసిన ‘’కాల్ ఇట్ స్లీప్ ‘’-1934 ఆ ద శాబ్దపు అతి గొప్పనవల .అన్జిరియా ఎజిరిస్కా 1920లో ఇమ్మిగ్రంట్ జ్యూ ల పై రాసిన ‘’బ్రెడ్ గివర్స్ ‘’ప్రభావంతో సమకాలీన మహిళా రచయితలూ రాసిన నవలలు అవి .
మరొక లిరికల్ ఆటో బయోగ్రాఫర్ ధామస్ ఉల్ఫ్ రాసిన ‘’లుక్ హోం వర్డ్ ,ఏంజెల్-1929,’’ఆఫ్ టైం అండ్ ది రివర్ ‘’1935లు తన కస్టాలు కలహాలు ఆలోచనలు భావాలు కలగలుపుగా 1938లో చనిపోకముందు రాసినవి .విట్మన్ ధోరణిలో రాసిన ‘’వెబ్ అండ్ రాక్-1939,యు కాంట్ గో హోమ అగైన్ —1940 చనిపోయాక ముద్రి౦పబడినవే .సౌత్ లో తన యవ్వనం ,తర్వాత నార్త్ లో జీవనం ,మనసులోని కోరికలను ,కలలను నెరవేర్చుకోవటానికి నిరంతర పరిశ్రమ లకు అద్దం పట్టాయిఈ రచనలప్రభావం యువరచయితలైన జాక్ కేరౌక్ వంటి వారిపై ఉన్నది .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -18-8-20-ఉయ్యూరు