ప్రపంచ దేశాల సారస్వతం
203-అమెరికాదేశ సాహిత్యం -15
20వ శతాబ్ది సాహిత్యం -7
01914నుంచి 1945వరకు
సాహిత్య విమర్శ
20వ శతాబ్ద౦ను ఒకసారి వెనక్కి తిరిగి చూసిన కొందరు చరిత్రకారులు దానిపై సద్విమర్శ రాస్తే బాగుంటుందని భావించారు .అంతకు ముందు నామమాత్రపు విమర్శ ఉన్నా ,సాహిత్య విమర్శ రూపుదాల్చలేదు .నూతనభావాలు అర్ధం చేసుకోవటానికి తప్పనిసరిగా అవసరం అని భావించారు .
ఈవిమర్శకాలం రెండు సాహిత్య గ్రూపుల ఉద్యమాల మధ్య ఏర్పడింది .ఒక గ్రూపు కొత్త మానవతావాదం ,పూర్వ సాహిత్య విలువల ఆధారంగా ఉండాలని భావిస్తే మరొక గ్రూపు పాత ప్రమాణాలను తుడిచేసి కొత్త వాటితో ఆహ్వానించాలని కోరింది .న్యు హ్యూమనలిస్ట్ లైన హార్వర్డ్ యూని వర్సిటి ప్రోఫెసర్ ఇర్వింగ్ బాబ్బిట్ ,రెండవ ఆయన పాల్ ఎల్మర్ మోర్లు మొరలిస్ట్ లు .నేచురలిజం రోమా౦టిజం , లిబరల్ ఫైత్ లనుకాదని నియో ట్రడిషనలిస్ట్ లైన టిఎస్ ఇలియట్ వంటివారిని సమర్ధించారు .వీరి ప్రత్యర్ది నాయకుడు తగాదాకోరు ,లిబరల్ కాని వాడు హెచ్ ఎల్ మెంకేన్ .ఇతడు’’ జీవిత సత్యాలను మెరుగులు దిద్దకుండా ‘’ రాయటమే రచయితల కర్తవ్యమ్ అన్నాడు .మాగజైన్లలో ఇతరరత్రా రాసిన తన వ్యాసాలను ‘’ఎ బుక్ ఆఫ్ ప్రిఫేసేస్’’గా 1917లో ప్రచురించాడు .ఇది సింక్లైర్ లేవిస్ వంటి సెటైరికల్ రచయితలకు భూమిక అయింది .కాన్రాడ్, ధియోడర్ వంటి మోడర్నిస్ట్ ల్పి మెకెన్ కి మక్కువ ఎక్కువ బాగా సమర్ధించాడు .ఇతడి సాహసం తో అమెరికన్ సాహిత్యం మోరలిస్టిక్ ఫ్రేం వర్క్ నుంచి బయటపడింది.
సాంఘిక -సాహిత్య విమర్శకులు
సాంఘిక మార్పు చోటు చేసుకొన్న ఈ కాలం లో ,విమర్శకులు సమాజాన్ని,రాజాకీయలను దృష్టిలో పెట్టుకొని ,19వ శతాబ్ది విమర్శకులు లాగా విమర్శించటం తప్పని సరి అయింది.వాన్ విక్ బ్రూక్స్ , వెర్నాన్ ఎల్ .పారింగ్టన్ లు రెండు ముఖ్య విధానాలు అనుసరించారు ..’’అమెరికాస్ కమింగ్ ఏజ్-1917,లెటర్స్ అండ్ లీడర్షిప్ -1918,దిఆర్డీల్ ఆఫ్ మార్క్ ట్వేన్-1920వచ్చాయి. బ్రూక్స్ అమెరికన్ పబ్లిక్ ను వారి మెటీరియలిజం ,విలువల బేఖాతరుతనం ,స్థానికతల పైమెరుగులపై దాడి చేశాడు .ఈస్థితి నుంచి ప్రక్కకు తొలగి ‘’మేకర్స్ అండ్ ఫై౦డర్స్’’సిరీస్ లో అంటే –దిఫ్లవరింగ్ ఆఫ్ న్యు ఇంగ్లాండ్ -1936,న్యు ఇంగ్లాండ్ అండ్ ఇండియన్ సమ్మర్ -1940,ది వరల్డ్ ఆఫ్ వాషింగ్టన్ ఇర్వింగ్ -1944,దిటైమ్స్ మేల్విల్లీ అండ్ విట్మన్ -1947,ది కాన్ఫిడెంట్ ఇయర్స్-1952 లలో అమెరికన్ సంస్కృతీ ,సాహిత్య నిర్మాణ సారదుల గురించి ఉన్నది .పారింగ్టన్ రాసిన ‘’మెయిన్ కరెంట్స్ ఇన్ అమెరికన్ లిటరేచర్-1927- 30లలో ప్రగతి శీల ,పునః పరిశీలనాత్మక (ప్రోగ్రెసివ్ రీ వాల్యుయేటేడ్ )అమెరికన్ సాహిత్యాన్ని జాక్సన్ డెమోక్రసీ కట్టుబడి ఉండటం అనే కోణంలో ఆవిష్కరించాడు ‘
ఆలోచనలపై మార్క్సిజం ప్రభావం వలన 1920-30కాలం విఎఫ్ కాల్వర్టెన్,గ్రాన్ విల్లీ హిక్స్ మాల్కం కౌలీ ,బెర్నార్డ్ స్మిత్ ల విమర్శనాత్మక రచనలలో నూ ,మోడరన్ క్వార్టర్లి,న్యు మాసేస్ ,పార్టిసాన్ రివ్యు ,న్యు రిపబ్లిక్ వంటి పత్రికలలో ఉన్న వ్యాసాలలో కనిపించాయి కమ్యూనిజం పై క్రమ౦గా మోజు ,తగ్గినా, మార్క్సిజం మాత్రం హిస్టారికల్ విధానం లో విశిష్ట విమర్శకులు ఎడ్మండ్ విల్సన్ ,కెన్నెత్ బర్క్ లు ,న్యూయార్క్ మేధావులైన లియోనిల్ ట్రిల్లింగ్,ఫిలిప్ రాహ్వ్ లు రాశారు .
సశేషం
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -19-8-20-ఉయ్యూరు