స్వామి సూచింఛి పరిష్కరించిన సమస్యలు
శ్రీ వాసు దేవానంద స్వామి చిఖలాడ దీక్షలో ఉండగా ,ఒకాయనవచ్చి తాను ఏది తిన్నా జీర్ణించుకోలేకపోతున్నానని ,దానితో నీరసం ఎక్కువైందని విన్నవించాడు .స్వామీజీ ఆయన ఇంటి కులదేవత పట్ల శ్రద్ధ చూపక ,పూజ మానేయటమే దీనికి కారణం అని చెప్పి ,కులదేవతను పూజ చేస్తూ తానూ ఉపదేశించే దత్తమంత్రం,దేవీ మంత్రం చదువుతూ మందులు కూడా ఇచ్చి పంపారు .అతని ఆరోగ్యం కుదుటబడింది .
1910లో నర్సోబా వాడి లో ఉండగా ఆప్రాంతం లో కలరా విపరీతంగా బాధిస్తుంటే ,పూజారులను దత్త పాదుకలకు అభి షేకం చేయమని చెప్పారు .అభి షేకం చేస్తే ఈ అంటు వ్యాధి ఎలా తగ్గుతుంది అని వాళ్ళు అడిగారు .దానికి ‘’చావుకూడా దేవుని అభి వ్యక్తీయే అని,ఈ వ్యాధులు కూడా ఆయన శక్తులే అని ,ఆశక్తుల్ని అభిషేకం లాంటి వాటితో వేదాలలో చెప్పినట్లు శాంత పరిస్తే అవి ప్రసన్నమై ,వ్యాధులను ఉపసంహరిస్తాయి ‘’అని చెప్పారు .ఆప్రకారం పూజార్లు చేయటం కలరా తగ్గటం జరిగింది .వాసుదేవ ఠాకూర్ అనే ఆయన ఇండోర్ నుంచి వచ్చి ,తన భార్య ఆరోగ్య౦ బాగాలేదని చెప్పాడు .స్వామీ జీ దానికి కారణం ఆయన వంశం లోని పవిత్ర మూర్తి సమాధికి జరిగిన ఉపేక్ష కారణం అని,కుజ వ్రతం చేయమని చెప్పారు .వెంటనే వాళ్ళ ఊరికి వెళ్లి ఆ సమాధిని శుభ్రం చేయించి బాగా అలంకరింఛి పూజ చేసి కుజవ్రతం శ్రద్ధగా చేయగా ,అతడి భార్య ఆరోగ్యం వెంటనే కుదుట బడింది .ఇప్పుడు చెప్పిన అవన్నీ దేవతా సంబంధ విషయాలు .
ఆది భౌతిక వ్యాధులు –భూకంపాలు వరదలు అగ్నిప్రమాదాలు తుఫాన్లు మెరుపులు ఉరుములు పంచ భూతాల వలన కలుగుతాయి .స్వామీజీ భక్తురాలు ఒకామెను భర్త వదిలేశాడు .చిన్న గుడి సెవేసుకొని కొద్దిపాటి పొలాన్ని చూసుకొంటూ బతుకు తోంది .ఒక సారి ఆమె పొలంలో పంటబాగా పండి ,కోతలు నూర్పిళ్ళు కూడా జరిగి ,ధాన్యం రాసి పోశారు .అనుకోకుండా తుఫాను పట్టుకొన్నది .ఆమెకు ఆధారం ఆ తిండి గింజలే .అవి తడిసిపోతే బతుకు గడవదు .ఆమె అ ధైర్యకుండా స్వామి జీ పాద ధూళి తీసుకొని రాశి చుట్టూ చల్లి స్వామి మహారాజ్ ను కాపాడమని నిండుమనసుతో ప్రార్ధించింది .తుఫాను వచ్చింది కాని ఒక్క చినుకు కూడా ఆమె ధాన్యపు రాసిపై పడలేదు అందరూ ఆశ్చర్యపోయారు .
స్వామీజీ నర్మదా తీరం గరుడేశ్వార్ లో చివరి చాతుర్మాస్స్య దీక్ష గడుపుతూ గోకులాష్టమి జరుపుతున్నారు వేలాది మంది భక్తులతో .అకస్మాత్తుగా ఆకాశం మేఘావృతమై విపరీతంగా వర్షం కురవసాగింది నది అవతలి ఒడ్డున .తుఫానుకు భయపడకుండా కీర్తనలు భజనలు కొనసాగించమని స్వామీజీ ఉద్బోధించారు .అర్ధరాత్రిదాకా వారు అలానే కొనసాగించారు .కార్యక్రమం పూర్తి అయి ,అందరూ లోపలి వెళ్ళగానే తుఫాను పగతీర్చుకోన్నదా అన్నట్లు విజ్రుమ్భించింది .
స్వామిస్వగ్రామం మాన్ గోన్ లో గృహస్తాశ్రమ౦లో ఉండగా ,ఒక గరుడ ద్వాదశి నాడు ,వందలాది భక్తులు వచ్చి కూర్చున్నారు . ప్రసాదం పంచి పెట్టె సమయానికి పెద్ద వర్షం భయపెట్టింది .ఏర్పాట్లన్నీ దెబ్బతి౦టా యేమో అనిపించింది .కంగారు పడవద్దనీ వరుణ దేవుడు కూడా ప్రసాదం తీసుకోవటానికి వచ్చాడని చెప్పి ,పెద్దపాత్రలో ఆయనకు ప్రసాదం నైవేద్యం పెట్టించారు .పెద్ద వర్షం కురిసి చుట్టుప్రక్కల ప్రాంతాన్ని భీభత్సం చేసి౦ది కాని ఇక్కడ ఒక్క చినుకు కూడా పడలేదు .ఇలాంటి అనుభవాలు స్వామి జీవితం లో చాలా జరిగాయి .
ఒక సారి గరుడేశ్వర్ లో ఒకపెద్ద అన్నం పాత్రను నర్మదా నదిలో పని చేసే స్త్రీలు కడిగి శుభ్రం చేస్తుంటే , నదిలోకి పట్టు తప్పి జారిపోయి,ప్రవాహానికి కొట్టుకు పోయింది .పని వాళ్ళు స్వామీజీ దగ్గరకు వచ్చి చెప్పుకోగా వెంటనే నది దగ్గరకు వెళ్లి ,నదీజలాన్ని తన దండం తో స్పృశింఛి ‘’తల్లీ నర్మదా ! ఈ పాత్రతో నీకేమిటి పని ?నీ పిల్లలకు అన్నం పెట్టకుండా అడ్డు తగులుతావా ?’’అన్నారు .వెంటనే అద్భుతంగా నది లో వాలుకు కొట్టుకుపోతున్న ఆపాత్ర ,ప్రవాహానికి ఎదురుగా వస్తూ ఒడ్డుకు చేరి అందరి కంగారు తీర్చేసింది .
ఈ విషయాల వలన మనకు తెలిసిదేమిటి ?ఆత్మజ్ఞాని కి ప్రకృతి సహకరిస్తుంది ,ఆయనతో సహజీవనం చేస్తుంది అన్న వేద సూక్తి రుజువైనట్లేకదా .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -20-8-20-ఉయ్యూరు