-
డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా-21
మద్రాస్ లో సుభాష్ చంద్ర బోస్
రామచంద్రగారు మద్రాస్ లో గన్నవరపుసుబ్బరామయ్య ‘’రంగనాథ రామాయణం ‘’పరిష్కరణలో తోడుగా ఉన్నారు ..ఎగ్మూర్ లో గదిలో ఉంటున్నారు .అక్కడ హరి హర విలాస్ లో భోంచేసి పదిన్నరకు చి౦తాద్రిపేట శ్రీనివాస పెరుమాళ్ వీధిలో ఉన్న సుబ్బరామయ్యగారింటికి చేరేవారు .సాయంత్రం అయిదున్నారదాకా డ్యూటీ చేసి ఇంటికి తిరిగి వచ్చేవారు .
అప్పుడు అఖిలభారత కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు జరిగాయి పట్టాభి కీ సుబాస్ బోస్ కు జరిగిన పోటీలో పట్టాభిఓడి బోసు బాబు గెలిచాడు. పట్టాభి ఓటమి తన ఓటమి అని గాంధీ తెగబాద పడ్డాడు .బోసు దేశమంతా తిరుగుతూ మద్రాస్ వచ్చాడు .మెరీనా బీచ్ లో సభ .ఆ సభకు మద్రాస్ మద్రాస్ కదిలి వచ్చింది .వేటూరి వారు గాంధీ అభిమాని .ఆయనా బాధ పడుతున్నాడు .’’బోసు తీవ్రవాది అతని సభకు ఎవరూ వెళ్ళద్దు ‘’అని అనుచరులకు ఆర్డర్ వేశారు .ఈ సంగతి రామ చంద్రకు తెలీదు. శాస్త్రిగారి భార్య మహాలక్షమ్మగారు తన ఇద్దరు పిల్లలు వేటూరి ఆనంద మూర్తి-9 ,చెల్లెలు సుజాత , వినీత -6ను తీసుకొని బోసు ను చూపించి రమ్మని చెప్పారు .’’ఆయన తెలుగు ఎంయే పరీక్షల సంఘం అధ్యక్షులుకనుక గంటలకు విశాఖ రైలుకు వెడతారు .ఆ లోపల వచ్చేయండి ‘’అన్నారు .’’శాస్త్రిగారికి కోపం వస్తుందేమో నండీ ‘’అని నీళ్ళు నవిలారు ,’’ నేనేదో నచ్చ చెబుతా .పిల్లలు బోసును చూడాలని ముచ్చట పడుతున్నారు త్వరగా రండి ‘’అన్నారు .
మెరీనా బీచ్ అందమైన ప్రపంచ బీచ్ లలో ఒకటి .అక్కడ ‘’లవర్స్ పాత్’’ ‘’మిథునపథం’’రమణీయంగాపరిశుభ్రంగా ప్రేమోద్దీపకం గాఉండేది .ఆ రోజు మధ్యాహ్నం నుంచే జనాలు తండోప తండాలుగా బోస్ స్పీచ్ కు వస్తున్నారు .సాయంత్రం ఆరుగంటలకు బోసు బాబు వచ్చాడు .అయన మీటింగ్ ముగించుకొని శాస్త్రిగారు వెళ్ళే రైలులోనే నెల్లూరు వెళ్ళాలి కనుక సాయంత్రం 7గంటలకే సభ ముగించారు .సుభాష్ తన ప్రసంగం లో రెండవ ప్రపంచ యుద్ధం రా బోతోందని ,బ్రిటిష్ వారికి భారతీయులు సహకరించరాదని ,త్వరలో స్వరాజ్యం సిద్ధిస్తుందని గంభీరం గా మాట్లాడాడు .మద్రాస్ అంతా వినబడేంత కరతాళ ధ్వనులతో సభ ముగిసింది .
‘’తమ్ కిం పిసాహసం పా-హసేణసాహంతి సమస సహానా –జం భావి ఊణ దివ్యో –పరం ముహో దుణి ని అసానం ‘’
భావం –సాహసులు సాహసం తో కార్యం సాధిస్తారు.దాన్ని తలచుకొని దైవం ముఖం తిప్పుకొని చూస్తుంది ‘’గడుసు వాడే ‘’అనే మెచ్చికోలు భావం తో .
రామచంద్ర ఆడపిల్లను చంకన ఎత్తుకొని ఆనందమూర్తి సుజాతచేరో చేయిపట్టుకోగా చేయిపట్టుకొని ఆ జన సముద్రం దాటు కుంటూ బయటపడే ప్రయత్నం చేశారు సభ జరిగిన చోటు నుంచి కన్నగి విగ్రహం దాకా దూరం వంద గజాలేఅక్కడి నుంచి పిల్లే రోడ్డు ఫర్లాన్గున్నర అంటే 320గజాల దూరం నడవటానికి గంటన్నర పట్టింది ఆమహా జన సమ్మర్దం లో .పిల్లలు బిక్కమోహాలేసుకొన్నారు .చేతులు పట్టుకున్న పిల్లలు ఎక్కడ తప్పిపోయి అబహాసు పాలోతానో అని అతిజాగ్రత్తగా నడుస్తున్నారు వాళ్ళతో రామ చంద్ర .ఎట్టాగో 4వనమ్బార్ శాస్త్రి గారింటికి చేరారు పిల్లలు తుర్రుమని లోపలి దూరారు
శాస్త్రి గారి హాలు సాయం ప్రార్ధనకోసం వచ్చే జనం తో నిండిపోయింది .ఆ రోజు మద్రాస్ లో ఒక్క వాహనం కూడా కదలలేదు .ప్రళయ పూర్వ గంభీరంగా ఉంది అక్కడి స్థితి .శాస్త్రి గారు కోపం తో పచార్లు చేస్తున్నారు .భయం ఎరుగని రామ చంద్ర భయపడ లేదుకానీ ,ఆయన విసురుగా వచ్చి ‘’ఎవరయ్యా నువ్వు బుద్ధి ఉందా నాకు గాంధీకి ఇష్టంలేని మనిషిని చూడటానికి నా అనుమతి లేకుండా వెళ్ళటమే కాకుండా మాపిల్లల్నీ తీసుకేదతావ .నీ ఏడ్పు నువ్వేడు నాపిల్లల క్రమశిక్షణ చెడగొట్టే హక్కు నీకెవరిచ్చారు ?’’అని మీద మీదకు వస్తుంటే నోతమాతరాక నిలబడితే ఆయన వెనకున్న భార్య ఏమీ మాట్లాడాడని సౌజన చేతున్నారు .ఎవరూ మాట్లాడలేదు .మళ్ళీ అందుకొని ‘’నీ వాళ్ళ నా మర్యాద మంతగాలిసింది రేపు సాయంత్రం విశాఖ చేరేవాడిని పిల్లల్ని చూసి వెడదామని ప్రయాణం మానేశా .నా ప్రోగ్రాం అంటా బూడిదపాలు చేశావ్ .పేనుకు పెత్తనమిస్తే తేలుకు పెత్తనమిస్తే ఒళ్ళంతా కుట్టినట్లుచేశావ్ .నేను ఇంట అరుస్తున్నా మాట్లాడకుండా కిమిన్నాస్తి గా ఉంటావేమిటి ?/అని ఎడా పెదా సుత్తి వీరభద్రరావు లాగా గంటసేపు నాన్ స్టాప్ గా వాయించేశారు శాత్రి గారు .ఇక ఆగలేక గేటు తీసుకొని ఏ వాహనం తిరగానందున నడిచి రౌండ్ ఠానా,హారిస్ రోడ్ గుండా ఎగ్మూర్ రోడ్డు నడుచుకొంటూ చేరి ,హోటల్ లో ఇడ్లీలు తిని రూమ్ కు చేరుకొన్నారు
మర్నాడు ఉదయం ఆలస్యం లేచి శాస్త్రి గారి రాగద్వేషాలు అర్ధం చేసుకొని పూర్వం ఒకసారి బరోడా గాయక్వాడ్ ఒరిఎంతల్ మాన్యు స్క్రిప్ట్ లైబ్రరీ వారు దక్షిణాది భాషలు తెలిసిన పండితులు కావాలని ప్రకటన ఇస్తే ,దరఖాస్తు పెట్టి శాస్త్రి గారికి చెప్పి మద్రాస్ నుంచి బరోడాకు రైలు చార్జీలు 8రూపాయలే అయినా నెలాఖరు కనుక డబ్బుల్లేక శాస్త్రి గారిని అడిగితె ‘’నీకు రాదు వెళ్ళద్దు నాదగ్గర డబ్బు లేదు ‘’అని పొడి మాటలు చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది .రామచంద్రగారి అర్హత బట్టి ఆఉద్యోగం ఆయనకు తప్పక వచ్చేది .ఒకసారి బరోడా లైబ్రరీ నుంచి మద్రాస్ కు ఒక విద్వాంసుడు వస్తే ప్రసంగావశాట్టు ఆయనతో తన అప్లికేషన్ సంగతి చెబితే ‘’మీది మొదటి స్థానం లో ఉండేది మీకే సాంక్షన్ చేశారు మీరురకపోవటం వలన రెండవస్థానం లో వారిని నియమించారు ‘’అని చెబితే నీరుకారి పోయారు రామ చంద్ర ఇది 1937 నాటి సంగతి
మర్నాడు ఉదయమే స్నానాదులు పూర్తీ చేసి సుబ్బరామయ్యగారింటికి సరైన సమయం లోనే వెళ్ళారు రామ చంద్ర .ఇద్దరూ పాతాంతరం చర్చల్లో ఉండగా బయట ఏదో అలికిడి ఐతే సుబ్బరామయ్యగారు అమాంతం లేచి నుంచోగానే ఎవరుఅని ఈయన చూస్తె వేతూరు వారు .ప్రభాకరశాస్త్రిగారు అమాంతం పరిగెత్తుకొచ్చి రామచంద్రను గట్టిగా కావలించుకొని ,ఏదో మాట్లాడబోయి మాటలురాక తడబడుతూ కన్నీరు కారుస్తూ పది నిమిషాలు నిలబడి అలాగే ఉండిపోయి తేరుకొని ‘’నాయనా !ఎంతో నొప్పించాను నిన్ను ‘’అనంరు .తలకోట్టేసినంత పని అయి ఈయన్ ‘’తప్పు నాదంది ‘’అన్నారు శాస్త్రిగారు ‘’నీదికాదు .మద్రాసుకు మద్రాసే విరగబడి వెడితే నువ్వు వేదితెతప్పా ?పిల్లలకు ప్రసిద్ధనాయకుల్ని చూసే ఉబలాటం ఉండటం సహజం .ఆ మీటింగ్ కు వచ్చిన వారందర్నీ ఆపగాలిగానానేను ?’’అని రుద్ధ కాంతం తో అని పశ్చాత్తాప పడ్డారు .నిప్పులో కాని నిర్మలమైన ఔదార్యం శాస్త్రి గారిది అంటారు తిరుమల రామ చంద్ర .ఒక ప్రాకృత శ్లోకం ఉదాహరించి దాని భావం చెప్పారు –‘’సజ్జనుడు కోపపడదు కోపం వస్తే చేడుఆలోచించాడు చెడు తలపోస్తే నోటితో అనడు ,వాగాడు ఒక వేల పొరబాటున నోరుజారితే సిగ్గుపడి పోతాడు చీచీ నేనేనా నోరు జారింది అని అతడికి సిగ్గుమున్చుకొస్తుంది .ఇది శాస్త్రిగారి వ్యక్తిత్వానికి గొప్ప ఉదాహరణ
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -20-8-20-ఉయ్యూరు
వీక్షకులు
- 981,171 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- కళా విశ్వ నాథ దర్శనం -1
- ఆముక్త మాల్యద సాహిత్య ఆధ్యాత్మిక సమీక్ష.27 వ.భాగం.5.2.23.
- అరుణ మంత్రార్థం. 12వ.భాగం.5.2.23.
- ఉయ్యూరులో వీరమ్మతల్లి ఉత్సవాలు పది రోజుల సంబరాలు
- పద్మ భూషణ్ కాజి నజ్రుల్ ఇస్లాం -2
- మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -398
- గాంధీజీ కంటే ముందే అస్పృశ్యత ను వ్యతిరేకించి ఆచరించిన –తల్లాప్రగడ విశ్వ సుందరమ్మ (వ్యాసం )-గబ్బిట దుర్గా ప్రసాద్-విహంగ వెబ్ మహిళా మాస పత్రిక -ఫిబ్రవరి
- సరస భారతి శ్రీ శోభ కృత్ ఉగాది వేడుకలు
- పద్మ భూషణ్ కాజి నజ్రుల్ ఇస్లాం
- ఆముక్త మాల్యద సాహిత్య ఆధ్యాత్మిక సమీక్ష. 25వ భాగం 3.2.23.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (77)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (8)
- నా దారి తీరు (135)
- నేను చూసినవ ప్రదేశాలు (107)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (2,925)
- సమీక్ష (1,280)
- ప్రవచనం (11)
- ఫేస్బుక్ (308)
- మహానుభావులు (343)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (1,069)
- రాజకీయం (65)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (334)
- సమయం – సందర్భం (838)
- సమీక్ష (25)
- సరసభారతి (9)
- సరసభారతి ఉయ్యూరు (499)
- సినిమా (362)
- సేకరణలు (315)
- సైన్స్ (46)
- English (6)
ఊసుల గూడు