అశ్వత్ధామ వంటి దివ్య పురుషులను దర్శించిన శ్రీ వాసు దేవానంద సరస్వతి-3
దుష్ట శక్తులు –
పిశాచ దెయ్యాలవంటి దుష్ట శక్తులు మానవ బాధలకు కారణాలౌతాయి .ఇవి తమబందువులను బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి .వాటికున్న అతీంద్రియ శక్తులతో బాధలు కలిగిస్తాయి .వాటిని గుర్తించటం కష్టం .మహిమాన్విత మహిళలు పురుషులుమాత్రమే వాటిని గుర్తించి బాధపడే వారికి ఉపశమనం కలిగించగలరు .మొదట శారీరక ఇబ్బంది , ఆతర్వాత మానసిక క్షోభ కలిగించి బాధ పెడతాయి .హవానూర్ లో ఒక యువతి కీళ్ళ బాధలు చూపు కనపడక పోవటం తో ఇబ్బందిపడుతుంటే ఆమె సోదరుడు ఆమెను శ్రీ వాసుదేవానంద స్వామి దగ్గరకు స్ట్రెచర్ లో తీసుకొచ్చాడు . కమండలం లోని పవిత్రజలాన్ని ఆమె పై చల్లి స్వామి ఆమె సోదరుడిని ఆజలాన్ని ఆమె తలకు పాదాలకు రాయమని చెప్పారు .రాయటం మొదలవ్వగానే ఆమెను ఆవహించిన దుష్ట శక్తి తానూ వదిలి వెళ్ళిపోతానని గగ్గోలు పెట్టి స్వామి సరేఅనగా వదిలి పారిపోయింది .అది వదలగానే ఆ యువతి లేచి నిలబడి తన ఇంటికి హాయిగా నడిచే వెళ్ళింది .మరోసారి ఒక ధనికుడి భార్య ఇలాగే ఇబ్బంది పడుతుంటే అతడిని తానూ సంపాదించిన దాన్లో కొంత బ్రాహ్మణుల అన్నవస్త్రాలకు ఖర్చు చేయమని సలహా ఇస్తే ఆయన అలాచేయగానే భార్య ఆరోగ్యం కుదుట పడింది ,.
కర్నాటక బనవాసి నివాసి ఒకాయన స్వామి తో తానూ కొత్త ఇల్లు కడుతుంటే అకారణంగా కూలి పోతోందని మొరపెట్టుకొన్నాడు .దైవ సంబంధ కార్యాలు చేయమని చెప్పగా అలా చేయటం తో ఇల్లు ఇబ్బంది లేకుండా పూర్తయింది .శ్రీపాద శాస్త్రి అనే ఆయన తన సోదరి తరచూ మూర్చలతో బాధ పడుతోందని చెబితే అది పిశాచ బాధ అని గ్రహించి చెప్పగా తానూ నమ్మలేనన్నాడు శాస్త్రి .స్వామి ఒక ఇటుక మీద మంత్రం రాసి ఆయనకిచ్చి రోజూ 21సార్లు జపించమని ధూపం వేయమని ,చెప్పారు .21రోజులు తర్వాత ఆపిశాచం ఆమెతో మాట్లాడింది .తానూ ఎందుకు బాధించానో వివరించి ఇక స్వామి శక్తిముందు తాను నిలబడ లేనని చెప్పి ఆమెను వదిలి వెళ్ళిపోయింది .
దుష్టశక్తులు గర్భ విచ్చిత్తికి ,శిశువు పుట్టకుండా చేయటానికి కారణం అవుతాయి .మండలమహాపూర్ కు చెందిన భైరవ ప్రసాద్ కు పుట్టిన అయిదుగురకొడుకులు వరుసగా చనిపోతే ,స్వామిని శరణు వేడాడు .నారాయణ బలి ఇస్తూ రోజూ విష్ణు సహస్రనామ పారాయణ చేయని సలహా ఇచ్చారు .
హేతుబద్ధత
మనిషి కిఉన్న విపరీత కోరికలే అనర్ధాలకు కారణమని స్వామీ బోధన.తాను చేసేపనులవలన భక్తజనం లో విశ్వాసం కలిగిస్తాయని .భౌతిక సుఖాలు మరిగినవారు అన్ని రకాల పతనం చెందుతారని వాళ్ళు అందుకే తనవద్దకు వచ్చి మార్గదర్శనం పొందుతారని వారిబాధలు నివారిస్తాయని చెప్పేవారు .వారి ఆత్మలను పరిశుద్ధి చేయటమే తను చేసేపని దానివల్లనే వారి ఇబ్బందులు తొలగి ధర్మమార్గాన నడుస్తున్నారని చెప్పారు .
సత్య దర్శనులు
నిజాయితీకల సత్యదర్శనులు ఆత్మజ్ఞానులు లోకం లో చాలా తక్కువమంది ఉన్నారు .కొందరికి ఒకజన్మలోనే సాధ్యమైతే మరికొందరికి ఎన్నో జన్మలు అవసరం రావచ్చు .
స్వామీజీ శినోర్ లో ఉండగా ఒకసారి జాబాల అనే ఒక జాలరి స్వామిని ఆపేశాడు .అతడు పెళ్లి అయిన కొద్దికాలానికే ఇల్లు వదిలి వచ్చేశాడు .ఇక్కడ భౌతిక సుఖాలకు దూరంగా జీవిస్తున్నాడు .అతడిని చూసి స్వామి ‘’మీరు ఇక్కడున్నారన్నమాట ‘’అన్నారు .రాత్రి మార్కండేయ దేవాలయనికి రమ్మని చెప్పి వెళ్ళిపోయారు .ఆ రోజునుంచి తానూ గీతా ప్రవచనం చేస్తానని ప్రకటించి మార్కండేయ దేవాలయం రాత్రిపూట ప్రవచనం ప్రారంభించారు స్వామి రోజూ జాబాలకూడా వచ్చి ఒక మూల కూర్చుని వినేవాడు .17వ అధ్యాయం ప్రవచనం అవగానే జాబాల స్వామితో ‘’ఇకనేను వినాల్సిన అవసరం లేదు ‘’అని చెప్పి వెళ్ళిపోయాడు .తర్వాత రెండు నెలలకు చనిపోయాడు జాబాల.
సరస్వతి బాయి అనే వేశ్య కొంతకాలానికి పశ్చాత్తాపం చెంది నర్సోబ వాడి ఆశ్రమం కి వచ్చిదత్త పాదుకలముందు దీక్షిత్ స్వామి ఎదుట కరుణా త్రిపాది పాడేది . ఒకసారి స్వామీజీ ఎదుట పాడుతుంటే ఆమె అనన్యభక్తికి మెచ్చి ఆమెకోసం గురు స్తోత్రం రాసిరోజూ పారాయణ చేయమన్నారు .ధ్యానం కూడా నేర్పారు .కొద్దికాలానికే ఆమె వాటిని పాటించి పరమ పవిత్రురాలైంది ‘.
సశేషం
రేపు శ్రీ వినాయకచావితిశుభా కాంక్షలతో
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -21-8-20-ఉయ్యూరు