అశ్వత్ధామ వంటి దివ్య పురుషులను దర్శించిన శ్రీ వాసు దేవానంద సరస్వతి-4
మహా జ్ఞానులతో శ్రీ వాసుదేవానంద సరస్వతి
శ్రీ రాజరాజేశ్వర ,శ్రీ అక్కల్ కోట్ మహా రాజ్ వంటి మహాజ్ఞానులతో మనస్వామికి గొప్ప పరిచయమే ఉండేది .
శ్రీ రాజరాజేశ్వర శంకర స్వామి
అప్పడు శ్రీ శృంగేరి పీతాదఠాపతులైన శ్రీ రాజరాజేశ్వర శంకరాచార్య స్వామి తో కలిసి హరిద్వారంలోచాతుర్మాస దీక్ష చేశారు .పీఠాధిపతి కోరికపై స్వామి శ్రీ ఆది శంకరులు ఉపనిషత్ భాష్యం పై ప్రవచనం చేశారు .తర్వాత 17వ చాతుర్మాస్య దీక్షను తంజావూర్ లో పూర్తి చేసి ,,కావేరి మీదుగా వెడుతుంటే శృంగేరి స్వామి శ్రీ రంగం లో ఉన్నారని తనకు స్వాగతం చెప్పే ప్రయత్నం లో ఉన్నారని తెలిసి అక్కడికి వెడితే పీఠాధిపతి గారు గౌరవంగా ఆహ్వానించారు .స్వామి శారదాంబ శ్రీ శంకరాచార్య లపై స్తోత్రం రాశారు .ఆచార్య కూడా స్వామిని ప్రస్తుతిస్తూస్తోత్రం రాశారు .స్వామికి తమ ఆశ్రమలో భిక్ష ఏర్పాటు చేసి ,ఘన సన్మానం జరిపారు .స్వామి గురించి ఆచార్య ‘’ఇవాళ మన ఆశ్రమానికి విచ్చేసిన స్వామి మహారాజ్ ను మీరు గుర్తించి ఉండరు .వారు సాక్షాత్తు దత్తప్రభువులే .తలిదండ్రుల పుణ్యం చేత జన్మించి ధ్యాన తపస్సులతో వెలిగిపోతున్నారు .వైదిక మతాన్ని కొనసాగించటానికి ఆది శ౦కరాచార్యుల వారితో సమానంగా కృషి చేస్తున్న ధన్యజీవులు .వర్ణాశ్రమ ధర్మాలను వైదిక విధానం లో తూచా తప్పక పాటిస్తున్న శ్రేస్టులు.వేలాది ప్రజలను తమ ప్రవర్తన ప్రవచనాలతో ఉద్ధరిస్తున్నారు .ఆ సేతు హిమాచలం కాలినడకన సందర్శిస్తున్న తపోధనులు .సాధకులకు కర్మజ్ఞాన భక్తీ మార్గాలను బోధిస్తూ పరిణామ కలిగిస్తున్నారు .వైదిక ధర్మ పునరుద్ధరణ కోసం శ్రీ వాసు దేవానంద సరస్వతి మహారాజ్ కు భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించమని కోరుతున్నాను ‘’అని భక్తులకు పరిచయం చేశారు .స్వామి దానికి సమాధానం గా ‘’అంతటి పొగడ్తలకు నేను అర్హుడనుకాను .శృంగేరి పీఠాన్ని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఉన్నత స్థితి కి తెచ్చారు ‘’అని వినయంగా చెప్పారు.తర్వాత శంకరాచార్య కోరికపై తాము రాసినగ్రంథాలు శృంగేరి మఠానికి పంపారు .
శ్రీ శాంతారాం స్వామి
ఆ కాలం లో బెనారస్ లో మహారాష్ట్ర కరడ్ కు చెందిన శ్రీ శాంతారాం స్వామి అనే మహాజ్ఞాని ఉండేవారు .40ఏళ్ళు కాశీలో వరుసగా భాగవత సప్తాహం నిర్వహించిన దీక్షా పరులాయన .భాగవత పరిపక్వతతో భగవంతునితో అనుసంధానం ఆయనకు ఏర్పడింది ఉదయం 4కు లేచే ఆయన ఒక్కోసారి ఆలస్యంగా లేచేవారు . .కాశీ విశ్వనాథుడే ఆయన తలుపు తట్టి నిద్ర లేపే వాడు అని జనం నమ్మేవారు .సంస్కృతం వేదం వేదాంగాలు పెద్దగా చదవనప్పటికీ ఆయన్ను కాశీలోని మహా విద్యావేత్తలు భాగవత పురాణం లో తమకు కలిగిన సందేహాలను ఆయనవద్దకు వచ్చి తీర్చుకొనేవారు .1913 బ్రహ్మావర్తనం లో వాసు దేవానంద స్వామిమూడేళ్ళుగా ఉన్నారని తెలిసి ఆయనను కాశీకి ఆహ్వానించాలని అనుకొన్నారు .కానీ స్వామి రాలేదు చివరికి శాంతారాం స్వామి బ్రహ్మావర్తం వెళ్లి కలుసుకోగా ఇద్దరి కళ్ళల్లో ఆనంద బాష్పాలు ధారాపాతం గా వర్షించాయి .ఇక్కడి ప్రశాంత వాతావరం పవిత్రత , జరిగే ప్రవచనాలుఆధ్యాత్మిక కార్యక్రమాలు శాంతారాం చూసి పరమానంద భరితులయ్యారు
శ్రీ వైద్యనాథ అవధూత
అత్యున్నత జ్ఞానం సాధించినా కొందరు మహామహులువింత ప్రవర్తనలతో జనాలకు దూరంగా ఉండేవారు .పసిబాలుడులాగాఉన్మత్తునిలా,పిశాచం లా ప్రవర్తింఛి జనాలను దూరం చేసి తన దీక్షకు భ౦గం కాకుండా కాపాడుకొనేవారు .అలాంటివారిలో నరసోబా స్వామి వైద్యనాథ ఒకరు .సూటిగా బాలునిలా మాట్లాడేవారు .ఎప్పుడు మతవిదాన చర్యలేవీ చేసేవారుకాదు .ఉదయం చేతిలో ఒక లోటా పట్టుకొని తిరిగేవారు .నదికి స్నానానికి వెళ్లి ఒళ్లంతా మట్టి పట్టించి గంటలకొద్దీ గజస్నానం చేసేవారు .ఆలయాలకు వెళ్ళటం కాని పాదుకలను పూజించటం కాని ఉండేదికాదు .ఎవరైనా ఇదేమిటిఅని అడిగితే తనను దయ్యం పట్టి ఆపనులు చేయనివ్వటం లేదనే వారు .ఎవరైనా ఇంటికి భోజనానికిఆహ్వానిస్తే దక్షిణగా రెండే రెండు పైసలు తీసుకొనేవారు .ఇలా వచ్చిన డబ్బును ఒకనమ్మకస్తునికి అప్పగించి ,తానే లెక్కలు రాసేవారు .ఒకసారి వాసుదేవ స్వామి వాడిలో మకాం గా ఉంటె ముఖ్య శిష్యుడు గండా మహారాజ్ వైద్యనాథ తో ఆయన దగ్గరున్న డబ్బుతో విశేష పూజ చేయమని సలహా ఇచ్చాడు .అందరికీ ఎప్పుడూ చెప్పెసమాదానమే ‘’ఆ డబ్బు మా తమ్ముడిని చూడటానికి వెళ్ళట కోసం జాగ్రత్త చేసుకొన్నాను ఖర్చుపెట్టను ‘’అన్నాడు .అక్కడి వారు గండా తో ‘’ఆయన వేళాకోళానికి చెప్పేమాట అది .ఇక్కడినుంచి ఆయన ఎప్పుడూ కదిలి వెళ్ళటం చూడలేదు ‘’అన్నారు. చివరికి వాసు దేవ స్వామి చెవిన ఈవిషయం వేశారు అందరూ కలిససి . ఆయన .’’ఆయన్ను మీరెవరూ సరిగా అర్ధం చేసుకోలేదు .దెయ్యం పట్టింది అని ఆయన అన్నదానికి అర్ధం భగవంతుడు తన్ను బంధించి ఉంచుతున్నాడు అని అర్ధం .సోదరుడి దగ్గరకు వెడతాను అంటే తన భౌతిక శరీరం రద్దు అవటం అని భావం .ఆయన మహాజ్ఞాని ఆయనమాటలు సామాన్యులకు అర్ధం కావు .ఆడబ్బు తన ఉత్తరక్రియలకోసం అని అర్ధం ‘’అని వివరించారు .వైద్యనాథని పిలిచి ‘’నీ దగ్గరున్న డబ్బులో 7రూపాయలు ఖర్చుపెట్టి ,మిగిలిన ఒక్కరూపాయి నీ సోదరుడిని చూడటానికి వెళ్ళేదానికి ఖర్చు పెట్టు ‘’అన్నారు వైద్యనాథ ఒప్పుకున్నాడుకానీ మాహాపూజ చేయటానికి ‘’ఆ దెయ్యం అంగీకరించలేదు ‘’అన్నాడు .స్వామి ‘’ఐతే ఆ దెయ్యాన్నో ఒక్క రోజుమాత్రం నిన్ను వదిలిపెట్టమని అడుగు ‘’అన్నారు .సరే అన్నాడు ఆయన .పూజ బ్రహ్మాండంగా జరిగింది ఊరివారందరినీ వైద్యనాథ పూజా ప్రసాదం తీసుకోవటానికి రమ్మని స్వామి కబురు చేయించారు .ఆయన దగ్గరున్న ఏడురూపాయలు అంతమందికి ప్రసాదం పెట్టటానికి ఎలా సరిపోతాయని అందరికీ సందేహం ఆశ్చర్యం కలిగాయి .ఎవరికి తోచినట్లు వారు ఆహారపదార్ధాలు వగైరా పంపించి,వేలాది భక్తజనం పాల్గొని మహాపూజ చూసి తరించి వైద్యనాథ ప్రసాదం కడుపారా ఆరగించారు .ఏర్పాట్లను స్వామితో కలిసి వైద్యనాథ పర్యవేక్షిస్తూ అందరినీ పలకరించారు .జనం కళ్ళల్లో ఆనందం తాండవ మాడింది .
శ్రీ అక్కల్ కోట్ మహారాజ్
1905లో పండరిపురం నుండి వాడీ వెడుతుండగా కమలాపురందగ్గర చేతులు మోకాళ్ళవరకు ఉన్న బలిస్టు డైనఒకస్వామి మహారాజ్ వాసుదేవ స్వామి కలలో కనిపించి ‘’దేశమంతా తిరుగుతున్నావు కవిత్వం రాస్తున్నావు .నా మీద నీకు దృష్టిపడలేదా ?’’అని ప్రశ్నించాడు .నిద్రలేచి తనకు కలలో కనిపించిన ఆస్వామి ఎవరు అని దత్తప్రభువును అడిగాడు ‘’ఆయనే అక్కల్ కోట్ మహారాజ స్వామి .ఆయన్ను నువ్వు దర్శించి ఆయన జీవిత చరిత్ర నువ్వు రాయాలని ఆయన కోరిక ‘’అని తెలిపాడు .వాసుదేవ స్వామి ‘’నా చేతి కలం దత్తస్వామిపాదాలకే కే అంకితం.మీరుఆజ్ఞాపించి ఆయన గురించి సమగ్రసమాచారం అందిస్తే వారి చరిత్ర రాస్తాను ‘’అన్నారు .’’అయితే అక్కల్ కోట్ వెళ్లి ఆయన్ను దర్శించు ‘’అని హితవు చెప్పగా అక్కల్ కోట్ వెళ్లి స్వామి సమర్థ ను దర్శించారు స్వామి సమర్థ అక్కల్ కోట్ సమర్ధస్వామిమహారాజ్ అంటారు .ఈయనకూడా దత్తాత్రేయ అవతారమే .వీరికి కర్నాటక మహారాష్ట్రలలో వేలాదిమంది అనుచరులున్నారు .అలాగే అక్కల్కోట్ మహారాజ్ చరిత్ర రాశారు
వాసుదేవానందస్వామి ఇలా ప్రముఖ జ్ఞానులతో సత్సంబంధాలు కలిగిఉన్నారు షిర్డీ సాయిబాబా వాసుదేవ స్వామిని తన సోదరులు అని చెప్పేవారు. ఈయనా దత్తాత్రేయ అవతారమే కదా .శ్రీ బ్రహ్మ చైతన్య గొడ్వా లేకర్ మహారాజ్ ,శ్రీ గులాబ్ రావు మహారాజ్ లకుకూడా వాసుదేవ స్వామి అంటే పరమ గౌరవం .
సశేషం
వినాయక చవితి శుభా కాంక్షలతో
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -22-8-20-ఉయ్యూరు