’డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదా-22
లాహోర్ లావణ్యం
లాహోర్ ను సిటీ ఆఫ్ గార్డెన్స్ అంటారు ఉద్యాన నగరం అన్నమాట .లక్నో ను సిటీ ఆఫ్ పార్క్స్ లఘు ఉద్యాననగరం అంటారు .లాహోర్ ప్రజలుకూడా ఆ నగర లావణ్యాన్ని కళ్ళకు రెప్పలా కాపాడుకొంటారు .అక్కడ లారెన్స్ గార్డెన్స్ విశాలమైనది . .మోఘలాయిలకాలం నాటి శివార్లలో ఉన్న షాలిమార్ గార్డెన్స్ మనోహరాతి మనోహరం .ఇక్కడి స్త్రీలు వసంతపంచమి రంగురంగుల దుస్తులతో కను విందు చేస్తారు. శ్రీరాముడికుమారుడు’’ లవుడు ‘’రాజ్యమేలిన చోటుకనుక లవరాజ్యం అయి లాహోర్ గా కాలక్రమలో మారింది .స్నేహప్రియులైన పంచాబీలు ‘’కీహుయా ‘’అంటే ఏముందిలే అనే’’ లైట్ ‘’తీసుకొనే రకం .ఋతువులకు అనుగుణంగా పచ్చికూరలు తినటం ప్రత్యేకత .
రామచ్నద్ర లాహోర్ కు వచ్చారు. రాగానే పోస్టాఫీస్ కు వెళ్లి అణా కవరు కొని వేటూరివారికి ఉత్తరం రాస్తూ ‘’తరుణం వర్ష పకాశం ‘’అంటే ఆయన అనుకొన్నట్లు ఆవ వేసిన లేతకూరకాదనీ ,’’లేత ఆవకూర ‘’అని ,మొదటిముద్దలో ఇక్కడ దాన్ని అన్నం లో తింటారని ఆకవర్ లో రెండు ఆవకూర పోచలు పెట్టి అంటించి పోస్ట్ చేసిబరువు ది౦చు కొన్నారు అక్కడ చివరి అంతస్తులో లెట్రిన్ పెట్టటం అలవాటు .మురికి గాలిపైకి పోతుందనే వాస్తు వాళ్ళది .రామచంద్ర అక్కడ పంజాబ్ యూని వర్సిటిలో తాళపత్ర గ్రంథ విభాగం లో పని చేయటానికి వచ్చారు .అక్కడరెండు వేల తాళపత్ర గ్రంథాలు తెలుగు కన్నడ గ్రంథ,మళయాళ,నందినగరి లిపులలో ఉన్నాయి .ఒకటి రెండు కాశ్మీర్ పండితులువాడే శారదాలిపిలో ఉన్నాయి .సగానికిపైగా శ్రుతి స్మృతి గ్రంథాలే .కావ్యాలు చాలాతక్కువ .శ్రీనాథుని సమకాలికుడు ఆదివన్ శఠకోపజియ్యర్ రాసిన ‘’వాసంతికా పరిణయం ‘’నిర్దుష్ట ప్రతి ఉన్నది ‘’ఘన జటాన్యాయ పంచాశత్ ‘’అనే కర్త పేరు లేని ఘన జటస్వరాలకు చెందిన యాభై శ్లోకాల లక్షణ గ్రంధం ,దాశరథి తంత్రం అనే తంత్రశాస్త్రం అపూర్వ రచనలున్నాయి .దాశరథి లో ఆకుల వెడల్పు రెండే రెండు అంగుళాలు .ఒక ఆకులో 20పంక్తుల ముత్యాలవరుస చూసి ఆశ్చర్యపోయారు రామ చంద్ర .
అక్కడి యూనివర్సిటి ఓరియెంటల్ కాలేజి ప్రిన్సిపాల్ –హిందీ ప్రాకృత సంస్కృత శాఖ మహామహోపాధ్యాయ మాధవ శాస్త్రి భండార్ జీ ,వైదికాను సంధాన సంస్థ అధ్యక్షుడు విశ్వబందు శాస్త్రి డాక్టర్ సూర్యకాంత్ ,ప్రభుత్వ కాలేజీ సంస్కృతాచార్యుడు గౌరీ శంకర శాస్త్రి ,విశ్వవిద్యాలయ ఆచార్యుడు డాక్టర్ బనారసీ దాస్ జైన్ ,(అర్ధమాగాది)డాక్టర్ లక్ష్మస్వరూప్ –సంస్కృతం ,డాక్టర్ మోహన్ సింగ్ –పంజాబీ ,స్థానిక రచయితలు ఉదయ శంకర్ భట్ సంత్ రాం ,వేద విజ్ఞానఖని పండిత భగవద్దత్ లు పరిచయమయారు .లాహోర్ లో రైల్వే మిలిటరీ ప్రైవేట్ వ్యాపార సంస్థల్లో తెలుగు వారు చాలాందే ఉన్నారు .అందరూ పరిచయమయ్యారు .డిప్యుటీ అసిస్టెంట్ కంట్రోలర్ ఆఫ్ మిలిటరీ అకౌంట్స్ జమ్మలమడక లక్ష్మీనారాయణ ,DACMA జనమంచి కామేశ్వరస్వామి,అసెంబ్లీ రిపోర్టర్ వెంకటరమణయ్య ,అసెంబ్లీ చీఫ్ రిపోర్టర్ పార్ధసారథి అయ్యంగార్,కాంగ్రెస్ నాయకులు డాక్టర్ సత్యపాల్,గోపీ చ౦ద్ భార్గవ ,అకాలీనాయకులు తారాసింగ్ ,ఆహరత్ పార్టీనాయకులు, ఖాక్ పార్ పార్టీవారు అల్లామా మర్శీన్ లు పరిచయమయ్యారు .తలుగు విద్యార్ధులలో చీమకుర్తి సీతారామయ్య ,హిందీ వక్కలగడ్డ వెంకటేశ్వర్లు –సంగం జాగర్లమూడివాడు మంచి విమర్శకుడు .లాహోర్ కోటీశ్వరుడు లాల్ బిందా శరణ్ లుకూడా దోస్తులయ్యారు .
తాళపత్ర గ్రంథ ప్రదర్శన పెడితే బాగుంటుందని రామ చంద్ర లైబ్రేరియన్ మొదలైనవారికి సూచించారు .గన్నవరపు సుబ్బరామయ్యగారికి జాబురాసి గంటం తోరాయటం, పత్రాలను రాతకు అనుకూలం గా సిద్ధం చేయటం ,గంటాల ఒరలు ,తిక్కన గంటం వగైరాలఫోటోలు తెప్పించారు తిరుమల .వీటన్నిటితో తాళపత్ర గ్రంథ ప్రదర్శన గొప్పగా నిర్వహించారు .అన్నిభాషల విలేకరులు చూసి అద్భుతమైన కవరేజ్ ఇచ్చారు .అందులో రెండు అంగుళాల ఆకుమీద 20పంక్తుల తెలుగు అక్షరాలున్న దాశరథి తంత్రం అందర్నీ విశేషంగా ఆకట్టుకొంది విద్వన్మండలిలో తిరుమల ప్రతిభ ఏడు కొండ లంత ఎత్తుకు పెరిగింది .వివిధ సంస్కృత పరిశోధనసంస్థలు ఆహ్వానించి సలహాలు అడగటం ప్రారంభించారు .ఆయనమాత్రం నిగర్వంగా ‘’ చెట్లు లేని చోట ఆముదపు చెట్టే మహా వృక్షం కదా’’ అన్నారు .
సశేషం
వినాయక చవితి శుభాకాంక్షలతో
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -22-8-20-ఉయ్యూరు