మచిలీ బందరు యోగి శ్రీ రామావదూత (శ్రీ రంగావధూత)

మచిలీ బందరు యోగి శ్రీ రామావదూత (శ్రీ రంగావధూత)

మచిలీ పట్నం అనే బందరులో శ్రీ వామ గోత్రం లో సుబ్బయ్య గారు మహాపుణ్యుడు బుద్ధిమంతుడు .ఆయనకు 1870లో జూన్ నెల ఏకాదశి జయవారం నాడు రంగ అనే శిశువు జన్మించాడు .పుట్టుకతోనే భక్తి అలవడింది .సత్యాహింసలు శాంతి అహింసలు మహామతిత్వం వంటి సుగుణాలు అబ్బాయి .క్రమంగా జ్ఞానవికాసమూ  కలిగింది .ఎనిమిదవ ఏట బడికి పంపారు .శ్రద్ధగా విద్య నేర్చాడు .సాయంకాలం బడి వదిలి ఇంటికి వచ్చి స్నేహితులతో కలిసి భక్తితో ఇంట్లోభజనాలు చేసేవాడు .ఇంటిలోని దేవతా విగ్రహాలను అత్యంత అందంగా అల౦క రించే వాడు .చుట్టుప్రక్కలవారు ఆతని భక్తి భజలకు ముచ్చటపడేవారు .తోటిపిల్లలతో ఆటలు ఆడే వాడు కాదు ఇదే అతడిలోకం .జీతం కట్టమని డబ్బు ఇచ్చి పంపిస్తే దారిలో బీద సాదలను చూసి జాలితో ఆడబ్బు వారికిచ్చేవాడు .బడికి వెళ్ళకుండా తిరిగి వచ్చేవాడు .షావుకారు కొట్లో సరుకులు తెమ్మనమని డబ్బు ఇచ్చి పంపినా ఇలాగే  దాన ధర్మాలు చేసేవాడు.స్నేహితులను ‘’ఒరే ‘’అని పిలవకుండా ‘’అయ్యా ‘’అని మర్యాదగా పిలిచే సంస్కారం అతడిది .ఒకపూట మాత్రమె బడికి వెడుతూ మధ్యాహ్నమంతా మనసంతా పరమాత్మపై లగ్నం చేస్తూ గడిపేవాడు .కొంతకాలానికే బడిలో చెప్పే విద్యలు  ఆస్థిరాలు అనే భావం మనసు నిండా పెరిగిపోయి ఆసక్తి పూర్తిగా తగ్గింది .

  బందరులోని పెద్దవారిళ్ళ వెళ్లి అక్కడ జరిగే సద్గోష్టి లో పాలుపంచుకొంటూ ,తనకు తోచిన ఆముష్మిక విషయాలు వారికి చెబుతూ ,పు ణ్యాత్ముడు గా కీర్తి గడించాడు .క్షమ శాంతం మొదలైన స్సద్గుణాలతో శోభిల్లాడు రంగడు .దైవపూజ చేస్తూ స్త్రీలను తల్లులుగా భావిస్తూ ,సర్వభూత దయతో ,ప్రాపంచిక భావన లేక కామక్రోధాదులకు దూరమై ,ఘన భవ్యమూర్తి అయ్యాడు .వీరింటికి కొంచెం దూరం లో చందమ్మ అనే ఒక పుణ్య స్త్రీ ఉండేది .ఊరివారందరికీ సోదరిలా ఉంటూ శాంతమూర్తిగా , సద్గుణ  రాశిగా,భక్తి ప్రపత్తులతో గడిపేది .ఆమెసుచరిత్ర అందర్నీ ఆకర్షించేది .ఐదో ఏడునుంచేదైవ భక్తి అబ్బింది  .దేవతాబొమ్మలను చేసి చుట్టుప్రక్కల పిల్లలను పిలిచి పూజలు చేస్తూ ,సత్యాహింసలు శమ దమాలతో ఈర్ష్య అసూయలు లేకుండా సాధ్వీ మణిగా ప్రసిద్ధి చెందింది .ఆమె భక్తికి రంగడు ఆకర్షిప బడి చందమ్మగారే తన గురువు అని మనసులో నిశ్చయంగా భావించాడు .వారి౦ట్లోనే  భజలలు పూజలు చేస్తూ ప్రసంగాలు వింటూ చేస్తూ చందమ్మ, రంగ తల్లీకోడుకుల్లాగా ప్రవర్తి౦ చారు  .రంగని జ్ఞానభక్తి వైరాగ్యాలకు చందమ్మఅతడే తన గురువుగా భావించింది .ఇలా వైరాగ్యభావం తో ప్రవర్తిస్తున్న రంగనికి పెళ్లి చేయాలని తలిదండ్రులు భావిచారు .

  నిర్మలమనసు తో ఉంటున్న తనకు వివాహ బంధం వద్దని గట్టిగా చెప్పాడు రంగ .చాలా మందిపెద్దలతో చెప్పించారు కానే అతడి మనసు మారలేదు.రంగడు పరమ పావనుడు అని అందరూ తలిదంద్రులకే చెప్పారు .ప్రయత్నాలు విరమించి మనసుకు సమాధాన పడి,ప్రశాంతంగా ఉన్నారు వాళ్ళు .క్రమక్రమగా రంగని వైరాగ్య దృష్టిపెరిగి ఇహలోకసంబ౦ దాలు  దూరమై జ్ఞానిగా మారి .మౌనం పాటిస్తూ ,తన సత్ప్రవర్తనతో తలిదండ్రుల మనసుమార్చి మౌనం తోనే జ్ఞానబోధ చేస్తూ మహావిరాగియై భాసిల్లాడు .ఇంట్లో వారికి బయటివారికి తేలిక మాటలతో జ్ఞానం బోధించి వివేకం కలిగించే జీవితానికి అర్ధం ,పరమార్ధం బోధించాడు .తలిదండ్రులు తీర్ధయాత్రలు చేసి పుణ్యం మూటకట్టుకోవాలని భావిస్తే వారితో  ‘’తీర్ధయాత్రల వలన లాభం లేదు .ధన౦  శ్రమఖర్చే .దానిబదులు దాన ధర్మాలు చేయండి ‘’అని మాన్పించి,బీద సాదలను ఆడదుకోనేట్లు చేశాడు .గురువు చందమ్మ దేహం చాలించింది .ఆమెకు చాలాభక్తిశ్రద్ధలతో  ఉత్సవాలు జరిపించాడు రంగ .ఆమె భక్తి జ్ఞాన వైరాగ్యబోధలను లోకంలో ప్రచారం చేశాడు .నిస్స౦గ౦గా జీవిస్తూ ,ఐహికాలకు దూరమై మనసంతా దైవమె గా జీవిస్తూ నియమనిష్టలతో గడుపు పరమ విరాగియై  ,అవదూతత్వం పొంది రంగ’’ శ్రీ రంగావదూత’’ గా పరిపర్తనం చెంది బందరు పురజలనకు జ్ఞాన మార్గదర్శి అయ్యారు .

  ఇంతవరకే ఉంది ఆయన ఎప్పుడు సమాధి చెందారో వివరాలు రాయలేదు .ఎవరికైనా తెలిస్తే తెలియ జేయండి .

  శ్రీ రంగావదూత జ్ఞానబోధ –కన్నులు లేనివారికి సూర్యుడు కనిపించానట్లే అజ్ఞానికి భగవంతుడు కనిపించడు.ముత్యాలకోసం సముద్రం లోదిగే వాడు చాలా కస్టపడి వాటిని సాధించినట్లే దేవుడిగురించి అంతకస్టపడి సాధన చేస్తేనే ఆతత్వం తెలుస్తుంది.బంగారాన్ని యెంత జాగ్రత్తగా కాపాడుతారో దేవుడినీ అంటే జాగ్రత్తగా కొలవాలి .పరిపూర్ణ శుద్ధమనసే శాంతి కలిగిస్తుంది .మనసే దైవం అనే భావం రావాలి .సాటిమనుషుల కష్టసుఖాలలో పాలు పంచుకోనేనే దైవం మెచ్చుకొంటాడు .ధ్యానసమయం లో మనసు అత్యంత పరిశుద్ధంగా ఉండాలి .ప్రపంచ సుఖాలు శాశ్వతం కాదు .శరీరం అశాశ్వతం ఆత్మమాత్రమే శాశ్వతం బంధాలను తొలగించుకోవాలి సాధనద్వారా .

 ఆధారం –బెజవాడ పురవాసిని జ్ఞాని,యోగిని శ్రీమతి జ్ఞానమాంబ గారు పద్యాలలో రచించిన ‘’శ్రీ రంగావదూత ల వారి దివ్య జీవితము  ,జ్ఞానబోధ’’ . ఈ పుస్తకం 1909 లో బందరుకు చెందిన భైరవ ముద్రాక్షర శాల  ప్రచురించింది .జ్ఞానమాబ గారి వివిధ ఛందస్సులలో పద్యాలు ద్రాక్షాపాకం తో లలితలలిత పదాలతో సకలజనులకు కూడా వేదాంత విషయాలు సుబోధకమయ్యే ట్లు రాశారు .అవధూత గారిదివ్య చరిత్రను లోకానికిఅందించారు .ఈపుస్తకం లేకపోతె రంగావదూత గురించి ఎవరికీ తెలిసి ఉండేదికాదేమో .జ్ఞానమాంబ గారి రసగుళికలవంటి కొన్ని పద్యాలు చూద్దాం –

  అవధూత జీవిత చరిత్ర -78పద్యాలు

‘’ధరలో సాగర తీరమందు శుచియై ధారాళమై యొప్పుచున్ –చిర రూఢిన్ మచిలీ పురంబనగా

‘’గోత్రంబొండు వీకాసమై ‘’శ్రీ వామమ్మున వెల్గు ‘’

‘’ఆ వంశంబున నుద్భవించె ఘనుడౌ సుబ్బయార్యుండు ‘’

‘’అవతరించే విమల సచ్చరితుడు తమమనియెడు అంధకార మడప నర్కుండు ధరలోని దివ్యమూర్తి జగదతీతుడరయ

‘’రంగ యను నామంబున’’

‘’చ౦దమ్మను నభిదానము-నం ధాత్రిని విదితమైన నవ గుణములతో ‘’

‘’రుతమున హి౦సయున్ దయాయు రోషము లేనటు వంటి మానసం బతులిత భక్తిశ్రద్ధలును ‘’

‘’ఘనమై సద్గుణ ఖనియై మెలగ నా కా౦తా లలామప్రావ-ర్తనముల్ గాంచి మహాత్మా యంచు దనలో దా ‘’ర౦గ యార్యుండు’’ఎం-ఛి నయంబౌ గణవార్థి నా విమలియే శ్రీ మద్గురు శ్రేష్టమం-చును నీ ధీమతియందు భక్తీ గలుగన్ స్తుత్యుండు బాగొప్పగా ‘’

‘’జననీ పుత్రుల మాడ్కి నీ మహితునిన్ చందమ్మ యత్యంత ప్రేమను జూచున్ ‘’

‘’నాకు వివాహమే వలదు నైర్మల మానసు తోడ నుందు’’

పరోపకార బుద్ధితోడ బాగు మీర నీతడున్  -సరళలమొప్పగాను తాను  చక్కగాను’’

‘’అనఘు డీ మహనీయుడజ్ఞానమును బాపు జ్ఞాన బోధనంబులు పెక్కు లీ ధరిత్రి ‘’

 అవధూత జ్ఞానబోధామృతం-135పద్యాలు

‘’కన్నులు లేనివారు దివి గాంచగ లేక దివాకరుండు లేడన్న విధంబుగా ‘’

‘’అగణిత భక్తి చే భగవదర్చన జేయుచునిర్మలాత్ములై ‘’

‘’అ౦గా రమ్ముల  నేగతి- బంగారము నే విధముగా భావి౦తురోయా  -భంగిని లోకము పైనను –మంగళ కరుడగు దేవు నెదను మది ను౦చ వలెన్ ‘’

‘’తనమనసే దేవు నెడ౦గ  భక్తిం గలిగి యుండు గాంచగా నా దే దేవుని నేల్లవేళ నారాధానము జేయుచు నుండవలయు ‘’

‘’అర్ధము పర సౌఖ్యంబును –వ్యర్ధము గావించి ‘’

‘’సంసారంబే శత్రువు –సంసారంబదికమైన సంతాపంబు ‘’

‘’ధర నెలతల మాతల వలె-విరివిగా పురుషుల జనకుల విధి దలచి మదిన్ ‘’

‘’స్వాంతము మాయయే మాయయే స్వాంతము ‘’

‘’శ౦క రహిత సుఖ మొదవున్ ‘’

‘’వేదాన్తులరము మాకే బాధలును లభించ వెటులవర్తి౦చిన గా  –నీ ధాత్రి ననెడు దుష్టులు-వేధనలే పొందగలరు  వేగిరమే మదిన్ ‘’

‘’దర్పణ౦బున దేహ మమెల్లయు ధాత్రి గన్పడు రీతి ‘’

‘’ఎన్నటికిని  ఆకాశము –పన్నుగ బ్రహ్మంబు గాదు-చిన్నెలు లేనిదే బ్రహ్మము ‘’

‘’పరము కరతామలకమే ‘’

‘’దేవుం డగు తానె మది-జీవుడుగా దోచు చుండు శీత కరుడు –మబ్బే విడిపోయిన ఎదలన్ –భావింపగా చంద్రు డనగ బయలు పడునుగా ‘’

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -23-8-20-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.