ఫోన్ లో శ్రీ మైలవరపు రామ శేషుగారి సహృదయ స్పందన
ఈ సాయంత్రం ఒక అరగంట క్రితం గుంటూరు బ్రాడీ పేటనుంచి డా శ్రీమతి మైలవరపు లలితకుమారి భర్తగారు శ్రీ మైలవరపు రామ శేషుగారు ఫోన్ చేసి ఎంతో ఆత్మీయంగా పావుగంట సేపు మాట్లాడారు .వారికి పంపిన సరసభారతి శ్రీ శార్వరి ఉగాది ఆవిష్కరణ మూడు పుస్తకాలు అందాయని ,పుస్తకాలు అంటే ఇష్టపడే తాను వీటినీ చాలా శ్రద్ధగా చదివి ఇప్పుడు ఫోన్ చేస్తున్నానన్నారు .వారి ఆనందం వర్ణనాతీతం అనిపించింది ‘’ఆనందం అంబరమైతే ‘’అన్నట్లు గాధ్వనించింది .ముందుగా’’ ఊసుల్లో ఉయ్యూరు’’ గురించి ప్రస్తావించారు .చిలకమర్తి వారి రచనతో సరితూగే ట్లుగా ఉందన్నారు .నేను ‘అంతపెద్ద వారితో నాకు పోలిక ఏమిట౦డీ?వారు మహానుభావులు సాహిత్య దిశా నిర్దేశం చేసినవారు ‘’అన్నాను .ఏమైనా తాను చెప్పింది కరెక్టే అన్నారు నవ్వాను .’’ఆ నాటి బ్రాహ్మణ కుటుంబాలలో ఉన్న సకల విషయాలు కళ్ళముందు ప్రత్యక్షం చేశారు .సూక్ష్మ పరిశోధన ,పరిశీలన అంతటా కనిపించింది పుస్తకం చేత్తో పట్టుకొంటే చివరిదాకా చదివే దాకా వదిలి పెట్ట బుద్ధికాలేదు .మంచి అనుభవాలు మాకు పంచినందుకు ధన్యవాదాలు ‘’అన్నారు.
.రెండవ పుస్తకం ‘’సోమనాథ్ నుంచి కాశీ విశ్వనాథ్ దాకా ‘’యాత్రా పుస్తకాన్ని మెచ్చుకొంటూ ‘’మేమూ దేశం లో చాలా ప్రదేశాలను మా లీవ్ ట్రావెల్ కన్సెషన్ లో తిరిగి చూశాం .ఒంటి మిట్ట చూడలేదు .అది ప్రత్యక్షం చేశారు .నవ్యాంధ్ర రాకపోతే దాన్ని పట్టించుకొనే వారు ఉండేవారు కాదు ఆ చుట్టుప్రక్కల ప్రదేశాల విషయాలూ ఎవరికీ పెద్దగా తెలీవు వాటి వివరాలు బాగా చెప్పారు. చూడాలనే ఉత్సాహం కలిగించారు అక్కడ డాక్టర్ శివ ,శ్రీమతి పద్మజ దంపతుల గురించి ప్రత్యేకించి బాగా రాశారు ‘’అన్నారు ‘’అవునండీ .వారు చాలా సహృదయులు ఎవరిననైనా అలాగే ఆదరిస్తారు వెళ్ళాలను కొంటె మంచి సహకారం ఇస్తారు. దగ్గరుండి అన్నీ చూపిస్తారు ‘’ తప్పక వెళ్లి చూడండి ‘’అన్నాను .
మూడవ పుస్తకం ‘’ఆధునిక ఆంద్ర శాస్త్ర మణి రత్నాలు ‘’గురించి చెప్పారు .’’వీరిలో చాలామంది తెలుగు మీడియం లో చదివి ఉన్నత స్థానాలు పొందినవారే .ప్రతిభ ఉంటే తెలుగు మీడియం అడ్డు కాదు అనిరుజువు చేసినవారే .ఈతరం వారికి వీరిలో చాలామంది తెలియని వారే .వారందర్నీ ఏరికోరి బాగా పరిచయం చేశారు .వారి పరిశోధనా ఫలితాలు మనం అనుభవిస్తున్నాం .మీ మూడు పుస్తకాలు మూడు ఆణి ముత్యాలవంటివే ‘’అని మహా సంతోష పడ్డారు .
తర్వాత బంధుత్వం గురించి మాట్లాడుతూ ‘ మా అమ్మాయిని గుడివాడ దగ్గర కూరాడ అగ్రహారం గబ్బిట వారబ్బాయికి ఇచ్చి వివాహం చేశాం . అల్లుడు రైల్వే లో పెద్ద హోదా ఉన్న ఉద్యోగి .హైదరాబాద్ లో ఉంటారు వాళ్ళు .మాకు ములగలేటి వారుకూడా బంధువులే ‘’అన్నారు .నేను ‘’ములగలేటి వారమ్మాయే మా పెద్దకోడలు .వాళ్ళది నూజి వీడు దగ్గర ఈదులగూడెం ‘’అన్నాను .అయన మరీ సంతోషించారు .’’ఈ సారి గుంటూరు వస్తే మా ఇంటికి తప్పకుండా రావాలి .మీదంపతులతో పర్సనల్ గా మాట్లాడాలని మా దంపతులకోరిక .’’అన్నారు .గుంటూరు వస్తే తప్పక అలానే చేస్తామన్నాను .ఆయన ‘’మీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయానికి ఉడతా భక్తి గా ఏదో ఇవ్వాలని ఉంది .అకౌంట్ నంబర్ వగైరా ఇవ్వండి ‘’అన్నారు .నేను ‘’మా దేవాలయానికి ప్రత్యేకంగా బాంక్ అకౌంట్ లేదు .రసీదు పుస్తకాలు లేవు. ఎవరైనా తోచింది పంపాలనుకొంటే నా బాంక్ అకౌంట్ నంబర్ ఇస్తాను .దానికే పంపిస్తారు .మేము పుస్తకాలు ప్రచురించినప్పుడు అందులో వారిపేరు ఇచ్చిన డబ్బు రాసి కృతజ్ఞతలు తెలియజేస్తాం ‘’ఊసుల్లో ఉయ్యూరు ‘’పుస్తకం లో తెలియబర్చి నట్లు .అభ్యంతరం లేకపోతె అకౌంట్ నంబర్ ఇస్తాను ‘’అన్నాను .’’అయ్యయ్యో !ఇవ్వండి .పంపిస్తాను ‘’అన్నారు .వెంటనే ఇచ్చాను .
చివరగా మళ్ళీ వారు గుంటూరు పని లేకపోయినా తమకోసమైనా వారింటికి రావాలని కోరారు ‘’తప్పని సరిగా వస్తాము మీరూ ఉయ్యూరు వచ్చి మాఆతిధ్యం పొంది మా శ్రీ సువర్చలాన్జనేయస్వామిని దర్శించండి ‘’అన్నాను .సహృదయ స్పందన ఎంతో ప్రోత్సాహమిస్తుంది .వారికి ధన్యవాదాలు.
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -26-8-20-ఉయ్యూరు