గుడివాడ తెలుగు భాషా వికాస సమితి వారి గిడుగు రామమూర్తి గారి స్మారక పురస్కార ప్రదానం
నేపధ్యం – ఈ నెల 21 సోమవారం రాత్రి 9-30కి ఆంధ్రప్రదేశ రచయితలసంఘం ప్రధాన కార్యదర్శి శ్రీ చలపాక ప్రకాష్ ఫోన్ చేసి ‘’సార్!మన సంఘ అధ్యక్షులు శ్రీ సోమేపల్లి వెంకటసుబ్బయ్య గారు నాకు ఫోన్ చేసి ,గుడివాడలో ఏదో సాహిత్య సంస్థ వారు గిడుగు వారి జయంతి చేస్తున్నారనీ ఆ సంస్థ అధ్యక్షుడు తనకు ఫోన్ చేసి ఎవరైనా రచయిపేరు సూచిస్తే ఆయనకు గిడుగు పురస్కారం అందిస్తామని చెప్పారట .సుబ్బయ్యగారు వెంటనే మీ పేరు సూచించారట .అక్కడ వాళ్ళవద్ద ఫండ్స్ ఏమీ లేవు .నగదు పురస్కారం ఉండదు .శాలువాకప్పి జ్ఞాపిక మాత్రం ఇస్తారట .మీరు అంగీకరిస్తే తానే గుడివాడ వారికి తెలియ జేస్తామని ,అందుకోసం నన్ను మీకు ఫోన్ చేసి మీ అభిప్రాయం తెలుసుకోమని చెప్పారు సుబ్బయ్యగారు .మీ అంగీకారం నాకు చెబితే నేను సుబ్బయ్యగారికి ఫోన్ చేసి చెబుతానన్నారు అప్పుడు గుడివాడ వారు రేపు మీకు ఫోన్ చేసి వివరాలు చెబుతారట అన్నారు ప్రకాష్ . .నేను పెద్దగా ఆలోచించకుండానే ‘’ప్రకాష్ గారూ !డబ్బు విషయం ముఖ్యం కాదు మనకు .ఏదో ఉడతాభక్తిగా చేస్తున్నదానికి మనం అంగీకరించటమే సాయం .సరే అని చెప్పండి సుబ్బయ్యగారికి .నన్ను సూచించినందుకు ఆ విషయం మీద్వారా తెలియ బర్చినందుకు వారికీ మీకు ధన్యవాదాలు ‘’అన్నాను .’’సరే ఇప్పుడే సుబ్బయ్య్గ గారికి మీ అంగీకారం చెబుతా ‘’అన్నారు చలపాక .
మర్నాడు మంగళవారం ప్రకాష్ ఫోన్ గుడివాడ వారు ఫోన్ చేశారా అని అడిగితె లేదన్నాను .మళ్ళీ 9-45కు ఫోన్ చేసి అడిగారు నేను ‘’ఇంకాలేదు .ఆయన పేరేమిటి ?’’అన్నాను .ఆయన ‘’నాకూ తెలీదు .ఆయనే ఫోన్ చేస్తారని సుబ్బయ్యగారు చెపారు ‘’అన్నారు.నేను ‘’సార్!10నుంచి 11వరకు ఫేస్ బుక్ లో లైవ్ ప్రోగ్రా౦ చేస్తున్నాను .అఆర్వాత ఫోన్ చేయమని చెప్పండి .’’అన్నాను .నా లైవ్ కార్యక్రమమ 11-15దాకా సాగింది .11-30కి గుడివాడ నుండి ఒకాయన ఫోన్ చేసి ‘’నా పేరు ప్రసాద్ .ఇక్కడ తెలుగు భాషా వికాస సమితి అధ్యక్షుడిని .ప్రతిఏడూ గిడుగు వారి జయంతి నిర్వహించి వారి స్మారక సాహితీ పురస్కారం ప్రసిద్ధులైన రచయితలకు అందిస్తున్నాము .ఈ సారి మీ పేరును వెంకట సుబ్బయ్య గారుసూచించారు .ఆయన గుడివాడ ఆర్ డి వో గా పని చేసినప్పటినుంచీ నాకు బాగా పరిచయం .మీరు అంగీకరించినట్లు సుబ్బయ్యగారు ఫోన్ చేసి చెప్పారు .దన్యవాదాలు .కరోనా హడావిడికనుక చాలా సింపుల్ గా. చేస్తున్నాం .మీతో పాటు ఇద్దరు అతిధులు వేదికపై ఉంటారు .శరత్ టాకీస్ ఎదురురోడ్డులో పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్న జిల్లా గ్రంధాలయం లో29 శనివారం ఉదయం కార్యక్రమం ..పై అంతస్తు కూలిపోయింది .కనుక కిందనే లైబ్రేరియన్ రూమ్ లోనే జరుపుతాం .ఉదయం 10-30కు రండి .11గంటలకు ప్రారంభించి ఒక అరగంట లో పూర్తి చేస్తాం ‘’అన్నారు .’’సరే గిడుగువారిని స్మరించుకోవటం మన విధి ‘’అన్నాను .వెంటనే ప్రకాష్ గారికి ఫోన్ చేసి ప్రసాద్ గారు నాతో మాట్లాదడినసంగతి చెప్పాను సరే నన్నారు .
ఒక్కసారి నామనసు చక్రాలు గుండ్రాలు లోకి అదేనండి ఫ్లాష్ బాక్ లోకివెళ్లి పాతిక ,ముప్పై క్రితం మినికవిత్వ సారధి వసుధ బసవేశ్వరరావు ‘ గుడివాడలో రెగ్యులర్ గా నిర్వహించే సాహిత్యకార్యక్రమాలు , నేను ఉయ్యూరు నుంచి తప్పకుండా వెళ్లి చూడటం అప్పుడు ఒకకుర్రాడు బానర్లు కడుతూ కుర్చీలు మైకు ఏర్పాట్లు చూస్తూ వసుధకు చేదోడుగా ఉండే లాయర్ ప్రసాద్ జ్ఞాపకం వచ్చి ‘’ఆ ప్రసాదేనా మీరు ?’’అని అడిగితె ఔనన్నారు .ఆ కార్యకరమాలు సాయంత్రం 5గంటలకు ప్రారంభం అవ్వాల్సి ఉన్నవి అతిధులు రాకపోవటం తో రాత్రి 7-30దాటితే కానీ మొదలయ్యేవి కావు .ఒక గంట చూసి ఇంటికి ఉయ్యూరు వచ్చేసే వాడిని .ఆ సభలపై నా స్పందన వసుధగారికి కార్డు పై రాసి తెలియ జేసేవాడిని నిర్మొహమాటంగా .ఆయనా చాలా స్పోర్టివ్ గా తీసుకొనేవారు .ఉయ్యూరులో మేము నిర్వహించే సాహితీ మండలి, ససరస భారతి కార్యక్రమాలకు తప్పక వచ్చేవారు .శ్రీమతి నాగలక్ష్మి,శ్రీ వంగిపూడి ,శ్రీ మాల్యాద్రి వగైరా లను కూడా తీసుకొచ్చేవారు తనతో పాటు .మా పురస్కారాలు వసుధకు అందించాం .కవి సమ్మేళనాలు ఆయనతో నిర్వహింప జేశాం .నాకు మంచి సాహితీమిత్రుడు వసుధ .ఆంధ్రాబాంక్ మేనజర్ . .ఆయన కైకలూరు బందరు ఎలమర్రు ,గుడివాడ ఎక్కడ పని చేసినా యువకవులకు ఆకర్షణ,స్పూర్తి .ఆ యన బృందం సాహితీ మిత్రులు .మా ఉగాది కవిసమ్మేళ కవితలు కవితా సంకలనాలు ‘’మా అక్కయ్య ‘’వసుధైక కుటుంబం ‘’కు ఆయనే మార్గదర్శి ,ఆయన ఆధ్వర్యం లోనే ముద్రి౦ప జేశాం .ఇన్ని విషయాలు ఒక్కసారిగా గుండ్రాలలో గుప్పుమని బయటికొచ్చాయి .
గుడివాడ విషయం ఎవరికీ చెప్పలేదు .మా అబ్బాయి రమణ కు మాత్రం అప్పుడే చెప్పా.అమెరికాలో ఉన్న మా అమ్మాయికి తెలిసింది .ప్రసాద్ గారు నా పాస్ పోర్ట్ సైజ్ ఫోటో బయోడేటా వాట్సాప్ లో పంపమంటే వెంటనే పంపాను .గురువారం నుంచీ రోజూ ఫోన్ లో టచ్ లోనే ఉన్నారు .నిన్న 28-శుక్రవారం రాత్రి 8గంటలకు మా రమణ కు మిత్రుడుశ్రీతుమ్మోజు రామలక్ష్మణాచార్యులు గారు పంపిన గుడివాడ సభ వార్తను ఫేస్ బుక్ లో పెట్టగా, ఆతర్వాత అరగంటతర్వాత నేను చూసి , ఈమెయిలు , ఫేస్ బుక్ వాట్సాప్ లో అందరికీ పంపాను .అగ్గి రాజుకున్నట్లు క్షణాలమీద వైరల్ అయి వెంటనే నాకు అభినందన సందేశాలు కుప్పలుగా వచ్చాయి .వచ్చినవాటికి వచ్చినట్లు ధన్యవాదాలు తెలిపాను .ఇవాళ ఉదయం నేను పురస్కారం అందిస్తున్న ప్రసాద్ గారికీ వారి బృందానికీ ,,నన్ను అభినందించిన సాహితీ బంధువులు సాహిత్యాభిమానులు బంధుమిత్రులందరికీ కృతజ్ఞత మూడు మాధ్యమాలలలోనూ తెలియజేశాను.
పురస్కార సభ
29 శనివారం ఉదయం స్నానసంధ్యపూజాదికాలు పూర్తి చేసుకొని ఉదయం 10గంటలకు నేనూ మారమణ ,తానూ వస్తానని రమణతో చెప్పిన మాన్నయ్యగారి అబ్బాయి రాం బాబు కారులో బయల్దేరి గుడివాడకు 10-45కు చేరాం.అప్పటికే ఒకసారి ప్రసాద్ గారు ఫోన్ చేసి ఎక్కుడున్నామో తెలుసుకొన్నారు .వెంకటసుబ్బయ్య గారూ రోజూ తనకు ఫోన్ చేసి ఎంక్వైర్ చేస్తున్నన్నట్లు చెప్పారు. అంతటి నిబద్ధత సుబ్బయ్యగారిది .లైబ్రేరియన్ శ్రీమతి రమాదేవి గారు .ప్రసాద్ గారు ఆహ్వానించారు .సభ 11-45 కు ప్రారంభమైంది .సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, రెవిన్యు అధికారి ,ఒక గుడి ఆచార్యులగారు ఇంకొరు అతిధులు .ప్రసాద్ అందర్నీ పరిచయం చేసి ఈ కార్యక్రమముద్దేశ్య౦ తెలిపారు .సి ఐ గారు గిడుగు వారి చిత్ర పటానికి పుష్పహారం వేయగా, మేమంతా భక్తిగా పూలు సమర్పించాం.క్లుప్తంగా సియిగారు ఆచార్యలు గారు మాట్లాడాక నాకు సెంటర్ లో కుర్చీవేసి కూర్చోబెట్టి ,సర్కిల్ గారి చేత శాలువా కప్పించి అందరూ కలిసి పుష్పగుచ్చం , జ్ఞాపిక అందజేశారు .కుర్చీలున్నా అందరూ వెళ్లిపోవాలనే తొందరలో కాళ్ళలో చక్రాలు పెట్టుకొని నుంచునే ఉన్నారు .నన్ను మాట్లాడమన్నారు .
.నేను ‘’ఇవాళ వ్యావహారిక భాషోద్యమనాయకుడు మార్గదర్శి శ్రీ గిడుగు వెంకట రామ మూర్తి గారి 158వ జయంతి .తెలుగు భాషకు వారు చేసిన విశిష్టమైన సేవలను పురస్కరించుకొని వారి జన్మ దినమైన ఆగస్ట్ 29 న గౌరవంగా తెలుగు భాషాదినోత్సవంగా దేశమంతటా నిర్వహిస్తున్నారు .సాహిత్యం లో కృషి చేసిన వారిని గుర్తించి గిడుగువారి స్మారక సాహితీ పురస్కారం అందిస్తున్నారు .ఆయన 29-8-1863 న జన్మించి ,22-1-1940న చనిపోయారు .కరోనా హడావిడి వలన ఎక్కడా బహిరంగసభలు సమావేశాలు అట్టహాసంగా పురస్కార ప్రదానాలు జరగటం లేదు ఈ సారి .అయినా గత రెండు దశాబ్దాలుగా గుడివాడ తెలుగుభాషా వికాస సమితి గిడుగు వారిజయంతి చేస్తూ సాహితీ పురస్కారం అందించటం హర్షదాయకం .ప్రసాద్ గారితో నాకు సుమారు ముప్పై ఏళ్ళకు పూర్వం నుంచీ పరిచయం ఉంది. ఉయ్యూరులో మా సమా వేశాలకూ వచ్చేవారాయన .శ్రీ వెంకటసుబ్బయ్య గారు నా పేరు సూచిస్తే ,నన్ను పిలిచి ఈ పురస్కారం, ఇందరు అధికారుల సమక్షంలో సరస్వతీ నిలయమైన గ్రంథాలయం లో అందించటం నాకు ఆనందం గా ఉంది .సుబ్బయ్యగారు మహా సౌమ్యులు సాహితీ పిపాసి.కధైకలను కవిత్వాన్నీ ప్రోత్సహిస్తూ తనపేరు మీద తండ్రిగారి పెరుమీడా పురస్కారాలు ప్రతిఏడాది అందిస్తారు వాటిని పుస్తకరూపం లో ముద్రిస్తారు . ఎవరు ఏమిటో ఎస్టిమేట్ చేసే గొప్ప నేర్పున్న అధికారి .ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం అధ్యక్షులుగా గత పదేళ్ళ నుంచి వినూత్న రీతిలో నిర్వహిస్తున్నారు .మా సరసభారతి కార్యక్రమాలకు అతిధులుగా తప్పక వచ్చి,చివరిదాకా ఉండే ఓపికవారిది .నిరుడు ఆ సంఘం తరఫున మొదటిసారిగా ‘’జ్ఞాన జ్యోతి ‘’పురస్కారం ఏర్పరచి ,మొదటి అవార్డ్ ను నాకు గ్రంథాలయ వారోత్సవాల సందర్భం గా బెజవాడ టాగూర్ లైబ్రరీలో 15-11-19 న అందజేసిన సౌజన్య సాహితీ మూర్తి .వారు సూచించారని తెలిసి అంగీకరించి వచ్చాను .మా మనవడు చరణ్ ‘’తాతా!గుడివాడ కరోనాతో పుచ్చి పోయింది .నువ్వు వెళ్ళద్దు ‘’అన్నాడు .అయినా మాట నిలబెట్టుకోవాలి కనుక వచ్చాను .రాష్ట్రం లో బహుశా ఎవరూ ఇవాళ గిడుగు వారి జయంతిని బహిరంగం గా జరిపి పురస్కారం అందిస్తున్నట్లుగా నాకు కనపడలేదు .ఒకవేళ ఎక్కడైనా ఒకటి రెండు చోట్ల జరిగాయేమో తెలీదు . కానీ ’’ ఏక వ్యక్తి సైనికుడైన’’ శ్రీ ప్రసాద్ గారుధైర్యంగా స్వంతఖర్చుతో ఇలా సమావేశం జరిపి పురస్కారం అందించినందుకు ఆంధ్రదేశం ఆయన సాహితీ సేవను తప్పక గుర్తిస్తుంది .ఇలా అరుదుగా జరిగిన ఈ సభలో నాకు మహామహులు గిడుగు వారి స్మారక సాహితీ పురస్కారం లభించినందుకు మహదానందంగా ఉంది ..ఈ పురస్కారం నాకు గొప్ప గౌరవాన్ని కలిగించింది .ఈపురస్కారం ‘మా ‘’సరసభారతి సాహిత్య సాంస్కృతిక సంస్థ ‘’కు వినమ్రంగా అంకితమిస్తున్నాను . సరసభారతి సాహితీ సేవ గురించి నా రచనా ప్రస్తానం గురించీ టూకీగా చెప్పాను సారాదుదుకాణాలకు జనం బాగానే వెడుతున్నారు గుంపులు గుంపులుగా .సాహిత్యసమావేశాలపై ఆంక్షలు ఎందుకో అర్ధం కాదు . ఏమైనా సాహసంగా గిడుగు వారి జయంతిని ప్రసాద్ గారు నిర్వహించినందుకు మనస్పూర్తిగా ,అభినందిస్తూ,ఆయన బుజాలను ,ఆప్యాయంగా తడుతూ, శ్రీ వెంకటసుబ్బయ్యగారికి,శ్రీ చలపాక ప్రకాష్ గారికీ కృతజ్ఞతలు తెలియ జేస్తున్నాను ‘’అని ముగించాను .తర్వాత అందరికి’’వేడి రుచికర ,శుచికర ,ఆరోగ్యకర లెమన్ టీ’’ మినీ కప్పులలో అందించారు .సుమారు 12-30కు బయల్దేరి ఇంటికి 1-15కు చేరి భోజనం చేసి కాసేపు విశ్రమిచి ,ఈ ఆర్టికల్ రాశాను .
గిడుగువారి జయంతి శుభాకాంక్షలతో
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -29-8-20-ఉయ్యూరు