సాహితీ బంధువులకు శుభకామనలు –
సరసభారతి 154వ కార్యక్రమంగా ఉపాధ్యాదినోత్సవం 5-9-20శనివారం నాడు సాయంత్రం 6-30గంటలకు శ్రీ సువర్చలాన్జనేయస్వామి దేవాలయం లో మా గురువరేణ్యులు బ్రహ్మశ్రీ కీ శే .కోట సూర్యనారాయణ ,కీ.శే.శ్రీమతి సీతమ్మ దంపతుల గార్ల గురుపూజోత్సవ కార్యక్రమం నిర్వహిస్తోంది .
1- 2020 మార్చి పబ్లిక్ పరీక్షలో ఉత్తీర్ణులైన పేద,ప్రతిభగల విద్యార్ధులకు శ్రీ మైనేని గోపాలకృష్ణ ,శ్రీమతి సత్యవతి (అమెరికా )దంపతులు ఏర్పాటు చేసిన శ్రీ కోట సూర్యనారాయణ ,శ్రీమతి సీతమ్మ దంపతుల స్మారక నగదు పురస్కారం అందజేయబడుతుంది .
2- శ్రీ కోటగురుపుత్రులు శ్రీ కోట చంద్ర శేఖరశాస్త్రి ,శ్రీ రామకృష్ణ ,శ్రీ గాయత్రి ప్రసాద్ ,శ్రీ సీతారామాంజనేయులు గార్లు తమ తలి దండ్రులు కీ. శే .కోట సూర్యనారాయణ శాస్త్రి కీ.శే. శ్రీమతి సీతమ్మ దంపతుల గార్ల పేరిట ఏర్పాటు చేసిన స్మారక నగదు పురస్కారం 2020 మార్చి పబ్లిక్ పరీక్షలో పదవతరగతి ఉత్తీర్ణత సాధించి ,ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న పేద ప్రతిభగల బ్రాహ్మణ విద్యార్ధికి ,విద్యార్ధినికి శ్రీ గురుపుత్రుల చేతులమీదుగా అందజేయ బడుతుంది .
3- డా సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినమైన ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా 1-శ్రీ వేమూరు సదాశివరావు –గణిత ,ఆంగ్ల ఉపాధ్యాయుడు 2-శ్రీమతి కనకదుర్గ –ప్రిన్సిపాల్ ,భారతీయ విద్యాకేంద్రం-ఉయ్యూరు లకు పురస్కార ప్రదాన సన్మానం జరుగుతుంది .
గమనిక –పురస్కారానికి ఎంపికైన విద్యార్ధినీ విద్యార్ధులు ,ఉపాధ్యాయినీ ,ఉపాధ్యాయులు,అతిధులు తప్పక మాస్కులు ధరించి హాజరు కావలసినదిగా కోరుతున్నాము .
జోశ్యుల శ్యామలాదేవి మాదిరాజు శివ లక్ష్మి గబ్బిత వెంకట రమణ గబ్బిత దుర్గాప్రసాద్
గౌరవాధ్యక్షురాలు కార్యదర్శి కోశాధికారి అధ్యక్షులు –సరసభారతి సాహిత్య సాంస్కృతిక సంస్థ –ఉయ్యూరు
పూర్తీ వివరాలతో 3వ తేదీ న ఆహ్వానం అంద జేస్తాము