మనకు తెలియని మహాయోగులు—7
13-కడప అవదూతే౦ద్రులు -1890-1978
కర్నూలు జిల్లా త్యాగి గ్రామం లో ఎంకి ,ఈరిగాడు అనే పేద హరిజన దంపతులకు ఎనిమిదవ సంతానంగా 1890లో పుట్టిన ఈరన్న అవదూతగా ఎదిగాడు.త్యాగి స్వామివద్ద ఉపదేశం పొంది ,యాగంటి గుహలో తపస్సు చేసి పరిణామం చెందాడు .ఎన్నో మహిమలు చూపాడు .రాబోయే అరిస్టాలనువింత విపరీత చేష్టలతో చూపించేవాడు .1978ఏప్రిల్ 10న 87వ ఏట కాళయుక్తి చైత్ర శుద్ధ తదియ సోమవారం ఉదయం 11.23గంటలకు కడప ఆస్పత్రిలో అవతారం చాలించారు అవధూత .దీన్ సాహెబ్ హోటల్ వంటగది యే ఆయన సమాధి స్థలంగా ఉండేది .దానిపై మందిరం నిర్మించారు .
14-చివటం అచ్చమ్మ అవధూత -1911-1981
పశ్చిమ గోదావరి జిల్లా రేలంగి గ్రామంలో కాపుకులానికి చెందిన మా యిష్టి భద్రయ్య కుమార్తె గా అచ్చమ్మ 1910లో జన్మించింది .బాల్యం నుంచే దైవభక్తి తో ఉండేది .భర్త గరగఅంజయ్య జూదం ఆడుతూ భార్యను హింసించేవాడు .భరించలేక అత్తగారికి చెప్పి బంధాలన్నీ తెంచుకొని చిన్నాయగూడెం లో ఒక భక్తుని ఇంట్లో భజనలు చేస్తూ గడిపి మళ్ళీ రేలంగి వెళ్లి ,చివరికి చివటం వచ్చినా ఆమె తోటలు స్మశానాలలోనే ఉండేది .కొద్దికాలం రాజమండ్రి స్త్రీల మఠంలో ఉండి సాధన చేసి ,మళ్ళీ చివటం వెళ్లి ఏకాంత ప్రదేశం లో ధ్యానం లో గడిపేది .సాదూరాం బావాజీ ని గురువుగాఎంచుకొని ,దిగంబరియై అవధూతగా మారింది .
రేలంగి ప్రజలు ఆమెను సిద్దురాలుగా భావించి గౌరవించారు .అవధూత పిచ్చమ్మ 12ఏళ్ళు మౌనవ్రతం పాటించింది .జ్ఞానులలో జ్ఞానిగా భక్తులలో పరమ భక్తురాలిగా ఉంటూ మహిమలు చూపేది .ఆమెను ఆశ్రయిచినవారికి అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు కలిగేవి .1981జూన్ 8 న 70వ ఏట రాత్రి 12.52గంటలకు కపాలం చేదించుకొని అవధూత పిచ్చమ్మ శరీరంచాలించారు .మర్నాడు జ్యేష్ట శుద్ధ నవమినాడు మహాసమాధి జరిగింది .సమాధిపై మందిరం నిర్మించారు సమాధినుంచే భక్తులను అనుగ్రహిస్తారనే నమ్మకం బాగా ఉన్నది .
సశేషం
మీ-గబ్బిటదుర్గాప్రసాద్ -2-9-20-ఉయ్యూరు