బ్రహ్మశ్రీ కోట గురువరేణ్యుల గురు పూజా మహోత్సవ ఆహ్వానం
-సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవాన్ని సుమారు 7 దశాబ్దాల క్రితం శ్రీ మైనేనిగారికి, నాకు ప్రాధమిక విద్య బోధించిన ”స్వర్గీయ బ్రహ్మశ్రీ కోట సూర్య నారాయణ శాస్త్రి గురువరేణ్యుల గురుపూజోత్సవం ”గా 5-9-20 శనివారం సాయంత్రం 6-30 గంటలకు ఉయ్యూరు శ్రీ సువర్చలాంజనేయ స్వామి వార్ల దేవాలయం లో సరసభారతి 154 వ కార్యక్రమంగా, నిర్వహిస్తున్నాము ..గురుపుత్రులు ,,శాసనమండలి సభ్యులు శ్రీ యలమంచిలి వెంకట బాబూ రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిధిగా పాల్గొనే ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే .విచ్చేసి జయప్రదం చేయ ప్రార్ధన .
సభాధ్యక్షులు –శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ ,సరసభారతి అధ్యక్షులు
సభ ప్రారంభం –శ్రీ మతి జోశ్యుల శ్యామలాదేవి –సరసభారతి గౌరవాధ్యక్షులు
ఆత్మీయ అతిధులు – శ్రీ కోట చంద్ర శేఖర శాస్త్రిగారు ,శ్రీ కోట రామ కృష్ణ గారు ,శ్రీ కోట సీతారామాంజనేయులుగారు ,శ్రీ కోట గాయత్రీ ప్రసాద్ గారు (కోట గురువరేణ్యుల పుత్రులు )
కార్యక్రమ వివరం
స్వర్గీయ బ్రహ్మశ్రీ కోట సూర్య నారాయణశాస్త్రి గురు వరేణ్యుల చిత్రపటానికి పుష్పమాలాలంకారం ,పుష్ప సమర్పణ
ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా సన్మాన సత్కారాలు
1-శ్రీ వేమూరు సదాశివరావు –గణిత ఉపాధ్యాయులు –విశ్వశాంతి స్కూల్ –ఉయ్యూరు
2-శ్రీ ఆదిరాజు హనుమంతరావు –ప్రిన్సిపాల్ ,ఫ్లోరా స్కూల్ –ఉయ్యూరు
3-శ్రీమతి ఆదిరాజు కనకదుర్గ –ప్రిన్సిపాల్ ,శ్రీ భారతీ విద్యానిలయం –ఉయ్యూరు
ప్రతిభ గల విద్యార్ధులకు శ్రీ మైనేని గోపాలకృష్ణ ,శ్రీమతి సత్యవతి (అమెరికా )దంపతులు ఏర్పాటు చేసిన’’ స్వర్గీయ బ్రహ్మశ్రీ కోట సూర్యనారాయణ శాస్త్రి శ్రీమతి సీతమ్మ ద౦పతుల స్మారక నగదు పురస్కార ‘’ప్రదానం
–2020 మార్చి పదవతరగతి పబ్లిక్ పరీక్షలలో పాఠశాల ప్రధమ స్థానం పొందిన పేద ,ప్రతిభగల విద్యార్ధినీ విద్యార్ధులకు
1- స్థానిక జిల్లాపరిషత్ పాఠశాల విద్యార్థిని-కుమారి . కె శ్రీకన్య –కు 2,000 రూపాయలు,2-విద్యార్ధి చి.చొప్పరపు నాగ ఫణికుమార్ కు – 2,000 రూపాయలు
2-..అమరవాణి పాఠశాల 1- విద్యార్ధి –ఛి.జిత్తు నిఖిల్ బాబు కు – 2,000 రూపాయలు 2-విద్యార్ధిని –కుమారి .బుద్ద జయలక్ష్మి కు 2,000 రూపాయలు
3–వి.ఆర్ .కె.ఎం విద్యార్ధిని –కుమారి వై .మాధవి కు -2,000 రూపాయలు
4-పబ్లిక్ స్కూల్ విద్యార్ధిని- కుమారి పామర్తి జ్ఞాన శరణ్య కు -2,000 రూపాయలు
.
.-గురుపుత్రులు ,కోటసోదరులు తమ తలిదండ్రులు స్వర్గీయ బ్రహ్మశ్రీ కోట సూర్యనారాయణ శాస్త్రి గారు శ్రీమతి సీతమ్మ దంపతుల పేరిట ఇంటర్ చదువుతున్న పేద ,ప్రతిభకల బ్రాహ్మణ విద్యార్ధిని ,విద్యార్ధికి ఒక్కొక్కరికి 10,,000 గా ఏర్పాటు చేసిన స్మారక ప్రోత్సాహక నగదు పురస్కారప్రదానం – ఈ సంవత్సరం బాలుడు ఎవరూ లేనందున ఇద్దరు బాలికలకు అందజేయబడినది .
5–2020 మార్చి పదవ తరగతి పబ్లిక్ పరీక్షలో స్థానిక నారాయణ స్కూల్ లో ఉత్తీర్ణత సాధించి అక్కడి జూనియర్ కాలేజిలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న -కుమారి-మద్దాలి అలేఖ్యకు -10 వేలరూపాయలు
6- స్థానిక ఫ్లోరా స్కూల్ లో ఉత్తీర్ణత సాధించి ఏ.జి అండ్ ఎస్ జి సిద్ధార్ధ జూనియర్ కాలేజిలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న కుమారి-గండూరి ఉమాశైలజ కు -10 వేలరూపాయలు-
శ్రీ కోట సోదరుల చేతులమీదుగా ప్రదానం చేయబడుతుంది .
7-సరసభారతి ప్రత్యేక ప్రోత్సాహక నగదు పురస్కార ప్రదానం
విజయవాడ శారదా కాలేజి హైస్కూల్ లో పదవతరగతి ఉత్తీర్ణత సాధించి ,శారదా కాలేజిలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న పేద ,ప్రతిభగల విద్యార్ధిని –కుమారి గరిమెళ్ళ షణ్ముఖలలితా శ్రీ బాల కు – 5వేలరూపాయలు అంద జేయబడుతుంది .
సభ నిర్వహణ –శ్రీమతి మాది రాజు శివ లక్ష్మి ,సరసభారతి కార్యదర్శి
తెలుగులో మాట్లాడటం మన జన్మ హక్కు
–
ఆహ్వాని౦చు వారు
జోశ్యుల శ్యామలాదేవి మాదిరాజు శివలక్ష్మి గబ్బిటవెంకట రమణ గబ్బిట దుర్గా ప్రసాద్- సరసభారతి అధ్యక్షులు
గౌరవాధ్యక్షులు కార్యదర్శి కోశాధికారి సరసభారతి అధ్యక్షులు
ఉయ్యూరు -2-9-20- ఉయ్యూరు