గురూ -మనగురు ఢిల్లీ కి వెళ్లి స్వయం ప్రతి పత్తి ,పోలవరం నిధులను అడుగుతానని చెప్పి వెళ్ళాడు ఏమైంది బ్రూ
బ్రూ-చెప్పింది అదే కానీ అక్కడ వాళ్ళు పిలిపించారని ఎవరూ ప్రచారం చేయలేదు బ్రూ . ఇంతకీ అక్కడ ఏమైంది బ్రూ
గురు -అక్కడ షా క్లాసు పీకాడని ప్రచారం బాగా జరిగింది బ్రూ రెండ్రోజులూ కూడా
బ్రూ క్లాసేనా ఇంకా ఏమైనా ఉందా ?
గురు -అంతఃపుర రహస్యాలు బయట పడవు . క్లాస్ తో పాటు కాష్ కూడా పీకి ఉండవచ్చునని గిట్టని వాళ్ళ గోల బ్రూ .
బ్రూ -అవున్లే చాలా నెలలైంది కప్పం కట్టి అని చెవులు కొరుక్కుంటున్నారు
గురు -అదే అన్నీ కలిసొస్తాయనే యాత్ర .ఐతే ఏదీ సాధించకుండా తలకు నవరత్న తైలమర్దన షామ్ పూ తో తలంటి పంపారని మీడియా గగ్గోలు .అయినా ఇవన్నీ మామూలే బ్రూ .అందుకే మంగళవారం రాత్రి అంతా అసహనం తో ఊగిపోయినట్లు పత్రికాకథనం బ్రూ .
బ్రూ -అందుకే శ్రీవారి దర్శనం తో సకల దోష నివారణ కూడా జరిగి ఉంటుందని కమలీయుల ప్రచారం
ఇంతకీ డిక్లరేషన్ విషయం లో మీసాలు గడ్డాలూ దువ్విన సాములోర్లు ,కాషాయం వాళ్ళు ఏమీ చేయలేక పోయారేంటి బ్రూ
గురు -మొండివాడు రాజుకంటే బలవంతుడు అన్నారు కదా బ్రూ .ఎవరిపాపాన వాళ్ళు పోతారనే వైరాగ్యం అందర్నీ ఆవహించింది బ్రూ
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -24-9-20 -ఉయ్యూరు