మహా త్యాగి మద్దూరి అన్నపూర్ణయ్య-8
మహాత్ముడు పరవశించే అన్ని రంగాలలో అగ్రగామిగా ఉన్న సీతానగరం ఆశ్రమాన్ని విచ్చిన్నం చేయాలనే కుట్రతో ,దాన్ని చట్ట విరుద్ధంగా ప్రభుత్వం ప్రకటించగా , ,1932జనవరి 18న పోలీస్ సూపరింటే౦డెంట్ 400మంది రిజర్వు పోలీసులతో ఆశ్రమాన్ని ముట్టడించగా ,డిప్యూటీ ముస్తఫా ఆలీ సత్యాగ్రులపై క్రూరంగా వ్యవరించాడని ప్రతీతి .వచ్చీ రాగానే అలీ ఆశ్రమ వాసుల౦దర్నీన ఒకచోటకు చేర్చి ‘’This Ashram is declared as an un-law ful body by the government .You are therefore all requested to disperse immediatlely ‘’అన్నాడు .అన్నపూర్ణయ్య గారు గంభీరం గా ‘’The Ashram is our home .We live or die here .Therefore we cannot disperse ‘’అన్నారు .పోలీసులు అయిదు నిముషాల సేపు వారి తలలలపై నాట్యమాడారు .పూర్ణయ్య దీక్షితులు కృష్ణమూర్తి వెంకటప్పయ్య గార్ల తలలు పగిలి రక్తం కారింది .కృష్ణమూర్తి అన్నగారిని కాపాడేందుకు అన్నయ్య ను ఆలింగనం చేసుకొన్నాడు ఫలితంగా లాఠీ దెబ్బలతో స్పృహ కోల్పోయి ,ఆస్పత్రిలో రెండు నెలలు ఉండాల్సి వచ్చింది .
క్షతగాత్రులపై కన్నెత్తి కూడా చూడకుండా ఖాన్ ఆశ్రమ ఆస్తి ధ్వంసం చేయటం లో మునిగి పోయాడు .ఆశ్రమ వాసులతో పాటు అన్నపూర్ణయ్య గారికీ నాలుగేళ్ళు శిక్ష పడింది .1932ఫిబ్రవరి 1నుండి 1936ఫిబ్రవరి వరకు కడలూరు, వేలూరు ,రాజమండ్రి బళ్ళారి చిరుచినాపల్లి జిల్లాలో దువ్వూరి శిక్ష అనుభవించారు .పదేళ్ళు దేదీప్యమానం గా వెలిగిన ఆశ్రమం 1933చివరలో ముగింపు దశకు రాగా ,ఒక్కొక్కరే ఆశ్రమం వదలి వెళ్ళిపోయారు .
విడుదల కాగానే ముందు రాజమండ్రికే వచ్చి,లింగరాజు గారితో కలిసి మద్రాస్ లో ప్రకాశంగారి ‘స్వరాజ్య ‘’పత్రికలో చేరారు .ఉద్యమమ విరమించిన 10నెలలతర్వాత తాపీగా దువ్వూరి ని విడుదల చేశారు .ఆయన అరెస్ట్ కు హింసా వాదం కారణం కాకపోయినా అతి ప్రమాదకరమైన దేశ ద్రోహి అనే కారణం మోపారు .
జైలు జీవితం లో అన్నపూర్ణయ్య గారికి చిత్ర విచిత్రానుభావాలు కలిగాయి .రష్యా సోషలిం,మార్క్సిజం గురించి అవగాహన కలిగింది .1936 సెప్టెంబర్ 26,27తేదీలలో కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ రెండవ మహాసభలు రాజమండ్రి లో జరిగాయి .దువ్వూరి ప్రధాన కార్య దర్శి ,పుచ్చలపల్లిసు౦దరయ్య గారు సహాయ కార్య దర్శిగా ఎన్నికయ్యారు .జాతీయ కార్య దర్శి జయప్రకాష్ నారాయణ మద్దూరికి బాగా సన్నిహితులయ్యారు .ఆంద్ర పర్యటనలో ఆయన వెంట నే ఉన్నారు మద్దూరి .’’భారత దేశం లో సొషలిజాన్నిపూర్తిగా అర్ధం చేసుకొని భాష్యం చెప్పగల ఏకైక వ్యక్తి జయప్రకాష్ ‘’అని గాంధీ చేత ప్రశంసలు పొందారు జయప్రకాష్ .ఆయన రాసిన ‘’వై సోషలిజం ‘’పుస్తకాన్ని మద్దూరి సూచనపై మహీధర జగన్మోహనరావు ‘’సోషలిజం ఎందుకు “”పేరుతొ అనువాదం చేశాడు .దీనికి మద్దూరి వివరణాత్మక ముందు మాటలు రాశారు .జమీందారీల రద్దు,ప్రభుత్వానికీ రైతుకు మధ్య దళారీ లు పోవాలని వీరి ముఖ్యసిద్ధాంతం .గాంధీ అదేమీ కుదరదు అలా౦టి స్థితేవస్తే తానుకూడా పోరాటం చేస్తాను జమీందార్లు ధర్మకర్తలు అన్నాడు .ఈ విషయాలన్నీ పుస్తకం లో వివరం గా చర్చించారు లోక నాయక జయప్రకాష్ .దువ్వూరికి రష్యానేత లెనిన్ పై చాలా గౌరవం .’’జోహారు లందుకో మా జోదు లెనిన్ ‘’అనే గేయం కూడా రాశారు .జయప్రకాష్ ను ‘’ భారత లెనిన్’’అని కీర్తించారు దువ్వూరి .
కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి అన్నపూర్ణయ్య గారు పార్టీ నియమావళి1937మార్చిలో ప్రకటించారు .అందులో ముఖ్యమైనవి –కాంగ్రెస్ సభ్యులే సోషలిస్ట్ పార్టీ సభ్యులు ,మార్క్స్ సిద్ధాంతాలను అంగీకరించాలి .వర్గపోరాట శాస్త్రాన్నీ ,అభ్యాస విదుల్నీ తెలుసుకోవాలి.
అఖిలభారత కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ కార్యక్రమ ఆదర్శాలు –1-ఉత్పత్తి దారులైన జన సామాన్యానికి రాజ్యాధికారం అప్పగించాలి . 2-దేశ ఆర్దికాన్ని నియమిత పద్ధతుల్లో ప్రభుత్వమే నడుపుతూ అభి వృద్ధి చేయాలి 3 –ఉత్పతి,పంపకం, మారకం క్రమేణా సంఘపరం చేయాలి 4-ప్రభుత్వమే విదేశీ వ్యాపారం చేయాలి 5-సంస్థానాలు, జమీందారీ విధానం షరతులు లేకుండా రద్దు చేయాలి .6-సహకార పరపతి సంఘాలు నెలకొల్పాలి 7-రైతులకు మళ్ళీ భూమి పంచాలి .8-సహకార వ్యవసాయం ప్రోత్సహించాలి 9-కార్మిక కర్షకుల అప్పు రద్దు చెయ్యాలి 10-పని చేసే హక్కు గుర్తించాలి 11-శక్తికొద్దీ పని, అవసరం కొద్దీ ప్రతిఫలం సూత్రం అంగీకరించాలి 12-మేజర్లు అందరికీ వోటింగ్ హక్కు ఇవ్వాలి 13-కులమత పక్షపాత౦ లేకుండా ప్రభుత్వ పాలన సాగాలి 14-స్త్రీ ,పురుష భేదం ప్రభుత్వం పాటించ కూడదు 15-పబ్లిక్ డెట్ ఆఫ్ ఇండియా ను ఎగ వెయ్యాలి .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -22-10-20-ఉయ్యూరు