-
మహా త్యాగి మద్దూరి అన్నపూర్ణయ్య-12(చివరి భాగం )
1948లో సోషలిస్ట్ పార్టీ ఏర్పడినప్పుడు అన్న పూర్ణయ్య గారు ప్రధానకార్య దర్శిగా పార్టీ విస్తరణకు నిర్విరామ కృషి చేశారు .1952లో సోషలిస్ట్ లంతా కలిసి ప్రజా సోషలిస్ట్ పార్టీ పెట్టినప్పుడు బొంబాయిలో జరిగిన జనరల్ కౌన్సిల్ కు మద్దూరి హాజరైనా ,ఆ విలీనం ఆనయనకు నచ్చలేదు .ఆంధ్ర పార్టీలో ఆయనకు గౌరవస్థానం ఇవ్వలేదు.ఆయన క్రమ౦గా రాజకీయాలకు దూరమౌతున్నారు .ఆధ్యాత్మికత వైపు దృష్టి సారించి అవతార్ మెహర్ బాబా వైపు ఆకర్షి౦ప బడి 1953జులై10న ‘’వెలుగు ‘’వారపత్రిక ప్రారంభించి మొదటి సంచికలో ‘’అబద్ధం రాజ్యమేలుతోంది. ప్రేమ సత్యం దూరమయ్యాయి ‘’స్వతంత్ర భారత బానిసల్లారా లేవండోయ్ ‘’అని ప్రజల్ని మేల్కొల్పాల్సిన సమయం వచ్చింది .భుక్తి ముక్తి చూపిస్తుంది వెలుగు పత్రిక .సోషలిజంద్వారా భుక్తినీ నీలోని వెలుగు చూపించి మేల్కొల్పి ముక్తినీ కల్పిస్తుంది ‘’అని రాశారు జయప్రకాష ,ఆంధ్రకేసరి ఆశీర్వదించారు .ప్రజా సేవలో 33ఏళ్ళు గడిపి 1953డిసెంబర్ 2నుంచి తాను ఏ పార్టీకీ చెందని ప్రజా సేవకుడుగా మిగిలారు .మెహర్ బాబా కీర్తి వ్యాపించటానికి మద్దూరి చేసిన కృషి అద్వితీయం .1954ఫిబ్రవరి 20నుంచి 11రోజులు మెహర్ బాబా ఆంధ్రలో పర్యటించినప్పుడు మద్దూరి వెన్నంటి ఉండేవారు .ఆయనపై ప్రత్యేక సంచిక తెచ్చారు .సభలలో అప్పటికప్పుడు ఆంగ్లకవితలు రాసి చదివి బాబాకు సమర్పించేవారు .
ఏలూరులో బాబా అన్నపూర్ణయ్య గారి అల్లుడు ఇంట్లో కుటుంబం వారందర్నీ ఆశీర్వదించి పూర్ణయ్య గారితో అయిదు నిమిషాలు ప్రత్యేక ఏకాంత దర్శనమిచ్చారు .ఆంధ్రలో ఇలాంటి అవకాశం ఎవ్వరికీ దక్కలేదు .ఒక్క మద్దూరికే దక్కింది ఆ అదృష్టం .కళా వెంకటరావు ,పాలకొడేటి సూర్య ప్రకాశరావు మద్దూరిబుచ్చి వెంకయ్య ,మద్దూరి కృష్ణమూర్తి ,నరసింహ దేవర సత్యనారాయణ లను బాబా ఆశీర్వదించారు మద్దూరివారి ప్రత్యేక ఆహ్వానం తో వచ్చిన మహర్షి బులుసు సాంబమూర్తి గారిని బాబా ఆలింగనం చేసుకొని ప్రత్యేక ఆసనం పై కూర్చోబెట్టారు.
1954 వేసవి ఎండలకు మద్దూరి ఆరోగ్యం దెబ్బతిన్నది .రాజమండ్రిలో బావమరది కొల్లూరి కృష్ణ శాస్త్రి ఇంట్లో భోజనం చేస్తూ కాలం గడిపారు ఒక హోటల్ యజమాని మద్దూరికి ఉచితంగా భోజనం ఏర్పాటు చేశాడు .సెప్టెంబర్ లో ఏలూరు వెళ్ళారు అక్కడే సెరిబ్రల్ మలేరియా వచ్చి 1954 సెప్టెంబర్ 11న మహాత్యాగి మద్దూరి అన్నపూర్ణయ్యగారు 65వ ఏట మరణించారు మరణవార్త టెలిగ్రాం ద్వారా తెలుసుకొన్న మెహర్ బాబా ఆయన తనలో లీనమయ్యారని తెలియ జేశారు ఏలూరులోనే అంత్యక్రియలు నిర్వహించి చితాభస్మాన్ని రాజమండ్రి లో గోదావరిలో నిమజ్జనం చేశారు .
అన్న పూర్ణయ్య గారికి నివాళులర్పించిన నేతలు ఆయన త్యాగనిరతిని బహుదా ప్రశంసించారు .మధు దండావతే -,’’విలువలు పునరుద్ధరించిన నేత మద్దూరి .ఆయనజీవితం యువతకు స్పూర్తి ‘’వావిలాల-‘’వేలూరు జైలులో ఆయనతో గడిపి ఎన్నో విషయాలు నేర్చుకొన్నాను .సర్దార్ గౌతు లచ్చన్న-న్యాయానికి నిలబడే శక్తి ప్రజల్లో కల్గించాడు ‘’.నండూరి ప్రసాదరావు ‘’నిస్వార్ధ సేవకుడు కూతురు స్కూలుఫీజు కూడా చెల్లించలేని స్థితిలో ఉండేవాడు ‘’.నార్ల-‘’ఆయన నాగురువు .నా మొదటి రచన ను కాంగ్రెస్ పత్రికలో ప్రచురించి ప్రోత్సహించారు .’తులసి గంగాధరరావు –‘’క్వారీ వర్కర్స్ సభకు ఆహ్వానించి రమ్మంటే యెంత సేపు చూసినా రాకపోతే నేను అడిగితే ‘’రావటానికి రిక్షా బాడుగ డబ్బులు లేవు .’’అన్నారు మీ డబ్బు ఏం చేశారు అని అడిగితె ‘’భూపతి కోటేశ్వరరావు కు కొంత ,ప్రెస్ కు కొంత,ఎవరెవరో వచ్చి అడిగితె వారికీ ఇచ్చి భోజనం లేకుండా ఉండిపోయాను ‘’అని చెప్పిన మహాత్యాగి ‘’శ్రీమతి రాజ్యం సిన్హా ‘’కృష్ణాజిల్లా ముడునూరులో ఉండే మా నాన్న అన్నే అంజయ్య గారు వీరూ ,నేతాజీ శిష్యులు .వక్త రచయితా ఉద్యమనిర్మాత మద్దూరి ‘’, ‘భాట్టం శ్రీరామమూర్తి –‘’ఆయన నా గురువు అనిచెప్పి గర్వపడుతున్నాను .మా వర్ణాంతర వివాహం దగ్గరుండి జరిపించిన విశాల హృదయుడు ‘’,మద్దూరి జయరాం ‘’మా తండ్రిగారికి స్థిర చరాస్తులు లేవు .ప్రభుత్వం ఇచ్చే ఐదు ఎకరాల భూమికంటే అభిమానులు సన్మానించి ఇచ్చిన రెండు రూపాయలే గొప్ప గా భావించేవారు .చనిపోవటానికి ఏడాదిముందు నన్ను యూనివర్సిటీలో చేర్పించారు నాన్న ‘’
అన్నపూర్ణయ్యగారు నడిపిన పత్రికలు -ననవ శక్తి, జయ భారత్ ,వెలుగు ,
సమాప్తం
ఆధారం –శ్రీ రావినూతల శ్రీరాములు రాసిన ‘’మహాత్యాగి మద్దూరి అన్న పూర్ణయ్య జీవిత చరిత్ర ‘’
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -30-10-20-ఉయ్యూరు
వీక్షకులు
- 1,009,497 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- గీర్వాణ కవుల కవితా గీర్వాణ0.3 వ భాగం.3.6.23
- అనేక మలుపులు తిరిగి గమ్యస్థానం చేరిన ‘’అనుకోని ప్రయాణం ‘’.
- గ్రంథాలయోద్యమ పితా మహ శ్రీ అయ్యంకీ వెంకట రమణయ్య గారు.3 వ భాగం.3.6.23.
- మురారి అన ర్ఘ రాఘవం.6 వ భాగం.3.6.23.
- గీర్వాణ కవుల కవితా గీర్వాణ0.2 వ భాగం.2.6.23.
- గ్రంథాలయోద్యమ పితామహ శ్రీ అయ్యంకి వెంకట రమణ య్య గారు.1 వ భాగం.1.6.23.
- మురారి అన ర్ఘ రాఘవం.4v వ భాగం.1.6.23.
- గీర్వాణ కవుల కవితా గీర్వాణ0 .1 వ భాగం.1.6.23.
- డా.ఉప్పలధడియం మొలిపించిన హైకూ’’ విత్తనం’’
- గ్రంథాలయోద్యమ పితామహ శ్రీ అయ్యంకి వెంకట రమణ య్య గారు.1 వ భాగం.1.6.23.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (77)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (8)
- నా దారి తీరు (135)
- నేను చూసినవ ప్రదేశాలు (107)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (2,978)
- సమీక్ష (1,333)
- ప్రవచనం (11)
- ఫేస్బుక్ (505)
- మహానుభావులు (346)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (1,077)
- రాజకీయం (65)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (334)
- సమయం – సందర్భం (844)
- సమీక్ష (25)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (516)
- సినిమా (376)
- సేకరణలు (315)
- సైన్స్ (46)
- English (6)
ఊసుల గూడు