ధ్వన్యాలోక ఆంధ్రీకరణ కర్త -శ్రీ పంతుల లక్ష్మీనారాయణ శాస్త్రి
కొందరు కవులు, పండితులు ఎన్ని గొప్ప రచనలు చేసినా ,వారిని గుర్తించే వారు ఆకాలం లో ఉండేవారే కానీ తర్వాత కాలం లో వారి గురించి ఆలోచించే వారు కరువైపోతున్నారు .అలాంటి మహా కవి పండితులలో శ్రీ పంతుల లక్ష్మీ నారాయణ శాస్త్రి గారు ఒకరు .వారు అభినవ గుప్తుని ధ్వన్యాలోకాన్ని తెలుగులో ఆనువదించారు .ఈశా వాస్యోపనిషత్ ,కఠ ఉప నిషత్ లను పద్యాలుగా సులభ శైలిలో ఆంధ్రీకరించిన ప్రతిభా శాలి .వీరు కవి శేఖర ,సాహిత్య విద్యా ప్రవీణ ,ఉభయ భాషా ప్రవీణులు .వేదాంత విమర్శన విశారద బిరుదాంకితులు.విజయనగరం లో ప్రభుత్వ మహారాజా సంస్కృత కళాశాల లో ఆంద్ర భాష ప్రధాన ఆచార్యులు .పై మూడు గ్రంధాలు మాత్రమేకాక కావ్య కంఠముని రచించిన ఉమా సహస్రం కు పద్యానువాదం ప్రభా వ్యాఖ్యా వివరణం కూడా రాశారు .’’అంజలి ‘’అనే శ్రీ రమణ మహర్షికి అంజలి ఘటించే పద్యాలు రాశారు .’’భామతి ‘’అనే స్వతంత్ర నవ్య కావ్యం రాశారు
పంతుల వారి విద్యావైదుష్యాన్ని గురించి మహా రాజా ప్రభుత్వ సంస్కృత కళాశాల అధ్యాపకులు ,న్యాయ విశారద న్యాయ సుధానిధి ,న్యాయ మీమాంసాలంకార విద్యా ప్రవీణ శ్రీ కొల్లూరి లక్ష్మణ మూర్తి శర్మ అద్భుతం గా ,కొని యాడారు .ఆయన మాటల్లోనే ‘’పంతులు గారు బాల్యం నుంచే కవిత్వం అలవడిన అదృష్ట శాలి .సంగీతం వీరి సాహిత్యానికి మెరుగులు దిద్దింది .అతి కష్ట సాధ్యాలైన ఉపనిషత్తులను,శాస్త్ర గ్రంధాలను సులభ శైలిలో ఆంధ్రీకరించటం వీరి పాండిత్య ప్రకర్షకు ,శాస్త్ర విజ్ఞానానికి గీటు రాయిగా ఉంది .అధ్యాపక వృత్తి కొనసాగిస్తూ ,ఇంతటి ఉత్కృష్ట రచనలు చేయటం వీరి దైవోపాసనా శక్తిని చాటుతోంది .’’భారతీయ సంస్కృతియే పున రుద్ధరణమే ప్రతి భారతీయుని కర్తవ్యమ్ ‘’అని ఎలుగెత్తి చాటే మహాత్ముల మాటలను వృధా పోనీకుండా ,సంస్కృత భాషలోని అనర్ఘ రత్నాలను తెలుగు భాషలోకి తీసుకు రావాలంటే సంస్కృత పండితులకే సాధ్యం అని,ఆ సమయం ఆసన్నమైందని ఎరిగిన ‘’క్రాంత దర్శి’’ శ్రీ లక్ష్మీ నారాయణ శాస్త్రి .మహాకావ్యాలు ప్రవృత్తి,నివృత్తి దాయకాలు .సహజీవనం ,విశ్వ సౌభ్రాతృత్వం వీటిలో ఉన్నాయి ధ్వని యొక్క వాదాన్ని శంకించే వారి వాదాలన్నిటికి స్వస్తి చెప్పి ‘’ధ్వని ని కావ్యాత్మ’’ గానిరూపించిన సహృదయ విద్వ దగ్రేసరుడు శ్రీమదానంద వర్ధన అభినవ గుప్తపాదుడు . అందుకే కావ్యాలు రాయాలన్నా ,మహా కావ్యాలు చదివి అనుభూతి చెందాలన్నా ఆయన రాసిన ‘’ధ్వన్యా లోకం ‘’ దానికి ‘’లోచనం’’ అనే వ్యాఖ్య అత్యంత ముఖ్యమైనవి . భగీరధుడు ఆకాశ గంగను హిమవత్పర్వత ద్వారంగా భారతావనిలో ప్రవేశింప జేసినట్లు శ్రీ శాస్త్రి గారు ప్రభా మతి చేత’’ ధ్వనిని’’ నాక లోకం నుంచి ‘’గుప్త లోచనోన్మీలన’’ద్వారా సహృదయ హృదయాలలో ప్రవేశింప జేశారు .పండితులకు మాత్రమె సాధ్యమయ్యే ‘’కర్కశ గ్రంధులను’’కూడా వీరి ‘’ప్రభా మతి’’సర్వజన సువిజ్ఞేయం చేసింది .ఈ ఆంధ్రీకరణం తెలుగు వారి వాకిట బంగారు తోరణం .ప్రవేశించి నవారికి అంతా కొంగు బంగారమే .శాస్త్రి గారి పద్య ,వచనాలు రెండూ మధుర కోమల ప్రసన్న కాంతి లలితాలే ‘’
స్వామి శివ శంకర స్వామి వేటపాలెం తీర్దాశ్రమం నుంచి శాస్త్రి గారి ఈశావాస్యోపనిషత్ ‘’ఆంధ్రీకరణం చదివి తమ అమూల్యాభిప్రాయం గా ‘’సామాన్య జ్ఞానం కలవారికి సక్రమ మార్గం లో ఉపనిషత్ సారం గ్రహించాలంటే మంచి అనువాదం తప్పని సరి .ఈ ఉపనిషత్ కు తెలుగులో చాలా అనువాదాలున్నాయి .కానీ శాస్త్రిగారు శంకర భాష్యాన్ని అనువదించటమే కాక ,ఇతర మతాచార్యుల భాష్యాలలోని ముఖ్య విషయాలను కూడా తేట తెల్లంగా చెప్పారు .టీకా కారుల వివరణ కూడా పొందు పరచారు .మూలానికి పదవిభాగ ,టీకా తాత్పర్యాలు సులభ శైలిలో రాశారు .సాహితీ సమితి సభ్యులవటం వలన స్వమతాన్ని కూడా ధైర్యంగా చెప్పారు .త్రిమతా చార్యుల తత్వాన్ని కూడా తెలియ జేశారు .గురువుల వద్ద వివిధ శాస్త్రాలు నేర్చిన శాస్త్రిగారు వేదవేదాంత అలంకార సంగీత శాస్త్రాలనూ క్షుణ్ణంగా మధించారు .కావ్య రచన లతో పాటు ,గేయ కావ్యాలూ రాశారు .లోచనాది వ్యాఖ్యాన సమన్విత ‘’ప్రభా మతి సహితంగా ‘’ధ్వన్యాలోకాన్ని ‘’పద్య గద్యాత్మకంగా అనితర సాధ్యంగా శాస్త్రి గారు ఆంధ్రీకరించారు .వేదాంత డిండిమం’’మొదలైన వాటిని గేయాత్మకంగా తెలుగు చేశారు.’’భామతి ‘’మొదలైన స్వతంత్ర పద్యకావ్యాలనూ మహా ప్రజ్ఞతో రాశారు ‘’అని శ్లాఘించారు .ఇది 24-9-1944లో ప్రధమ ముద్రణ ,30-6-1959లో ద్వితీయ ముద్రణ పొందింది .
శాస్త్రి గారి ‘’ఆంద్ర కాఠకోపనిషత్ ‘’ను ప్రస్తుతిస్తూ విజయనగారసంస్కృత కాలేజి వ్యాకరణ ,అలంకార శాస్త్ర ఉపన్యాసకులు శ్రీ నౌడూరు వేంకట శాస్త్రి ‘’అర్ధ జ్ఞానం తో ఈ ఉపని షత్తును అధ్యయనం చేసి శాస్త్రి గారు ‘’అన్యూన్యాతిరిక్తం గా ఆంధ్రీకరించటం అభినందనీయం ‘’అన్నారు ‘’.The present translation has rendered the original into Telugu and it reads well ‘’అని కీర్తించారు మహారాజా కాలేజి ప్రొఫెసర్ కె.రంగా చారి .విజయనగర ప్రభుత్వ సంస్కృత కాలేజి ప్రధాన ఆంద్ర పండితులు శ్రీ ఆకొండి రామ మూర్తి ‘’శాస్త్రి గారు నాకు బంధువు చిరపరిచితులు కూడా .శాస్త్రి గారు నాకు ఈ అనువాదాన్ని మా ఇంట్లో నాకు చదివి వినిపించారు .అందులోని అమూల్య విషయాలను ఆస్వాదిస్తూ ,ఆకవితామృత రసాస్వాదనను మహా పార వశ్యంగా విన్నాను .ఎక్కడా దోషం కనిపించలేదు .మహా వృద్ధ పండితులు మాత్రమే చేయదగిన సాహస కార్యాన్ని శాస్త్రిగారు అలవోకగా ,అసాధారణంగా ,నిర్దుష్టంగా ఆంధ్రీకరింఛి నందుకు మనసారా అభి నందిస్తున్నాను .ప్రిన్సిపాల్ శ్రీ రామానుజ స్వామి ‘’shastri is proficient in Sanskrit and Telugu .The trans lation gives a good coception of the teaching of SHANKARA .This book alone serve the purpose of enrichingthe Telugu language .Lakshmi Narayana has to be congratu lated on making a real contribution to the Telugu literature and earning the gratituseof Telugu people .’’అన్నారు .ఈ పుస్తకం 1-9-1953న ప్రచురితం .
గ్రంధ కర్త శాస్త్రిగారు తమ గురు వరేణ్యులు బ్రహ్మశ్రీ అప్పల్ల జోగన్న శాస్త్రి గారికి నిండుమనసుతో కృతజ్ఞతలు చెప్పుకొన్నారు .అమూల్యాభిప్రాయం తెలిపిన శ్రీ కిళాంబి రంగా చార్యుల గారికి ,ముద్రణ ఖర్చును భరించిన శ్రీ జ్ఞానేద్రాశ్రమానికి ,శ్రీ జ్ఞానానంద రామానందుల వారికి సవినయం కృతజ్ఞతలు ప్రకటించారు .ఈ గ్రంధం 1-5-1935లో ప్రచురితమైనది .
ధన త్రయోదశి శుభా కాంక్షలతో
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -13-11-20
—