కౌముదీ శరదాగమన కర్త –శ్రీ అప్పల్ల జోగన్న శాస్త్రి
వ్యాకరణాచార్య,వ్యాకరణాలంకార విద్యా ప్రవీణ ,శ్రీ విజయనగర మహారాజ సంస్కృత కళాశాల వ్యాకరణాలంకార శాస్త్రో పాద్యాయులు శ్రీ అప్పల్ల జోగన్న శాస్త్రి గారు 1942లో జయాపుర సంస్థానానాధీశ్వరులు ,కళా ప్రపూర్ణ ,సాహిత్య సామ్రాట్ ,డి.లిట్ శ్రీ మహారాజా విక్రమ దేవ వర్మగారి సమాదరణం తో’’ కౌముదీ శరదాగమనం ‘’రచించి ప్రచురించారు .ఈ మహాగ్రందాన్ని పరిచయం చేస్తూ మహారాజా కాలేజి ప్రిన్సిపాల్ శ్రీ రామానుజస్వామి ‘’భట్టోజీ దీక్షితుని సిద్ధాంత కౌముది కి తెలుగు అనువాదం వ్యాఖ్యానం రాసిన జోగన్న శాస్త్రి గారి పుస్తకానికిముందు మాటలు రాసే అవాశం కల్పించారు .శాస్త్రిగారు ఈ కాలేజీలోనే చదివి ,మద్రాస్ యూని వర్సిటి నుంచి వ్యాకరణం ప్రత్యేక అంశం గా శిరోమణి పొందారు.ఆంద్ర విశ్వ విద్యాలయం నుంచి సాహిత్య, అలంకార స్పెషల్ సబ్జెక్ట్ లలో విద్యా ప్రవీణ అయ్యారు .విద్యా వ్యాసంగం పూర్తయ్యాక శాస్త్రి గారు మాతృ విద్య సంస్థలోనే వ్యాకరణ పండితులుగా నియమింపబడి ఎందరో విద్యార్ధులకు వ్యాకరణం కరతలామలకం చేశారు .వ్యాకరణం ను చాలా ఇష్టంగా దాదాపు పావు శతాబ్దం పాటు బోధించిన అనుభవం వారిది .కనుక జోగన్న శాస్త్రి గారుసిద్ధాంత కౌముది పై వ్యాఖ్య రాయటానికి సర్వ విధాలా అర్హులే .సంస్కృత వ్యాకరణం అంటే వ్యాకరణం మాత్రమే కాక ,ఫైలాలజి, ఫిలాసఫీ కూడా కలిపి ఉండే మహాద్భుతం .పాణిని వ్యాకరణ సిద్ధాంతాలను సులభతరం చేయటానికి చాలామంది ప్రయత్నించినా ,భట్టోజీ దీక్షితుని సిద్ధాంత కౌముది అన్నిటికంటే మిన్న .దాదాపు ఒకటిన్నర శతాబ్దాలుగా వ్యాకరణం లో అనుభవం సాధించటానికి సిద్ధాంత కౌముది మాత్రమె కరదీపికగా ముందు ఉంది .కనుక దీనిపై కొత్తగా వ్యాఖ్యానం రాయాల్సిన అవసరం ఉందని గ్రహించి దానికి పూనుకొన్నారు శాస్త్రి గారు .’’I trust many scholors will follow his foot steps and augment in Telugu literature in various ways .His attempt is laudable ‘’ అని ఆంగ్లం లో ప్రశంసించారు .
మద్రాస్ యూని వర్సిటి తెలుగు హెడ్ శ్రీ కోరాడ రామకృష్ణయ్య ‘’తెలుగులోని వ్యాకరణ పుస్తకాలన్నీ పాణినీయం ను అనుసరించి రాసినవే .’’In order to master the grammatical principles of their own language shastri ‘s SHARADAgaMANA ‘’Supply a long felt necessity ‘’ఇలాంటి సాంకేతిక పుస్తకాలు తెలుగులో రాయటం,ప్రచురించటం అత్యంత సాహసంతో కూడిన పని దాన్ని సుసాధ్యం చేసిన జగ్గన్న శాస్త్రి అభినందనీయులు ‘’అన్నారు ఆంగ్లం లో .
చిట్టి గూడూరు నారసింహ సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ మత్తిరుమల గుదిమెళ్ళ వరదాచార్యులవారు (ఎస్టిజి వరదాచార్యులు )’’దుర్బోధకమైన కౌముదిని విద్యార్ధులకు కరతలామలకం గా రాసిన శాస్త్రిగారు అభినందనీయులు ‘’అన్నారు .ఆంద్ర యూనివర్సిటి తెలుగు లెక్చరర్ విద్వాన్ గంటి జోగి సోమయాజులు ‘’ఈకాలం లో ఇలాంటి గ్రంధం రావటం చాలా సంతోషంగా ఉంది .ఆంద్ర భాష అధ్యేతలకు ఇది గొప్ప సహాయకారి’’అన్నారు .కళాప్రపూర్ణ ,శాస్త్ర రత్నాకర ,మహారాజా సంస్కృత కళాశాల హెడ్ పండిట్ బ్రహ్మశ్రీ తాతా సుబ్బారాయ శాస్త్రి ‘’దీక్షిత సిద్ధాంతాలను అవగతం చేసుకొనే వారి అరచేతిలో మాణిక్యం ఇది .విశ్వ విద్యాలయ పరీక్షలలలో సాహిత్య విద్యా ప్రవీణ ,వ్యాకరణ విద్యా ప్రవీణ కక్ష్యలవారు దీని ద్వారా కౌముదిని తేలిగ్గా వంటపట్టించు కోగలుగుతారు ‘’అని మెచ్చారు .మహామహోపాధ్యాయ ,కళాప్రపూర్ణ ,కవిరాజ, కవి సార్వభౌమ ,ఆంద్ర వ్యాస ,అభినవ శ్రీనాధ శ్రీ శ్రీపాద కృష్ణ మూర్తి శాస్త్రి ‘’ఇంతవరకు ఎవరూ ఇలాంటి ప్రయత్నం చేయలేదు ,శాస్త్రిగారుసుబోధకం గా రాశారు .మిగిలిన భాగాలు కూడా త్వరలోనే పూర్తి చేస్తారని భావిస్తాను ‘’అని ఆశీర్వదించారు .ఆంద్ర యూని వర్సిటి విశ్రాంత ఆంద్ర ఉపన్యాసకులు శ్రీ వఝల చిన సీతారామ శాస్త్రి ‘’ఆంద్ర భాషలో తత్సమ భాగం ఎక్కువ అవటం ,తెలుగు వ్యాకరణాలు పాణిని సంప్రదాయం లోనే ఉండటం వలన సిద్ధాంత కౌముది విషయాలను సులభతరంగా తెలియ జేయటం వలన శాస్త్రి గారి రచన పరమ ప్రామాణికం గా ఉంది ‘’అని కితాబిచ్చారు .
విజయనగర మహారాజ సంస్కృత కాలేజి సంస్కృత ఉపాధ్యాయుడు శ్రీ ఘండి కోట సుబ్రహ్మణ్య శాస్త్రి ‘’గ్రంధ నిర్మాణమే కాక శాస్త్రిగారు సౌజన్య,సౌశీల్యాది గుణ సంపన్నులు .ఈ రచన నిరుపమానం .సంస్కృత భాషలోసర్వజ్ఞ శ్రీ మాధవాచార్యుల వ్యాఖ్యాన శైలి ఇందులో ఉన్నది .మాధవాచార్యులు ఏది రాసినా గురువు అవసరం లేనట్లే శాస్త్రి గారి ఈ రచన కూడా దానికి దీటుగా ఉంది ‘’అని మనస్పూర్తిగా మెచ్చుకొన్నారు .
శ్రీ జగ్గన్న శాస్త్రి గారు తన అభిప్రయాన్ని ఇలా చెప్పారు ‘’శాబ్దిక సార్వ భౌముడు భట్టో జీ దీక్షితులు పాణినీయ వ్యాకరణ పాల సముద్రాన్నితన ‘’ప్రతిభా మందరం’’ చేత మదించి సారాన్ని ‘’వ్యాకరణ సిద్ధాంత కౌముదిగా రాశాడు .దీనికి ముందు కాశిక మొదలైనవి లోకం లోప్రచారం లో ఉన్నాయి .వాటిలో ప్రకరణ విభాగాలు లేకపోవటం తో అర్ధం చేసుకోవటం కష్టంగా ఉండేది .వీటికి భిన్నంగా కౌముది సునాయాసంగా అర్ధమయేట్లు ఉంది .ఇది వ్యాకరణ జ్ఞానం కావాలనుకొనే వారు తప్పక చదవాలిసిన గ్రంధం .విద్యా ప్రవీణ శిరోమణి భాషా ప్రవీణ విద్వాన్ ,ఎంఏ పరీక్షలకు ,ప్రభుత్వ ఎంట్రన్స్ పరీక్షలకు పాఠ్య గ్రంథం గా ఉన్నది .అందుకని అన్నిభాషలలోకిఅనువాదం పొందింది .మహా రాజా విక్రమ దేవ వర్మగారు నన్ను దాన్ని తెలుగులో రాసి విద్యార్ధులకు ఉపయుక్తం చేయమని కోరగా రాశాను .నాగ్రంధముపై అమోల్యా భిప్రాయాలు అందించిన విద్వత్ వరేణ్యులకు ,ముద్రణ చేయించిన రాజావారికి కృతజ్ఞుడను ‘’అని వినయంగా శాస్త్రి గారు చెప్పారు .
గ్రంధాది లో సంస్కృత శ్లోకాలు శ్రీ మేధా దక్షిణా మూర్తి కి ముందుగా సమర్పించి ,తర్వాత గురువు నౌడూరు వేంకట శాస్త్రి గారిని స్మరించారు .తర్వాత శ్రీ తాతాసుబ్బారాయ శాస్త్రి గారిని ప్రస్తుతించారు .తర్వాత తల్లి, తండ్రి అయిన వెంకమాంబ ,సోమేశ శాస్త్రి గార లకు వందన సమర్పణ చేశారు .’’ అప్పల్ల వంశ జలధి సోమం సోమేశ శాస్త్రిణ౦-వే౦క మార్ధాంగ రుచిం వందే మత్పితరం సదా ‘’ ఆ పిమ్మట విక్రమ దేవవర్మ మొదలైన వారికి కృతజ్ఞతలు చెప్పుకొన్నారు .’’జోగన్న శాస్త్ర్యభి జ్ఞాత నామా రాజేశ్వరీ ప్రియః –పాణిన్యాది మునీన్నత్వా శబ్ద శాస్త్ర ప్రవరకాం ‘’అని తన సంగతి చెప్పి పాణిన్యాదులకు నమస్కరించారు .చివరగా –
‘’శబ్ద శాస్త్ర వివిత్సూనాం కుర్వేహ ముపకారకం –వైయాకరణ సిద్ధాంత కౌముదీ శరదాగమం ‘’
‘’పద క్లేశ మహా మేఘైశ్చన్నేయం దైక్షితీ కృతిహి- చకాస్తు కౌముదీ దానీం శరదాగమ సంగతాః’’
ఇంతకంటే శాస్త్రిగారి జీవిత విశేషాలు అందు బాటులో లేవు .ఇందులో సంజ్ఞాప్రత్యయ ప్రకరణం నుంచి స్త్రీ ప్రత్యయ ప్రకరణం వరకు 14ప్రకరణాలు 534శ్లోకాలో ఉన్నాయి .
దీపావళి శుభా కాంక్షలతో
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -14-11-20-ఉయ్యూ