సంస్కృత పండితులు శ్రీ దోర్బల విశ్వనాథ శర్మ గారు అస్తమయం !
ప్రముఖసంస్కృతాంధ్రవిద్వత్కవి, మహామహోపాధ్యాయ శ్రీ దోర్బల విశ్వనాథశర్మ గారు అనారోగ్యంతో నిన్న రాత్రి 1.30 గంటలకు హైదరాబాదులో పరమపదించారు. వారి వయస్సు 90 సంవత్సరాలు. వీరు ప్రముఖ సంస్కృత పండితులు శ్రీ దోర్బల ప్రభాకర శర్మ గారికి సహోదరులు. 1931 లో అప్పటి మెదక్ జిల్లా రామాయంపేటలో జన్మించిన శర్మ గారు సంస్కృతాంధ్రభాషలలో అపారపాండిత్యాన్ని సంపాదించి లబ్ధప్రతిష్ఠులయ్యారు. ఆయన రచించిన ‘శ్రీలాలిత్యం’ అశేషపాఠకాభిమానులను అలరించింది.సంస్కృతాంధ్రభాషలలో శతకాలూ,కావ్యాలూ,వ్యాఖ్యానాలూ శతాధికంగా రచించి ఉభయభాషలలోనూ అపారకీర్తిని గడించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరుపున విశిష్ట సేవాపురస్కారంతో ముఖ్యమంత్రి చేతుల మీదుగా సత్కారాన్ని అందుకున్నారు. అనేక జాతీయ స్థాయి రాష్ట్రస్థాయి పురస్కారాలను, సత్కారాలను పొందారు—-అప్పల శ్యాం ప్రణీత శర్మ గారు ఫేస్ బుక్ లో పెట్టిన వార్త