విదేశీ సంస్కృత విద్వాంసులు
46-విదేశాలలో సంస్క్రుతాధ్యయనం
9-పోలాండ్ దేశం
ప్రొఫెసర్ ఇ.స్టుడ్ కీ విజ్ పోలాండ్ లోని అతిపెద్దదైన వార్సా యూని వర్సిటిలో సంస్కృత బోధన పుస్తకం రాశాడు .ఎ.లోగోవి స్కి ఇప్పటికీ బోధిస్తున్నాడు .ఆర్టూర్ కార్ప్ సంస్క్రుతపాలీ భాషల ను నేర్పుతున్నాడు .ప్రొఫెసర్ ఎం కె.బిరిస్కి,తాను ఇండియాలోని బెనారస్ యూని వర్సిటిలో చదివి నేర్చిన సంస్కృత నాటకాలు భగవద్గీత సంప్రదాయ విధానం లో బోధిస్తున్నాడు .క్రాకౌ లో సంస్కృత అధ్యయనం ఆగిపోతే ,పారిస్ లో సంస్కృత శిక్షణ పొందిన విలియం గ్రా బౌస్కా శతపద బ్రాహ్మణం అధ్యయనం చేసింది .కొన్నళ్ళ అంతరాయం తర్వాత 1973లో ఇండియన్ స్టడీస్ శాఖ ఏర్పడి ప్రోఫెసర్ పోబో గ్నైక్ ,ఆయన శిష్యుడు జేఎల్ జాక్ కలిసి సంస్క్రుతతరగతులు నిర్వహించారు .బ్రేస్లావ్ అనే వ్రోక్లా లో రెండవ ప్రపంచ యుద్ధానికి పూర్వం ఇండియన్ స్టడీస్ ప్రొఫెసర్ ఎల్ స్కుర్జుక్ అనే జర్మని స్కాలర్ ఆధ్వర్యం లో బాగానే జరిగాయి .తర్వాత వోల్కొవ్ స్కా భారతీయ వివాహ వ్యవస్థలో సంస్కరణలు రాసిప్రసిద్ధి చెంది ,ప్రొఫెసర్ జే .సాక్సే కు సంస్కృతం నేర్పి ,గురువు రిటైర్ అయ్యాక సంస్కృత టీచర్ అయింది .ఆతర్వాత వార్స్లా, క్రాకౌ యూనివర్సిటీలలో సంస్కృత ప్రొఫెసర్లు లేరు .కాని వియన్నా నుండి ఒబెర్ హామార్ క్రకౌ కు వచ్చి వెడుతూ సంస్కృతం నేర్పాడు .
వార్సాలో యువ విద్యార్ధి, బౌద్ధం పై స్పెషలిస్ట్ ఎం. మేజర్ సౌత్ ఏషియన్ డిపార్ట్ మెంట్ హెడ్ అయ్యాడు .ఇతడు వసుబంధుని ’’ ప్రతిత్య సంపుత్పాద ‘’ ను వెలుగులోకి తెచ్చాడు .క్షేమేంద్రుని ‘’బోధి సత్వ వధాన కల్పలత ‘’అభి ధర్మ కోశ లకు పోలిష్ అనువాదం తెచ్చాడు .బాల్సేరోవిజ్ ,వేజ్లేర్ లుకలిసి మాగజైన్ నడిపారు .ట్రై కోస్కా –శిశుపాలవధ మీద సాధికారత సాధించి ప్రసంగాలు చేశాడు .బిరిస్కి సంప్రదాయ విధానం లో గీత బోధించింది .భారతం లోని మోక్షధర్మ పర్వం ,మనుస్మృతి బాగా అధ్యయనం చేసింది .ఋగ్వేదం లోని కాస్మాలజిని వివరించింది .ప్రపంచం అగ్నియొక్క రూప విక్రియవలన ఏర్పడిందని చెప్పింది .క్రాకౌ యూని వర్సిటిలో డా.ఎల్ సుడిక సంస్కృత సాహిత్యం నేర్చింది .యూరోపియన్ సంస్కృతిపై భారతీయ సంస్కృతీ ప్రభావం పై రాసింది .డా మార్లేవిజ్ సంస్కృత వ్యాకరణం బోధించింది .వేదాంతం పై రిసెర్చ్ చేయించింది .డా ఏం జెర్నేయిక్ జాతకర్మపై ,గృహ్య సూత్రాలపై పరిశోధన చేసింది .డా గలేవిజ్ ,రుక్, అధర్వణ వేద మంత్రాలకు పోలిష్ అనువాదం చేసింది .ఫిలాసఫీ శాఖకు చెందిన డా కుడేల్ స్కా- గీత, ఉపనిషత్తులను పోలిష్ లోకి అనువాదం చేశారు .ఐ.కానియ భర్తృహరి శతకత్రయానికి పోలిష్ అనువాదం చేశాడు .వార్స్లా వర్సిటిలో జే సాచ్ సే సాంస్క్రిట్ భాష ,చరిత్ర గీత ,భారతం ల పై పరిశోధన చేసింది పంచతంత్రం పై పరిశోధించింది .పోజ్ఞాల్ యూని వర్సిటి లో బి .కోయి సంస్కృతం బోధిస్తున్నాడు .పురాణాలపై శోదిస్తున్నాడు . ఈ దేశం లో గురు పరంపరను గౌరవిస్తున్నారు .పోలిష్ పిల్లలు తండ్రిని’’తాత’’అంటూ ఆప్యాయంగా సంస్కృత విధానం లో పలకరిస్తూ అందరికీ ఆదర్శంగా ఉన్నారు ..
10-ధాయ్ లాండ్ దేశం
చాలా ఏళ్ళ క్రిందటి నుంచి ధాయ్ లాండ్ లో సంస్కృత అధ్యయనం జరుగుతోంది .రాజకుటుంబాలు సంస్కృతాన్ని బాగా పోషించి ప్రోత్సహించాయి .శిల్ప కోరం యూని వర్సిటి ,చూల లోన్గో కార్న యూని వర్సిటి ,మహాచూల లోంగ కొరాన్ రాజ విద్యాలయ లలావుసంస్కృత బోధనా జరుగుతోంది .శిల్పకోరం వర్సిటీలో దాదాపు యాభై ఏళ్ళనుండి సంస్కృత బోధన జరుగుతోంది .ఆర్కియాలజిలో బాచిలర్ డిగ్రీవరకు సంస్కృతం ఉంటుంది .ఇక్కడ 1974లో ఓరియ౦టల్ లాంగ్వేజెస్ డిపార్ట్ మెంట్ ఏర్పడి ఎపిగ్రఫీ ,ఓరియ౦టల్ లాంగ్వేజెస్ లోనూ లో మాస్టర్ డిగ్రీలో సంస్కృతం ప్రవేశ పెట్టారు .1976నుంచి ఇప్పటికి 180మంది సంస్కృతం లో ఎం .ఏ .సాధించారు .1997 స్టడీ సెంటర్ ఏర్పడి రిసెర్చ్ కి అవకాశం కలిగింది .దీని డైరెక్టర్ డా .చిరాపట్ ప్రపంద్వీయ .లైబ్రరి కంప్యూటర్ ఆఫీస్ వగైరా సౌకర్యాలు కల్పించారు .2001 మే లో అ౦తర్జాతీయ సంస్కృత సదస్సు నిర్వహించారు . భారత దేశం ఇక్కడ విజిటింగ్ ప్రొఫెసర్ పోస్ట్ ఏర్పాటు చేసి బాగా ప్రోత్సహించింది .డా సత్యవ్రత శాస్త్రి మొదటి విజిటింగ్ ప్రొఫెసర్ .సంస్కృత బోధనా స్థాయి పెంచాడు .ధాయ్ దేశ విలాసం ,రామకీర్తి మహాకావ్యాలు రాశాడు .డా హరిదత్త కాలంలో బాగా అభి వృద్ధిజరిగి , ధాయ్ భూమీరియం ,సంస్క్రుతాతనం మహాకావ్యం రాశాడు ,శిలాశాసనాలు మనుధర్మ శాస్త్రం ,సంస్కృతంలోకి చేరిన పదాలు,సుత్తానుపాతంలో బ్రహ్మ ,కర్మ –పునర్జన్మ,ఉపనిషత్తులలో మోక్షం బౌద్ధం లో నిర్వాణం వగైరాలపై పరిశోధనలు జరిగాయి .
బాంకాక్ లోని చూలలోన్కారాన్ యూనివర్సిటి లో –ఎపిక్ సంస్కృతం లో కారకాలు ,భారతీయ వివాహ వ్త్యవస్థ ,కాళిదాస నాటకాల నాయికలు ,విదూషకులు ,అప్సరసలు ,సంస్క్రుతసాహిత్యం లో సతి ,స్త్రీలహక్కులు బాధ్యతలు ,బుద్ధ చరితలో శబ్దాలంకారాలు ,సంస్కృత ,పాలీ,ధాయ్ భాషలలో ఇంద్రుడు ,సంస్కృత నాటకాలలో ఉపమాలంకారం,నాంది వగైరాలపై విస్తృత పరిశోధనలు జరిపి పరిశోధనపత్రాలు రాసి ప్రచురించారు .విద్యార్ధులకు ఉపయుక్తంగా –ఇంటర్ సంస్కృత వ్యాకరణం ,సంస్కృతపాఠ౦,సంక్షిప్త వేద వ్యాకరణం ,సంస్కృతబోధ ,సంస్కృత ప్రవేశన ,కారక ప్రకరణ ,అభ్యాస వ్యాకరణం,సంస్కృత రచనావిది ,అనువాద విధి ,సుభాషితాలు ,పద ప్రయోగం ,ప్రజానీతిమొదలైన 30పుస్తకాలు ప్రచురించారు.
కుసుమ రాసా మణి-ప్రహేళిక ,సురసిత్ ధాయ్ రత్న –వ్యాస శతకం ,పెన్గ్ పొంగ్సా -సంస్కృతం లో గరుడ, నాగ ,లపై రాస్తే ,ప్రాణీ లఫానిత్ –సువృత్తి తిలక ,చారు చర్య , మొదలైన దాదాపు 25మంది సంస్కృత రచనలకు అనువాదాలు రాసిప్రచురించారు .త్రిభాష –సంస్కృత ధాయ్ ,ఇంగ్లిష్ ,నిఘంటు ను కెప్టెన్ లువాంగ్ బౌవన్న బర్నాక్ ,చతుర్భాషా-పాళీ సంస్కృత ధాయ్ ఇంగ్లిష్ నిఘంటును ప్రిన్స్ కితియకార కొమ్మాన్ ఫ్రా చందబూరి నరున్నాథ నిర్మాణం సమర్ధ వంతంగా చేశారు .ఈదేశం లో అనేకానేక కాన్ఫరెన్సులు సెమినార్లు 1986నుంచి 2000వరకు జరిపారు.ఈవిధ౦గా ఆధునిక సంస్కృత బోధన, అధ్యయనాలలో ధాయ్ లాండ్ మార్గదర్శకం గా ఉంది .
11-ఇటలీ దేశం
1998నుంచి 2001వరకు మూడేళ్ళ కాలం లొఇటలీలొ విక్టర్ అగోస్టిని,ఫబ్రీసియా బల్డీ సిర్రా ,గియులాంకో బోకాలి ,కార్మెన్ బొట్టో,ఆస్కార్ బొట్టో,ఆల్బర్టో చియాంత రెట్టో,రోసా మేరియా సిమినో, కార్లో డేల్లా కాసా ,క్రిస్టియానో డోగ్నిని,డీ ఒంజా చివోడా,గుస్సేప్పి ఫిలిప్పి ,రెనాటో ఫ్రాన్సి మొదలైనవారు చాణక్య రాక్షస సిద్దార్ధ ,ప్రతీకవాదం .క్షేమేంద్రుని నర్మమాల ,వర్ష ఋతు కవిత్వం ,శ౦కరాద్వైతం ,కావ్యాలలో అలంకారాలు ,భభ్రవ్య పంచాల ,శత సహస్రిక , స్వబోధోదయ మంజరి ,మొదలైన విషయాలపై పరిశోధనలు చేశారు .
మనవి-‘’ విదేశాలలో సంస్కృత అధ్యయనం ‘’శీర్షిక తో 43నుండి 46వరకు రాసిన 4 ఎపిసోడ్ లకు ఆధారం –ఢిల్లీ లోని లాల్ బహదూర్ శాస్త్రి రాష్ట్రీయ సంస్కృత విద్యా పీఠం ప్రొఫెసర్ వాచస్పతి ఉపాధ్యాయ సంపాదకత్వం లో 2001ప్రచురించిన ‘’Sanskrit Studies Abroad’’.ఈ విద్యా పీఠం సలహాదారుల బోర్డ్ మెంబర్ గా సంస్కృత విశ్వ విద్యాలయ మాజీవైస్ చాన్సలర్ , మన తెలుగు వారు ,కృష్ణాజిల్లా చల్లపల్లి దగ్గరున్న టేకుపల్లి గ్రామ వాస్తవ్యులు ,బహు సంస్కృత గ్రంథకర్త ,దేశ విదేశాలలో సంస్కృత వ్యాప్తికి విశేష కృషి చేస్తున్న వారైన డా.బ్రహ్మశ్రీ వెంపటి కుటుంబ శాస్త్రి గారు అవటం మనకు గర్వ కారణం .
మనవి-‘’ విదేశాలలో సంస్కృత అధ్యయనం ‘’శీర్షిక తో 43నుండి 46వరకు రాసిన 4 ఎపిసోడ్ లకు ఆధారం –ఢిల్లీ లోని లాల్ బహదూర్ శాస్త్రి రాష్ట్రీయ సంస్కృత విద్యా పీఠం ప్రొఫెసర్ వాచస్పతి ఉపాధ్యాయ సంపాదకత్వం లో 2001ప్రచురించిన ‘’Sanskrit Studies Abroad’’.ఈ విద్యా పీఠం సలహాదారుల బోర్డ్ మెంబర్ గా సంస్కృత విశ్వ విద్యాలయ మాజీవైస్ చాన్సలర్ , మన తెలుగు వారు ,కృష్ణాజిల్లా చల్లపల్లి దగ్గరున్న టేకుపల్లి గ్రామ వాస్తవ్యులు ,బహు సంస్కృత గ్రంథకర్త ,దేశ విదేశాలలో సంస్కృత వ్యాప్తికి విశేష కృషి చేస్తున్న వారైన డా.బ్రహ్మశ్రీ వెంపటి కుటుంబ శాస్త్రి గారు అవటం మనకు గర్వ కారణం . నిన్నరాత్రి శాస్త్రిగారికి 45వ ఎపిసోడ్ పంపిస్తే ,చదివి స్పందించి
kutumba sastry vempaty | 10:16 AM (7 hours ago) | ||
|
సశేషం
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -19-12-20-ఉయ్యూరు