సంగీత సద్గురుత్యాగరాజ స్వామి ఆరాధనోత్సవం
సరసభారతి 155 వ కార్యక్రమంగా సంగీత సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి వారి 174వ ఆరాధనోత్సవ౦ పుష్య బహుళ పంచమి 2-2-21 మంగళవారం సాయంత్రం 6.30గం.లకు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో నిర్వహింపబడుతుంది .ఆ సాయంత్రం 6గం లకు శ్రీ త్యాగరాజస్వామికి అష్టోత్తర పూజ జరుగుతుంది .అనంతరం స్థానిక ,ఇతర ప్రదేశాలనుండి,ఉత్సాహం గా పాల్గొనే గాయనీ గాయకులు ’’ శ్రీ త్యాగరాజ పంచ రత్న కీర్తనలు ’’ గానం చేస్తారు .ఇతర కృతులతో అలరిస్తారు .
అమరగాయకులు స్వర్గీయ ఘంటసాల వేంకటేశ్వరరావు,పద్మ విభూషణ్ డా .మంగళం పల్లి బాల మురళీ కృష్ణ ,ఇటీవలే మరణించిన పద్మ భూషణ్ శ్రీపతి పండితారాధ్యుల బాల సుబ్రహ్మణ్యం (బాలు )సంస్మరణ జరుగును .సాహిత్య ,సంగీతాభిమానులు పాల్గొని జయప్రదం చేయ ప్రార్ధన .
పూర్తి వివరాలు తర్వాత తెలియ జేస్తాం . గబ్బిట దుర్గాప్రసాద్ -19-1-20-ఉయ్యూరు