సంగీత సద్గురు త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవం
సరసభారతి 155 వ కార్యక్రమంగా సంగీత సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి వారి 174వ ఆరాధనోత్సవ౦ పుష్య బహుళ పంచమి 2-2-21 మంగళవారం సాయంత్రం 6.30గం.లకు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో నిర్వహింపబడుతుంది .ఆ సాయంత్రం 6గం లకు శ్రీ త్యాగరాజస్వామికి అష్టోత్తర పూజ జరుగుతుంది .అనంతరం స్థానిక ,ఇతర ప్రదేశాలనుండి,ఉత్సాహం గా పాల్గొనే గాయనీ గాయకులు ’’ శ్రీ త్యాగరాజ పంచ రత్న కీర్తనలు ’’ గానం చేస్తారు .ఇతర కృతులతో అలరిస్తారు .
అమరగాయకులు స్వర్గీయ ఘంటసాల వేంకటేశ్వరరావు,పద్మ విభూషణ్ డా .మంగళం పల్లి బాల మురళీ కృష్ణ ,ఇటీవలే మరణించిన పద్మ భూషణ్ శ్రీపతి పండితారాధ్యుల బాల సుబ్రహ్మణ్యం (బాలు )సంస్మరణ జరుగును .సాహిత్య ,సంగీతాభిమానులు పాల్గొని జయప్రదం చేయ ప్రార్ధన .
పాల్గొను గాయనీ గాయకులు
1-శ్రీమతి జోశ్యుల శ్యామలా దేవి –సరసభారతి గౌరవాధ్యక్షులు –నిర్వాహకురాలు
2- శ్రీమతి వి.శాంతి శ్రీ –మ్యూజిక్ లెక్చరర్ –గుడివాడ
3-శ్రీమతి టేకుమళ్ళ చిదంబరి –ప్రముఖ సంగీత విద్వాంసురాలు , రేడియో, టివి గాయని –విజయవాడ
4-శ్రీ రొయ్యూరు సురేష్ –వర్ధమాన గాయకుడు –విజయవాడ
5-శ్రీమతి పి.పద్మజ –వర్ధమాన గాయని -ఉయ్యూరు
6-శ్రీమతి జి.మాధవి –గాయని ,,చిరంజీవి నితిన్-వర్ధమాన బాలగాయకుడు –ఉయ్యూరు
7- గానగంధర్వ స్వర్గీయ శ్రీ’’ బాలు’’ పై ప్రముఖ కవి, విమర్శకుడు శ్రీ టేకుమళ్ళ వెంకటప్పయ్య గారి ప్రసంగం (15 నిమిషాలు )
8-కార్యక్రమ నిర్వహణ –శ్రీమతి మాదిరాజు శివ లక్ష్మి –సరసభారతి కార్యదర్శి
శ్రీమతి జోశ్యుల శ్యామలాదేవి – శ్రీమతి మాదిరాజు శివ లక్ష్మి శ్రీ గబ్బిట వెంకట రమణ
గౌరవాధ్యక్షురాలు కార్య దర్శి కోశాధికారి
గబ్బిట దుర్గాప్రసాద్ –సరసభారతి అధ్యక్షులు -25-1-21-ఉయ్యూరు