సరసభారతి 155 వ కార్యక్రమంగా 2-2-21 మంగళవారం శ్రీ త్యాగరాజస్వామి 172 వ ఆరాధనోత్సవం
ప్రతి మనిషికి సంగీత, సాహిత్యం పట్ల మక్కువ ఉండాలని మక్కువ ఉండాలని శాసనమండలి సభ్యులు శ్రీ వైవిబి రాజేంద్ర ప్రసాద్ అన్నారు . ఉయ్యూరులోని శ్రీ సువర్ఛలాంజనేయ స్వామి వారి సన్నిధిలో మంగళవారం రాత్రి సంగీత సద్గురు అరి త్యాగరాజ స్వామి వారి 172 వ ఆరాధానోత్సవాన్ని ‘సరస భారతి’ సాహిత్య సాంస్కృతిక సంస్థ తమ 155వ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
సంగీత సద్గురు త్యాగరాజ స్వామి కీర్తనలు వింటే మానసిక వత్తిడి నుండి ఉపశమనం దొరుకుతుందని, ఆయన కీర్తనలు అజరామరమని తెలిపారు . ఇప్పటి సమాజంలో తగ్గిపోతున్న సంగీత ఉనికిని మన ఉయ్యూరు పట్టణంలో సరసభారతి సాహిత్య సంస్థ ఇటువంటి సభను ఏర్పాటు చేసి సంగీత సేవ చేయడం అభినందనీయమని అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయకులు, సరస భారతి గౌరవాధ్యక్షులు శ్రీమతి జోస్యుల శ్యామలా దేవి, శ్రీమతి జి.మాధవి, చిరంజీవి జి.నితిన్ కౌశిక్, శ్రీ ఆర్. సురేష్ లు పాల్గొని త్యాగరాజ స్వామివారి కీర్తనలను ఆలపించారు. వీటితో పాటుగా అమర గాయకులు స్వర్గీయ ఘంటసాల గారు, మంగళంపల్లి బాల మురళీ కృష్ణ గారు, యస్.పి. బాల సుబ్రహ్మణ్యం గారు పాడిన పాటలను కూడా గాయకులు అద్భుతంగా ఆలపించి, ఆ మహనీయులను గుర్తు చేసుకున్నారు. ఆనంతరం బాలు గారి స్వగ్రామనైన నెల్లూరులో బాలు గారి ఇంటిపక్కనే నివసించి, బాల్యంలో ‘బాలు’ గారితో అనుబంధం కలిగిన శ్రీ టేకుమళ్ళ వెంకటప్పయ్య బాలు గారితో తమ అనుబంధాన్ని తెలుపుతూ.. చిరు ప్రసంగం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనమండలి సభ్యులు శ్రీ వై.వి.బి. రాజేంద్ర ప్రసాద్ గాయకులను ఉచితరీతిన సత్కరించారు.. సరస భారతి అధ్యక్షులు, తమ గురువులు అయిన శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ గారు 8 పదుల వయసులో కూడా సాహిత్యం, సంస్కృతిపై గల ఆసక్తితో ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ.. నేటి యువతరానికి ఆదర్శంగా నిలిచారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని గబ్బిట రమణ, వై.వి. గంగాధర రావు, మాదిరాజు శివలక్ష్మి నిర్వహించారు..
https://www.facebook.com/photo/?fbid=3672966436112507&set=pcb.3672972249445259