అద్వైత భాస్కరులు ఆది శంకరాచార్యులు -2
అమానుష శక్తి సామర్ధ్యాలకు నిలయమైన శ్రీ శంకర భగవత్పాదులు ప్రాచీన ,ఆధునిక ,ప్రాక్ పశ్చిమ పండితులచే కొనియాడబడ్డారు .’’The life of Shankara makes a strong impression of contraries .He is a philosopher and a poet,a savant and a saint mystic and a reformer ‘’అన్నాడు రాధాకృష్ణన్ .’’బలీయం పరస్పర వైరుధ్యంగా శంకరాచార్య జీవితం కనిపిస్తుంది .కానీ ఆయన తాత్వికుడు కవి ,విద్వాంసుడు మహాత్ముడు అనుభవ సంపన్నుడు ,మత సంస్కర్త గా ఒక్కొక్కరికి ఒక్కో రకంగా కనిపిస్తాడు .’’యవ్వనం లో ప్రజ్ఞాన తృష్ణా దాహం తో అచంచల నిర్భయ వాదిగాఒకరికి కనిపిస్తే ,ఏకత్వాన్ని ప్రజా బాహుళ్యం లోకి ప్రవేశపెట్టే సునిశిత రాజకీయ వేత్తగా వేరొకరికి ,జీవితం లోని వైవిధ్యాలను బయట పెడుతూ అజేయమైన తీక్షణత కలిగిఉన్న ,ప్రశాంత తత్వ వేత్తగా,మనకు తెలిసినదానికంటే మనం గొప్పగా చెప్పుకొనే అనుభవ వేత్త గా మరొకరికి కనిపిస్తాడు ‘’అంటూ రాధా కృష్ణ పండితుడు ‘’There have been few minds more universal than his ‘’అంటే శంకరుని కంటే సర్వతోముఖమైన చిత్తాలు చాలా అరుదు అంటాడు పండిత రాధాకృష్ణ ‘’ముప్పై ఒక్క సంవత్సరాలలో తత్వశాస్త్రాన్ని అంతా మధించి’’Also wrote tremendous lot and tour all over the country from Cape Comarin right up to Himlayas ‘’బండ్లకొద్దీ సాహిత్యాన్ని రచించి ,కన్యాకుమారినుంచి హిమాలయాలవరకు దేశామంతటినీ పర్యటించటం,అసాధారణం ,ఆసమయం ,పరమాద్భుతం ‘’అంటాడుప్రధమ రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్ .
తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రు ‘’శంకరాచార్య తత్వవేత్త మరియు ,పండితుడు అనుభవ వేత్త,,కవి ,మహాత్ముడు .వీటికి అన్నిటికి ఆచరణ యోగ్యమైన సంస్కర్త ,సమర్ధ నిర్మాత ‘’అన్నాడు .సోదరి నివేదిత ‘’పాశ్చాత్యులు శంకరుని అవగాహన చేసుకోలేరు .చిరుప్రాయం లోనే ‘’దశ నామి ‘’సంప్రదాయాన్ని నెలకొల్పి ప్రత్యేక మత సంస్థాపనకు అవసరమైన సంస్కృత విజ్ఞానాన్ని సాధించి ,సంభ్రమ ఆశ్చర్యాలు కలిగించే స్తోత్రావళి రచించినప్పటికీ అనుభవ వేత్తలాగా ,నిశ్చింతగా ,తేజోమయ జీవితాన్ని గడిపిన శంకరాచార్య ను ‘’The greatness that we may appreciate but can not understand ‘’ఆయన ఔన్నత్యాన్ని స్తుతించగలం కానీ, గ్రహి౦పజాలం ‘’అని కీర్తించింది .’’అజేయమైన తత్వ వేత్త అయి ,తార్కికుడై ,ప్రశాంత సువిశాల సమరస మూర్తియై Sankara taught us to love truth ,respect reason ,and realize the purpose of life .Twelve centuries have passed and yet his influence is visible ‘’సత్యాన్ని ప్రేమించటానికి ,హేతువును గౌరవి౦చటానికి ,జీవితాదర్శాన్ని పొందటానికి ఆయన ఉద్బోధించాడు .12శతాబ్దాలు గడిచినా శంకర ప్రభావం ప్రస్ఫుటంగానే ఉంది’’అన్నాడు డా రాధాకృష్ణన్ .డాసూర్య నారాయణ శాస్త్రి’’ఆ కాలం లో ఆయన దేశం నాలుగు మూలలా పర్యటింఛి తనప్రభావాన్ని సమకాలికులపై ప్రసరింప జేశాడు అంటారు కానీ , ‘’Many of them flourish even today shedding a kindly luster that inspires the week ‘’ ఆ ప్రభావాలు అనేకం ఇంకా దుర్బలులకు కరుణార్ద్ర ప్రకాశం చేత ఉత్తేజం అలిగిస్తూనే ఉన్నాయి ‘’అన్నారు .
‘’భగవత్పాదుల అసాధారణ ప్రజ్ఞ,నిర్మలాత్మ ,గంభీర హృదయం ,ప్రశాంత చిత్తం ,ఘనమైన మనోభావం పొందిన మరొక మానవుడు లేనేలేడు .దీనికి కారణం ‘’He spoke of things as he saw and not as imagined ‘’తాను ఊహించినట్లుకాక ,తాను చూసిన విషయాలే శంకరులు ప్రసంగిస్తూ ముఖతహా కాక హృదయం తో పలుకుతూ ,విశ్వ హృదయుడై విరాజిల్లటం శంకర ప్రఖ్యాతికి ముఖ్యకారణం ‘’అన్నారు శ్రీ అనుభవానంద స్వామి .
‘’వేదకాలం నుంచి లెక్కలేనంతమంది తత్వ వేత్తలు మానవ మనో వృత్తుల్ని సంస్కరి౦చి చారిత్రిక పురుషులయ్యారు –yet there are general synthesis ,systematic conceptions ,
Put for word by a Badarayana or a Sankara which will remain land marks of human genius ‘’సర్వ సామాన్య సమన్వయము బాదరాయణ వ్యాస, ,శంకరాచార్యులచే ప్రతిపాదింప బడే సక్రమ భావ విధానం ‘’The more trustworthy exponent of the Arya dharma was the great teacher Sankara ‘’ఆర్య ధర్మానికి సముచితమైన ,విశ్వసనీయ వ్యాఖ్యాత జగద్గురు శంకరాచార్యుడే అనీ సర్ మో౦టర్,విలియమ్స్ అన్నాడు .’’ఆ ధర్మ గ్రహణానికి ‘’We look to Sankara rather than to the legendary Vyasa ,even though the latter be the reputed author of the Vedanta Sutras ‘’వేదా౦తసూత్రకర్తగా ప్రఖ్యాతి పొందిన పౌరాణికుడైన వేద వ్యాసమహర్షి కంటే శంకరాచార్యులనే మనం ప్రమాణం గా చూడాలి ‘’అన్నాడు మాక్స్ ముల్లర్ పండితుడు .ఇదీ శంకర భగవత్పాదుల శ్రేష్టత్వం .రేపు శంకర జయంతి సందర్భంగా ఆ అద్వైత భాస్కరునికి ఇలా అక్షరాంజలి ఘటించే అదృష్టం నాకు దక్కిందని సంతోషంగా ఉంది .మిగిలిన వివరాలు రేపు తెలుసుకొందాం .
సశేషం
శ్రీ శంకర జయంతి శుభాకాంక్షలతో
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -16-5-21-ఉయ్యూరు