అద్వైత భాస్కరులు ఆది శంకరాచార్య
స్త్రీలకు సన్యాసాశ్రమ౦
ఉపనయన సంస్కారం శూద్రులకు లేదుకనుక వారు సన్యాసానికి అనర్హులు అనే వాదం ఉంది కానీ పూర్వకాలం లో స్త్రీలకూ ఉపనయనం మొదలైన సంస్కారాలు ఉండటం చేత గురుకులం లో ఉంటూ వేదాధ్యయనం చేసి నిష్ణాతులై వేద సభలలో చర్చా గోష్టులలో పాల్గొనే వారు .’’పురా కల్పే కుమారీణాంమౌ౦జీ బంధన మిష్యతే –అధ్యాపనం చ వేదానాం,సావిత్రీ వచనం తధా’’అంటే పూర్వం బాలికలు ఉపనయన సంస్కారం పొంది వేదాలు నేర్వటం బోధించటం లో ,సావిత్రీ మంత్రాన్ని జపించటం లో అధికారులై ఉన్నారు అని ‘’యమ స్మ్రుతి ‘’పేర్కొన్నది ‘’.’’యత్తు హారీ నోక్తం ద్వివిధాః స్త్రియో బ్రహ్మవాదిన్యః సద్యో వద్యశ్చ తత్ర బ్రహ్మ వాదినాం ఉపనయన మగ్నీన్ధనం,వేదాధ్యయనం స్వగృహే చ భిక్షా చర్యేతి’’.హారీతుని వాక్యం ప్రకారం స్త్రీలు బ్రహ్మవాదినులని ,సద్యో వధువులు అని రెండు రకాలు .బ్రహ్మ వాదినులకు ఉపనయనం అగ్నికార్యం వేదాధ్యయనం స్వగృహం లో భిక్షా చర్య కలిగి ఉన్నారని హరీతధర్మ సూత్రం తెలియ జేసింది .అందుకే ఆర్ ఆర్ దివాకర్ ‘’It is now usually admitted that the Upanayana ceremony is Vedic and was common t both boys and girls ‘’ఉపనయనం వైదికమై బాల బాలికలందరికి సామాన్యం గా ఉండేదని ,కనుక ప్రస్తుతం అంగీకారమే అని డా.ఆర్ ఆర్ దివాకర్ ప్రబుద్ధ భారత లో రాశాడు .సిజి బిస్వాస్ కూడా ప్రబుద్ధ భారత లో ‘’శాస్త్రాధ్యయనానికి ముందు బాలికలు కూడా ఉపనయనం పొందాలి అనే నియమం కూడా ఉందని రాశాడు.’’బ్రహ్మ చర్యేణకన్యా యువాన౦ విందతే పతిం’’బ్రహ్మ చర్యాశ్రమం చేత కన్య యువకుడైన భర్త ను పొందుతోంది అని అధర్వణ వేద వాక్యం .బృహద్దేవత సూత్ర ప్రకారం ‘’నైష్టికులై తురీయాశ్రమాన్ని తీసుకొంటే ,బ్రహ్మ వాదినులనీ ,గృహస్తాశ్రమ౦ తీసుకొంటే సద్యో వదువులని పిలువబదేవారు .కనుక వేదాలలో స్త్రీలకూ ఉపనయన వేదాధ్యయన యుక్త బ్రహ్మ చర్య ,ఆతర్వాత వారి ఇష్టప్రకారం బ్రహ్మవాదినిగా సన్యాసం ఉన్నాయని తాత్పర్యం.
మహా భారతం శాంతి పర్వం లో ‘’భిక్షుకీత్య నేనా స్త్రీణామపిప్రాగ్వివాహాద్వావైధవాచూర్ధ్వం సంనాసాధి కారో స్తీతి దర్శితం –తేన భిక్షా చర్యం మోక్ష శాస్త్ర శ్రావణ మేకాంతేఆత్మా ధ్యానం చ తాభిరతికర్తవ్య౦త్రి చ దండాదికంచ ‘’అంటే స్త్రీకి పెళ్ళికాక ము౦దు,వైధవ్యం కలిగిన తర్వాతకానీ కాని ,సన్యాసాశ్రమ అర్హత ఉంది .దీని వల్ల భిక్షాచర్యం ,వేదాంత శ్రవణం ఏకాంతవాసం లో ఆత్మ ధ్యానం అర్హతలు లభిస్తాయి .త్రిండడం ధరించి సన్య సి౦చటం కూడా ఉంది.’’సులభ’’ అనే భిక్షుణి గురించి పేర్కొన్నది .’’అటంత్యా’’లో పరివ్రజకత్వాన్ని తెలియజేస్తూ ,’’తత్ర తర శ్రుతోమోక్షో కధ్యమాన త్రిదండినః’’ఆమెకు త్రిదండ ధారణాదికారం కూడా ఉన్నది అన్నది.ఇది తెలిసి జనకమహారాజు ఆమెను బ్రాహ్మణ బ్రహ్మవాదినిగా భావించి ,సత్కరించి ,గౌరవించి ,ఆతర్వాత ఆమె క్షత్రియ స్త్రీ అని ఆమె వల్లనే తెలుసుకొన్నాడు .కనుక ఆకాలం లో బ్రాహ్మణ క్షత్రియ బ్రహ్మ వాదినులు ఉన్నారని తెలుస్తోంది .ఆర్ ఆర్ దివాకర్’’మహాభారత కాలం లో కూడా కురుక్షేత్రం దగ్గర ఒక ఆశ్రమం లో ఒక బ్రాహ్మణ కన్య యోగ శక్తులను పొంది తపస్సిద్ది సాధించింది ‘’అని రాశాడు ప్రబుద్ధ భారత లో .
వేదాలలో వేదేతర గ్రంథాలలోబ్రహ్మ చారిణి ,తాపసి ,సిద్దా అనే పేర్లతో పిలువబడే వారు కనుక పురుషులతోపాటు స్త్రీలు కూడా సరి సమానంగా ఆధ్యాత్మిక సాధన ,వేదాధ్యయనం చేసేవారు అన్నాడు దివాకర పండితుడు ‘’The intellectual eminence of women was proved by her capacity for debates and discussions in the royal courts and in Samitis and Sabhas ‘’రాజాస్థానాలలో సమితులు పండిత సభలలో ప్రసంగించి చర్చించటం స్త్రీ శక్తి సామర్ధ్యాల మేధా ఔన్నత్యాలను గుర్తించే జరిగి నిరూపితమైంది ‘’అన్నాడు డా కాళిదాస నాగ్ –ప్రబుద్ధ భారతి లో .
ఆరణ్యక ,ఉపనినిషత్తులలోఉన్న వైదిక వాజ్మయం లో బ్రహ్మవాదినులు అని పేరొందిన స్త్రీ ఋషులచే దర్శి౦ప బడిన అనేక వైదిక మంత్రాలను జాగ్రత్త చేయటం చేత ,ఆస్త్రీ బ్రహ్మవాదినుల ఆధ్యాత్మిక ఔన్నత్యం ఇనుమడించింది అని కాళిదాస నాగ్ స్పష్టంగా రాశాడు. ఏ.సి బోస్ కూడా ‘’వేదాధ్యయనానికి స్త్రీలకుఅర్హతలెదనటం చరిత్రను దూషించట మే’’అన్నాడు .
మరిన్ని విషయాలు మరోసారి
ఆధారం –శ్రీ అనుభవానంద స్వామి వారి ‘’సర్వ సిద్ధాంత సౌరభం ‘’
సశేషం
బుద్ధ, అన్నమయ్యజయంతి శుభా కాంక్షలతో
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -26-5-21-ఉయ్యూరు