సరసభారతి 159వ కార్యక్రమం లో ‘’అంతర్జాతీయ తెలుగు బడి ‘’పురస్కార ప్రదానం .œ
అమెరికాలో ఉన్న ‘’అంతర్జాతీయ తెలుగు బడి ‘’సంస్థ ఎన్నో విశిష్ట కార్యక్రమాలు నిర్వహిస్తోంది .అందులో టెక్సస్ రాష్ట్రం లోని ఆస్టిన్ నగర శాఖా నిర్వాహకులు శ్రీ డొక్కా రామభద్ర (నిరతాన్న ప్రదాత ,అపర అన్నపూర్ణ కీ శే .శ్రీమతి డొక్కా సీతమ్మ గారి ‘’ఇని మనవడు ‘’గారు (మునిమనవడి గారి కుమారుడు ) ఆంధ్ర రాష్ట్రం లో రెండేళ్ళ నుంచి కరోనా వలన ఉపాధికోల్పోయి ,ఆర్ధికం గా ఇబ్బందులు పడుతున్నా , తెలుగు బోధిస్తున్న ఉపాధ్యాయులకు గురుపూర్ణమినాడు ఉడతాభక్తిగా సరసభారతి ద్వారా ఆర్ధిక సాయం అందింఛి సత్కరించాలని భావించి నిన్ననే ఫోన్ లో మాట్లాడి నాకు తెలియ జేయగా ,అలాంటి అయిదుగురు ఉపాధ్యాయులను ఎంపిక చేసి 24-7-21 శనివారం ఉదయం 10గం.లకు సరసభారతి 159 వ కార్యక్రమం శ్రీ వేద వ్యాస మహర్షి జయంతి(గురు పౌర్ణమి )నాడు శ్రీ సువర్చలా౦జనేయ స్వామి దేవాలయం లో ఒక్కొక్కరికి 15 వేల రూపాయలు అంద జేస్తున్నాము . ఈ కార్యక్రమం లో’’ కోవిడ్ నిబంధనలను’’ పాటిస్తూ పురస్కారగ్రహీతలు ,అతిధులు ,భాషాభిమానులు, వదాన్యులు పాల్గొని జయప్రదం చేయ ప్రార్ధన .
ఆత్మీయ అతిధులు
శ్రీ కోసూరు ఆది నారాయణ రావు –రిటైర్డ్ హెడ్ మాస్టర్,కృష్ణా జిల్లా ప్రధానోపాధ్యాయ సంఘ మాజీ కార్య దర్శి –కోసూరు
శ్రీ దండి భట్ల దత్తాత్రేయ శర్మ – హెడ్ మాస్టర్ ,తెలుగు భాషా సాంస్కృతిక సమాఖ్య కోశాధికారి –విజయవాడ
డా.శ్రీమతి కొమాండూరి కృష్ణా –తెలుగు ఉపాధ్యాయిని,వక్త –విజయవాడ
శ్రీమతి గుడిపూడి రాధికా రాణి –ఉపాధ్యాయిని ,బాల సాహిత్యకర్త –మచిలీపట్నం
అంతర్జాతీయ తెలుగు బడి పురస్కార గ్రహీతలు
1-శ్రీమతి జి.మాధవీ లత-హైదరాబాద్
2-శ్రీ పెరక రవికుమార్ –పెడన –కృష్ణాజిల్లా
3-శ్రీమతి ఆదిలక్ష్మీ పద్మావతి –విజయవాడ
4-శ్రీ కపిలవాయి రైవత శర్మ –విజయవాడ
5-శ్రీ దేవర ఈశ్వరరావు –విశాఖ పట్నం
జోశ్యుల శ్యామల దేవి మాదిరాజుశివ లక్ష్మి గబ్బిట వెంకట రమణ
గౌరవాధ్యక్షురాలు కార్యదర్శి కోశాధికారి
గబ్బిట దుర్గా ప్రసాద్-సరసభారతి సాహిత్య సాంస్కృతిక సంస్థ అధ్యక్షులు
15-7-21-ఉయ్యూరు