డా తూములూరు శ్రీదక్షిణా మూర్తి శాస్త్రి గారు
చిత్త శార్దూలమ్ము చిత్తు చిత్తు గ ,గాగ నెత్తిపై కెక్కిన నీరజాక్షి –శేముషీ సింహమ్ము ‘’శ్రీ ‘’పెంచి ,దానిచే మహిషాదులను నామపు మహిత భావ –శ్వాస హంసము నెక్కి ,చతుర సంచారంబు నేర్పించి కాచు నిర్నిద్ర మాత ‘’అయిన లలితా పరా భట్టారిక శ్రీ రాజ రాజేశ్వరి పై శతకం రాసి ,తమ గురుదేవులు బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు ,వారి తండ్రిగారు వెంకటప్పయ్య శాస్త్రిగారు రచించిన ‘’శ్రీరామ కదామృతం’’అనే బృహత్ గ్రంధం పై’’ సమగ్ర సమీక్ష పరిశోధన నిబంధనం ‘’రచించి ,ఆంద్ర విశ్వ విద్యాలయం చేత పి హెచ్ డి పొందిన వారు శ్రీ తూములూరు శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి గారు .పొన్నూరు లోని శ్రీ భావనారాయణ సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్ గా ఉద్యోగించి, పదవీ విరమణ చేసిన సాహితీ మూర్తి .వీరి జననం కృష్ణా జిల్లా ఉప్పులూరు కావటం విశేషం .శ్రీ తూములూరు వెంకట రామ శాస్త్రి ,శ్రీమతి లక్ష్మీ నరసమ్మ దంపతులకు 15-2-1953 లో జన్మించిన శాస్త్రిగారు శ్రీమతి నాగ పద్మావతి గారిని వివాహమాడారు .
రామాయణం –సమాజ దర్పణం ను రెండుభాగాలుగా రచించి ,శ్రీ రామ ,వాల్మీకి , వానుమ ద్వాణి లను వినిపించిన ఆధ్యాత్మిక తేజో విరాజితులు .పావనీ శతకం ,శ్రీ త్రికూటేశ్వర త్రిశతి ,శ్రీ కపోతేశ్వర శతకం ,శ్రీ పొన్నూరు వీరాంజనేయ శతకం ,భావ దేవశతకం వంటి భక్తీ శతకాలను ‘’పిలిస్తేపలికే పద్య ధార’’తో వీనుల విందుగా, గుండెల నిండుగా రాసిన సాహితీ చైతన్య మూర్తి .తమ బావ గారు –అంటే అక్కగారి భర్త గారు శ్రీ చెరువు సత్యనారాయణ శాస్త్రి గారి అపార సంస్క్రుతాంధ్ర వైదుష్యానికి ,సంస్కృత శతావదానానికీ అనుక్షణం అబ్బురపడి ఆ మధుర స్మృతులను పంచుకొనే సహృదయ మూర్తి శ్రీ శాస్త్రిగారు
.’’స్తవ నీయుండు ,నరోత్తముండు ,సుగుణోద్దాముండు,ధన్యుండు రాఘవ నారారాణశాస్త్రి తాడెపలి విఖ్యాతుండు ,కారుణ్య మూర్తి ,వివేక స్థిర వర్తనుడు మద్దీక్షా గురుండు ,ఆత్మ తత్వ విదుండా’’రుషి వర్యు ‘’గొల్తు ‘’ అని ఘనం గా కీర్తించే గురుభక్తి శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి గారిది .ఇంతవరకు పద్యాలలో యోగ విద్య ను రాయని లోటును తీరుస్తూ ‘’ యోగ వైభవం ‘’రాసి రికార్డ్ సృష్టించారు . సాహిత్య సాంస్కృతిక ప్రసంగాలతో ప్రజలకు వందనం అభివందనం గబ్బిట దుర్గాప్రసాద్
గీర్వాణ కవుల కవితా గీర్వాణం మొదటి భాగం గ్రంధాన్ని ఉస్మానియా విశ్వ విద్యాలయ సంస్కృత ప్రాచార్యులు డా.శ్రీ ఇప్పగుంట సాయి బాబా గారికి పంపగా, క్షుణ్ణంగా చదివి అభినందిస్తూనే ,నేను చేసిన తప్పులను సవివరంగా వ్రాత పూర్వకంగా తెలియ జేశారు .ఆ పత్రాలను అందరికి అంతర్జాలం ద్వారా తెలియ బర్చాను .అందులో వారు నాకొక గొప్పసూచన చేశారు .శ్రీ ఎం .కృష్ణమాచారియార్ గారు ఆంగ్లం లో రాసిన ‘’హిస్టరీ ఆఫ్ క్లాసికల్ సాంస్క్రిట్ లిటరేచర్ ‘’తెప్పించుకొని చదవమన్నారు .ఈ విషయాన్ని గుర్తించిన నా ఆత్మీయులు శ్రీ మైనేని గోపాలకృష్ణ గారు సుమారు వెయ్యిపెజీలున్న ఆ గ్రంధాన్ని నాకు తెలియ కుండానే ఆర్డర్ ఇచ్చి తెప్పించి నాకు పంపారు .అద్భుతం అనిపించింది చదువు తుంటే .దాని ఆధారం గా గీర్వాణ కవుల కవితా గీర్వాణం రెండవ భాగం నెట్ లో రాయటం ప్రారంభించాను .ఇందులో ఉన్న దాదాపు అందరుకవులను ,అన్ని ప్రక్రియలను గురించి రాయగలిగాను .దీనికి శ్రీ సాయిబాబాగారికి శ్రీ మైనేని వారికీ ఎంతైనా రుణపడి ఉంటాను .
మొదటిభాగానికి ముందుమాట రాసిన డా. రామడుగు వెంకటేశ్వర శర్మ గారు కూడా ఇంకా రాయవాసిన కవులు చాలా మంది ఉన్నారని వారిని గూర్చి కూడా రెండవ భాగం లో రాయమని మంచి సలహా ఇస్తూ ఆ కవుల వివరాలు గుంటూరు జిల్లా పొన్నూరు సంస్కృత కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ డా.తూములూరు శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి గారు ఇవ్వగలరని వారి ఫోన్ నంబర్ నాకు ఇవ్వగా కిందటిఏడాది సెప్టెంబర్ లో వారితో ఫోన్ లో మాట్లాడి వివరాలు తెలుసుకొన్నాను .వారి వలననే బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు ,వారి తండ్రిగారు శ్రీ వెంకటప్పయ్య శాస్త్రిగారు ,శ్రీ తూములూరు వారి బావగారు ,శ్రీ రాఘవ నారాయణ శాస్త్రి గారి దౌహిత్రులు అయిన శ్రీచెరువు సత్యనారాయణ శాస్త్రిగారు,శ్రీ కొలచిన యజ్ఞనారాయణ దీక్షితులు గార్ల గురించి శ్రీ దక్షిణామూర్తి శాస్త్రి గారు పై వారు రచించిన పుస్తకాలు పంపగా రాయగలిగాను .శాస్త్రి గారి ద్వారానే శ్రీ ముళ్ళపూడి జయ సీతా రామ శాస్త్రి గారిని పరిచయం చేసుకొని సీతారామ శాస్త్రి గారు పంపిన తమవీ ,తమ తండ్రి గారు శ్రీ నారాయణ శాస్త్రి గారి గ్రంధాలనాధారంగా వీరిద్దరి సంస్కృత సేవను వివరించాను .అలాగే శ్రీ ములుకుట్ల నరసింహావధాని గారు రచించిన ‘’రామాయణ సారోద్ధారం ‘’7 భాగాలు శ్రీ తూములూరు వారు నాకు అందజేయగా అవధాని గారి గూర్చి సవివరంగా రాయగలిగాను .
.చీరాల విశ్రాంత లెక్చరర్ ,సంస్కృత భాషా సేవకులు ,ఆత్మ జ్యోతి మాసపత్రిక సంపాదకులు శ్రీ రావి మోహన రావు గారినీ శ్రీ తూములూరు వారు పరిచయం చేయగా ,వారు పంపిన వాటి ఆధారం గా శ్రీ చింత గుంట సుబ్బారావు గారి గురించి రాశాను .శ్రీ మోహన రావు గారి ద్వారాశ్రీ గరిమెళ్ళ సోమయాజులుగారు పరిచయమవ్వగా వారు పంపిన రచనల నాదారంగా శ్రీ గరిమెళ్ళ వారి గూర్చి రాశాను .గుంటూరు జిల్లా జిల్లెళ్ళమూడి అమ్మ సంస్కృత కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి గారి తో ఉన్న పూర్వ పరిచయాన్ని పురస్కరించుకొని వారిద్వారా జిల్లెళ్లమూడి సంస్కృత కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ డా.శ్రీ పన్నాల రాదా కృష్ణ శర్మ గారి ఫోన్ నంబర్ తెలుసుకొని , హైదరాబాద్ లో వారి స్వగృహం లో కలిసి ఇంటర్వ్యు చేసి ,వారు అందజేసిన తమ రచనల నాధారంగా శర్మ గారి గీర్వాణ కృషి ని పరిచయం చేయగలిగాను.
ఆచార్య సార్వ భౌమ శ్రీ వేదుల సుబ్రాహ్మణ్య శాస్త్రి గారు వారంతకు వారే నాగురించి తెలుసుకొని వారి గ్రంధాలను పంపగా వారి గూర్చి రాసే భాగ్యం దక్కింది .ఈ రెండవ భాగం తీగ కదలటానికి ముఖ్య కారకులు ,నాపై అమితమైన ప్రేమ ఆదరణ కురిపిస్తూ,అభినందిస్తూ ‘’ప్రసాద్ గారూ !సంస్కృతం చదువుకొన్న మేమెవ్వరం చేయ లేని మహత్కార్యాన్ని మీరు చేస్తున్నారు. మిమ్మల్ని చూసి నాకు గర్వం గా ఉంది’’అని ఎప్పటికప్పుడు ఫోన్ లో దీని ప్రగతిని తెలుసుకొంటూ నన్ను ఎంతగానో ప్రోత్సహించిన శ్రీ తూములూరు వారి సౌజన్యానికి ఎంతో రుణపడి ఉంటాను .
శ్రీ గరిమెళ్ళ సోమయాజులు శర్మ గారి పరిచయం లో మరో గొప్ప ముందడుగు పడింది .వారు ఆచార్య శ్రీ బిరుద రాజు రామ రాజు గారు ఆంగ్లం లో రాసిన ‘’కంట్రి బ్యూషన్ ఆఫ్ ఆంద్ర టు సాంస్క్రిట్ లిటరేచర్ ‘’‘’గ్రంధం చదివారా అంటే, లేదని చెప్పాను .ఎక్కడైనా దొరుకుతుందేమో నెట్ లో వెతకమని శ్రీ మైనేని వారిని కోరటం వారు వెంటనే దాన్ని ఆర్డర్ ఇచ్చిస్వర్గీయ సద్గురు శ్రీ శివానంద మూర్తి గారి గారి కుమారులు శ్రీ బసవ రాజు గారి తో ఫోన్ లో మాట్లాడగా తమ వద్ద ఉన్నదని చెప్పి కొరియర్ లో 700 పేజీలున్న దానిని భద్రం గా ఉచితంగా పంపి…