1916 డిసెంబర్ 14 న లిస్లి జాక్సన్ ,గెరాల్డిన్ దంపతులకు జన్మించి 1965 ఆగస్ట్ 8న చనిపోయిన అమెరికా హారర్, మిస్టరి నవలారాణి షిర్లీ జాక్సన్ . తల్లి అమెరికన్ రివల్యూషనరి వార్ హీరో నథానియల్ గ్రీన్ కుటుంబానికి చెందింది .ఈమె తాత అలాస్కా సుపీరియర్ జడ్జి .జాక్సన్ ముత్తాత ప్రసిద్ధ ఆర్కిటెక్ట్ .
ఆరునవలలు రెండు జ్ఞాపకాలు ,200కు పైగా కథలు రాసింది .కాలిఫోర్నియాలోని సాన్ ఫ్రాన్సిస్కో నగరం లో పుట్టిన ఈమె న్యుయార్క్ సిరాక్యూజ్ యూనివర్సిటిలో యూనివర్సిటి లిటరరీ మాగజైన్ నిర్వహణ లో పని చేసింది .అక్కడే తనకు కాబోయే భర్త స్టాన్లీ హెడ్గార్ హైమన్ తో పరిచయం కలిగి గ్రాడ్యుయేషన్ అయ్యాక పెళ్ళాడి కొత్త జంట న్యూయార్క్ లో కాపురం పెట్టి ‘’ది న్యుయార్కర్ పత్రిక ‘’లో పని చేశారు .జాక్సన్ ఫిక్షన్ కు ,హైమన్ ‘’టాక్ ఆఫ్ ది టౌన్ ‘’ కు బాధ్యత వహించారు.
1945లో జాక్సన్ దంపతులు వెర్మాంట్ లోని నార్త్ బెన్నింగ్టన్ లో స్థిరపడ్డారు .భర్త బెన్నింగ్టన్ కాలేజి ఫాకల్టి లో చేరాడు .1948లో జాక్సన్ ‘’ది రోడ్ థ్రు ది వాల్ ‘’అనే ప్రఖ్యాత నవలను కాలి ఫోర్నియాలో తన బాల్య౦ గురించి పాక్షిక జీవిత చరిత్ర గా రాసింది .రెండవ నవల ‘’హాంగ్ సమన్’’1951లో రాసింది .ఇందులో అదృశ్యమైన ఒక యువకుడి జాడ కనిపెట్టలేక పోవటం గురించి రాసింది .దక్షిణ వెర్మాంట్ లో గ్లాస్బరి మౌ౦టెన్స్ దగ్గర ఘోరారణ్యం లో జరిగిన యదార్ధ సంఘటన .ఈ సంఘటన ఆమె రాసిన ‘’ది మిస్సింగ్ గర్ల్ ‘’కథకు ప్రేరణ . తర్వాత ‘’లాటరి ‘’అనే కథ ను అమెరికా గ్రామీణ జీవితం గురించి రాసింది .1950-60కాలం లో అనేక చిన్న కథలు చాలా మేగజైన్ లకు రాసింది .వీటిలో కొన్నిటిని జ్ఞాపకాలుగా 1953లో ‘’లైఫ్ అమాంగ్ సావేజేస్ ‘’సంపుటి గా ప్రచురించింది .1959లో ‘’ది హంటింగ్ ఆఫ్ హిల్ హౌస్ ‘’ ను సూపర్ నాచురల్ హారర్ నవలగా రాసింది .ఇది ఇది వరకు ఎవరూ రాయని బెస్ట్ ఘోస్ట్ స్టోరి గా పెద్ద ఏరు తెచ్చింది .గుడ్ హౌస్ కీపింగ్ ,వుమెన్స్ డే,కొల్లియర్స్ రచనలు కూడా చేసింది ఆమె కథలు true-to-life funny-housewife stories” of the type later popularized by such writers as Jean Kerr and Erma Bombeck .తన జీవిత చరిత్ర రాసుకోవటం ఇష్టం లేదనీ ,తన రచనలు దాదాపు తన సెమి ఆటో బయాగ్రఫి అని తేల్చి చెప్పింది .1962లో చివరి నవల ‘’ఉయ్ హావ్ ఆల్వేస్ లివెడ్ ఇన్ ది కాజిల్ ‘’ అనే గోథిక్ మిస్టరి నవల రాసింది .దీన్ని టైం మేగజైన్ 1962లో పది ఉత్తమనవలలో ఒకటిగా ప్రశంసించింది .తర్వాత ఏడాది పిల్లల బొమ్మలపుస్తకం ‘’నైన్ మాజిక్ విషెస్ ‘’నవల రాసి ఉత్సాహం ఉన్న ఒక బాలుడికి ఒక మజీషియన్ అనేక గమ్మత్తిన్ విషయాలు చేసి చూపింఛి ఆశ్చర్యపరచటం గా రాసింది
ఆడవారు బయట ప్రపంచం లో పని చేయటానిఇంకా కి ప్రోత్సహించని కాలం లో ,కుటుంబానికి సంపాదన పరురాలైన స్త్రీగా పని చేసి భర్త ప్రోత్సాహం తో కన్న నలుగురు పిల్లలను బాధ్యతగా పెంచింది .ఎప్పుడూ రచనలో మునిగిఉన్నా కష్టపడి పని చేయటం ఆమెకు చాలా ఇష్టం .వంటా వార్పూ అన్నీ యథా తధంగా ఠంచన్ గా టైంకి జరిగిపోయేవి .హాయిగా పిల్లలను నవ్విస్తూ జోకులు పేలుస్తూ ఉల్లాసంగా ఉండేది .కార్టూన్లు చూసి పగలబడి నవ్వేది .ఒకభర్త కడుపుతో ఉన్న భార్యను కష్టపడద్దు అని చెబుతూ వీసమెత్తు సాయం కూడా పనిలో చేయని కార్టూన్ ఆమెకు బాగా నచ్చేది .మంచి నవలారచయ్త్రిగానేకాడు ఉత్తమ గృహిణి గా తనబాధ్యతలను నిర్వహించింది జాక్సన్ .1960లో జాక్సన్ ఆరోగ్యం క్రమంగా గుండె జబ్బు వలన క్షీణి౦చింది.1965లో ఆగస్ట్ 8 న తన 48వ ఏట జాక్సన్ అంతు లేని తీరాలకు చేరింది .ఆమె రచనా ప్రభావం నీల్ గైమన్ ,స్టీఫెన్ కింగ్ ,సారా వాటర్స్ ,నిగెల్ క్రియేల్,క్లైర్ ఫుల్లర్ ,జోయాన్నే హారిస్ ,రిచార్డ్ మెద్ సన్ వంటి ప్రసిద్ధ రచయితలపై అపారంగా ఉన్నదని విశ్లేషకులు గుర్తించి చెప్పారు.
1968లో జాక్సన్ భర్త ‘’కం అలాంగ్ విత్ మి’’అనే ఆమెచివరి అసంపూర్తి నవల,పూర్వం ప్రచురింపబడని ‘’లూసా , ప్లీజ్ కం హోం’’,వంటి 14 కథలు, ఆమె రచయితల సభలలో ప్రసంగించిన మూడు ప్రసంగాలు కలిపి ఆమె స్మృతి చిహ్నంగా ప్రచురించాడు . జాక్సన్ ఇంటి వెనక ఉన్న బారెన్ హౌస్ లో దొరికిన కథలు ,అంతకుపూర్వం సేకరి౦ప బడని మాగజైన్లలో పడిన కథలు అన్నీకలిపి 1996లో’’జస్ట్ యాన్ ఆర్డినరి డే’’గా ప్రచురించారు .ఈ పేరు ఆమె రాసిన ఒక కథపేరే .లైబ్రరికా౦గ్రెస్లో ఆమెరచనలు అన్నీ అందుబాటులో ఉన్నాయి .న్యుయార్కర్ పత్రిక 2013 ఆగస్ట్ 5న ఈ లైబ్రరీలో లబ్ధమైన ఒకకథ ‘’పారనోలా ‘’ను ముద్రించి వెలుగులోకి తెచ్చింది .మిగిలిన ప్రచురితం కాని జాక్సన్ రాసిన కథలన్నీ ‘’లెట్ మి టెల్ యు ‘’సంపుటిగా 2015లో ప్రచురితమైంది. ఆమె మొదటిసారి ‘’ది స్ట్రాండ్ మేగజైన్ ‘’కు రాసిన కథ ‘’అడ్వెంచర్ ఆన్ ఎ బాడ్ నైట్ ‘’.2020 డిసెంబర్ లో పబ్లిష్ అయింది .జాక్సన్ రాసిన ‘’లాటరి ‘’కథ అన్నిమాధ్యమాలలో విపరీతంగా ప్రచారం ప్రసారమూ అవటమేకాక మూడు సార్లు సినిమాగా తీశారు .మొత్త౦ మీద 7నవలలు ,7షార్ట్ ఫిక్షన్ రచనలు ,200కు పైగా కథలు ,బాలసాహిత్యం 4రచనలు ,3 జ్ఞాపకాల దొంతరలు షిర్లీజాక్సన్ రాసి అమెరికన్ హారర్ నవలా మహారాణి అనిపించుకొన్నది .
జాక్సన్ తన రాచనలకు ఎన్నో అవార్డ్ లు పురస్కార గౌరవాలు అందుకొన్నది .బెస్ట్ అమెరికన్ షార్ట్ స్టోరి అవార్డ్ నాలుగు సార్లు ,,,ఓహెన్రి అవార్డ్ ,న్యూయార్క్ టైం బుక్ రివ్యు అవార్డ్ మూడుసార్లు ,నేషనల్ బుక్ అవార్డ్ ,మిస్టరి రైటర్స్ ఆఫ్ అమెరికా ఎడ్గార్ అల్లాన్ పో అవార్డ్ రెండు సార్లు , ,టైం మాగజైన్ అవార్డ్ ,రెండు సార్లు షిర్లీ జాక్సన్ పొందింది .ఆమె పేరుమీద షిర్లీ జాక్సన్ అవార్డ్ ను 2007లో ఏర్పాటు చేసి సైకలాజికల్ ,సస్పెన్స్ ,హారర్ ,డార్క్ ఫన్టాస్టిక్ రచనలో ఉత్తమ రచన చేసినవారికి ప్రతి ఏడాది అందజేసి గౌరవిస్తున్నారు .ఆమె రచనలన్నీ టిపైనా ఎందఱో పరిశోధనలు చేసి కొత్త విషయాలు వెలుగులోకి తెస్తూనే ఉన్నారు ఆమెభర్త హేమన్. ఆమె స్వభావాన్నీ ,అంతరంగాన్నీ ఆవిష్కరించాడు-చూడండి-. Jackson’s husband wrote in his preface to a posthumous anthology of her work that “she consistently refused to be interviewed, to explain or promote her work in any fashion, or to take public stands and be the pundit of the Sunday supplements. She believed that her books would speak for her clearly enough over the years”. Hyman insisted that the dark visions found in Jackson’s work were not, as some critics claimed, the product of “personal, even neurotic, Cold War era in which she lived, “fitting symbols for [a] distressing world of the concentration camp and the Bomb”.[89] Jackson may even have taken pleasure in the subversive impact of her work, as indicated by Hyman’s statement that she “was always proud that the Union of South Africa banned ‘The Lottery’, and she felt that they at least understood the story”.