త్యాగ ధనుడు శ్రీ నల్లపాటి హనుమంతరావు-6 శ్రీ హనుమంతరావు గారు నిర్మించిన కృష్ణాశ్రమం నిర్వహణ కోసం ఎందఱో దాతలు ముందుకు వచ్చి ఆర్ధిక ఆర్ధికేతర సహాయ సహకారాలు అందించారు .జిల్లాలేబర్ ఆఫీసర్ సి౦గారు వేలు మొదలియార్,మేనేజర్ భాగవతుల అన్నప్ప శాస్త్రి చేదోడు వాదోడుగా నిలిచారు .పొగాకు వ్యాపారి శ్రీ కోట లక్ష్మయ్య నాయుడు ‘’డబ్బులకు ఇబ్బంది పడవద్దు ఎప్పుడు ఎంతకావాలంటే అంతా ఇస్తాను తీసుకు వెళ్లి ఖర్చుచేయండి మీ గ్రాంట్ రాగానే ఇచ్చేయండి ‘’.అన్నారు గుంటూరులో స్థలం కోసం మూడు వేలరూపాయలు అప్పుగా ఇస్తూ వడ్డీ వద్దని అసలు ఇస్తే చాలని చెప్పారు .ఈ డబ్బు తీర్చగలనో లేనో అనే భయం తో రావుగారు గుంటూరులో కొన్న 5ఎకరాల భూమి ,పెదపాలెం లో బిల్డింగ్ తో సహా ఒక యకరం భూమి,ఆయన పేర తాకట్టు దాస్తా వేజు రాయించి ,క్రయ ,తాకట్టు దస్తావేజులు ఒకే రోజున రిజిస్టర్ చేయించారు రావు జీ .అదీ నిబద్ధత అంటే . లక్ష్మయ్య నాయుడు గారి వద్ద తీసుకొన్న మూడు వేలకు ,అప్పుగా తీసుకొన్న వెయ్యి కలిపి గుంటూరు జూట్ మిల్ దగ్గర అయిదెకరాల పొలం కొన్నారు రావు గారు .మంచి ఉత్సాహం ,ఊపుతో విద్యాలయం ఆశ్రమం నడుపుతున్నారు .శ్రీ కొండా వెంకటప్పయ్య గారు తిలక్ స్వరాజ్య నిధి నుంచి 5వేలుఇవ్వగా ,ఆశ్రమంలో భవనం కట్టటానికి ఖర్చుపెట్టగా ఒక వెయ్యి మాత్రమె మగిలితే ఆశ్రమం ఖాతాలో జమ చేశారు రావు గారూత్తరాది యాత్రకు వెళ్లి ఢిల్లీలో స్వామి శ్రీ శ్రద్ధానందస్వామి స్థాపించిన ‘’కాంగ్రీ గురుకులం ‘’దర్శించి వారితో హరిజనోద్ధరణ ఉద్యమం గురించి మాట్లాడారు .పూనాలో లోకమాన్య బాలగంగాధర్ తిలక్ గారిని ఇంటి వద్దనే కలవటానికి వెడితేతే, ఆయన అమెరికా నుంచి తిరిగి వస్తున్న లాలాలజపతి రాయ్ గారిని ఆహ్వానించటానికి బొంబాయి వెళ్ళినట్లు తెలిసి ,వారి మేనల్లుడు అన్ని రకాల సదుపాయాలూ కలిపించినా అక్కడే ఉన్న విశాల ఆవరణలోవేరే వంటచేసుకొని తిన్నారు. అక్కడే కేసరి ,మరాటా పత్రికలూ ముద్రి౦చబడుతాయి. తిలక్ స్వంత లైబ్రరీలో కొన్ని వేల ఇంగ్లీష్ ,సంస్కృత గ్రందాలున్నాయి .తిలక్ రాగానే వారి౦ ట్లోనే భోజన ఏర్పాటు చేశారు .పైన డాబా లో విశ్రాంతి తీసుకొనే గదికి వెళ్లి తిలక్ గారిని కలిసి రావు గారు మాట్లాడారు .అంటరాని తనం నిర్మూలించటానికి మార్గం ఏమిటి అని ప్రశ్నించారు ‘’హరిజనులు బాగుపడాలి అంటే వారికోసం వారున్న చోట్ల అగ్రకులాల వారు స్వచ్చందంగా గుడులు కట్టి తరచుగా తాము వెళ్లి దర్శిస్తూ ,ఆతర్వాత వారినికూడా మామూలు దేవాలయలకు ఆహ్వానించి దర్శనం కల్గిస్తే అంటరానితనం క్రమంగా మాయమవుతుంది ‘’అని చెప్పారు తిలక్.తిలక్ గారికి వచ్చిన బహుమతుఅలన్నీ ప్రదర్శనగా ఏర్పాటు చేయగా రావు గారు చూసి ధన్యతచెందారు .అప్పటికే ఆయన ఆరోగ్యం దెబ్బ తిన్నది ..మర్నాడు పూనాలో బంగ్లాలో ఉండటానికి బయల్దేరారు ఒకరిద్దరు పట్టుకొని ఎక్కిస్తే కాని బండీ ఎక్క లేక పోయారు .ఆతర్వాతకొన్ని నెలలకే తిలక్ అమరులయ్యారు . 1921లో రావు గారు దక్షిణాది వెళ్ళినప్పుడు శ్రీ అరవి౦దులను దర్శించారు .’’పూర్ణయోగం మీరుకని పెట్టిందా ?లేక పూర్వం నుంచీ ఉన్నదా ?’’అని అడిగితె ‘’పూర్వ గ్రంథాలనుంచి తీసుకొన్నదే ‘’అన్నారు అరవి౦ద యోగి .అంతటి మేధావితో తానేమి మాట్లాడగలను అనుకొన్నారు రావుజీ . 1922లో రావుగారి భార్య కాపురానికి వచ్చారు .తర్వాత కొన్ని నెలలకే తండ్రికి నంజు వ్యాధి వచ్చి ,మంచం దిగలేని స్థితి దీనితో అతిసారం పట్టుకొన్నది . ఎక్కడికీ వెళ్ళకుండా ఆయన సేవలోనే రావు గారు ఉండిపోయేవారు మలమూత్రాలను తీయటం పక్క మార్చటం అన్నీ యధావిధిగా చేసేవారు రోజూ వేడి నీటి స్నానం చేయించి ,తెల్ల వస్త్రాలు కట్టి ,సాంబ్రాణి పొగ వేసి మంచం పై పడుకోబెట్టేవారు ఆయన ఏది తి౦టానంటే దాన్ని వండించి పెట్టేవారు ఈ సీవకు పరవశుడై తండ్రి ‘’నాయనా !నేను పుడితే నీకు కొడుకుగానే పుడతానురా ‘’అనేవారు ఆ మాటకు ఒకప్రక్క ఆనందం మరోపక్క బాధ కలిగేవి రావుగారికి ‘’నాన్నా !నువ్వు నాకు లక్ష రూపాయల ఆస్తి ఇచ్చినా ఇంత సంతోషం కలిగేది కాదు ‘’అంటూ ఆనంద బాష్పాలు రాల్చేవారు రావుగారు .కొద్దిరోజులకే తండ్రి చనిపోయారు .రావు గారు హరిజనులతో కలిసి తిరుగుతున్నందు వలన ఆయన శవాన్ని మోయటానికి ,మంత్రం చెప్పటానికి బ్రాహ్మణులు ఎవరూ రాలేదు కొలకలూరి లోని మేనమామలు వచ్చి అన్నీ నిర్వర్తించారు .అయితే ఆఊరి బ్రాహ్మణ్యాన్ని ఎదిర్చి తండ్రి గారి ప్రాణమిత్రుడైనబ్రాహ్మణుడు వచ్చి నిలబడి కర్మకాండ ,ఉత్తరక్రియలు జరిపించాడు .గోదాన ,అన్నదానాలు యధా విధిగా జరిపించాడు. తండ్రి అనారోగ్యం లోనే ఉన్నప్పుడు ఒకరోజు కొడుకుతో ‘’నాయనా !నేను ఇంకా బతుకుతానా ?గుడి కట్టిస్తానా ?’’అన్నారు ఆయన పుణ్యకార్యాలు చేయలేక పోయాననే బాధలో ఉన్నారని రావు గ్రహించారు తండ్రిగారు పోయాక భార్యతో పెదపాలెం లో కాపురం పెట్టారు రావుగారు ..నౌలూరు నుంచి వచ్చే అయివేజు ఏమాత్రం చాలేదికాదు .ఆశ్రమం నుంచి డబ్బు తీసుకోవటం ఇష్టం లేదు అ సమయం లోశ్రీ పుతు౦బాక కృష్ణయ్య గారు ఏలోటూ రాకుండా చూసుకొన్నారు . ఆశ్రమం నుంచి ప్రతిఫలం తీసుకోవచ్చా అని కొండా వారినిఅడిగితే ‘’తప్పేమీ లేదు ‘’అని చెప్పారు .అప్పటి నుంచి నెలకు కుటుంబం లోని పెద్దలకు 15చొప్పున ,పిల్లలకు 5రూపాయలచోప్పున గౌరవ వేతనం –ఆనరోరియం తీసుకొనేవారు . శ్రీ వింజమూరి పార్ధ సారధి గుంటూరు నుంచి కృష్ణాశ్రమం చూడటానికి వచ్చి ఆ విశేషాలు భారతి మాసపత్రిక లో రాశారు . ‘’హనుమంతరావు గారి ఆహ్వానం అందుకొని ఆశ్రమం చూడటానికి వెళ్లాను రేవేంద్ర పాడు పోయే బకింగ్ హాం కాలువ చేరి బల్లకట్టు ఎక్కి అవతలి ఒడ్డుకు చేరాను .బల్లకట్టు దిగుతూనే వెనకనుంచి ఎవరో ‘’తాకుతా వయ్యా నీ ఇల్లు బంగారం కానూ ‘’అన్నాడు .’’ఏం తాకితే ?’’అన్నాను .’’ఓహో స్వదేశపు మనుసులు గామాలే ‘’అంటూ వికటంగా నవ్వాడు ..పంచముల దౌర్భాగ్యస్థితి చూసి గుండెలో గునపం గుచ్చినట్లనిపించి కన్నీరు తన్నుకొచ్చింది .గబగబా నడిచి పెదపాలెం వెడుతున్నాను .మొహం నిండా విభూతి పెండి కట్లు తో ఏవో మంత్రాలు చదువుకొంటూ వెళ్ళే ఒక బ్రాహ్మణుడు నా వైపు చూసి తమరిదేవూరు ?’’అంటే ‘’గుంటూరుకాపురం ‘’అనగా ‘’ఎక్కడికి ?’’అంటే ‘’పెదపాలెం ‘’అనగా ,’’మాల వాళ్లకు బ్రాహ్మలు చదువు చెప్పెచోటికా ?’’అనగా ‘’ఔను అక్కడికే ‘’అనగా కాసేపాగి ‘’వినాశకాలే విపరీత బుద్ధి ‘’అని చివర విసర్గ లేకుండా అని ‘’మాల వాళ్లకు బ్రాహ్మలు చదువు చెప్పటం ఏమిటి మీదుమిక్కిలి వాళ్ళను తాకటం .ఎంతటి దురవస్థ పట్టిందండీ మనకులగోత్రాలకు ?’’అని వాపోయాడు . ‘’తరతరాలనుంచి వస్తున్న ఈ ఆచారాన్ని ఇప్పుడు మార్చాలంటే శ్రోత్రియ బ్రాహ్మణులు వేదాలే తప్ప వేరేదీ శరణ్యం లేదనే వాళ్ళు ఎలావొప్పుకొంటారు ?’’అన్నాను నేను .ఆయన ‘’వేదాలలో అక్కడా అక్కడా చండాలురుఅంటే బ్రాహ్మణ స్త్రీకి శూద్రుని వలన పుట్టినవారు అని ఉంది వాళ్ళే అంటరాని వాళ్ళు .ఈ దోషానికి పరిహారం కూడా శృతి స్మృతులలో ఉన్నాయి .’’అన్నాడు నేను ‘’వేదాల్లో పంచములను పెర్కొన్నారా ?మన విప్రచరిత్ర అంతా ఈ రంకు మీదే ఆధార పడింది కదా ‘’అన్నాను .??ఇంకా చాలా చెప్పారు పార్ధసారదిగారు ఆవివరాలు రేపు తెలుసుకొందాం . సశేషం 2022 నూతన ఆంగ్ల సంవత్సర శుభా కాంక్షలతో మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -1-1-2022-ఉయ్యూరు
వీక్షకులు
- 1,010,503 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- గ్రంథాలయోద్యమ పితామహ శ్రీ అయ్యం కి వెంకట రమణయ్య గారు?8 వ భాగం.9.6.23.
- మురారి అన ర్ఘ రాఘవమ్. 12 వ భాగం.9.6.23.
- సరస భారతి వీక్షకుల సంఖ్య 10 లక్షలపైనే
- గీర్వాణ కవుల కవితా గీర్వాణ 0 .7. వ భాగం. 8.6.23:
- 25 ఏళ్లకే సంస్కృత ప్రొఫెసర్ అయి ,’’కాదంబరి’’ ప్రచురించిన స్కాట్లాండ్ సంస్కృత విద్వాంసుడు –పీటర్ పీటర్సన్
- గ్రంథాలయోద్యమ పితామహ శ్రీ అయ్యం కి వెంకట రమణయ్య గారు.8 వ భాగం.8.6.23.
- మురారి అన ర్ఘ రాఘవం.11 వ భాగం.8.6.23.
- గీర్వాణ కవుల కవితా గీర్వాణ 0.7 వ భాగం.7.6.23.
- గ్రంథాల యోద్యమపితామహ శ్రీ అయ్యం కి వెంకట రమణయ్య గారు.7 వ భాగం.7.6.23.
- చారిత్రక నవలా ‘’కల్కి ‘’తురాయి కి చలన చిత్ర ‘’మణి రత్నం ‘’-పొన్నియ౦ సెల్వం
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (77)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (8)
- నా దారి తీరు (135)
- నేను చూసినవ ప్రదేశాలు (107)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (2,978)
- సమీక్ష (1,333)
- ప్రవచనం (11)
- ఫేస్బుక్ (522)
- మహానుభావులు (346)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (1,079)
- రాజకీయం (65)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (334)
- సమయం – సందర్భం (844)
- సమీక్ష (26)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (517)
- సినిమా (376)
- సేకరణలు (315)
- సైన్స్ (46)
- English (6)
ఊసుల గూడు