మనమరుపు వెనక మన వెండి తెర మహానుభావులు -36
36-రక్తకన్నీరు సీత
1933 అక్టోబర్ 14న కాకినాడలో జన్మించిన సీత తొలిసారిగా కేవీ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘యోగి వేమన’(1946)లో బాలనటిగా నటించారు. అప్పటినుంచి తను దర్శకత్వం వహించిన ‘గుణసుందరి కథ’, ‘పెద్ద మనుషులు’, ‘పెళ్లినాటి ప్రమాణాలు’, ‘మాయాబజార్’ తదితర చిత్రాల్లో మంచి పాత్రలు ఇచ్చి సీతను ప్రోత్సహించారు కేవీ రెడ్డి. బాలనటిగానే కాకుండా హాస్య తారగా సరికొత్త మేనరిజమ్స్తో ప్రేక్షకుల్ని ఆకట్టుకొన్నారు సీత. 1946లో ప్రారంభమైన ఆమె సినీ ప్రస్థానం 2002 లో వచ్చిన ‘నేనేరా పోలీస్’ చిత్రం వరకూ కొనసాగింది.
దాదాపు 250 చిత్రాల్లో నటించారు. ‘రుతురాగాలు’ సహా పలు టీవీ సీరియల్స్లో కూడా సీత నటించారు. ‘రక్తకన్నీరు’ నాటకాన్ని నటుడు నాగభూషణంతో కలసి పలు ప్రాంతాల్లో ప్రదర్శించేవారు సీత. మనసులు కలవడంతో 1956లో నాగభూషణం సీతను పెళ్లి చేసుకొన్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు.. భువనేశ్వరి, నరేందర్. ఓ పెద్ద నటుడికి భార్యననీ, మంచి నటిననీ అనే అహంభావం సీతలో కనిపించేది కాదని ఆమెను ఎరిగిన వారు చెప్పేమాట. పెళ్లయ్యాక నటనకు దూరం జరిగిన సీత పిల్లలకు పెళ్లిళ్లు కావడంతో మళ్లీ నటన మీద ఆసక్తి చూపి కొన్ని సినిమాల్లో నటించారు. తనకు నటన నేర్పిన తొలి గురువు సీత అని నటి వాణిశ్రీ చెబుతుంటారు.
సుమారు 3 దశాబ్దాలు సినిమాలు, నాటకాలలో నటించిన సీత 1935లో సినిమా నటుడు, వస్తాదు, నిర్మాత, దర్శకుడు అయిన రాజా శాండో, మూకీ,టాకీల తొలితరం సినిమా నటి లీలాబాయిలకు జన్మించారు .[1]. ఈమె పూర్వీకుల స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ. తల్లిదండ్రులు ఇద్దరూ సినిమా రంగానికి చెందిన వారు కావడం వల్ల ఈమెకు చిన్నతనం నుండి సినిమా పరిశ్రమ, నటన పట్ల అవగాహన ఏర్పడింది. ఈమె శేషాద్రి అయ్యర్ వద్ద సంగీతం నేర్చుకున్నారు . మంచి కంఠస్వరం, గ్రహణశక్తి ఈమెను మంచి గాయనిగా తీర్చిదిద్దింది. ఈమె వెంపటి చినసత్యం వద్ద కూచిపూడి నాట్యంలో శిక్షణ పొందారు. ఈమెకు నాలుగేళ్ల చిన్నవయసులోనే ముఖానికి రంగువేసుకుని సినిమాలలో నటించే అవకాశం వచ్చింది. ఆ తరువాత అనేక సినిమాలలో, నాటకాలలో నటించారు .. ఈమెకు 1956లో ప్రముఖ నటుడు సి.నాగభూషణంతో వివాహం జరిగింది.
కుటుంబం
ఈమె కుటుంబంలో అందరూ సినిమా రంగానికి చెందిన వారే. ఈమె తల్లిదండ్రులు సినిమా నటీనటులు. భర్త సినిమా, నాటకాలలో రాటుదేలిన నటుడు. ఈమె వియ్యంకుడు ఎస్.డి.లాల్ ప్రముఖ సినిమా దర్శకుడు. కూతురు భువనేశ్వరి భర్త, ఎస్.డి.లాల్ తనయుడు మీర్ టెలివిజన్ రంగంలో ప్రముఖ కెమరామ్యాన్, దర్శకుడు, ఎడిటర్. ఈమె కుమారుడు సి.సురేంద్ర కూడా పేరొందిన కెమరామ్యాన్, టి.వి. నటుడు. ఇతడు భార్యాభర్తలు, ఆత్మ మొదలైన టెలివిజన్ సీరియళ్లలో నటించాడు.
సినిమా రంగం
సీత నాలుగేళ్ల ప్రాయంలో త్యాగభూమి అనే సినిమాలో తొలిసారి నటించారు . పన్నెండేళ్ల వయసులో చిత్తూరు నాగయ్య నటించిన యోగివేమన సినిమాలో మోహనాంగి చెల్లెలు కనకాంగిగా నటించారు . ఇంకా ఈమె నాటకాల రాయుడు, బికారి రాముడు, నేనేరా పులి, రియల్ స్టోరి తదితర చిత్రాలలో నటించారు . ఋతురాగాలు, శివలీలలు మొదలైన టెలివిజన్ సీరియళ్లలో కూడా నటించారు
నాటక రంగం
ఈమె చెన్నపురి ఆంధ్ర మహాసభ ఆధ్వర్యంలో ప్రదర్శితమైన మోహినీ రుక్మాంగద నాటకంలో ధర్మాంగద పాత్రను ఏడేళ్ల వయసులో అభినయించి ప్రేక్షకుల మెప్పును పొందారు. అప్పటి నుండి రంగూన్ రౌడీ, తులాభారం, చింతామణి మొదలైన నాటకాలలో ప్రదాన పాత్రలను పోషించారు కలికాలం, పాపం పండింది, బికారి రాముడు మొదలైన నాటకాలలో నటించారు
రక్తకన్నీరు
1958లో ఆవిర్భవించిన రక్తకన్నీరు నాటకం ఈమె జీవితంలో పెద్ద మలుపు తిప్పింది. తమిళంలో ఎం.ఆర్.రాధా విరివిగా ప్రదర్శించిన ఈ నాటకాన్ని పాలగుమ్మి పద్మరాజు తెలుగులోనికి అనువదించాడు. నాగభూషణం దీనిని రంగస్థలంపై రసవద్ఘట్టంగా తీర్చిదిద్దాడు. రక్తకన్నీరు నాటకంలో సుందరి పాత్రను ఈమె నటించేది. ఇది వాంప్ తరహా పాత్ర. హీరో నాగభూషణం భార్య ఇందిరను అలక్ష్యం చేసి సుందరి పంచన చేరతాడు. ఇందిర పాత్రను వాణిశ్రీ, శారద చాలాకాలం వీరి ట్రూపుతో కలిసి నటించారు. ఈమె వాణిశ్రీకి డైలాగులు పలకడంలో, వేషధారణ, ఆంగికాభినయంలో శిక్షణ ఇచ్చారు . రక్తకన్నీరు నాటకం విజయవంతం కావడానికి నాగభూషణం సతీమణిగా, నాటక సమాజం నిర్మాతగా ఈమె పాత్ర అదృశ్యమే అయినా ప్రముఖమైనది. రక్తకన్నీరు ప్రదర్శించబడిన 20 సంవత్సరాలు కూతురు భువనేశ్వరి పుట్టినప్పుడు రెండు నెలలు మినహాయిస్తే మిగిలిన అన్నిరోజులు ఈమె ఆ నాటకంలో ఇందిర పాత్రను పోషించారు . వెనుక వుండి నిర్వహణ పనులను అంకితభావంతో చూసుకునేవారు .
1940లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సీత.. దేవదాసు, మాయాబజార్ వంటి హిట్ చిత్రాల్లో నటించారు. దాదాపు 250 చిత్రాల్లో ఆమె కనిపించారు. చివరగా 2002లో నేనేరా పోలీస్లో ఆమె కనిపించారు. అంతేకాదు భర్త నాగభూషణంతో కలిసి రక్తకన్నీరు, పాపం పండింది, ఇనుప తెరలు, అందరూ బతకాలి లాంటి నాటకాల్లో నటించారు. దాదాపు 2 వేలకు పైగా ఆమె ప్రదర్శనలు ఇచ్చారు.నాగభూషణంకు కుడి భుజంగా ఉండేవాళ్లు . దీంతో ఆ పరిచయమే చనువుగా మారి.. పెళ్లి చేసుకున్నాడు నాగభూషణం. అప్పటికే ఆయనకు పెళ్లి అయినా కూడా సీతను మరో పెళ్లి చేసుకున్నాడు నాగభూషణం. ఇదిలా ఉంటే సీత అంత్యక్రియలు2020 సెప్టెంబర్ 20న మరణించారు .హైదరాబాద్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు 21న ముగిశాయి. ఈమె మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేసారు.
సశేషం
రిపబ్లిక్ దే శుభాకాంక్షలతో
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -26-1-22-ఉయ్యూరు