మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-70
70-శాస్త్రీయ సంగీత సుస్వరాల లీలాహేల సంగీత దర్శకురాలు -పద్మ భూషణ్ కలైమామణి-పి.లీల
పొరయత్తు లీల (మే 19, 1934 – అక్టోబరు 31, 2005) దక్షిణ భారత నేపథ్యగాయని. మలయాళ చిత్ర రంగములో ప్రప్రథమ నేపథ్యగాయని. ఈమె తమిళ, మలయాళ, తెలుగు భాషల్లో ఆమె 15 వేలకు పైగా పాటలు పాడింది. తెలుగులో లవకుశ, మాయాబజారు, పాండవవనవాసం, రాజమకుటం, గుండమ్మకథ, చిరంజీవులు తదితర సినిమాల్లో ఆమె పాడిన ఎన్నో పాటలు అత్యంత ప్రజాదరణ పొందాయి.[1]
లీల మే 19, 1934లో కేరళలోని పాలక్కాడ్ జిల్లాకు చెందిన చిత్తూరులో సంగీతాసక్తి ఉన్న కుటుంబములో జన్మించింది. తండ్రి వి.కె.కుంజన్ మీనన్ ఎర్నాకుళంలోని రామవరం ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేసేవాడు, తల్లి మీనాక్షి. ముగ్గురు అక్కాచెల్లెల్లలో (శారద, భానుమతి, లీల) లీల చివరిది. ఈమె సినిమాలలో రాకమునుపే శాస్త్రీయ సంగీతములో శిక్షణ పొందినది. తండ్రి కుంజన్ మీనన్ కు సంగీతంలో ఉన్న ఆసక్తితో ముగ్గురు కూతుర్లకు సంగీతంలో శిక్షణ ఇప్పించాడు. సంగీతకారుడు టి.వి.గోపాలకృష్ణన్ పెద్దనాన్న త్రిభువన మణిభాగవతార్ ఈమె మొదటి గురువు. ఈమె తన పదమూడో యేట 1947లో విడుదలైన తమిళ చిత్రము కంకణంతో సినీరంగప్రవేశం చేసింది. ఈమె పాడిన మొదటి పాట హెచ్.ఆర్.పద్మనాభశాస్త్రి స్వరపరిచిన శ్రీ వరలక్ష్మీ.. అంటూ మొదలయ్యే స్త్రోత్రం. ఈ తరువాత తెలుగు, కన్నడ చిత్రాలలో అనేక పాటలు పాడింది. 1948లో విడుదలైన నిర్మల చిత్రముతో లీలకు తొలిసారి తన మాతృభాషైన మలయాళంలో పాడే అవకాశం వచ్చింది. తెలుగులో ఈమె తొలి చిత్రం 1949లో విడుదలైన మన దేశం.
జన్మించింది కేరళ రాష్ట్రంలోని ఎర్నాకుళంలో నైనా, సంగీతం మీద పి. లీలకున్న అభిరుచి కారణంగా సంగీతం నేర్పించాలనే తలంపుతో పి. లీల తండ్రి మద్రాసులో మకాం పెట్టారు. ఆది నుంచి తెలుగువారి ప్రోత్సాహం పొందడం వల్ల తెలుగువారన్నా, తెలుగు భాష అన్నా లీలకు చాల ఇష్టం. శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటూ తన తొమ్మిదో ఏడాదే సంగీతకచేరి చేసారు పి.లీల. ఆంధ్రమహిళా సభలో తొలిసారి సంగీత కచేరి చేసిన ఆమెకున తెలుగు భాషమీద అభిమానం. ప్రేమ పెరిగింది. ‘భక్త తులసీదాసు’ చిత్రంకి బృందగానంలో ఒకరిగా పాడారు. తరువాత ‘మనదేశం’ చిత్రంలో బాలా త్రిపురసుందరీ….. అనే పాటను ఘంటసాల ప్రోత్సాహంతో పాడారు. అప్పటికి తెలుగు మాట్లాడడం, అర్ధం చేసుకోవడం లీలకు తెలియదు. అందుకే మలయాళంలో ఆ పాట రాసుకుని పాడారట. తెలుగు భాష రాకుండా తెలుగు పాటలు పాడితే బాగుండదని తెలుగు నేర్చుకున్నారు. తెలుగువారి వల్లనే గాయనిగా తనకు ప్రముఖ స్థానం లభించిందని పి. లీల అనేవారు. ఆకాశవాణిలో కూడా పాటలు పాడుతున్న పి.లీలను చూసి తొలుత ‘కంకణం’ తమిళ చిత్రంలో పాడించారు. ఈ చిత్రంలో పాడటానికి ముందుగానే కొలంబియా గ్రామఫోన్ కంపెనీ సరస్వతి స్టోర్స్ పి. లీల పాడిన ప్రయివేటు గీతాలను రికార్డులుగా విడుదల చేసారు. సంగీత దర్శకుడు సి.ఆర్. సుబ్బరామన్ సంగీతం సమకూర్చే తమిళ చిత్రాలకు పాటలు పాడుతూ, ఆయన వద్దనూ శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారు లీల.
ఘంటసాల ప్రోత్సాహంతో ఆయన సంగీత దర్శకత్వం వహించిన ‘మనదేశం’ చిత్రంలో బాలా త్రిపుర సుందరి… పాట పాడటంతో తెలుగులో గాయనిగా ఆమె కెరీర్ ప్రారంభం అయింది. కీలుగుర్రంలో దిక్కు తెలియదేమి సేతు, గుణసుందరికథలో ‘ఓ మాతా రావా, మొర వినవా…’ ‘ఉపకార గుణాలయవై ఉన్నావు కదే మాతా …,’ కల్పకమ తల్లివై ఘనత వెలిసిన గౌరి…, ‘ఏ ఊరు ఏలినావో…’ శ్రీతులసీ ప్రియ తులసీ పాటలను, ‘పాతాళభైరవి’ చిత్రంలో ‘తీయని ఊహలు హాయిని గొలిపే వసంత గానమె హాయి. కలవరమాయె మదిలో, నా మదిలో, ఎంత ఘాటు ప్రేమయో…, ‘పెళ్ళిచేసి చూడు’లో ‘మనసా నేనెవరో, నీకు తెలుసా…’ ఏడుకొండలవాడా వెంకటరమణా, ఎవరో…ఎవరో, చంద్రహారంలో ‘దయ గనవే తల్లిd…’ కృప గనవా నా మొర వినవా…’ ఏ సాధువులు ఎందు హింసలు బడకుండ… అని సాగే పద్యం, ‘మిస్సమ్మ’లో ‘తెలుసుకొనవె చెల్లిd…’ ‘కరుణించు మేరిమాతా…’ ‘రావోయి చందమామా…’ ‘ఏమిటో ఈ మాయా…’ ‘మాయాబజార్’లో ‘నీవేనా నను తలచినది..’ ‘చూపులు కలసిన శుభవేళా…’ ‘విన్నావ యశోదమ్మా..’, ‘లాహిరి లాహిరి లాహిరిలో’, నీ కోసమే నే జీవించునది… పెళ్ళి నాటి ప్రమాణాలులో ‘వెన్నెలలోనే వేడి ఏలకో..’ నీతోనే లోకము, నీతోనే స్వర్గము, లాలి మా పాపాయి ఆనందలాలీ…’ ‘అప్పుచేసి పప్పుకూడు’లో ‘రామనామ శరణం, భద్రాద్రిరామ శరణం’, ‘ఎచట నుండి వీచినో ఈ చల్లని గాలి’, ‘సుందరాంగులను చూసిన వేళల…,’ ‘ఆనందం పరమానందం..’ ‘చేయి చేయి కలుపరావె హాయి హాయిగా…,’ గుండమ్మకథలో ‘వేషము మార్చెను…’ ముద్దుబిడ్డలో జయమంగళ గౌరీదేవీ… ‘పాండవ వనవాసం’లో దేవా దీనబాంధవా… వంటి పాటలు సోలో గీతాలుగాను, యుగళగీతాలుగాను పాడారు లీలగా. తెలుగు చిత్రరంగంలో నిలదొక్కుకోడానికి, తెలుగు గాయని కాబోలు అని అనిపించుకోడానికి ఘంటసాల ప్రధాన కారకులైతే, సి.ఆర్, సుబ్బరామన్, ఓగిరాల రామచంద్రరావు, విజయా కృష్ణమూర్తి, సుసర్ల దక్షిణామూర్తి, మాస్టర్ వేణు, టి.వి.రాజు, ఎస్.రాజేశ్వరావు, పెండ్యాల ఇలా పలువురు సంగీత దర్శకులు, విజయా సంస్థ , నిర్మాతలు, దర్శకుల ప్రోత్సాహం మరుపురానిదనేవారు పి.లీల.
తన సినీ జీవితములో అనేక అవార్డులు అందుకొన్న లీలకు 1969లో కేరళ ప్రభుత్వ ఉత్తమ నేపథ్యగాయకురాలు అవార్డు అందుకొన్నది. 1992లో తమిళనాడు ప్రభుత్వం లీలను కళైమామణి పురస్కారంతో సత్కరించింది.
లీలపాడిన పాటల్లో అందమె ఆనందం, ఆనందమె జీవిత మకరందం, ఏమిటో ఈ మాయా…, లవకుశలో సుశీలతో కలిసి పాడిన పాటలు ఎంతో హాయినిస్తాయి.
సావిత్రి దర్శకత్వంలో రూపొందిన ‘చిన్నారి పాపలు’ చిత్రానికి సంగీత దర్వకత్వం నిర్వహించారు.
సినిమా సంగీతంలో వచ్చిన మార్పులు, మెలొడీకి, సాహిత్యానికి ప్రాధాన్యత తగ్గి వాయిద్యాల హోరు పెరిగి పోవడంతో పాటలు తగ్గించారు పి. లీల. పాట పాడకుండా ఉండలేని స్థితి కారణంగా జమునారాణి, ఎ.పి. కోమల ప్రభృతులతో కలసి సినిమా పాటల కచేరి, శాస్త్రీయ సంగీత కచేరీలు నిర్వహించేవారు.
• SIతన సినీ జీవితములో అనేక అవార్డులు అందుకొన్న లీల 1969లో కేరళ ప్రభుత్వ ఉత్తమ నేపథ్యగాయకురాలు అవార్డు అందుకొన్నది. 1992లో తమిళనాడు ప్రభుత్వం లీలను కళైమామణి పురస్కారంతో సత్కరించింది.
తెలుగు సినిమారంగం
ఈమె 1949 నుండి 1984 వరకు అనేక తెలుగు సినిమాలో పాటలు పాడింది. చిన్నారి పాపలు అనే చిత్రానికి సంగీతాన్ని సమకూర్చింది[2].
పి.లీల తెలుగు చిత్రాలలో పాడిన సినిమ పాటల పాక్షిక జాబితా:
క్రమ సంఖ్య | సినిమా పేరు | పాట పల్లవి | సహ గాయకుడు/ గాయని | సంగీత దర్శకుడు | గేయ రచయిత | సినిమా విడుదలైన సంవత్సరం |
1 | మనదేశం | బాలత్రిపురసుందరీ | ఘంటసాల | 1949 | ||
2 | కీలుగుర్రం | దిక్కుతెలియదేమిసేతు దేవదేవా కావరావా దిక్కు నీవనుచు నమ్మి | ఘంటసాల | తాపీ ధర్మారావు నాయుడు | 1949 | |
3 | కీలుగుర్రం | నిదురబో నాయన్న నిదురబో నా చిన్న నిదురబో నాయయ్య నిదురబో | ఘంటసాల | తాపీ ధర్మారావు నాయుడు | 1949 | |
4 | గుణసుందరి కథ | ఉపకార గుణాలయవై ఉన్నావు కదే మాతా అపరాధములన్ని మరచి | ఓగిరాల రామచంద్రరావు | పింగళి | 1949 | |
5 | గుణసుందరి కథ | ఓ మాతా రావా నా మొరవినవా నీవు వినా దక్కెవరే ఓ రాజరాజేశ్వరి | ఓగిరాల రామచంద్రరావు | పింగళి | 1949 | |
6 | గుణసుందరి కథ | కల్పగమ తల్లివై ఘనత వెలసిన గౌరి కల్యాణ హారతిని | ఓగిరాల రామచంద్రరావు | పింగళి | 1949 | |
7 | గుణసుందరి కథ | చిటి తాళం వేసినంటే చిట్టంటుడు చేసినంటే | కస్తూరి శివరావు | ఓగిరాల రామచంద్రరావు | పింగళి | 1949 |
8 | గుణసుందరి కథ | శ్రీతులసి ప్రియతులసి జయమునీయవే జయమునీయవే | ఓగిరాల రామచంద్రరావు | పింగళి | 1949 | |
9 | లైలా మజ్ను | అందాల చిన్నదాన బంగారు వన్నెదానా పిలుపు | కె.జమునారాణి | సి.ఆర్.సుబ్బరామన్ | సముద్రాల సీనియర్ | 1949 |
10 | శ్రీ లక్ష్మమ్మ కథ | ఇది నా విధికృతమా గతిమాలిన జన్మ యిల బాధలకేనా | సి.ఆర్.సుబ్బరామన్ | 1950 | ||
11 | శ్రీ లక్ష్మమ్మ కథ | చిన్నారి బంగారు చిలకవే నా తల్లి చిగురుమావులలోన | బృందం | సి.ఆర్.సుబ్బరామన్ | 1950 | |
12 | శ్రీ లక్ష్మమ్మ కథ | జీవితమే వృధాయౌనో సుఖించే ఆశలు మాసెనో | బృందం | సి.ఆర్.సుబ్బరామన్ | 1950 | |
13 | అగ్నిపరీక్ష | వసంత రుతువే హాయి మురిపించి మించెనోయి | గాలిపెంచల | కె.జి. శర్మ | 1951 | |
14 | పాతాళ భైరవి | ఎంత ఘాటు ప్రేమయో ఎంత తీవ్ర వీక్షణమో కన్నుకాటు | ఘంటసాల | ఘంటసాల | పింగళి | 1951 |
15 | పాతాళ భైరవి | కలవరమాయే మదిలో నా మదిలో కన్నులలోన కలలే | ఘంటసాల | ఘంటసాల | పింగళి | 1951 |
16 | పాతాళ భైరవి | తీయని ఊహలు హాయిని గొలిపే వసంత గానమే హాయి వసంత | బృందం | ఘంటసాల | పింగళి | 1951 |
17 | పాతాళ భైరవి | హయిగా మనకింక స్వేచ్ఛగా | ఘంటసాల | ఘంటసాల | పింగళి | 1951 |
18 | సర్వాధికారి | అందాల నారాజు నన్నేలే రతిరాజు ముద్దు మురిపాలు | సుసర్ల దక్షిణామూర్తి | 1951 | ||
19 | చిన్నమ్మ కథ | కనుపించినావు రావో రాకున్న విడువనోయీ | వేలూరు కృష్ణమూర్తి | 1952 | ||
20 | పెళ్ళి చేసి చూడు | ఎవరో ఎవరో ఈ నవనాటక సూత్రధారులు.. ఎవరా ఎవరా | ఘంటసాల | ఘంటసాల | పింగళి | 1952 |
21 | పెళ్ళి చేసి చూడు | ఏడుకొండలవాడా ! వెంకటారమణా! సద్దు శాయక నీవు | ఘంటసాల | పింగళి | 1952 | |
22 | పెళ్ళి చేసి చూడు | ప్రియా ! ప్రియా! హా ప్రియా! ప్రియా యుగ | పిఠాపురం, రామకృష్ణ | ఘంటసాల | పింగళి | 1952 |
23 | పెళ్ళి చేసి చూడు | మనసా నేనెవరో నీకు తెలుసా నీకు తెలుసా తెలుసా మనసా | ఘంటసాల | పింగళి | 1952 | |
24 | మిస్సమ్మ | ఏమిటో ఈ మాయా ఓ చల్లని రాజా వెన్నెల రాజా | ఎస్.రాజేశ్వరరావు | పింగళి | 1955 | |
25 | మిస్సమ్మ | కరుణించు మేరీమాత శరణింక నీవే మేరీమాత | ఎస్.రాజేశ్వరరావు | పింగళి | 1955 | |
26 | మిస్సమ్మ | తెలుసుకొనవె చెల్లి అలా నడచుకొనవే చెల్లీ మగవారికి దూరముగా | ఎస్.రాజేశ్వరరావు | పింగళి | 1955 | |
27 | మిస్సమ్మ | రాగసుధారస పానము చేసి రాజిల్లవే ఓ మనసా | సి.కృష్ణవేణి | ఎస్.రాజేశ్వరరావు | పింగళి | 1955 |
28 | మిస్సమ్మ | రావోయి చందమామ మా వింత గాథ వినుమా | ఎ.ఎం.రాజా | ఎస్.రాజేశ్వరరావు | పింగళి | 1955 |
29 | చరణదాసి | ఈ దయ చాలునురా కృష్ణా కాదనకీరా నాకో వరము | ఎస్.రాజేశ్వరరావు | 1956 | ||
30 | చింతామణి | తగునా నను నీట ముంచ తగునా కన్నీట ముంచ తగునా | అద్దేపల్లి రామారావు, టి.వి.రాజు | 1956 | ||
31 | చిరంజీవులు | అల్లవాడే రేపల్లెవాడే అల్లిబిల్లి పిల్లంగొవి | ఘంటసాల బృందం | ఘంటసాల | మల్లాది రామకృష్ణశాస్త్రి | 1956 |
32 | చిరంజీవులు | ఎందాక ఎందాక ఎందాక అందాక అందాక | ఘంటసాల | ఘంటసాల | మల్లాది రామకృష్ణశాస్త్రి | 1956 |
33 | చిరంజీవులు | ఏనాటికైనా నీ దాననే ఏనాటికైనా నీ దాననే | ఘంటసాల | మల్లాది రామకృష్ణశాస్త్రి | 1956 | |
34 | చిరంజీవులు | కనుపాప కరవైన కనులెందుకో తనవారే పరులైన | ఘంటసాల | ఘంటసాల | మల్లాది రామకృష్ణశాస్త్రి | 1956 |
35 | చిరంజీవులు | చికిలింత చిగురు సంపంగి గుబురు చినదాని మనసు | ఘంటసాల | ఘంటసాల | మల్లాది రామకృష్ణశాస్త్రి | 1956 |
36 | చిరంజీవులు | తెల్లవార వచ్చె తెలియక నా సామి మళ్ళి పరుండేవు లేరా | ఘంటసాల | మల్లాది రామకృష్ణశాస్త్రి | 1956 | |
37 | భలే రాముడు | ఓహో మేఘమాలా నీలాల మేఘమాలా చల్లగ రావేలా మెల్లగ రావేల | ఎస్. రాజేశ్వరరావు | సదాశివబ్రహ్మం | 1956 | |
38 | హరిశ్చంద్ర | ఏలమ్మా ఈ వర్షధార లోకమేనిండి కల్లోలమైపోయె ఏలమ్మ | సుసర్ల దక్షిణామూర్తి | జంపన | 1956 | |
39 | దొంగల్లో దొర | విన్నావా చిన్నదాన అదో ఆ దూర తీరాల అనురాగ రాగాల | ఘంటసాల | ఎం.ఎస్.రాజు | నారపరెడ్డి | 1957 |
40 | మాయాబజార్ | చూపులు కలసిన శుభవేళా ఎందుకు నీకీ కలవరము | ఘంటసాల | ఎస్.రాజేశ్వరరావు | పింగళి | 1957 |
41 | మాయాబజార్ | దయచేయండి దయచేయండి | ఘంటసాల, పి.సుశీల | ఘంటసాల | పింగళి | 1957 |
42 | మాయాబజార్ | నీకోసమె నే జీవించునది | ఘంటసాల | ఎస్.రాజేశ్వరరావు | పింగళి | 1957 |
43 | మాయాబజార్ | నీవేనా నను తలచినది | ఘంటసాల | ఎస్.రాజేశ్వరరావు | పింగళి | 1957 |
44 | మాయాబజార్ | లాహిరి లాహిరి లాహిరిలో | ఘంటసాల | ఎస్.రాజేశ్వరరావు | పింగళి | 1957 |
45 | మాయాబజార్ | విన్నావటమ్మా ఓ యశోదమ్మా | పి.సుశీల, స్వర్ణలత | ఘంటసాల | పింగళి | 1957 |
46 | వినాయక చవితి | ఆలించరా మొరాలించరా లాలించి నను పరిపాలించరా | ఘంటసాల | సముద్రాల సీనియర్ | 1957 | |
47 | వినాయక చవితి | తనూవూగే నా మనసూగె నునుతొలకరి మెరపుల తలపులతో | ఘంటసాల | సముద్రాల సీనియర్ | 1957 | |
48 | వినాయక చవితి | రాజా ప్రేమ జూపరా నా పూజల చేకోరా | ఎం.ఎస్.రామారావు బృందం | ఘంటసాల | సముద్రాల సీనియర్ | 1957 |
49 | సతీ అనసూయ | ఓ నాగ దేవతా నా సేవగొని దయసేయుమయా ఓ నాగదేవతా | ఘంటసాల | సముద్రాల జూనియర్ | 1957 | |
50 | సారంగధర | జయ జయ మంగళ గౌరి జయ జయ శంకరి కౌమారి | ఘంటసాల | సముద్రాల సీనియర్ | 1957 | |
51 | అప్పుచేసి పప్పుకూడు | ఎచటినుండి వీచెనో ఈ చల్లని గాలి తీవెల పై | ఘంటసాల | ఎస్.రాజేశ్వరరావు | పింగళి | 1959 |
52 | పెళ్ళి సందడి | అప్పటికి ఇప్పటికి ఎంతో తేడా అది తెలిసి మసలుకో బస్తీ చిన్నోడా | ఘంటసాల | సముద్రాల జూనియర్ | 1959 | |
53 | సతీ సుకన్య | అందాల సొగసులు చిందెనే కనువిందేనే మది పొంగేనే ఔనే | ఘంటసాల | శ్రీరామచంద్ | 1959 | |
54 | భక్త రఘునాథ్ | హేశివశంకరా నమ్మినవారి కావగలేవా మమ్మిటుచేయుట న్యాయమా | ఘంటసాల | సముద్రాల సీనియర్ | 1960 | |
55 | మహాకవి కాళిదాసు | రసికరాజమణిరాజిత సభలో యశము గాంచెదవే సోదరి | రత్నం | పెండ్యాల | పింగళి | 1960 |
56 | శాంతి నివాసం | కలనైనా నీ వలపే కలవరమందైనా నీ తలపే | ఘంటసాల | సముద్రాల జూనియర్ | 1960 | |
57 | శాంతి నివాసం | సెలయేటి జాలులాగ చిందేసే లేడిలాగ సరదాగ గాలిలోన | ఎ.పి.కోమల బృందం | ఘంటసాల | సముద్రాల జూనియర్ | 1960 |
58 | జగదేకవీరుని కథ | జలకాలాటలలో కలకల పాటలలో ఏమి హాయీలే హలా | పసుశీల బృందం | పెండ్యాల | పింగళి | 1960 |
59 | ఋష్యశృంగ | ఆనందమీనాడే పరమానంద మీనాడే | టి.వి.రాజు | సముద్రాల జూనియర్ | 1961 | |
60 | సీతారామ కళ్యాణం | ఓ సుకుమారా నినుగని మురిసితిరా నిను వలచేర | ఘంటసాల | గాలిపెంచల | సముద్రాల సీనియర్ | 1961 |
61 | శ్రీకృష్ణ కుచేల | నీ దయ రాదయా ఓ మాధవా కడువేదన పాలైన మాపైన | ఘంటసాల | ఘంటసాల | పాలగుమ్మి పద్మరాజు | 1961 |
62 | గుండమ్మ కథ | వేషము మార్చెనూ భాషను మార్చెను మోసము నేర్చెను అసలు తానే మారెను | ఘంటసాల | ఘంటసాల | పింగళి | 1962 |
63 | మహామంత్రి తిమ్మరుసు | జయవాణీ చరణకమల సన్నిధి మన సాధన రసికసభా రంజనగా | ఘంటసాల | పెండ్యాల | పింగళి | 1962 |
64 | ఆప్తమిత్రులు | పవనా మదనుడేడా మరలిరాడా తెలుపరా వేగ | ఎ.పి.కోమల | ఘంటసాల | సముద్రాల జూనియర్ | 1963 |
65 | రాణీ సంయుక్త | ఓ వెన్నెలా ఓ వెన్నెలా వేగ మురిపించవా వెన్నెలా | ఘంటసాల | ఎం.రంగారావు | ఆరుద్ర | 1963 |
66 | లవకుశ | జగదభి రాముడు శ్రీరాముడే, రఘుకుల సోముడు ఆ రాముడే | ఘంటసాల, పి.సుశీల, వైదేహి, పద్మామల్లిక్ | ఘంటసాల | సముద్రాల సీనియర్ | 1963 |
67 | లవకుశ | రామకథను వినరయ్యా ఇహపర సుఖముల నొసగే సీతా రామకథను వినరయ్యా | పి.సుశీల | ఘంటసాల | సముద్రాల సీనియర్ | 1963 |
68 | లవకుశ | రామసుగుణధామ రఘువంశ జలధిసోమ సీతామనోభిరామా సాకేత సార్వభౌమ | పి.సుశీల | ఘంటసాల | సముద్రాల సీనియర్ | 1963 |
69 | లవకుశ | లేరు కుశలవుల సాటి సరి వీరులు ధారుణిలో | పి.సుశీల | ఘంటసాల | సముద్రాల సీనియర్ | 1963 |
70 | లవకుశ | వినుడు వినుడు రామాయణ గాథా వినుడీ మనసారా | పి.సుశీల | ఘంటసాల | సముద్రాల సీనియర్ | 1963 |
71 | లవకుశ | శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా ఘనశీలవతి సీతకథ వినుడోయమ్మా | పి.సుశీల | ఘంటసాల | సముద్రాల సీనియర్ | 1963 |
72 | సోమవార వ్రత మహాత్మ్యం | అడిగితినని అలుసా నిన్నడగనులే పోనీ నీ నోటి పసిడి | మాస్టర్ వేణు | నార్ల చిరంజీవి | 1963 | |
73 | పతివ్రత | రావో రాధామోహనా నమ్మినానోయి రాధాకృష్ణా | ఎం.రంగారావు | అనిసెట్టి | 1964 | |
74 | పతివ్రత | నీ చెలికనవో నీ చెలి గనవా చలించవా | మాధవపెద్ది | ఎం.రంగారావు | అనిసెట్టి | 1964 |
75 | పతివ్రత | లేత లేత వయసులో జాతి మేలు కోరుతు దేశభక్తి | బృందం | ఎం.రంగారావు | అనిసెట్టి | 1964 |
76 | పతివ్రత | సా సా సా సా పాడమ్మా .. మోహన మూర్తివి నీవో | పి.బి.శ్రీనివాస్ | ఎం.రంగారావు | అనిసెట్టి | 1964 |
77 | బభ్రువాహన | ఏలరా మనోహరా త్రిలోక మోహనా ఏలరా మనోహరా | పామర్తి | సముద్రాల సీనియర్ | 1964 | |
78 | రహస్యం | శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా శ్రీగిరినిలయా గిరిరామాయా సర్వమంగళా | ఘంటసాల | మల్లాది | 1967 | |
79 | శ్రీకృష్ణ మహిమ | కృష్ణా నా ముద్దు కృష్ణా నిదురించు నిర్మలవదనా | ఎ.పి.కోమల | ఘంటసాల | అనిసెట్టి | 1967 |
80 | శ్రీకృష్ణావతారం | విన్నారా విన్నారా వన్నెల కృష్ణుని వరాల పాటలు | బృందం | టి.వి.రాజు | సి.నా.రె. | 1967 |
81 | తారాశశాంకము | నీకే మాకే తగురా మా కౌగిళ్ళలో పస | పి.సుశీల | టి.వి.రాజు | సముద్రాల సీనియర్ | 1969 |
82 | మా ఇలవేల్పు | గౌరీ మాహేశ్వరి మము కన్న తల్లి పరమేశ్వరి | జిక్కి | జి.కె.వెంకటేష్ | సి.నా.రె. | 1971 |
మరణం
లీల అక్టోబర్ 31 2005 న చెన్నైలోని రామచంద్ర ఆసుపత్రిలో అస్వస్థతతో చికిత్స పొందుతూ మరణించింది. బాత్రూంలో జారిపడి తలకు దెబ్బ తగలడంతో ఆసుపత్రిలో చేరిన లీల మొదడులో రక్తం గడ్డకట్టిందని వైద్యులు నిర్ధారించారు. దానికై శస్త్రచికిత్స పొంది కోలుకుంటుండగా న్యుమోనియా సోకింది. అంతకు ముందునుండే లీలకు ఆస్థమా వ్యాధి ఉండటం వల్ల పరిస్థితి విషమించింది.[3]
ఈమెకు భారత ప్రభుత్వం 2006 సంవత్సరంలో మరణానంతరం పద్మ భూషణ పురస్కారం బహుకరించింద
మధుర గాయని లీల –విశాలాంధ్ర
సంగీతం వింటే మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలసిన మనసుకు మానసిక ప్రశాంతత, విశ్రాంతిని ఇచ్చే సాధనం సంగీతం. సంగీతమంటే కచ్చేరీల్లో పాడే కీర్తనలు, రాగాలే కానక్కరలేదు. జానపదగీతాలు కావచ్చు, సినీ పాటలు కూడా కావచ్చు. కాకుంటే అవి భావయుక్తమై, రాగప్రధానమై, ఎటువంటి రణగొణధ్వనులు లేకుండా ఉంటేచాలు. అమ్మఒడిలోని పాప జోలపాటకు ఏడుపునాపి హాయిగా నిద్దరొయినట్లు సంగీత ప్రధానమైన పాటలను వింటున్నప్పుడు మనసుకు కలిగే ఆనందం, విశ్రాంతి అనుభవించేవారికే తెలుస్తుంది. మానసిక ఒత్తిడిని తగ్గించే మార్గాల్లో సంగీతం, సంగీతంతో కూడిన పాటలు వినడం ఒక మార్గం. అటువంటి వాటిలో సినిమా పాటలు కూడా ఒకటి. 50 యేళ్ళక్రితం నిర్మించగా విడుదలైన సినిమాల్లోని పాటలను సైతం నేటికీ విని ఆనందిస్తున్నామంటే ఆ పాటల్లోని భావం, వాటి సంగీతం, పాడిన గాయనీగాయకుల గొప్పతనమే అనిచెప్పకతప్పదు. అలా పాతతరంనాటి ఎన్నో సినిమాల్లో అద్భుతమైన పాటలకు ప్రాణప్రతిష్టచేసి నేటికి పాడుకునేలా చేయగలిగిన గాయనీమణుల్లో పి.లీల ఒకరు.
దక్షిణ భారత భాషలైన తెలుగు, తమిళం, కన్నడం, మళయాళం భాషచిత్రాల్లో వేల సంఖ్యలో పాటలు పాడారు. అలాగే బెంగాలీ, సింహాళ చిత్రాలలో కూడా పాటలు పాడారు. కేవలం సినీపాటలే కాదు భక్తిగీతా లను సైతం అద్బుతంగా ఆలపించారు. భారతదేశం గర్వించదగ్గ సంగీతసరస్వతులు ఎం.ఎస్. సుబ్బలక్ష్మి, ఎం.ఎల్. వసంతకుమారి, డి.కె. పట్టామ్మాళ్ వంటి వారి సమకాలీకురాలు కావడం ఆమెకు సంగీతంపై మక్కువకు కారణంకావచ్చునేమో. కేరళ, పాలక్కడ్ లోని చిట్టూర్లో 1934 సంవత్సరంలో పుట్టారు పొరయాతు లీల.లీలతో పాటు ఆమె తల్లిదండ్రులకు ముగ్గురు ఆడపిల్లలు. తల్లితండ్రులు సంగీతప్రియులు కావడంతో లీలకు స్వతహాగానే సంగీతంపై మక్కువ ఏర్పడటం గమనించి ఆమెకు కర్నాటక సంగీతం నేర్పించారు తల్లిదండ్రులు. ఆమె గొంతు కొద్దిగా లావుగా ధ్వనించేదని విమర్శించినా అదే పాటకు నిండుదనం తెచ్చిందని చెప్పాలి. అద్భుతమైన గాత్రం ఆమెకు ఓ వరం. ఎందరో ప్రముఖ విద్వాంసుల వద్ద సంగీతాన్ని అభ్యసించారు. మరింత సాధనకోసం, సంగీతం కోసం మద్రాసు చేరింది లీల కుటుంబం. మద్రాసులో ప్రముఖ సంగీత విద్వాంసుల సంగీతం వినడం, నేర్చుకోవడం ద్వారా సంగీతంలో మరింతగా రాణించి పలు పోటీల్లో పాల్గొని బహుమతులు కూడా సాధించారు.
ఈ సందర్భంలో కొలంబియా రికార్డింగ్ కంపెనీవారు తాము విడుదల చేసే పాటలకు పాటలు పాడే గాయనీ కోసం వెతుకుతుండగా లీలగారి గురించి తెలిసి ఆమెను గాయనిగా ఎంచుకున్నారు. అది ఆమె సినీరంగ ప్రవేశానికి మార్గమయిందని చెప్పొచ్చు. అయితే ఆమెకు తెలుగు, తమిళ భాషల్లో పట్టులేని కారణంగా కీర్తనలను మళయాళంలో రాసుకుని సాధనచేసి పాడేవారట. ఆ తర్వాత ట్యూటర్ను నియమించుకుని భాషపై పట్టును సాధించారు. గాయనీగాయకులకు ఉండవలసిన లక్షణాలలో ఒక లక్షణం భాషపై పట్టు సాధించడం. ఇది నేటితరం గాయనీ గాయకులు ఆదర్శంగా తీసుకోవాలి.1948 సంవత్సరంలో తొలిసారిగా తమిళంలో పాడిన పాటతో సినీ రంగ ప్రవేశం చేశారు. అప్పటికి ఆమె వయసు 14 సంవత్సరాలు. ఆ సినిమాలో హీరోయిన్కు అన్నిపాటలు ఆవిడే పాడారు. అలా తమిళంలో పాడుతూ, 1949 సంవత్సరం తెలుగులో పాడే అద్భుత అవకాశం వచ్చింది. నాగయ్యగారు నటించిన మనదేశం చిత్రంలో ఘంటసాలమాస్టారి సంగీతదర్శకత్వంలో పి.లీలను తొలిసారిగా తెలుగువారికి గాయనిగా పరిచయం చేస్తూ అందులో పాటలు పాడించారు. ఆ చిత్రం ద్వారానే ఆంధ్రుల ఆరాధ్యనటుడు స్వర్గీయ ఎన్.టి.ఆర్. పరిచయమయ్యారు. ఆ యేడాది విడుదలైన మనదేశం, కీలుగుర్రం, గుణ సుందరికథ చిత్రాల్లో ఆమె పాటలు పాడగా ఆ మూడు చిత్రాలు కూడా అద్భుత విజయం సాధించి ఆమెకు మంచిపేరు తెచ్చిపెట్టడమే కాదు తెలుగులో గాయనిగా స్థిరపడ్డారు. అంతేకాదు వాహిని, విజయా సంస్థలు నిర్మించే చిత్రాల ఆస్థానగాయనిగా పేరుపడ్డారావిడ. ఆ తర్వాత మిస్సమ్మ, షావుకారు, పాతాళభైరవి, సువర్ణ సుందరి, పెళ్ళినాటి ప్రమాణాలు, శాంతినివాసం, చిరంజీవులు, బాలనాగమ్మ, మాయాబజార్, జగదేకవీరునికథ, పెళ్ళిచేసిచూడు, గుండమ్మకథ, అప్పుచేసి పప్పుకూడు సంపూర్ణరామాయణం, బభ్రువాహన, తిరుపతమ్మ కథ, మహామంత్రి తిమ్మరసు, దక్షయజ్ఞం, శ్రీసీతారామకళ్యాణం, దీపావళి, శ్రీ వేంకటేశ్వరమహాత్మ్యం, పెళ్ళి సందడి, పాండురంగ మహాత్మ్యం, సారంగధర, భలేరాముడు, జయం మనదే, పరమానందయ్య శిష్యులకథ, నవ్వితే నవరత్నాలు, పల్లెటూరు, అనార్కలి వంటి చిత్రాల్లో అద్భుతమైన పాటలు పాడారు. సుశీల, జిక్కి, వంటి గాయనీమణులతో కూడా కలిసి ఎన్నో చక్కని గీతాలను కూడా ఆలపించారు. కేవలం సినీ గీతాలే కాకుండా ప్రైవేటుగా భక్తిగీతాలు, శ్లోకాలు, పద్యాలు కూడా పాడారు. లవకుశ చిత్రంలో ఆమె పాడిన పాటలు నేటికీ సినీప్రియులు పాడుకుంటూనే ఉంటారు. భావప్రధానంగా, రాగయుక్తగా పాడటం ఆమెకే చెల్లు. ఉత్తమగాయనిగా ఆంధ్ర, కేరళ, తమిళనాడు ప్రభుత్వాల నుండి అవార్డులను అందుకున్నారు. ఎన్నో బిరుదులు, సత్కారాలు పొందారు. ఆమె పాడిన పాటల్లో గుణసుందరికథలో ‘శ్రీ తులసి జయతులసి జయమునియ్యవే..’, బ్రతుకుతెరువు చిత్రంలో ‘అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం.’ జయసింహ చిత్రంలో ‘ఈనాటి ఈరేయి కలకాదోరు నిజమోరు,’ మిస్సమ్మ చిత్రంలో ‘కరుణించుమేరిమాత,’ ‘తెలుసుకొనవే యువతి’, ‘యేమిటో ఈ మాయ, చల్లనిరాజా వెన్నెల రాజా’, వంటి పాటలు, చిరంజీవులు చిత్రంలో ‘తెల్లవారగ వచ్చే తెలియక నాస్వామి మళ్ళీ పరుండేవు లేరా’, మాయాబజార్ చిత్రంలో ‘చిన్నారి శశిరేఖ వర్ధిల్లవమ్మ,’ ‘విన్నావా యశోదమ్మ’, జగదేకవీరుని కథలో ‘నను దయగనవా నా మొరవినవా..’, లవకుశ చిత్రంలోసుశీలగారితో ‘రామకథను వినరయ్య,’ ఊరకే కన్నీరు నింప,’, ‘వినుడు వినుడు రామాయణగాథ, ‘ శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ’ వంటి పాటలు కలిసి పాడారు. పాండవవనవాసం చిత్రంలో ‘దేవా దీనబాంధవా’, రహస్యం చిత్రంలో ‘శ్రీలలిత శివజ్యోతి సర్వకామద’ గీతాలాలపించారు. హుషారు, విషాదం, భక్తి ఇలా అన్నిరకాల పాటలు పాడారు. ‘చిన్నారిపాపలు’ అనే చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు. దక్షిణభారతదేశంలో అద్భుత పాటలకు ప్రాణప్రతిష్ట చేసిన గాయనీ మణుల్లో ప్రముఖురాలిగా సినీ ప్రియులచే అభిమానించబడిన పి.లీల 2005 అక్టోబరులో చెన్నైలో మరణించారు. ఆమె మరణించినా ఆమె పాడిన పాటలు సినీ ప్రియుల మదిలో సజీవమై ఉన్నంతకాలం ఆమె పాటలరూపంలో బ్రతికే ఉంటారు.
అవును పాటలలో చిరంజీవిగా నిలిచారు లీల
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -14—2-22-ఉయ్యూరు