మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -82
82-ఇంటిపేరు లలితమైన పువ్వుల స్వరంమాత్రం కంచు నారద ఫేం,కళావిశారద ,గానగంధర్వ –సూరిబాబు
పి.సూరిబాబు లేదా పువ్వుల సూరిబాబు (ఫిబ్రవరి 22, 1915 – ఫిబ్రవరి 12, 1968) సుప్రసిద్ధ తెలుగు రంగస్థల, సినిమా నతొలి రోజులు
వీరు ఫిబ్రవరి 22, 1915 సంవత్సరంలో గుడివాడ తాలూకా బొమ్ములూరు గ్రామంలో జన్మించారు. చిన్నతనంలోనే మేనమామ హనుమాన్లు గారి వద్ద సంగీతం నేర్చుకున్నారు. నాటకాల మీద మోజుతో గద్వాల పారిపోయి, సంస్థానపు నాటక సమాజంలో చేరి పాత్రలు పోషించి తిరిగివచ్చారు.
ఆనాడు గుంటూరులో దంటు వెంకటకృష్ణయ్య “బాలమిత్ర సభ” పేరుతో చిన్నపిల్లల నాటక సమాజాన్ని నడుపుతున్నారు. అందులో కొప్పరపు సుబ్బారావు గారు నాటక ప్రయోక్తగా, సంగీత దర్శకులుగా శిక్షణ ఇస్తున్నారు. సూరిబాబు ఈ సభలో చేరి వివిధ వేషాలు పోషించి అనతికాలంలోనే అగ్రశ్రేణి నటుడిగా పేరుపొందారు. ఆనాటి నాటక సమాజాల వారు సూరిబాబు కోసం పోటీపడేవారు.
నాటక సమాజం
సూరిబాబు 1931 సంవత్సరంలో బాలకృష్ణ నాటక సమాజాన్ని గుడివాడలో స్థాపించి భక్త విజయం, మాయా మధుసూదన నాటకాలను పెద్ద ఎత్తున ప్రదర్శించారు. నష్టాలతో సమాజం మూతపడింది. 1936లో తెనాలి చేరి సత్యనారాయణ నాట్యమండలి పేరుతో నాటకాలను ప్రదర్శించారు.
1944 సంవత్సరంలో నటీమణి రాజరాజేశ్వరిని వివాహం చేసుకొని ఆమె పేరుమీద రాజరాజేశ్వరి నాట్యమండలిని స్థాపించి కొప్పరపు సుబ్బారావు గారితో “తారా శశాంకం” నాటకాన్ని వ్రాయించి తానే దర్శకత్వం వహించి చనిపోయేవరకు 15 వందలకు పైగా నాటకాలు ఆంధ్రదేశమంతా ప్రదర్శించారు. ఇది కాక భూకైలాస్, కురుక్షేత్రం, విప్రనారాయణ, తులాభారం మొదలైన పౌరాణిక నాటకాలను భారతదేశమంతా ప్రదర్శించి అఖండమైన కీర్తి ప్రతిష్ఠలు సంపాదించారు
జెమినీ వారి జీవన్ముక్తి సినిమాలో పి.సూరిబాబు పాడిన వెలిగింపుమా నాలో జ్యోతి పాట
వీరు చాలా విభిన్నమైన పాత్రలను పోషించారు. వాటిలో నారదుడు, కంసుడు, ధర్మరాజు, విప్రనారాయణ, బిల్వమంగళుడు, భవానీశంకరుడు, రాజరాజు, సుబుద్ధి, రామదాసు, చినరంగారావు, ధర్మారాయుడు మొదలైనవి ముఖ్యమైనవి. ఎన్ని నాటకాలాడినా, ఆయన గాత్రం కంచు గంటలా మారుమ్రోగేది. మైక్ లేకపోయినా ఒక ఫర్లాంగు దూరం వరకు పద్య పఠనము, వాచిన విధానము క్లియర్ గా వినపడేవి. పద్యాన్ని భావయుక్తంగా విరిచి పాడడంతో ప్రేక్షకులను అవలీలగా ఆకట్టుకొనేవారు.
1946లో మైసూరు మహారాజావారి దర్బారులో వీరి నాటకాలను ప్రదర్శించి సన్మానం పొందారు. 1957లో తెనాలిలో సూరిబాబుకి గజారోహణం, గండపెండేరం మొదలైన సన్మానాలు జరిపి కళావిశారద, గాన గంధర్వ మొదలైన బిరుదులు అందుకున్నారు.
భారతదేశమంతా అపార ఆదరాభిమానాలను సంపాదించిన సూరిబాబు ఫిబ్రవరి 12, 1968 న స్వర్గస్తులైనారు.
సినీ ప్రస్థానం
· దక్షయజ్ఞం (1962) (నటుడు, గాయకుడు)
· ఉషా పరిణయం (1961)
· శ్రీ వేంకటేశ్వర మహత్మ్యం (1960) (నటుడు, గాయకుడు)
· కృష్ణ లీలలు (1959) (నటుడు)
· సతీ సావిత్రి (1957) (నటుడు)
· శ్రీకృష్ణ తులాభారం (1955) (నటుడు)
· జీవన ముక్తి (1942)
· తారా శశాంకం (1941) (నటుడు, గాయకుడు)
· రైతు బిడ్డ (1939) (నటుడు)
· మాలపిల్ల (1938) (నటుడు, గాయకుడు)
· కనకతార (1937)
కంచులా మ్రోగే కంఠస్వరంతో, కఠినంగా అనిపించే పద్యాలను పామరులకు సైతం అర్థమయ్యేలాగా సుస్పష్టమైన ఉచ్చారణతో పాడి అటు రంగస్థలాన్ని, ఇటు తెలుగు చిత్ర రంగాన్ని సుసంపన్నం చేసిన నటుడు పువ్వుల సూరిబాబు.
ఆనాడు గుంటూరులో దంటు వెంకటకృష్ణయ్య “బాలమిత్ర సభ” పేరుతో చిన్నపిల్లల నాటక సమాజాన్ని నడుపుతున్నారు. అందులో కొప్పరపు సుబ్బారావు గారు నాటక ప్రయోక్తగా, సంగీత దర్శకులుగా శిక్షణ ఇస్తున్నారు. సూరిబాబు ఈ సభలో చేరి వివిధ వేషాలు పోషించి అనతికాలంలోనే అగ్రశ్రేణి నటుడిగా పేరుపొందారు. ఆనాటి నాటక సమాజాల వారు సూరిబాబు కోసం పోటీపడేవారు.
సూరిబాబు 1931 సంవత్సరంలో బాలకృష్ణ నాటక సమాజాన్ని గుడివాడలో స్థాపించి భక్త విజయం, మాయా మధుసూదన నాటకాలను పెద్ద ఎత్తున ప్రదర్శించారు. నష్టాలతో సమాజం మూతపడింది. 1936లో తెనాలి చేరి సత్యనారాయణ నాట్యమండలి పేరుతో నాటకాలను ప్రదర్శించారు.
1944 సంవత్సరంలో నటీమణి రాజరాజేశ్వరిని వివాహం చేసుకొని ఆమె పేరుమీద రాజరాజేశ్వరి నాట్యమండలిని స్థాపించి కొప్పరపు సుబ్బారావు గారితో “తారా శశాంకం” నాటకాన్ని వ్రాయించి తానే దర్శకత్వం వహించి చనిపోయేవరకు 15 వందలకు పైగా నాటకాలు ఆంధ్రదేశమంతా ప్రదర్శించారు. ఇది కాక భూకైలాస్, కురుక్షేత్రం, విప్రనారాయణ, తులాభారం మొదలైన పౌరాణిక నాటకాలను భారతదేశమంతా ప్రదర్శించి అఖండమైన కీర్తి ప్రతిష్టలు సంపాదించారు.
వీరు చాలా విభిన్నమైన పాత్రలను పోషించారు. వాటిలో నారదుడు, కంసుడు, ధర్మరాజు, విప్రనారాయణ, బిల్వమంగళుడు, భవానీశంకరుడు, రాజరాజు, సుబుద్ధి, రామదాసు, చినరంగారావు, ధర్మారాయుడు మొదలైనవి ముఖ్యమైనవి. ఎన్ని నాటకాలాడినా, ఆయన గాత్రం కంచు గంటలా మారుమ్రోగేది. మైక్ లేకపోయినా ఒక ఫర్లాంగు దూరం వరకు పద్య పఠనము, వాచిన విధానము స్పష్టంగా వినపడేవి. పద్యాన్ని భావయుక్తంగా విరిచి పాడడంతో ప్రేక్షకులను అవలీలగా ఆకట్టుకొనేవారు.
1946లో మైసూరు మహారాజావారి దర్బారులో వీరి నాటకాలను ప్రదర్శించి సన్మానం పొందారు. 1957లో తెనాలిలో సూరిబాబుకి గజారోహణం, గండపెండేరం మొదలైన సన్మానాలు జరిపి కళావిశారద, గాన గంధర్వ మొదలైన బిరుదులు అందుకున్నారు.
ద్రౌపదీ వస్త్రాపహరణం తో చిత్రసీమలో ప్రవేశించారు. మాలపిల్ల చిత్రంలో ఆయన పాడిన ‘కొల్లాయి కట్టితేనేమి మా గాంధీ….’ పాట వాడ వాడలా మార్మోగింది. చాలా చిత్రాల్లో నటించడమే కాక తన పాటలు, పద్యాలు తానే పాడుకున్నారు. అంతేకాదు పాటలను, ముఖ్యంగా పద్యాలను స్వరపరచడానికి సంగీత దర్శకులు సూరిబాబు గారి సహకారం తీసుకునేవారు. అలా మహాకవి కాళిదాసు చిత్రంలోని మాణిక్య వీణాం……. శ్లోకం స్వరకల్పనలో ఈయన హస్తం కూడా వుంది.
తెనాలిలో సత్యనారాయణ నాట్యమండలి ప్రారంభించి కొన్ని నాటకాలు ప్రదర్శించారు .కలకత్తా బొంబాయి మైసూర్ బెంగుళూర్
లలోనూ నాటాకాలు ప్రదర్శించి దేశవ్యాప్తకీర్తి నార్జించారు .రామదాసు లో రామా దాసు బొబ్బిలియుద్ధంలో ధర్మారాయుడు ,రంగారావు ,
భక్త విజయం లో గజేంద్రుడు ,తక్షకుడు ,కశ్యపుడు ,ఉత్తానపాదుడు ,నారదుడు ,మాయా మధు సూడాన లో కంసుడు ,కురుక్షేత్రం లో ధర్మరాజు
భీముడు ,అర్జునుడు ,ద్రుత రాష్ట్రుడు ,అశ్వత్ధామ ,భీష్ముడు ,విప్రనారాయణలో విప్రనారాయణుడు ,చింతామణిలో బిల్వ మంగళుడు ,
భవానీ శకరుడు ,సారంగధరలో రాజరాజు ,సుబుద్ధి పాత్రలు పోషించి ఆ పాత్రలు ఆయనకోసమే ఉన్నాయా అన్నట్లు నటించి చిరస్మరణీయం చేశారు
కంచు గంట వంటి గాత్రం స్పష్టమైన నిర్దుష్ట వాచికం ,చక్కని అభినయం సూరిబాబు సొత్తు .
1946లో మైసూర్ మహారాజ దర్బార్ లో నాటకాలు ప్రదర్శించి సన్మానాలు పొందారు .1957లో గజారోహణం గండపెండేరం అందుకొన్నారు .కళా విశారద ,గాన గ౦ధర్వ బిరుదాంకితులు .డా సర్వేపల్లి రాదా కృష్ణన్ ,పృధ్వీ రాజ్ కపూర్ లు సూరిబాబు నటనను బాగా మెచ్చుకొన్నారు .పోట్టివాడైనా గట్టివాడనే సామెత రుజువు చేసుకొన్నారు సూరిబాబు .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -19-2-22-ఉయ్యూరు