· మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -153
· 153-శరత్ బాబు ,రా.వి..శాస్త్రి లనుతెరకు పరిచయం చేసిన 75బహుభాషా చిత్ర నిర్మాత –అట్లూరి పూర్ణచంద్రరావు
· అట్లూరి పూర్ణచంద్రరావు తెలుగు, హిందీ చలనచిత్రాల నిర్మాత, కమ్యూనిస్టు నాయకుడు.[1]
జీవిత విశేషాలు
ఇతడు కృష్ణాజిల్లా, గుడివాడ మండలం, చౌటుపల్లి గ్రామంలో 1925వ సంవత్సరం ఏప్రిల్ 4న జన్మించాడు[2]. ఇతనికి చదువు అబ్బలేదు. ఎస్.ఎస్.సి ఫెయిల్ అయిన తర్వాత ఇంటి నుండి పారిపోయి విజయవాడలో ఒక కాంట్రాక్టర్ వద్ద మూడు నెలలు పనిచేశాడు. తర్వాత గుడివాడలోని గౌరీశంకర్ టాకీసులో ప్రొజెక్టర్ ఆపరేటింగ్ అసిస్టెంట్గా, బుకింగ్ క్లర్క్గా ఆరు నెలలు పనిచేశాడు. తర్వాత విజయవాడలోని నవయుగ ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ కంపెనీలో ఐదు సంవత్సరాలు పనిచేశాడు. అదే సంస్థ గుంతకల్లు బ్రాంచి మేనేజరుగా కొంతకాలం పనిచేశాడు. తర్వాత మద్రాసుకు వెళ్లి బి.విఠలాచార్య, పి.పుల్లయ్యల వద్ద సహాయ దర్శకుడిగా పనిచేశాడు. తర్వాత మిత్రుల సలహాతో ప్రొడక్షన్ రంగంలోకి ప్రవేశించాడు. సినిమాలలో ప్రొడక్షన్ అసిస్టెంటుగా నాలుగు సంవత్సరాలు పనిచేసి మెళకువలు నేర్చుకున్నాడు.
సినీ నిర్మాణ రంగంలో
ఇతడు 1964లో మొట్టమొదటగా అగ్గిమీద గుగ్గిలం చిత్రాన్ని ప్రారంభించాడు. నవభారత్ ఫిలింస్ బ్యానర్పై నిర్మించిన ఈ చిత్రానికి పి.ఎస్.ప్రకాశరావు 50వేలు పెట్టుబడి పెట్టాడు. ఈ చిత్రం ప్రారంభం నుండి చివరివరకు పూర్ణచంద్రరావు చూసుకున్నా నిర్మాతగా ఇతని పేరు మొదటి ఐదు సినిమాలలో వేసుకోలేదు. ఇతడు తెలుగులో 35 సినిమాలు, హిందీలో 18 సినిమాలు, తమిళంలో 13 సినిమాలు, కన్నడ, బెంగాలీ, ఒరియా, మరాఠీ భాషలలో రెండేసి చిత్రాలు, భోజ్పురిలో ఒక చిత్రం నిర్మించాడు.
శరత్ బాబును సినీ నటుడిగా పరిచయం చేశాడు. రాచకొండ విశ్వనాథ శాస్త్రిని సినీ సంభాషణల రచయితగా వెండితెరకు పరిచయం చేశాడు.[1]
సినిమాల జాబితా
- అగ్గిమీద గుగ్గిలం
- అపాయంలో ఉపాయం
- ఉక్కుపిడుగు
- గజదొంగ గంగన్న
- మాతృదేవత
- రైతు కుటుంబం
- రౌడీరాణి
- పాపం పసివాడు
- ప్రేమ పుస్తకం
- వెంకీ
- లోక్ పరలోక్ (హిందీ)
- మాంగ్ భరో సజనా (హిందీ)
- ఏక్ హీ భూల్ (హిందీ)
- అంధాకానూన్ (హిందీ)
- ఆఖరీరాస్తా (హిందీ)
- చాల్భాజ్ (హిందీ)
- దిల్ (తమిళ)
- యూత్ (తమిళ)
- ఇడియట్ (హిందీ)
మరణం
కొంతకాలం కాలేయ క్యాన్సర్ తో బాధపడుతూ 2017, అక్టోబరు 29 న హైదరాబాదులోని ఓ ఆసుపత్రిలో ప్రాణాలు విడిచాడు.[3] ఈయన భార్య మరుద్వతి. వీరికి ఇరువురు కుమారులు ఉన్నారు.
ప్రముఖ సినీ నిర్మాత, కమ్యూనిస్టు నాయకుడు అట్లూరి పూర్ణచంద్రరావు (92) కన్నుమూశారు. మేడ్చల్ జిల్లా కాప్రా మండలం కమలానగర్ లో తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. పూర్ణచంద్రరావు మృతిపై పలువురు సినీ ప్రముఖులు, కమ్యూనిస్టు నాయకులు సంతాపం తెలిపారు. కాగా, కృష్ణా జిల్లా చవుటపల్లి గ్రామంలో పూర్ణచంద్రరావు జన్మించారు.
పదో తరగతి తప్పడంతో మనస్తాపం చెందిన ఆయన ఆత్మహత్య చేసుకుందామని విజయవాడ కృష్ణానది వద్దకు వెళ్లారు. అయితే, ఆ తర్వాత మనసు మార్చుకుని, ఓ కాంట్రాక్టర్ వద్ద పనిలో చేరారు. ఆ తర్వాత నవయుగ డిస్ట్రిబ్యూటర్స్ లో రిప్రజంటేటివ్ గా చేరారు. ఈ క్రమంలో గుంతకల్లు నవయుగ బ్రాంచ్ మేనేజర్ స్థాయికి ఎదిగారు. ఇక్కడ మేనేజర్ గా పనిచేస్తున్న సమయంలోనే దర్శకుడు తాతినేని ప్రకాశరావు వద్ద సహాయకుడిగా పని చేసేందుకు మద్రాసు వెళ్లారు.
ఈ క్రమంలో దర్శకులు విఠలాచార్య, పి. పుల్లయ్య దగ్గర పనిచేశారు. ‘దేవదాసు’ నిర్మాత డిఎల్ నారాయణ, ఎస్. భావనారాయణల ప్రోత్సాహంతో ప్రొడక్షన్ రంగంలోకి దిగారు. విజయవాడ నవభారత్ బుక్ హౌస్ ప్రకాశరావుని భాగస్వామిగా చేసుకుని ‘అగ్గిమీద గుగ్గిలం’ సినిమాకు ఆయన నిర్మాతగా అవతారమెత్తారు. ఆ తర్వాత ‘ఉక్కుపిడుగు’, ‘రౌడీరాణి’, ‘పాపం పసినవాడు’, ‘యమగోల’ వంటి చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. కేవలం, తెలుగులోనే కాకుండా ఇతర భాషాచిత్రాలకు కూడా ఆయన నిర్మాతగా వ్యవహరించారు.
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్-24-3-22-ఉయ్యూరు