మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-279
279-శత చిత్ర ఫోటోగ్రఫీ డైరెక్టర్ ,మోసగాళ్ళకు మోసగాడు అసాధ్యుడు వీరాభిమన్యు ఫేం ,నిర్మాత దర్శకుడు,నందిపురస్కార గ్రహీత –వీస్ ఆర్ స్వామి
వి.ఎస్.ఆర్. స్వామి సుమారు 100 సినిమాలకు ఛాయాగ్రాహకుడిగా పనిచేశాడు.[1]
జీవిత విశేషాలు
ఇతడు కృష్ణా జిల్లా, గుడివాడ మండలం, వలివర్తిపాడు గ్రామంలో జూలై 15 1935 న జన్మించాడు.[2] ఇతనికి చిన్నప్పటి నుండి ఫోటోగ్రఫీపైన మక్కువ ఎక్కువ. ఇతడు తన గురువైన సి.నాగేశ్వరరావు వద్ద ఫొటోగ్రఫీలో మెళకువలు నేర్చుకున్నాడు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్లు అయిన రవికాంత్ మెగా, ఎస్.శంకర్ ల దగ్గర పనిచేశాడు. వీరాభిమన్యు, బందిపోటు చిత్రాలకు కెమెరా ఆపరేటర్గా పనిచేశాడు. కృష్ణ నటించిన అసాధ్యుడు చిత్రంతో మొదటి సారిగా ఇతడు ఛాయాగ్రాహకుడయ్యాడు. ఇతడు సినిమాటోగ్రఫీలో ఎన్నో ప్రయోగాలు చేశాడు. తెలుగులో అగ్రనటుల చిత్రాలకు ఎక్కువగా ఛాయాగ్రాహకుడిగా పనిచేసింది ఇతనే. 1986లో నిర్మింపబడిన తొలి తెలుగు 70 ఎం.ఎం. సినిమా సింహాసనంకు ఇతడే ఛాయాగ్రాహకుడు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్లు ఎం.వి.రఘు, ఎస్. గోపాలరెడ్డి, రాం ప్రసాద్ లు ఇతని శిష్యులే.
వెండితెరపై అద్భుతాలు
మోసగాళ్ళకు మోసగాడు సినిమా క్లైమాక్స్ తీస్తున్నారు. హీరో కృష్ణ, విలన్ని గట్టిగా గూబమీద కొట్టాలి. ఆ దెబ్బకి అతనికి లోకమంతా గిర్రున తిరిగే ఎఫెక్టు రావాలి. ఈ నన్నివేశం ఎలా తీయాలి?. అందరూ టెన్షన్ పడుతున్నారు గానీ, కెమెరామన్ మాత్రం తాపీగా ఆలోచిసూ కూర్చున్నారు. కాసేపటి తర్వాత లారీ టైర్ తెమ్మని పురమాయించారు. దాన్ని తాడుతో వేలాడదీశారు. “ఈ లారీటైర్తో ఈయనగారు ఏం చేస్తారా” అని యూనిట్ అంతా వళ్లంతా కళ్ళు చేసు కుని మరీ చూస్తుంటే, ఆ కెమెరామన్ తన కెమెరాతో సహా ఆ లారీటైర్లో కూర్చుని దాన్ని గిర్రున తిప్పమని ఆదేశించారు. అలా టైర్లో గిర్రున తిరుగుతూ ఆ సీన్ షూట్ చేశారు. ఆ కాలంలో యిప్పటిలా క్రేనులూ, గ్రాఫిక్సూ లేనప్పటికీ కేవలం తన బుర్రతోనే కెమెరా కు పని చెప్పి వెండితెరపై వండర్స్ చేశారు. ఆయన ఛాయాగ్రహణ శాఖలో పూనా ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ నుంచి వచ్చిన తొలి బృందంలో ఒకరు. రవికాంత్ నగాయిచ్ లాంటి మహామహుల దగ్గర శిష్య రికం చేసిన స్వామి అసాధ్యుడు(1985)తో కెమెరామన్ గా మారారు[3]. తెలుగు సినిమాని సాంకేతికంగా కీలక మైన మలుపు తిప్పిన ఆయన. కలర్, సినిమా స్కోప్, 70 ఎం.ఎం. వంటి ప్రక్రియల్లో తొలినాళ్లలోనే ప్రయో గాలకు శ్రీకారం చుట్టారు. 250 పైగా సినిమాలకు ఛాయాగ్రహణం సమకూర్చారు. మలయాళం మినహా దాదాపు అన్ని భాషల్లోనూ చక్రం (కెమెరా) తిప్పారు. ఆయన ఖాతాలో ఎన్నో విలువైన చిత్రాలు ఉన్నాయి.
హిందీలో ‘మహాశక్తిమాన్’ అనే త్రీడీ చిత్రం, తెలుగులో ఆపద్బాంధవులు చిత్రాలకు దర్శకత్వం వహించారు. అలాగే ఎదురీత, కలియుగ స్త్రీ అనే సినిమాలను నిర్మించారు. నేటి ప్రసిద్ధ ఛాయాగ్రాహకులు ఎస్.గోపాల్రెడ్డి, ఎమ్వీ రఘు, శరత్, తదితరులు ఈయన దగ్గర శిష్యరికం చేసిన వారే. కెమెరామన్ గా ఆయన చివరి చిత్రం ప్రభాస్ నటించిన ‘అడవి రాముడు’.
సినిమాలు
ఛాయాగ్రాహకుడిగా
====తెలుగు====
- అసాధ్యుడు (1968)
- కథానాయకుడు (1969)
- మోసగాళ్ళకు మోసగాడు (1971)
- భలే మోసగాడు (1972)
- అందాల రాముడు (1973)
- దేవుడు చేసిన మనుషులు (1973)
- మంచివాళ్లకు మంచివాడు (1973)
- అల్లూరి సీతారామరాజు (1974)
- భక్త కన్నప్ప (1976)
- సిరిసిరిమువ్వ (1976)
- ఎదురీత (1977)
- విచిత్ర జీవితం (1978)
- యువరాజు (1982)
- ఖైదీ (1983)
- చట్టంతో పోరాటం (1985)
- వేట (1986)
- సింహాసనం (1986)
- అల్లుడు దిద్దిన కాపురం (1991)
- ఆదిత్య 369 (1991)
- చినరాయుడు (1992)
- ప్రెసిడెంట్ గారి పెళ్ళాం (1992)
- రౌడీ ఇన్స్పెక్టర్ (1992)
- సమరసింహారెడ్డి (1999)
- నరసింహ నాయుడు (2001)
- భలేవాడివి బాసు (2001)
- ఇంద్ర (2002)
- కొండవీటి సింహాసనం (2002)
- అనగనగా ఓ కుర్రాడు (2003)
- అడవి రాముడు (2004)
- లక్ష్మీనరసింహా (2004)
- విజయేంద్ర వర్మ (2004)
- ఒక్క మగాడు (2008)
హిందీ
- ఇత్నీ సీ బాత్ (1981)
- పాతాళ్ భైరవి (1985)
- సింఘాసన్ (1986)
- దోస్త్ (1989)
దర్శకుడిగా
- మహా శక్తిమాన్ (1985)
పురస్కారాలు
· 1987లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారిచే ఉత్తమ సినిమాటోగ్రాఫర్గా విశ్వనాధ నాయకుడు చిత్రానికి తామ్ర నంది పురస్కారం.[4]
మరణం
నాలుగు దశాబ్దాల పాటు ఛాయాగ్రాహకుడిగా సుదీర్ఘ ప్రయాణం చేసి, ఎన్నో అజరామరమైన చిత్రాలకు తన కెమెరాతో నగిషీలద్దిన మేటి కెమెరామన్ వీయస్ఆర్ స్వామి 2008,నవంబరు 11న మచిలీపట్నంలో గుండెపోటుతో మరణించాడు. మరణించే సమయానికి అతని వయసు 70 సంవత్సరాలు. [5]
మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-280
280-టివి,సినిమా నటుడు ,జాతీయస్థాయి జయసేన్ అవార్డ్ ,నండీ అవార్డ్ గ్రహీత –అచ్యుత్
అచ్యుత్’ ఒక తెలుగు టెలివిజన్, సినీ నటుడు. ఇతను తెలుగు దూరదర్శిని, సినిమాలలో అనతికాలంలో మంచి పేరు సంపాదించిన నటుడు.[1] చిన్న ప్రాయంలోనే గుండెపోటుతో హఠాత్తుగా మృతిచెందాడు.1-7-1964న మచిలీపట్నం లో కూనపరెడ్డి రామారావు ,సుజాత దంపతులకు జన్మించాడు
నేపథ్యము
కళాశాలలో డిగ్రీ చదువుతున్న రోజుల నుంచి నటనపై ఆసక్తి చూపాడు. 1983లో రెండేళ్ళు హైదరాబాదు లోని మధు ఫిలిం శిక్షణా సంస్థలో నటనలో శిక్షణ పొందాడు. 1986లో ఇంధ్ర ధనస్సు అనే దూరదర్శన్ సీరియల్ లో తొలిసారి నటించాడు. తరువాత వెన్నెల వేట, 1988లో హిమబిందు, ప్రేమ అంటే ఇదే సీరియల్స్ లోనూ, 1989లో మిస్టర్ బ్రహ్మానందం, ఇదెక్కడైనా ఉందా అనే సీరియల్స్ లో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. తెలుగు సినిమా రంగంలో ప్రవేశించి 1991లో జంధ్యాల దర్శకత్వంలోని ప్రేమ ఎంత మధురం, 1992లో బి.సి.శేఖర్ దర్శకత్వంలోని పట్టుదల సినిమాలలో నటించాడు. ఇతని కృషికి గుర్తింపుగా 1990లో జాతీయ స్థాయిలో జయసేన్ అవార్డు అందుకున్నాడు. హిమబిందు, మిస్టర్ బ్రహ్మానందంలో అతని నటనకు ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాడు. 1990 సంవత్సరంలో ప్రతిష్ఠాత్మకమైన నంది అవార్డునుఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అందుకున్నాడు.
మరణం
2002 సంవత్సరంలో గుండె పోటుతో హఠాన్మరణం చెందాడు.
నటించిన టెలివిజన్ ధారావాహికలు
· ఇంధ్ర ధనస్సు (1986) – దూరదర్శన్ – (తొలి ధారావాహిక)
· వెన్నెల వేట
· హిమబిందు (1988)
· ప్రేమ అంటే ఇదే (1988)
· మిస్టర్ బ్రహ్మానందం (1989)
· ఇదెక్కడైనా ఉందా (1989)
· అంతరంగాలు
· అన్వేషిత
· మట్టిమనిషి
· అన్నయ్య
సినిమాలలో
· అల్లరి రాముడు (2002)
· వాసు (2002)
· లాహిరి లాహిరి లాహిరిలో (2002)
· డాడీ (2001) …. రమేష్
· ఎదురులేని మనిషి (2001)
· కౌరవుడు (2000) …. రాహుల్
· తమ్ముడు (1999) …. చక్రి
ఉల్లాసంగా ఉత్సాహంగా చక్కని చెదరని చిరునవ్వుతో మంచి హావభావాలతో మ్సాఫ్ట్ కార్నర్ పాత్రలను బుల్లితెరపైనా వెండి తెర పైనా నటించిన మందస్మిత
వదనారవిన్దుడు అచ్యుత్ .అకాల మరణం చెంది అందరికీ బాధ కలిగించాడు .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -9-5-22-ఉయ్యూరు